-
ఒక్క రక్తపు బొట్టు.. శిశువు గుట్టు విప్పు..
పిల్లలు పుట్టిన ఆనందం కంటే వాళ్లు బలహీనంగా ఉండటం లేదా మరో తీవ్రమైన సమస్యతో బాధపడటాన్ని చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు.. చికిత్స నిమిత్తం లక్షల రూపాయలు ఖర్చుచేయడం తెలిసిందే. పిల్లలు పుడుతూనే ఆరోగ్యసమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతాయి? నవజాత శిశువులకు మెరుగైన చికిత్స అందించలేమా? అనే ప్రశ్నలతో ప్రారంభమైన పరిశోధన చివరికి సత్ఫలితాల్ని సాధించింది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఆల్ట్రా వాయిలెట్ స్కానింగ్ విధానంలో కంటే ఒకే ఒక్క రక్తపు బొట్టుతో శిశువు వయసుతోపాటు వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. తద్వారా పసిపిల్లల అనారోగ్యానికి గల కారణాలనూ విశ్లేషించి వారికి నూతన విధానంలో చికిత్స అందించవచ్చు. ఈ పరిశోధనలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమస్యగా మారిన శిశుమరణాలను నివారించే వీలుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా పిండ దశ నుంచి 37 వారాల తర్వాత తల్లి గర్భం నుంచి వెలుపలికి వచ్చే శిశువుది ఆరోగ్యకరమైన జననంగా వైద్యులు భావిస్తారు. కానీ పౌష్టికాహారలోపం, వాతావరణకాలుష్యం, మానసిక, శారీరక ఒత్తిడి తదితర కారణాలతో కొందరు తల్లులు 37 వారలకంటే ముందే శిశువులకు జన్మనిస్తున్నారు. ఇలా సరైన సమయానికి ముందే(ప్రీ మెచ్యూర్ బేబీస్) పుట్టిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 వేల మంది ప్రీమెచ్యూర్ బేబీలు పుడుతున్నారు. వీరిలో చాలామంది బతికిబట్టకట్టలేకపోతున్నారు. తాజాగా అభివృద్ధి చేసిన వైద్య విధానంలో శిశువు నుంచి ఒకే ఒక చుక్క రక్తాన్నిసేకరిస్తారు. రకరకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ శిశువు ప్రీమెచ్యూర్ బేబీనా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటంతోపాటు వారి ఆరోగ్యపరిస్థితికి తగిన చికిత్స అందించేవీలుంటుందని శాస్ర్తవేత్తల బృందానికి నేతృత్వం వహించిన కెల్లీ రైక్ మన్ తెలిపారు. అమెరికాలోని అయోవా స్టేట్ యూనివర్సిటీకి చెందిన కెల్లీ బృందం దాదాపు ఐదేళ్లపాటు వివిధ దేశాలకు చెందిన మూడు లక్షల మంది నవజాత శిశువులకు పరీక్షలు నిర్వహించింది. -
జర... జాగ్రత్త సుమా!
అధ్యయనం కొంతమంది పిల్లలు హింసతో కూడుకున్న ఆటలంటేనే బాగా ఇష్టపడతారు. ‘వీడియో గేమ్సే కదా’ అని మనం తేలికగా తీసుకోవడానికి లేదు. ఈ ఆటల ప్రభావం వారి మనస్తత్వంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు. ‘‘గణితం నేర్చుకునేటప్పుడు, సంగీతం నేర్చుకునేటప్పుడు తెలియకుండానే దాని ప్రభావం మన మీద ఉన్నట్లే హింసాత్మకమైన వీడియో గేమ్స్ను పదే పదే చూడడం వల్ల దాని ప్రభావం కూడా అనివార్యంగా ఉంటుంది. ఒక అంశాన్ని పదే పదే సాధన చేసినప్పుడు, దానికి సంబంధించిన జ్ఞానం మెదడులో నిక్షిప్తమై పోతుంది’’ అంటున్నారు లోవా యూనివర్శిటీ(ఇంగ్లండ్)కి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ డగ్లస్ జెంటిల్. హింసాత్మక ఆటలు ఆడుతున్నప్పుడు... అనుకూల భావనల స్థానంలో ప్రతికూల భావనలు పెరుగుతూ పోతాయి. సహనం తగ్గుతూ పోయి అసహనం మనసులో పెద్ద పీట వేసుకుంటుంది. తగాదాలలో తలదూర్చడం ఎక్కువ అవుతుంది అని కూడా హెచ్చరిస్తున్నారు డగ్లస్. అధ్యయనం కోసం నాలుగు, అయిదు, ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మొత్తం 3,000 మంది పిల్లలను ఎంచుకుంది డగ్లస్ నేతృత్వంలోని పరిశోధక బృందం. పిల్లలు ఎంచుకున్న వీడియో గేమ్స్లో హింస పాలు ఎంత? వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేమిటి అనే కోణంలో మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఎన్నికల వేళ.. చేపల చెరువు తవ్వకం
108 వాహనంలో ప్రసవం
15 నుంచి భీమవరంలో అతిరాత్ర మహాయాగం
Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
పచ్చ ముఠాల విధ్వంస కాండ
ఓట్ల పండగకు సొంతూళ్లకు..
ఓటర్లూ.. ఈ నిబంధనలు పాటించండి
నేత్రపర్వం.. చాత్మార్ ఉత్సవం
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఓటు హక్కు.. వినియోగిద్దాం ఇలా..
తప్పక చదవండి
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
- Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
- Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
- Lok Sabha Election 2024: ఇండోర్లో ఉచిత పోహా, జిలేబీ..
- వందొస్తే టాప్ కాలేజీల్లో సీఎస్సీ!
- చురుగ్గా రబీ ధాన్యం సేకరణ
- Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
- Lok Sabha Election 2024: మాజీ మామా అల్లుళ్ల సవాల్
Advertisement