-
ఐపీవో స్ట్రీట్: మజగాన్ డాక్, యూటీఐ ఏఎంసీ
ప్రభుత్వ రంగ దిగ్గజం మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(29న) ప్రారంభం కానుంది. గురువారం(అక్టోబర్ 1న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 135-145. ఐపీవోలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15.17 శాతం వాటాకు సమానమైన దాదాపు 3.06 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వం రూ. 444 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. రక్షణ రంగానికి చెందిన ఈ కంపెనీ ఉద్యోగులకు 3.45 లక్షల షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేసకోవలసి ఉంటుంది. కంపెనీ వివరాలు రక్షణ రంగ పీఎస్యూ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్.. 40,000 డీడబ్ల్యూటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. తద్వారా ఓడలు, సబ్మెరైన్లను రూపొందిస్తోంది. రక్షణ శాఖకు అవసరమయ్యే యుద్ధనౌకల తయారీ, మరమ్మతులను చేపడుతోంది. వాణిజ్య ప్రాతిపదికన ఇతర క్లయింట్లకు వెస్సల్స్ను తయారు చేస్తోంది. 2006లో కంపెనీ మినీరత్న హోదాను పొందింది. కంపెనీ రుణరహితంకావడంతోపాటు.. ముంబై తీరంలో ఉండటంతో అధిక అవకాశాలు పొందుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్డర్లను త్వరగా పూర్తిచేయగలగడం, తద్వారా వేగంగా క్యాష్ఫ్లోను సాధించగలగడం వంటి అంశాలు కంపెనీ భవిష్యత్పై ప్రభావం చూపే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. రక్షణ రంగ బడ్జెట్ ఆలస్యంకావడం లేదా ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడటం ద్వారా వ్యయాలు పెరగడం వంటి ప్రతికూలతలు ఎదురుకావచ్చని తెలియజేశారు. యూటీఐ ఏఎంసీ నిర్వహణలోని ఆస్తుల రీత్యా దేశంలోనే రెండో పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. యూటీఐ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(29న) ప్రారంభం కానుంది. గురువారం(అక్టోబర్ 1న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 552-554. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఎస్బీఐ, ఎల్ఐసీ, బీవోబీ, పీఎన్బీ, టీ రోవ్ ప్రైస్ ఇంటర్నేషనల్ వాటాలు విక్రయించనున్నాయి. మొత్తం 3.9 కోట్ల షేర్లవరకూ ఆఫర్ చేస్తున్నాయి. ఇది కంపెనీ ఈక్విటీలో 30.75 శాతం వాటాకు సమానంకాగా.. తద్వారా రూ. 2,160 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేసకోవలసి ఉంటుంది. అర్హతగల ఉద్యోగులకు 2 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. కంపెనీ వివరాలు యూటీఐ ఏఎంసీలో ప్రస్తుతం ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ 18.24 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. టీ రోవ్ ప్రైస్కు 26 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఐపీవో ద్వారా ఎస్బీఐ, బీవోబీ, ఎల్ఐసీ 8.25 శాతం, టీ రోవ్, పీఎన్బీ 3 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి. 2019లో ఈపీఎఫ్వో నిధులలో 55 శాతం నిర్వహణకు యూటీఐ ఏఎంసీ అనుమతిని పొందింది. గత కొన్నేళ్లుగా యూటీఐ ఏఎంసీ ఉత్తమ రిటర్నులు, మార్జిన్లను సాధిస్తున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ నిపుణులు నిరాలీ షా పేర్కొన్నారు. మార్కెట్ క్యాప్ టు ఈక్విటీ QAAUM ప్రకారం చూస్తే 18 శాతంగా నమోదైనట్లు తెలియజేశారు. ప్రస్తుత ఐపీవో ధర కంటే చౌకగా ఈ ఏడాది కంపెనీ ఉద్యోగులకు షేరుకి రూ. 728 ధరలో వాటాలను కేటాయించినట్లు తెలియజేశారు. -
మంచి ఇంటర్నేషనల్ ఫండ్ ఏది?
నేను ప్రస్తుతం యూటీఐ ఎంఎన్సీ, యూటీఐ డివిడెండ్ ఈల్డ్ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్స్లో నా ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? ఒక ఇంటర్నేషనల్ ఫండ్లో కూడా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను, తగిన సూచనలివ్వండి. -శ్రీధర్, జగిత్యాల మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రెండు ఫండ్స్- యూటీఐ ఎంఎన్సీ, యూటీఐ డివిడెండ్ ఈల్డ్లకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ రెండింటిలో ఎలాంటి సందేహాలు లేకుండా పెట్టుబడులు కొనసాగించండి. ఈ రెండింటి పెట్టుబడులను యూటీఐ ఈక్విటీ ఫండ్కు మళ్లించవచ్చు. యూటీఐ ఈక్విటీ అనేది డైవర్సిఫైడ్ ఫండ్. మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న ఈ రెండు ఫండ్స్తో పోల్చితే ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ ఎక్కువ. ఇక ఇంటర్నేషనల్ ఫండ్ పెట్టుబడి విషయానికొస్తే, పెట్టుబడులను ప్రాంతాల వారీగా డైవర్సిఫై చేయడం చాలా మంచి యోచన. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, బిర్లా సన్లైఫ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఏ- ఈ ఫండ్స్ అన్నీ అంతర్జాతీయంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మొదటి రెండు ఫండ్స్ ప్రధానంగా అమెరికా కంపెనీల్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ అమెరికా కంపెనీలు ప్రపంచమంతా వ్యాపారం చేస్తున్నాయి. మీరు వీటిల్లో ఏ ఫండ్నైనా ఎంచుకోవచ్చు. పొలం అమ్మగా నా వాటా కింద రూ.80,000 సొమ్ము వచ్చింది. ఒక ఏడాది కాలానికి ఈ డబ్బులను ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి -అనిత, గుంటూరు ఏడాది కాలం ఇన్వెస్ట్మెంట్ కోసమైతే షేర్ల గురించి ఆలోచించవద్దు. ఏడాది లోపు ఈ సొమ్ములు మీకు అవసరం లేకపోతే, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయండి. వీటి వల్ల మంచి రిటర్న్లు రావడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. డబ్బులు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవాలనుంటే, లిక్విడ్ ఫండ్లో గానీ, ఆల్ట్రా షార్ట్-టెర్మ్ బాండ్ ఫండ్లో గానీ పెట్టుబడులు పెట్టండి. నా కొడుకు, కోడలు ఇద్దరూ 40 ఏళ్ల టెర్మ్ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నారు. టెర్మ్, ఆరోగ్య బీమా కూడా ఉండే కొన్ని ప్లాన్లను వివరిస్తారా? -అచ్యుత రామయ్య, తిరుపతి మీ కొడుకు, కోడలూ ఇద్దరూ చిన్న వయసులోనే ఉన్నారు. కాబట్టి వాళ్లు తప్పనిసరిగా ఆన్లైన్ టెర్మ్ పాలసీలు తీసుకోవడమే ఉత్తమం. ఆన్లైన్ పాలసీలు తీసుకుంటే ఏజెంట్ల, దళారీల ప్రమేయం ఉండదు. దీంతో ఈ ఆన్లైన్ పాలసీలను బీమా కంపెనీలు తక్కువ ధరకే అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ క్లిక్ 2 ప్రొటెక్ట్, ఐసీఐసీఐ ప్రు ఐకేర్, ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్, అవైవా ఐ-లైఫ్.. ఇవన్నీ కొన్ని మంచి పాలసీలు. అవైవా లైఫ్ మినహా మిగిలినవన్నీ 30 ఏళ్ల కాలపరిమితి ఉన్న పాలసీలు. అవైవా పాలసీ 35 ఏళ్ల పాలసీ. మీ ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకోండి. రూ. కోటి పాలసీ తీసుకోవాలనుకుంటే, ఒకటే పాలసీ కాక రెండు పాలసీలు తీసుకోండి. ఇక ఆరోగ్య బీమా విషయానికొస్తే, ఒకే పాలసీ కింద ఇద్దరికీ వర్తించే ఫ్యామిలీ ఫ్లోటర్ను ఎంచుకోండి. విభిన్నరకాలైన బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు ఇన్ పేషెంట్గా హాస్పిటల్లో చేరితే అయ్యే వ్యయాలను భరిస్తే, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ను కూడా కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలున్నాయి. ప్రసూతి వ్యయాలు, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ రిస్క్, ఇత్యాది ఎన్నో ప్రయోజనాలందించే పాలసీలు చాలా ఉన్నాయి. మా వెబ్సైట్లోని బీమా సెక్షన్లోకి వెళ్లి మీకు ఎంత కవరేజ్ అవసరమో దృష్టిలో పెట్టుకొని ఏ పాలసీని తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్య బీమాకు సంబంధించి ఏమీ దాచకుండా అన్ని వివరాలను సంబంధిత దరఖాస్తుల్లో నింపండి. ఫలితంగా బీమా పరిహారం పొందేటప్పుడు ఎలాంటి సమస్యలుండవు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement