-
ప్రతి నలుగురిలో ఒకరికి పనిలేదు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి అవకాశాలపై కోవిడ్–19 చూపించిన ప్రతాపం అంతాఇంతా కాదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. సంఘటితర రంగంలోని ప్రాధాన్యత కేటగిరీలు మొదలు అసంఘటిత రంగంలోని కార్మికుల వరకు అందరినీ రోడ్డున పడేసింది. తీవ్ర నష్టాలతో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోగా.. చిన్నాచితకా సంస్థలు మూతబడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టి మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటున్నా.. ఉపాధి అవకాశాలు మాత్రం ఆశించినంతగా పెరగడం లేదు. ప్రస్తుతం ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నట్లు గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ పరిశీలన చెబుతోంది. దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 30 సంవత్సరాలలోపు వయసున్న వారి ఉద్యోగ స్థితిని ఈ శాఖ పరిశీలించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఈ పరిశీలన జరిపింది. జాతీయ సగటు నిరుద్యోగిత రేటు 22.9 శాతంగా ఉందని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా 24.3% ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా జమ్మూ కశ్మీర్లో 44.1% నిరుద్యోగిత ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (38.7%) ఉత్తరాఖండ్ (34.5%), ఒడిశా (32.5%), అసొం (32.2%) రాష్ట్రాలున్నాయి. అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ (7.7%), పశ్చిమ బెంగాల్ (14.0%), ఢిల్లీ(19.4%) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగైదు నెలలు వేచి చూడాలి మార్కెట్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంలో జరుగుతున్న జాప్యంతో కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగలేదు. కొత్తవారికి ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండడంతో నిరుద్యోగం పెరిగినట్లు పరిశీలన చెబుతోంది. కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే మార్కెట్ సాధారణ స్థితికి వస్తోంది. కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగాలంటే మరో నాలుగైదు నెలలు వేచి చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళలే బాధితులు కరోనా లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు మహిళలపై ఎక్కువ ప్రభావాన్ని చూపినట్లు పరిశీలన స్పష్టం చేస్తోంది. దేశంలో సగటు నిరుద్యోగిత రేటు 22.9 శాతంగా ఉండగా, ఇందులో పురుషుల నిరుద్యోగిత రేటు 20.9 శాతంగా, మహిళల నిరుద్యోగిత రేటు 29.5 శాతంగా ఉండటం గమనార్హం. లాక్డౌన్కు ముందు పురుషుల నిరుద్యోగిత రేటు 20.2 శాతం ఉండగా, మహిళల్లో 24.2 శాతం ఉంది. ఈ లెక్కన మహిళల్లో నిరుద్యోగిత ఏకంగా 5 శాతం పెరిగినట్లు పరిశీలన చెబుతోంది. లాక్డౌన్ అనంతర పరిస్థితుల ప్రభావంతో చాలా కంపెనీలు ఎక్కువగా మహిళా ఉద్యోగులను తొలగించగా.. కొత్తగా చేసిన నియామకాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కార్మిక వ్యవహారాల నిపుణులు ఒకరు సాక్షితో చెప్పారు. ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి మార్కెట్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. దాదాపు అన్ని రంగాలు ఏడాదిన్నర పాటు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని తేరుకుంటున్నాయి. రెండు నెలలుగా కొత్తవారికి అవకాశాలు మొదలయ్యాయి. కోవిడ్–19 వ్యాప్తి పెరగకుండా ఉంటే వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఇప్పటికైతే సీనియర్లకు డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఎక్కువ మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లే ఉంటున్నారు. ఐటీ సెక్టార్లో ఏడాదికి పైబడి ఖాళీగా ఉన్న అనుభవజ్ఞుడికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. – వైదేహి రెడ్డి వడిసెల, హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ -
పగటి కల... చేదు నిజం!
ప్రపంచం సంక్షోభం నుంచి బయటపడి కోలుకునే దశలో ఉన్నదని, త్వరలోనే పూర్వ పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. కానీ అమెరికాసహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలలో కోలుకునే దశ ఉద్యోగాలు లేనిదిగానే ఉంది. ‘కూచ్ సర్ఫింగ్’ అనే మాట విన్నారా? తెలుగులో ‘మంచం కోసం వేట’ అనాలేమో. అమెరికన్ సెనేట్ మెజారిటీ నేత డెమోక్రాట్ హారీ రీడ్కు కూడా నిన్నటి దాకా అలాంటి పద ప్రయో గం ఉన్నదని తెలీదు. ‘‘ఇంటి అద్దె చెల్లించలేక ‘మంచం కోసం వేట’లో మిత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, రాత్రికో చోట తలదాచుకోలేక ఇప్పటికే చస్తున్నాను. నిరుద్యోగ బీమాకు మంగళం పలికేసి మరింత నరకం చూపకండి’’ అని మొరపెట్టుకుంటూ ఒక నెవడా మహిళ రీడ్కు లేఖ రాసింది. గత గురువారం ఆయన దాన్ని సెనేట్కు వినిపించారు. అభాగ్యుల విలాపాలను వినరాదని ఎరిగిన సెనేట్ నిరుద్యోగ బీమా పొడింపు బిల్లును చెత్తబుట్టకు (58-40) పంపింది. పని కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆరు నెలల నిరుద్యోగ భృతి, తదితర సదుపాయాలను కల్పిస్తుంది. వాటి కొనసాగింపునకు 2008లో ‘అత్యవసర నిరుద్యోగ పరిహార పథకా’న్ని ప్రారంభించారు. దాని గడువు గత డిసెంబర్ 28తో ముగిసిపోయింది. మరుక్షణమే 13 లక్షల మంది బికార్లయ్యారు. మార్చికి మరో 22 లక్షల మంది వారిలో కలుస్తారు. 2009 చివరికే ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి గట్టెక్కి కోలుకునే దశకు చేరిందని ప్రభుత్వం సెలవిస్తోంది. కాబట్టి ఆరు నెలలు పైబడి నిరుద్యోగులుగా ఉన్న వారంతా సోమరిపోతులేనని తేల్చేశారు. ‘మంచం వేట’ మాని తక్షణమే పని చేసుకోమని నెవడా మహిళకు ఉచిత సలహాను పారేశారు. ఆమెలాటి ‘సోమరిపోతులు’ దేశంలో 37 లక్షల మందున్నారు! గత పది రోజులుగా ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లోనేగాక జపాన్లో సైతం జోరుగా సాగుతున్నవి నియామకాలు కావు... ఉద్వాసనలు (లే-ఆఫ్లు)! ఉద్యోగాలపై కత్తి ఎత్తిన యాభైకి పైగా బహుళ జాతి సంస్థల్లో మనకు బాగా తెలిసినవి మచ్చుకి... కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ‘డెల్’ కనీసం 15 వేల మందికి, ‘వోల్వో’ వాహనాల సంస్థ 4,400 మందికి, ‘నోవార్టిస్.’ ‘ఆస్త్రాజెనెకా’ ఫార్మా సంస్థలు ఒక్కొక్కటి ఐదు వేల మందికి, ‘సోనీ’ 5,000 మందికి ఉద్వాసన పలుకుతున్నాయి. 2008 సంక్షోభానికి ముందు రెండు దశాబ్దాలూ ఉద్యోగాలు లేని వృద్ధి దశ. అలాగే నేటి కోలుకునే దశ కూడా ఉద్యోగాలు లేనిదే. ప్రపంచ ఉద్యోగితపై అంతర్జాతీయ కార్మిక సంస్థ జనవరిలో విడుదల చేసిన తాజా నివేదిక పేరు ‘ఉద్యోగాలులేని కోలుకునే దశ?’ అమెరికా నిపుణులు గత ఏడాదిలో నెలకు రెండు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. గత డిసెంబర్లో కల్పించిన ఉద్యోగాలు 74 వేలు! నిరుద్యోగం 10 శాతం (2009) నుంచి 6.7 శాతానికి తగ్గిందంటున్నా... పూర్తికాలం పని కోరే పార్ట్టైమర్లు మొత్తం ఉద్యోగులలో 13.1 శాతం ఉన్నారు. 2014 మొదటికి జనాభాలో ఉపాధిని కలిగిన వారి వాటా 1983 తర్వాత అతి కనిష్ట స్థాయికి, 59 శాతానికి దిగజారింది. కొత్త ఉద్యోగాల్లో అత్యధికం నాసిరకం అల్ప వేతన ఉద్యోగాలు, ఏ ప్రయోజనాలు లేని పార్ట్ టైం ఉద్యోగాలే. ఒకప్పుడు వస్తు తయారీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి వెన్నెముక. గత దశాబ్దిగా ఆ రంగం 26 లక్షల ఉద్యోగాలను కోల్పోయింది. నేడు కూడా నిరుద్యోగులుగా మారుతున్నవారే తప్ప కొత్త నియామకాలు లేవు. గత ఏడాది కొత్త ఉద్యోగాల్లో అత్యధికం (8 లక్షలకు పైగా) ఏడాదికి 25 వేల డాలర్ల కంటే తక్కువ వేతనాన్ని ఇచ్చే అల్ప వేతన రంగాలవే. ప్రైవేటు సగటు వేతనం గంటకు 20.04 డాలర్లలో 80 శాతం లేదా అంత కంటే తక్కువ వేతనాలను అల్ప వేతనాలుగా నిర్వచించారు. 2008 సంక్షోభం తదుపరి కల్పించిన ఉద్యోగాల్లో 60 శాతం అవే. 4.7 కోట్ల అల్పవేతన జీవులంతా ఆహార కూపన్ల బతుకుల పేదలే. వారిలో ఫాస్ట్ఫుడ్ వర్కర్లు, దుకాణాల్లో బట్టలు మడతపెట్టడం, గిన్నెలు కడగ డం వంటి పనులకు గంటకు 10 డాలర్ల కంటే తక్కువ వే తనమే. ఈ అత్యల్ప వేతన జీవులు 25 శాతంపైనే. అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆర్భాటపు ‘కనీస వేతనాల పెంపుదల’ బిల్లు (గంటకు 7.25 నుంచి 10.10 డాలర్లు) కూడా సెనేట్లో బోర్లాపడక తప్పేట్టు లేదు. నేడు ప్రతి ఐదు అమెరికన్ కుటుంబాల్లో ఒకటి (20 శాతం) ఆహార కూపన్లపై ఆధారపడుతున్నాయి. ఆహార కూపన్ల బతుకుల సంఖ్య 2009-2013 మధ్య 51.3 శాతం పెరిగింది. పోర్ట్లాండ్లో వారానికి రెండుసార్లు ఏకధాటిగా 18 గంటల షిప్టులో వికలాంగ పెద్దలకు సంరక్షకునిగా బట్టలు ఉతకడం, స్నానాలు చేయించడం వంటి పనులు చేసే హెచ్ డెర్ (37) వంటి వారు... ‘ఎక్కడ ఈ పని పోగొట్టుకొని నా కుటుంబం ఆకలితో మాడేట్టు చేస్తానోనని నిర ంతరం బీతావహు’లవుతూ బతుకుతున్నారు. ఇక ‘హలో క్లాస్, మీ ప్రొఫెసర్ ఆహార కూపన్లపై బతుకుతోంది’ అనే కథనంతో ‘హఫింగ్టన్ పోస్ట్’లో తన గోడును వెళ్లబోసుకున్న కేతే క్విక్... ఆహార కూపన్లకు అనుమతి వస్తే ఆకాశం దిగొచ్చినంతగా సంబరపడింది. కాలంతో పాటే మాటలకు అర్థాలూ మారుతున్నట్టుంది. ఆర్థిక వ్యవస్థ ‘కోలుకోవడం’ అంటే పేదరిక ం పెరగడమని అర్థం గామోసు! - పి. గౌతమ్
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement