-
గుప్త నిధుల కోసం తవ్వకాలు
సింహాద్రిపురం : మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని నంద్యాలంపల్లె – ముసల్రెడ్డిపల్లె రహదారిలో పురాతన కోనేరులో రెండు రోజుల క్రితం గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. కసనూరు గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు మహేశ్వరరెడ్డి పొలంలో పురాతన కాలం నాటి కోనేరు ఉంది. దాని పక్కనే ఉన్న పురాతన సత్రాన్ని రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో గుప్త నిధుల కోసం కోనేటిలో ఉన్న పెద్ద బండరాళ్లను సైతం తొలగించారు. అక్కడ పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. -
అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు
వీరబల్లి: పెద్దివీడు గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన జయపాల్రెడ్డి అనే రైతుకు సంబంధించి మూడు ఎకరాలలో మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్రామ సమీపాన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కంటికి రెప్పలా చూసుకున్నామని, ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో కాలిపోయాయని ఆయన రోదించారు. దీంతోపాటు డ్రిప్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి చెట్లలో గరిక (గడ్డి) ఎక్కువగా ఉండటం వల్ల మంటలు రెట్టింపై వ్యాపించాయని పేర్కొన్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం కలిగిందన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పెంచుకున్నామని, పూర్తి స్థాయిలో కాలిపోవడం వల్ల తమ గోడు ఎవరికి తెలుపుకోవాలంటూ వాపోయారు. ఆ చెట్లకు 5 ఏళ్ల వయస్సు కలదని చెప్పాడు. సంబంధిత అధికారులు స్పందించి నష్ట పరిహారాన్ని అందించి, మళ్లీ మొక్కలను నాటుకునేందుకు డ్రిప్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరాడు. -
అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు
వీరబల్లి: పెద్దివీడు గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన జయపాల్రెడ్డి అనే రైతుకు సంబంధించి మూడు ఎకరాలలో మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్రామ సమీపాన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కంటికి రెప్పలా చూసుకున్నామని, ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో కాలిపోయాయని ఆయన రోదించారు. దీంతోపాటు డ్రిప్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి చెట్లలో గరిక (గడ్డి) ఎక్కువగా ఉండటం వల్ల మంటలు రెట్టింపై వ్యాపించాయని పేర్కొన్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం కలిగిందన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పెంచుకున్నామని, పూర్తి స్థాయిలో కాలిపోవడం వల్ల తమ గోడు ఎవరికి తెలుపుకోవాలంటూ వాపోయారు. ఆ చెట్లకు 5 ఏళ్ల వయస్సు కలదని చెప్పాడు. సంబంధిత అధికారులు స్పందించి నష్ట పరిహారాన్ని అందించి, మళ్లీ మొక్కలను నాటుకునేందుకు డ్రిప్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరాడు. -
శ్మశానవాటికలో శవాల కలకలం
విచారణ చేపట్టిన పోలీసులు జవహర్నగర్ : గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి రెండు మృతదేహాలను స్థానికంగా పూడ్చిపెట్టడం కలకలం లేపింది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం కారులో వచ్చిన నలుగురు రెండు శవాలను జవహర్నగర్లోని అరుంధతినగర్ శ్మశానవాటికలో పూడ్చి వెళ్లారు. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకన్న శ్మశాన వాటికకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. శవాలను తీసుకువచ్చిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. కీసర మండలం నాగారంలో గల మెర్సి హార్వెస్టిం గ్ మిషన్ సొసైటీ వృద్ధాశ్రమంలోని ఇద్దరు అనాథ వృద్ధులు జోసఫ్ (75), రాజు (69) బుధవారం రాత్రి చనిపోగా వృద్ధాశ్రమం వారే రెండు మృతదేహాలను తీసుకువచ్చి పూడ్చిపెట్టారని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సీఐ అశోక్కుమార్ తెలిపారు. -
రోడ్డుపైనే శిశువును వదిలేశారు..
* రోడ్డు పక్కన ఎండలో 2 నెలల చిన్నారి * నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన మిర్యాలగూడ టౌన్: ఎర్రగా బొద్దుగా ఉంది.. నుదుట బొట్టు.. బుగ్గపై కాటుక చుక్క.. పక్కన పాల పీక.. చూస్తేనే ఎంత ముద్దొస్తుందో.. ఎర్రటి ఎండలో రోడ్డుపక్కన గుక్కపెట్టి ఏడుస్తోందా పసికందు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రాంనగర్ బంధం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ నుంచి నేరేడుచర్ల వైపు వెళ్తున్న ఓ ఆటోలో నుంచి మహిళ కిందికి దిగి చిన్నారి నోట్లో పాలపీకను పెట్టి ఖమ్మం రోడ్డులోగల రాంనగర్బంధంసమీపంలో రోడ్డు పక్కన వదిలి వెళ్లింది. నోట్లో నుంచి పాల పీక కిందపడిపోవడంతో ఆ చిన్నారి ఎండలో గుక్కపెట్టి ఏడుస్తోంది. మిర్యాలగూడ నుంచి గరిడేపల్లికి వెళ్తున్న పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షుడు, ఫెయిత్ బంజారా ఆశ్రమ నిర్వాహకుడు డి.హన్యానాయక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్ ఘటన స్థలం వద్దకు వెళ్లి ఆ చిన్నారిని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. సీఐ భిక్షపతి చిన్నారిని సీడీపీవో విశ్వజకి అప్పగించగా నల్లగొండలోని శిశు భవన్కు పనికందును తరలించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement