-
నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు
హిమాయత్నగర్: ప్రపంచవ్యాప్తంగా తనకున్న క్రేజ్, ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొన్ని యూట్యూబ్, మీడియా చానెళ్లలో అసత్య ప్రచారం చేయిస్తున్నాడని ‘ప్రజా శాంతి’ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రెవరెండ్ కేఏ పాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. సీపీతో సమావేశం అనంతరం పాల్ మీడియాతో మాట్లాడుతూ... సాయి అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని, దీనికి చంద్రబాబే కారకుడని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను సీపీకి అందజేశానన్నారు. ‘నేను అమెరికా నుంచి అక్రమంగా డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నానని, ఒంగోలులో నా బ్రదర్ని చంపానని, ఆ కేసులో అరెస్ట్ అయ్యాన’ని సోషల్ మీడియా కేంద్రంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. ‘నేను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఆంధ్రప్రదేశ్లో నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేశాను. సెక్యూరిటీ నిమిత్తం హైదరాబాద్ పోలీసులను కోరగా, సీపీ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామ’ని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ది ద్వంద్వ వైఖరి
న్యూఢిల్లీ: జీఎస్టీపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని.. జీఎస్టీ కౌన్సిల్లో ఒకలా.. పార్లమెంటులో మరోలా మాట్లాడుతోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. నిరుద్యోగం, ఇతర సమస్యల పరిష్కారంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. రాజ్యసభలో తొలిసారి ఆయన ప్రసంగిస్తూ.. జీఎస్టీ అంటే ‘గబ్బర్సింగ్ ట్యాక్స్’ కాదని, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం, పేదల సంక్షేమ పథకాలకు ఆ పన్ను ద్వారానే నిధులు వస్తున్నాయని షా పేర్కొన్నారు. కాంగ్రెస్ వల్లే నిరుద్యోగ సమస్య తీవ్రమైందని, నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడీలు అమ్ముకోవడం మంచిదేనన్నారు. దాదాపు 90 నిమిషాలు సాగిన ప్రసంగంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ఏకరువు పెట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై షా చర్చను ప్రారంభిస్తూ.. జీఎస్టీతో దేశమంతా ఒకే పన్ను కల నిజమైందన్నారు. రాహుల్ గాంధీ చేసిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ‘షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఒక బందిపోటు. దేశంలో ఇప్పుడు దోపిడీ జరుగుతోందా..? చట్టబద్ధంగా ప్రజలు చెల్లించే పన్నులు దోపిడీ కింద లెక్కా? ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఎక్కడికి పోతోంది. ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ కోసం జవాన్ల ఖాతాల్లోకి, అమరవీరుల భార్యల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తోంది. పేద మహిళలకు వంట గ్యాస్ ఇచ్చేందుకు ఉజ్వల యోజన కోసం ఖర్చవుతోంది’ అని చెప్పారు. కొన్ని అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని షా సూచించారు. ‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు జీఎస్టీని వ్యతిరేకించాయని చెపుతున్నారు. అది నిజం కాదు. బీజేపీ ఎప్పుడూ జీఎస్టీని వ్యతిరేకించలేదు. కేవలం కొన్ని అంశాల్ని మాత్రమే వ్యతిరేకించింది. కాంగ్రెస్ మాత్రం జీఎస్టీ మండలి సమావేశాల్లో ఒకవిధంగా.. పార్లమెంటులో మరో విధంగా మాట్లాడుతోంది. జీఎస్టీ మండలి సమావేశాల వివరాల్ని బహిర్గతం చేయమంటారా?’ అని ప్రశ్నించారు. 8 ఏళ్లు సరిపోదు.. నిరుద్యోగులుగా ఉండే కంటే బతకడం కోసం యువత పకోడాలు అమ్ముకోవడం మంచిదేనని షా పేర్కొన్నారు. ‘పకోడాలు చేయడం సిగ్గుచేటేమీ కాదు. అలాంటి వ్యక్తిని బిక్షగాడితో పోల్చడమే సిగ్గుపడాల్సిన విషయం’ అని చెప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగ కల్పనేనని చెప్పిన సంగతి తెలిసిందే. ‘55 ఏళ్ల కాంగ్రెస్ పాలన అనంతరం నిరుద్యోగ సమస్య కొనసాగడంతో పాటు మరింత తీవ్రమైంది. దీని పరిష్కారానికి 8 ఏళ్ల (ఎన్డీఏ పాలన) సమయం సరిపోదు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా పథకాల్ని ప్రవేశపెట్టాం’ అని షా వెల్లడించారు. బడ్జెట్లో ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకం(మోదీ కేర్) గురించి మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ఏ ప్రభుత్వమూ సాహసించలేదని అన్నారు. ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదానికి సహకరించాలని కాంగ్రెస్ను కోరారు. విపక్షాల ఫోన్లు ట్యాపింగ్: ఆజాద్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల్లోనే కాకుండా అధికారులు, ప్రతిపక్ష నేతల్లో భయానక వాతావరణ సృష్టిస్తోందని ఆరోపించారు. ‘దేశంలో భయానక వాతావరణం ఉంది. ప్రతిపక్షంతో మాట్లాడటానికి, సంప్రదింపులకు ఎవరైనా భయపడుతుంటే అది ప్రజాస్వామ్యానికి, వాక్ స్వాతంత్య్రానికి మంచిది కాదు. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. దేశాన్ని రెండు వర్గాలుగా విడగొట్టడమే కాకుండా.. ప్రతిపక్షాల్ని వేరు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, సీబీఐ, ఈడీల్ని ఉపయోగించి ప్రతిపక్షాల్ని భయపెడుతోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో కాంగ్రెస్, సమాజ్వాదీ, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీలు 324 సవరణల్ని సూచించాయి. -
భారత ఫార్మాను దెబ్బతీసే కుట్ర..
♦ ఇక్కడి కంపెనీలపై అసత్య ప్రచారం ♦ ఆరోపణలు అవాస్తవమని తేలింది ♦ ఫార్మెక్సిల్ డీజీ రవి ఉదయ్ భాస్కర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా సుస్థిర స్థానంలో ఉన్న భారత ఫార్మా రంగం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) అభిప్రాయపడింది. ప్రపంచ జనరిక్స్ మార్కెట్లో గట్టి పోటీనిస్తున్న ఇక్కడి కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోందని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. మందులను తట్టుకునే బ్యాక్టీరియాకు భారత్ కారణమవుతుందన్న ఆరోపణలు అవాస్తవమని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చేపట్టిన అధ్యయనాన్ని బట్టి అవగతమవుతోందని స్పష్టం చేశారు. ప్లాంట్ల నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియాకు పలు కంపెనీలు కారణమవుతున్నాయని లండన్కు చెందిన చేంజింగ్ మార్కెట్స్ అనే స్వచ్ఛంద సంస్థ కొన్ని నెలల క్రితం ఆరోపించింది. నిజానిజాలను తెలుసుకునేందుకు ఫార్మెక్సిల్, బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ యానిమల్ బయాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.దయానంద బృందం అధ్యయనం చేసింది. ప్లాంట్ల సమీప ప్రాంతంతోపాటు 50 కిలోమీటర్ల వెలుపల కూడా బ్యాక్టీరియా తీరులో మార్పులేకపోవడాన్ని గుర్తించారు. జన్యు అధ్యయనానికి సైతం ఇదే బృందం రెడీ అయింది. ప్లాంట్లకు 100 కిలోమీటర్ల వెలుపల కూడా పరీక్షలు జరపనున్నారు. నిజం లేదని స్పష్టమైంది.. పెన్సిలిన్స్, సెఫలోస్పోరిన్, కార్బాపెనిమ్ తయారవుతున్న ఓ కంపెనీకి చెందిన యూనిట్–7 సమీపంలో సేకరించిన వ్యర్థాల్లో ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా దర్శనమిచ్చినట్టు చేంజింగ్ మార్కెట్ ఆరోపించింది. అలాగే యూనిట్–11 నుంచి మురుగునీరు సముద్రానికి బదులు పైడిభీమవరం గ్రామంలోకి వెళ్తోందని తెలిపింది. అయితే యూనిట్–7లో ఈ ఔషధాలను కంపెనీ తయారు చేయడం లేదు. యూనిట్–11 నుంచి శుద్ధి చేసిన మురుగునీరు పైపుల ద్వారా నియంత్రణ సంస్థలు నిర్దేశించిన సముద్రం లోపల వదులుతోంది. చేంజింగ్ మార్కెట్ ఆరోపణలు అవాస్తవమని దీనినిబట్టి అర్థం అవుతోందని ఫార్మెక్సిల్ వెల్లడించింది. వైద్యులు ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ను రోగులకు సూచించడం, మందుల అధిక వాడకం, కాలుష్యం వంటి కారణాలతోనూ బ్యాక్టీరియాకు తట్టుకునే శక్తి వస్తోందని రవి ఉదయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళన కలిగించే అంశమని గర్తు చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏలూరులో చల్లారని రగడ...
పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
ఏకకాలంలో ఎన్నోపనులు..!
బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు
చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?
వారణాసి.. రాజకీయ చరిత్ర ఇదే!
ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement