-
యూకేలో మొట్టమొదటిసారిగా అష్టావధానం
ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK)లో మొట్టమొదటిసారిగా అష్టావధానం నిర్వహించారు. ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచేతుల మీదుగా జులై 9న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతి వలె ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరం ఈ కార్యక్రమానికి వేదికయ్యింది. వందలాది మంది తెలుగు ఎన్నారైలు ఈ వేడుకను తిలకించారు.స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకుడు కుమార్ అనీష్ కందాడ ప్రార్థనా గీతం ఆలపించగా, పల్లవి మంగళంపల్లి తన మధురమైన గాత్రంతో అలరించింది. కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్ను పట్టుశాలువా, పూల మాలలు, సన్మాన పత్రంతో సత్కరించారు. -
విశేషంగా అలరించిన వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానం
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా తెలుగు సాహితీ సంస్కృతికి తలమానికమైన అవధాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. సింగపూర్ వేదికపై బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానం నిర్వహింపబడడం ఇదే తొలిసారి కాగా, ఇది వారు చేసిన 1240 అవధానం కావడం మరొక విశేషం. "తెలుగువారికి గర్వకారణమైన అవధాన ప్రక్రియకు పట్టంకడుతూ అన్ని దేశాలవారితో కలసి నిర్వహిస్తున్న అష్టావధాన కార్యక్రమ పరంపరలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సింగపూరు తెలుగువారికి సంక్రాంతి కానుకగా అందించడానికి ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాల్లో పృచ్ఛకులుగా సింగపూర్ నుంచి తమ సంస్థ సభ్యులే పాల్గొనడం మరింత ఆనందంగా ఉందని" సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర శాసనసభ పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు, డా. వంగూరి చిట్టెన్ రాజు, సంచాలకులుగా ఆస్ట్రేలియా నుండి అవధాన శారదామూర్తి, తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని సభకు మరింత శోభను చేకూర్చారు. చక్కటి చలోక్తులతో ఆసాంతం ఆసక్తికరంగా కొనసాగిన ఈ అవధానంలో "కృష్ణున్బొంది సుయోధనుండు మురిసెన్ గీతామృతాస్వాదియై" అనే శార్దూల వృత్తంలో సమస్యాపూరణం, దత్తపది అంశంలో "గురువు" అనే పదాన్ని నానార్థాలలో వాడుతూ చంపకమాల వృత్తం, ఆధునిక మహిళ విజయాలపై నిషిద్ధాక్షరి అంశం కొరకు కంద పద్యం, న్యస్తాక్షరి అంశం కొరకు "గాలిపటం" అనే పదంలోని అక్షరాలను వేర్వేరు పాదాలలో వచ్చేలా ఉత్పలమాల పద్యం, రాముని అందాన్ని చూసి మైమరచిన విశ్వామిత్రుని స్పందన వర్ణన అంశం పద్యం మొదలైన అధ్భుత పూరణలు అందరినీ అలరించాయి. పృచ్ఛకులుగా సమస్యాపూరణం - రాధిక మంగిపూడి; దత్తపది- రాధాకృష్ణ రేగళ్ల; నిషిద్ధాక్షరి - అపర్ణ గాడేపల్లి; న్యస్తాక్షరి - రోజారమణి ఓరుగంటి; వర్ణన - స్వాతి జంగా; ఆశువు - పాటూరి రాంబాబు; అప్రస్తుతం - శ్రీ రత్న కుమార్ కవుటూరు; పురాణపఠనం - శ్రీ రాజేంద్రబాబు గట్టు; పాల్గొని చక్కటి ప్రశ్నలతో సభను రక్తి కట్టించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు చామిరాజు రామాంజనేయులు సభానిర్వహణ గావించగా భాస్కర్ ఊలపల్లి వందన సమర్పణ చేశారు, ధరణీప్రగడ వెంకటేశ్వరరావు, రమాసత్యవతి దంపతులు "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రతినిధులుగా పద్మాకర్ గురుదేవులను సత్కరించారు. గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలల నుండి వేలాదిమంది తెలుగు సాహితీప్రియులు వీక్షించి హర్షించారు. -
సప్త ఖండాల్లో ‘వద్దిపర్తి’ అవధానం
సాక్షి, హైదరాబాద్: ‘త్రిభాషా మహా సహ స్రావధాని’ వద్దిపర్తి పద్మాకర్ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తోన్న అష్టావధానం ఆసక్తికరంగా సాగుతోంది. ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’ పేర జరుగుతున్న ఈ అవధాన యజ్ఞంలో ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు సాహితీమూర్తులు, భాషాప్రియులు భాగస్వాములవుతున్నారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల అవధానాన్ని పూర్తిచేసిన వద్దిపర్తి, తాజాగా ఆసియా ఖండావధానం నిర్వహించారు. ఈ అవధాన ప్రక్రియ ఏ ఖం డంలో కార్యక్రమం జరుగుతుంటే ఆ ఖండా నికి చెందిన తెలుగు కవి పండితులు పృచ్ఛకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఆసియా ఖండ అవధానానికి ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్, కొప్పరపు కవుల మనుమడు మాశర్మ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ‘అమెరికా అవధాని’ పాలడుగు శ్రీచరణ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కవిపండితులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. చల్లా రామచంద్రమూర్తి (సమస్య, ఉత్తరప్రదేశ్), మాడభూషి సంపత్ కుమార్ (దత్తపది, తమిళనాడు), రాధిక మంగిపూడి (న్యస్తాక్షరి, మహారాష్ట్ర), రాళ్లపల్లి సుందరరావు (ఆశువు, పశ్చిమ బెంగాల్), లక్ష్మీ అయ్యర్ (పురాణ పఠనం, రాజస్తాన్) ఫణి రాజమౌళి (అప్రస్తుతం, కర్ణాటక), ముత్యంపేట గౌరీ శంకరశర్మ (నిషిద్ధాక్షరి, తెలంగాణ), నిష్ఠల సూర్యకాంతి (వర్ణన, ఆంధ్రప్రదేశ్)లు పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఈ అవధాన ప్రక్రియలో భాగంగా ఆఫ్గానిస్తాన్లో జరుగుతున్న అకృత్యాల మొదలు అనేక అంశాలపై ప్రాశ్నికులు సంధించారు. ‘రాముని పెండ్లియాడె నొక రక్కసి సీత సహాయమాయెగా’అనే సమస్య,‘ముక్కు–చెవి–కన్ను–నోరు’ పదాలతో ’దత్తపది’వంటి అంశాలను అవధాని వద్దిపర్తి పద్మాకర్ అలవోకగా ఎదుర్కొని పద్యరూపాత్మక సమాధానాలతో అబ్బురపరిచారు. -
దుర్గతులను దూరం చేసే తల్లీ!
అమ్మవారు జ్ఞానదాయిని, మోక్షదాయిని, సర్వవిద్యాప్రదాయిని. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి దశమి వరకు ఉండే పది తిథులలోనూ నిష్ఠగా ఉండి ఇంద్రియాలను జయించాలని, దానివల్ల పునర్జన్మ ఉండదని దేవ్యుపనిషత్తు తెలుపుతోంది. అమ్మ అంటే ప్రకృతి. ఈ ప్రకృతిని ప్రేమించడం, దానిని వికృతిని చేయక రక్షించడమే అమ్మపూజ అని, అదే మానవ ధర్మమనీ బ్రహ్మాండపురాణం చెబుతోంది. ఈర్ష్యను వదలడం, సత్యం, అహింస, ధర్మం, దురాశను వదలడం, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం, దురాచారాలు, పాపాలు త్యజించి, పరస్త్రీని, పరధనాన్నీ కోరకుండా ఉండటం, ఆత్మస్థైర్యంతో సర్వకార్యాలనూ సాధించడం... ఇవే శరన్నవరాత్రుల పూజలలోని విశేషార్థం. అమ్మవారికి వసంతకాలంలో వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి మొదలుగా గల నవరాత్రులన్నా, శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుగా గల నవరాత్రులన్నా ఇష్టమైన రోజులు. ఈ ఋుతువులు రెండూ రోగాలు వ్యాపింపజేసే లక్షణాలున్నవే. వర్షాలు వెనకబడటం వల్ల శరత్కాలంలోనూ, చలి తొలగడం వల్ల చైత్రంలోనూ కొత్త రోగాలు వచ్చి ప్రజలను పీడించి ప్రాణాలు తీస్తాయనీ, అందువల్ల వీటిని యముని కోరలుగా పిలుస్తారనీ, ఈ బాధల నుండి బయటపడటానికి అమ్మను పూజించాలని వేదవ్యాసుడు జనమేజయ మహారాజుకు చెప్పాడు. కేవలం మహిషాసుర సంహారం వల్ల శరన్నవరాత్రుల పూజలు ఆరంభమయ్యాయని చాలామంది భావిస్తారు. కానీ అది తప్పు. శరన్నవరాత్రులు ఆరంభం కావడానికి మూలకారకుడు కృతయుగంలోని దుర్గముడు. హిరణ్యాక్షుని కొడుకు రురుడు. వాడి కొడుకు దుర్గముడు. వాడు బ్రహ్మ గురించి తపస్సు చేసి, విప్రులు వేదాలు మరచిపోవాలనీ, అవి తనకే చెందాలనీ వరం కోరాడు. ఆ వరం వాడికి బ్రహ్మ ఇవ్వడంతో విప్ర, మునులంతా వేదాలు మరచిపోయారు. దాని వల్ల యజ్ఞాలు ఆగిపోయాయి. హవిస్సులు అందక దేవతలు కృశించిపోయారు. దేవతలు కృశించడంతో వర్షాలు కురవక భూలోకవాసులు తల్లడిల్లిపోయారు. అప్పుడు వారంతా అమ్మను ప్రార్థించగా, శ్రీదేవి వారికందరికీ ముందుగా ఆహారాన్ని పెట్టింది. అప్పటి నుంచి అమ్మవారిని శాకంభరి అన్నారు. ఆపై దుర్గముడిని చంపివేసింది. వాడి చావుతో బ్రహ్మ వాడికిచ్చిన వరం తొలగిపోయి యథాస్థితి ఏర్పడింది. లోకం సుభిక్షమైంది. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చింది. శ్రీమత్ దేవీభాగవతంలోని సప్తమ స్కంధంలో ఈ కథ ఉంది. దుర్గాసప్తశతిలో కూడా అమ్మ స్వయంగా, దుర్గముడిని చంపిన తనకు దుర్గ అనే పేరు వచ్చిందని చెప్పింది. ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు అమ్మవారు దుర్గముడిని అమ్మవారు చంపడం వల్ల ఆనాటి నుండి దుర్గాష్టమిగా దానిని పేర్కొన్నారు. శరన్నవరాత్రులు ఉత్తమ మనువు కాలంలో ఈ దుర్గమ వధ వల్ల ప్రారంభమైనట్లు కాళికాపురాణం చెప్తోంది. పూర్వం శ్రీరాముడు సీతాన్వేషణ సమయంలో లంకకు వెళ్లే ముందు నారదుని సలహాపై అంబికను ప్రతిష్ఠించుకుని దేవీనవరాత్రి పూజలు చేశాడు. అష్టమినాడు అమ్మవారిని 1008 తామరపూలతో, అవి కూడా వేయి రేకులున్న వాటితో పూజించదలిచాడు. సహస్రార కమలాలు కేవలం సౌగంధిక సరస్సులోనే ఉంటాయి. వాటిని హనుమంతుడు రాముడికి తెచ్చి ఇచ్చాడు. నారదుని పౌరోహిత్యంలో అష్టమీ పూజ శ్రీలలితాసహస్రనామాలతో జరుగుతోంది. ఇంక రెండు నామాలున్నాయనగా రెండు పూలు తక్కువయ్యాయి. నారదుడు దీక్షలో నుండి కదలకూడదనీ, ఆలస్యం లేకుండా ఆ రెండు పూలూ కూడా సమర్పించకపోతే పూజ అంతా వ్యర్థమేననీ, పైగా అమ్మవారికి మహాపచారం కూడా చేసినట్లేననీ అన్నాడు. అప్పుడు రాముడు... నా కళ్లే తామరపూలకు బదులుగా ఇస్తాననీ, నన్ను ప్రజలు ‘రామః కమల పత్రాక్షః’ అంటారనీ పలికి, ఆ రెండు నామాలనూ నారదుడు చదువుతుండగా, తన కళ్లు పీకి అమ్మకు సమర్పించాడు. అప్పుడు అమ్మ అష్టమినాటి ఆ రాత్రి వేళ ఆయనకు ప్రత్యక్షమై, తానే రాముడిని పరీక్షించడానికి పూలు మాయం చేశానని చెప్పి, రాముని అనన్య భక్తికి వరాలిచ్చి, దశమినాడు లంకకు వెళ్లమని, ఆయనకు సీతాసమాగమం అవుతుందని వరమిచ్చింది. అప్పటి నుంచి దుర్గాష్టమి రామాష్టమిగా, విజయాష్టమిగా, మోక్షాష్టమిగా ప్రసిద్ధికెక్కిందని కాళికాపురాణం, శ్రీమత్ దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలోనూ వ్యాసుడు వివరించాడు. నవరాత్రులు తొమ్మిదిరోజులూ అమ్మవారిని పూజించలేనివారు కనీసం అష్టమి నుండి అయినా అమ్మను అర్చించడం ఫలదాయకం. అర్చన విధానం అమ్మవారిని ఉంచే మండపాన్ని తోరణాలతో అలంకరించాలి. ఉదయమే లేచి పవిత్ర స్నానం చేయాలి. అమ్మవారిని వస్త్రాదులతో అలంకరించాలి. అమ్మవారి పాదాల వద్ద నవార్ణవ మంత్రంతో కూడిన యంత్రం స్థాపించాలి. వేదికపై కుడివైపు అంటే మనకు ఎడమవైపు కలశస్థాపన చేయాలి. కలశంలో పంచపల్లవాలు అంటే రావి, జువ్వి, మేడి, మద్ది, మామిడిచిగుళ్లు ఉంచాలి. కలశంలో నదీజలం, సువర్ణం, రత్నం వీలును బట్టి వేయాలి. ముందుగా ఆచమనం చేయాలి. సంకల్పం చెప్పుకుని పూజను ఆరంభించాలి. గురూపదేశ మంత్రం జపించి, సహస్రనామాలతో శ్రీచక్రాన్ని పూజించాలి. నిత్యార్చనలో పంచామృతాలు ఉపయోగించాలి. అమ్మవారి పూజలో గంధం, అగరువత్తులు, కర్పూరం, సుగంధ పుష్పాలు, అమ్మవారి పూజకు మందారం, కానుగ, అశోకం, సంపెంగ, గన్నేరు, మాలతి, బిల్వపత్రాలు, తామరపూలు, కలువపూలు ఉండాలి. నల్ల కలువలు శ్రేష్ఠం. నైవేద్యంలో ఉండవలసిన ఫలాలు: కొబ్బరికాయ, నిమ్మ, దానిమ్మ, అరటి, నారింజ, పనస, మారేడుకాయ. పిండివంటలు: దద్ధ్యోదనం, పాయసం. - వద్దిపర్తి పద్మాకర్, ప్రణవ పీఠాధిపతి అమ్మవారి పూజాదులలో అనే కాంతరార్థాలున్నాయి. ‘దురాచార విఘాతినీం’ అని అమ్మను శ్రీ దేవ్యధర్వ శీర్షం వర్ణించింది. మనలోని అహంకార మమకా రాలు, కోమక్రోధాదులు, జంతువు లను బలి ఇచ్చే హింసాది లక్షణాల కు ‘దుం’ అని పేరు. వాటిని తొలగించే తల్లి దుర్గ అని, దురా చారాలను తొలగించుకోవడమే శరన్నవరాత్రుల పూజలోని అంత రార్థమనీ, మనలోని నవరంధ్రాల ను శుద్ధి చేసుకోవడమే నవరాత్ర పూజ అనీ, అథర్వ శీర్షంలోని మంత్రాలు వివరిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement