-
తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్.. ‘హైదరాబాదీ’ విజయగాథ !
భారతదేశంలో ముస్లిం సముదాయం నుంచి తొలి మహిళా న్యూరోసర్జన్ అయిన ఘనత డాక్టర్ మరియమ్ హఫిఫా అన్సారీకి దక్కింది. ఆమె హైదరాబాదీ కావడంతో తెలంగాణకు కూడా ఈ ఖ్యాతి దక్కినట్లే. పదవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదివిన హఫిఫా ఆ తర్వాత నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనసాగించి అనేక రికార్డులు సాధించింది. ‘ఆడపిల్లలు తాము అనుకున్నది సాధించేవరకు ఓటమి అంగీకరించవద్దు’ అంటున్న హఫిఫా గురించి... కొన్ని అద్భుతాలు మన పక్కనే జరుగుతుంటాయి. అయితే అవి వినమ్రంగా ఉండటం వల్ల కూడా మనకు తెలియవు. చిన్న గెలుపుకు ఆకాశమంత ఆర్భాటం చేస్తారు కొందరు. పర్వాతాన్ని పిండి కింద కొట్టినా మెదలకుండా ఉంటారు మరి కొందరు. 28 ఏళ్ల మరియమ్ హఫిఫా అన్సారీకి తను సాధించిన విజయం పట్ల చాలా వినమ్రత ఉంది. ఎందుకంటే ఆమె అది తన గెలుపుగా భావించక ‘అల్లా మియా ఇచ్చిన కానుక’ అంటుంది కనుక. అదే ఆమె ఘనత డాక్టర్ మరియమ్ హఫిఫా అన్సారీ మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో న్యూరోసర్జరీ రెసిడెంట్గా ఉంది. న్యూరో సర్జరీ విభాగంలో చురుగ్గా పని చేస్తూ ఉంది. త్వరలో ఆమె పూర్తిస్థాయి న్యూరో సర్జన్గా విధులు నిర్వహించనుంది. అయితే ఏమిటి ఘనత అంటారా? భారతదేశంలో ముస్లింలలో న్యూరోసర్జన్ అయిన తొలి మహిళ మరియమ్ హఫిఫా. సాధారణంగా మహిళా డాక్టర్లు పిడియాట్రిషియన్లుగా, గైనకాలజిస్టులుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ను ఎంచుకుంటారు. ఇతర ముఖ్య విభాగాలను ఎంచుకున్నా న్యూరోసర్జరీలోకి ప్రవేశించేవారు తక్కువ. ముస్లింలలో అసలు లేరు. ఆ అడ్డంకిని దాటి న్యూరోసర్జన్ అయ్యింది మరియమ్ హఫిఫా. తప్పు అని నిరూపించండి ‘ఆడపిల్లలు అది చేయలేరు.. ఇది చేయలేరు అని కొందరు విమర్శిస్తుంటారు. ఆడపిల్లలు వెనక్కి తగ్గకూడదు. అలా అనేవారి మాటలు తప్పు అని నిరూపించేలా విజయాలు సాధించాలి’ అంటుంది హఫిఫా. పెయింటింగ్లో హఫిఫాకు అభిరుచి ఉంది. కాలిగ్రఫీని కూడా సాధన చేస్తోంది. సర్జరీ చేస్తున్న హఫిఫా ఫొటోను షేర్ చేసి ‘భారతదేశపు తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్’ అని గర్వపడింది ఆమె సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలోని ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎం.ఎస్.ఓ). కాని ఆమె ఆ ఘనత సాధించిందంతా ఇక్కడే కనుక నిజంగా గర్వపడాల్సింది తెలంగాణనే. ఉర్దూ మీడియమ్లో చదివి హఫిఫా మరియంది మహారాష్ట్రలోని మాలేగావ్. అక్కడే ఏడవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదువుకుంది. తల్లి ఉర్దూ టీచర్. ఆమె సింగిల్ పేరెంట్గా తన కుమార్తెను పెంచడానికి సిద్ధపడి హైదరాబాద్ వలస వచ్చింది. ఇక్కడే పదోతరగతి వరకూ మళ్లీ ఉర్దూ మీడియంలోనే చదివి టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది హఫిఫా. చిన్నప్పటి నుంచి డాక్టర్ కానీ, సైంటిస్ట్ కాని కావాలని ఆమె కల. నెమ్మదిగా సైంటిస్ట్ను పక్కన పెట్టి డాక్టర్ కలను గట్టిగా పట్టుకుంది. ‘నా ఒంటి మీద తెల్లకోటు, మెడలో స్టెతస్కోపు ఉండాలి. నన్ను అందరూ డాక్టర్ హఫిఫా అని పిలవాలి అనుకున్నాను’ అంటుందామె. కాని మెడిసిన్ చదివించే స్తోమత లేదు. బాగా చదువుకుంటే తప్ప ఉచిత సీటు రాదు. దాంతోపాటు ఉర్దూ మీడియంలో చదవడం వల్ల ఇప్పుడు ఇంగ్లిష్ మీడియమ్కు అలవాటు పడాలి. అందుకే రేయింబవళ్లు చదివేది హఫిఫా. టెన్త్ అయ్యాక హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థుల ఎంట్రన్స్ కోసం టాలెంట్ టెస్ట్ పెడితే టాపర్గా వచ్చింది హఫిఫా. దాంతో ఒక కాలేజీ వాళ్లు ఇంటర్లో ఫ్రీ సీట్ ఇచ్చారు. ఆ తర్వాత మెడికల్ ఎంట్రన్స్లో ఏకంగా 99వ ర్యాంకు సాధించింది. ఉస్మానియాలో ఎం.బి.బి.ఎస్. చదివింది. ఎం.బి.బి.ఎస్.లో ఆమెకు ఐదు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆ తర్వాత ‘పోస్ట్ జనరల్ సర్జరీ’లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఎఫ్.ఆర్.సి.ఎస్. (లండన్) పూర్తి చేసింది. 2020లో మళ్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాసి 137వ ర్యాంకు సాధించి ‘న్యూరోసర్జరీ’ విభాగాన్ని తీసుకుంది. చదవండి: Lotus: నీటి తొట్లలో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేల దాకా మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ! ఈ పూలు వాడిపోవు.. ఆమె హాబీ.. ఆదాయ వనరుగా ఎలా మారిందంటే! -
హవ్వా.. స్కావెంజర్ పర్యవేక్షణలో పరీక్షలా..!
సాక్షి, బిచ్కుంద (జుక్కల్): ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగుపర్చి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం నిండా నిర్లక్ష్యం కనిపిస్తోంది. బిచ్కుందలోని ఉర్దూ మీడియం హైస్కూల్లో మంగళవారం పదో తరగతి విద్యార్ధులకు విద్యా నైపుణ్యం పెంచడానికి నెలవారీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పర్వవేక్షణలో నిర్వహించాల్సి ఉండగా ఉదయం 11గంటలైనా ఒక్క ఉపాధ్యాయుడు రాలేదు. దీంతో స్కావెంజర్ ముజ్జు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు అందించి పరీక్ష నిర్వహించారు. పాఠశాలలో ముగ్గురు రెగ్యులర్, ముగ్గురు వీవీలు ఉండగా ఒక్కరు కూడా పాఠశాలకు రాకపోవడంతో స్కావెంజరే పరీక్ష నిర్వహించాడు. దీనిని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పాఠశాల మరుగుదొడ్లు, తరగతి గదులను స్కావెంజర్ శుభ్రం చేయాలి. నీటివసతి కల్పించాల్సి ఉంటుంది. కాని తమకు ఆలస్యమవుతుందని ఉపాధ్యాయులు ఫోన్ చేసి పరీక్ష ప్రశ్నపత్రాలు ఇచ్చి పరీక్ష నిర్వహించాలని ఆదేశించడంతో పరీక్ష నిర్వహించానని స్కావెంజర్ ముజ్జు తెలిపారు. తల్లిదండ్రులు ఫిర్యాదు కోసం ఎంఈవో కార్యాలయానికి వెళ్లినప్పటికీ అక్కడ ఫిర్యాదు తీసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు రాకపోవడం స్కావెంజర్ పరీక్ష నిర్వహించడంపై ఎంఈవో రాములు నా యక్ను వివరణ కోరగా విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
వారు ఉర్దూ మీడియం కోరుతున్నారు: అవంతి
సాక్షి, అమరావతి: తెలుగు, ఉర్దూ భాషల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా రెండవ అధికార భాషగా ఉర్దూ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో అధికార భాష సంఘాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. దీనికి సాహిత్యవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను చైర్మన్గా, పలువురు భాషావేత్తలను సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే అయిదు జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా ఉర్దూ మీడియంను కోరుతున్నారని.. కాబట్టి అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉర్దూ మీడియం అమలును పరిశీలిస్తామని వెల్లడించారు. -
డీఈఈ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ర్యాంక్
కదిరి అర్బన్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఈ) ఫలితాల్లో ఉర్దూ మీడియం విభాగంలో కదిరి పట్టణానికి చెందిన మదనపల్లి ముస్కాన్ 74 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. ఈమె ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీయట్ ఎంహెచ్సీ గ్రూపులో 1000 మార్కులకు 918 సాధించింది. ముస్కాన్ తండ్రి ఇర్షాద్ బీడీ కార్మికుడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు. పెద్దకూతురు ఆలియాజ్ గతేడాది ఉర్దూమీడియం డీఈఈ ఫలితాల్లో స్టేట్ 2వ ర్యాంకు సాధించి కర్నూలోని డైట్ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తోంది. పట్టుదలతో విద్యార్థినులు చదివి స్టేట్ర్యాంకులు సాధించారు. -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, సిటీబ్యూరో: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మజ్లిస్ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో శనివారం ఉర్దూ మీడియం విద్యార్థినిలకు ప్రతిభా పురస్కారాలు, పదవ తరగతి పరీక్ష ఫీజు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో విద్యతోనే అన్ని రంగాలు ముడిపడియున్నాయని, విద్యను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. బాలల కంటే బాలికలే అత్యధికంగా ప్రతిభ కనబర్చుతారని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో రాణించాలనే తపనకలిగిన ప్రతిభావంతులకు సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ టాపర్లుగా నిలిచిన 556 మంది విద్యార్ధులకు నగదు అవార్డులు అందజేశారు. నగరంలోని 86 ఉర్దూ మీడియం పాఠశాలకు సంబంధించి 2024 మంది విద్యార్థినిలకు పదవతరగతి పరీక్ష ఫీజును అందజేశారు. అదేవిధంగా ఎస్ఎస్సీలో వంద శాతం ఫలితాలు సాధించిన మూడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పాషాఖాద్రీ, ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, జాఫర్ హుస్సేన్, మౌజం ఖాన్, మొహీయెద్దీన్, బలాల, ఎమ్మెల్సీలు జాఫ్రీ, రజ్వీ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement