-
‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. అఫ్గాన్ మహిళల ఆవేదన
కాబుల్: అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ, అఫ్గాన్ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు తాలిబన్లు. యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని హుకుం జారీ చేశారు. ఆ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకు దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. యూనివర్సిటీల దగ్గర భారీగా బలగాలను మోహరించి వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తమ హక్కులను కాలరాయడంపై అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు మార్వా అనే యువతికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కానీ, ఇప్పుడు ఆమె సోదరుడు ఒక్కడే వెళ్తాడని తెలిసి మనోవేదనకు గురైంది మార్వా. మహిళలపై నిషేధం విధించటం వారి తల నరకడం కన్నా చాలా బాధకారమని పేర్కొంది. ‘ఒకవేళ వారు మహిళలను శిరచ్ఛేదం చేయమని ఆదేశిస్తే.. అది కూడా ఈ నిషేధం కంటే మెరుగ్గా ఉండేది. మనం ఇంత దురదృష్టవంతులమైతే, మనం పుట్టి ఉండకపోతేనే బాగుండేది. నేను ఈ భూమిపై ఉన్నందుకు బాధపడుతున్నా. మనల్ని పశువులకన్నా హీనంగా చూస్తున్నారు. పశువులు ఎక్కడికైనా వెళ్లగలవు. కానీ, బాలికలకు ఇంట్లోంచి బయట అడుగుపెట్టేందుకు కూడా హక్కు లేదు. ’ అని ఆవేదన వ్యక్తం చేసింది 19 ఏళ్ల మార్వా. కాబుల్లోని మెడికల్ యూనివర్సిటీలో మార్చి నుంచి మెడికల్ డిగ్రీలో చేరేందుకు ఇటీవలే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది మార్వా. అతన సోదరుడు హమిద్తో పాటు యూనివర్సిటీకి వెళ్లాలని కలలను కంది. అయితే, తాజా నిర్ణయం ఆమె ఆశలను నాశనం చేసింది. తనతో పాటు చదువుకుని తన సోదరి లక్ష్యాన్ని సాధించాలని కోరుకున్నట్లు తెలిపాడు హమిద్. ఎన్నో కష్టాలను దాటుకుని తన సోదరి 12వ తరగతి వరకు చదువుకున్నట్లు తెలిపాడు. 45% బాలికలు డ్రాపవుట్ 2021 సెప్టెంబర్ నుంచి అఫ్గాన్లో సెకండరీ స్కూల్స్లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్ అయ్యారు. ఇదీ చదవండి: Afghanistan: రెక్కలు విరిచేస్తున్నారు.. అఫ్గాన్ యూనివర్సిటీల్లో అమ్మాయిలకు ఇక నో ఎంట్రీ -
యూనివర్సిటీలను గాడిలో పెట్టాల్సిందే: కేసీఆర్
ఇష్టారాజ్యంగా నడుస్తున్న యూనివర్సిటీల పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల స్థితిగతులను ఆయన సమీక్షించారు. అవసరమైతే యూనివర్సిటీల చట్టంలో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. అన్ని యూనివర్సిటీలకు ఒకే వ్యక్తి చాన్సలర్గా ఉండటం వల్ల పర్యవేక్షణ కష్టం అవుతుందని, యూనివర్సిటీల అవసరాలను బట్టి అనుభవం, నైపుణ్యం ఉన్నవారిని చాన్సలర్లుగా నియమిస్తామని ఆయన అన్నారు. చాన్సలర్లను నియమించే అధికారం ప్రభుత్వానికే ఉండాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వైద్య, ఆరోగ్యశాఖను కూడా విద్యాశాఖ పరిధిలోకి తెస్తామని, వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. సనత్ నగర్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీని సందర్శించారు. బస్తీలలోని ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, ఇరుకైన ఇళ్లలో కనీస వసతులు లేని బస్తీలలో సుమారు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వీరందరికీ దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరానగర్ బస్తీ వాసుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు ఎదురుగా ముస్లిల కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపడతామని ఆయన అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement