-
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
కర్నూలు జిల్లా వాసిగా భావిస్తున్న పోలీసులు ఫిరంగిపురం: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలో ఉన్న బాలయేసు కధెడ్రల్ దేవాలయ ప్రాంగణంలోని కార్మెల్ భవన్ వద్ద సోమవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 45–50 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి కార్మెల్ భవన్ సమీపంలో పడి ఉండటాన్ని సోమవారం తెల్లవారుజామున భక్తులు గుర్తించి ఆలయ పెద్దలకు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ఎం.ఆనందరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఆదివారం మధ్యాహ్నం దేవాలయ ప్రాంగణంలో తలనీలాలు తీయించుకొని మొక్కుబడి తీర్చుకున్నట్లు ప్రా«థమికంగా గుర్తించారు. మృతుని ఎడమచేతిపై‘ఎన్.రామకృష్ణ్ణ’ అని పచ్చబొట్టు వుంది. బ్యాగులో వున్న రైల్వే టిక్కెట్టును పరిశీలిస్తే కర్నూలు జిల్లా బేతంచర్ల నుంచి ఫిరంగిపురం ప్రయాణం చేసినట్లు ఉంది. దేవాలయ ప్రాంగణంలోని సీసీ కెమెరా ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. గుండెపోటు, మూర్చ, విషసర్పాల కాటు లాంటి వాటిలో ఏదైనా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట మార్చురీకి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుని ఆచూకీ గుర్తించిన వారు ఫిరంగిపురంలోని పోలీస్ స్టేషన్లో నేరుగా, లేదా 0863–257223 ఫోన్ నంబర్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
నదిలోమునిగి గుర్తుతెలియని వ్యక్తి మృతి
విజయపురిసౌత్(గుంటూరు): స్నానానికి నదిలో దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణవేణి ఘాట్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వృద్ధుడు(85) మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కృష్ణవేణి ఘాట్కు కొద్దిదూరంలో నదిలో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తూ లోతైన ప్రదేశంలోకి జారిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన సమీపంలోని కొందరు మత్స్యకారులు హుటాహుటిన వృద్ధుడిని నీటిలోంచి ఒడ్డుకు చేర్చారు. కొనప్రాణంతో ఉన్న వృద్ధుడు ఆ తరువాత కొద్దిసేపటికే మృతి చెందాడు. మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుడి జేబులో మాచర్ల నుంచి హిల్కాలనీకి తీసుకున్న ఆర్టీసీ బస్ టికెట్ ఉంది. మృతుడి ఒంటిపై తెల్ల చొక్కా, తెల్ల పంచె ఉన్నాయి. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయపురి సౌత్ ఎస్ఐ వై.కోటేశ్వరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీదే గెలుపు!
ముగిసిన తెప్పోత్సవాలు
పోలీసుల అదుపులో ఒడిశా వేటగాళ్లు
పిడుగుపాటుకు యువకుడికి గాయాలు
తిమ్మాపురంలో విజయ్ దేవరకొండ సందడి
అప్పన్నకు రెండవ విడత చందనం సమర్పణ
ఫ్లైఓవర్పై లారీ బోల్తా
ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు
కమనీయం.. కల్యాణోత్సవం
తప్పక చదవండి
- 'బిగ్బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
- 'విశ్వంభర'లో మరో టాలెంటెడ్ బ్యూటీ.. అఫీషయల్ ప్రకటన
- SRH vs RR: అతడి మీదే భారం.. సన్రైజర్స్ గెలవాలంటే..
- వీడియో: కేదార్నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
- T20: బంగ్లాదేశ్కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం
- రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏముందంటే..
- ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
- అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి
Advertisement