-
అవార్డులు కొత్తేమీ కాదు ఆదుకోండి..
సాక్షి, చెన్నై: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన చిన్నపిళ్లైని పేదరికం వెంటాడుతోంది. తనను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు అవార్డులు కొత్తేమీ కాదని, పద్మశ్రీ అవార్డు ఆనందమేనని చిన్నపిళ్లై వ్యాఖ్యానించారు.దక్షిణ తమిళనాడు అన్ని రంగాల్లో ఒకప్పుడు వెనుక బడి ఉండేది. ప్రధానంగా మదురై, తిరునల్వేలి, విరుదుగనర్ జిల్లాల్లో కందువడ్డి వేధింపులు మరీ ఎక్కువే. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న దృష్ట్యా, రైతు కూలీలు మరీ ఎక్కువే. ఈ సమయంలో 1990లో మహిళలు స్వయం ఉపాధి కల్పన, వారి జీవితాల్లో వెలుగు లక్ష్యంగా మదురైకు చెందిన చిన్నపిళ్లై (67) కదిలారు. కళంజియం పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. స్వయం సహాయక బృందాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. కందువడ్డి వేధింపుల భారి నుంచి గ్రామీణ ప్రజల్ని రక్షించేందుకు ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలు తీసుకున్నారు. స్వయం సహాయక బృందాలకు రుణాల్ని ఇప్పించి, వృత్తి శిక్షణతో బలోపేతం చేశారు. వారి కాళ్లపై వాళ్లే నిలబడే స్థాయికి గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు. అలాగే, మద్యపానానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పినా, మద్దతు కరువే. బాల్య వివాహాల్ని అడ్డుకోవడంలో చిన్నపిళ్లై సఫలీకృతులయ్యారు. ఆమె సామాజిక సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, వ్యక్తిగతం చిన్నపిళ్లై ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రస్తుతం పేదరికంలో ఉన్న ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇస్తున్న రూ. వెయ్యి వితంతువు పింఛన్ ఒక్కటే ఆదరణగా మారింది. వాజ్పేయి ఆశీర్వాదం: పద్మశ్రీ అవార్డుకు ఎంపి కైన చిన్నపిళ్లైని మీడియా కదిలించగా, తనకు వచ్చిన అవార్డులు, పేదరికం, ఆరోగ్య సమస్యలను వివరించారు. తనకు అవార్డులు కొత్తేమీ కాదన్నారు. అప్పట్లో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి తన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకునిమరి బిరుదును ప్రదానం చేశారన్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అవ్వయార్ బిరుదును ప్రదానం చేసిందన్నారు. బిరుదులు వస్తుంటాయని, అయితే, గ్రామీణ మహిళలు మరింత ఆర్థిక ప్రగతి సాధించాలన్నదే తన తపనగా పేర్కొన్నారు. ఇప్పుడు మద్యం రక్కసి గ్రామాల్లో అనేక కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదనను మద్యానికి తగలబెడుతున్నారని, మహిళలు దాచుకున్న నాలుగు రాళ్లను లాక్కెళ్తున్న వాళ్లు ఎక్కువగానే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవ్వయార్ బిరుదు అందుకునే సమయంలో మద్యం దుకాణాల్ని మూసి వేయాలని సీఎంకు విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నించానని, అయితే, ఆయన దారిదాపుల్లోకి వెళ్లకుండా అధికారులు తనను అడ్డుకోవడం జరిగిందన్నారు. మహిళా సంక్షేమంపై చిత్త శుద్ధి ఉంటే, మద్యం దుకాణాల్ని మూసి వేయడానికి సీఎం పళనిస్వామి చర్యలు చేపట్టాలని కోరారు. పేదరికంలో ఉన్నా : సామాజిక సేవ అన్నది ఓ వైపు ఉన్నా, దానిని కొనసాగించేందుకు తగ్గ బలం ఇప్పటికీ ఉందన్నారు. అయితే, వ్యక్తిగతంగా తాను పేదరికంలో ఉన్నట్టు, ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు రూ.వెయ్యి వితంతు పెన్షన్ను అందిస్తోందని, ఇది మందులకు సరిపోతున్నట్టు చెమ్మగిళ్లుతున్న కళ్లను తుడుచుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పేదరికంతో తాను కొట్టుమిట్టాడుతున్నానని, ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, పేద విద్యార్థులకు ఉపాధి కల్పన అవకాశాలు మెరుగు పరచాలని, బాల్య వివాహాలు అడ్డుకునేందుకు విస్తృతంగా ముందుకు సాగాలన్న తపనతో కళంజియం ఉందన్నారు. -
ఐపీఎల్ కార్డుదారులకూ వాజ్పేయి ఆరోగ్యశ్రీ
డిసెంబర్ రెండవ వారంలో అమలు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడి సాక్షి, బెంగళూరు : వాజ్పేయి ఆరోగ్య శ్రీ పథకాన్ని ఐపీఎల్ కార్డుదారులకూ విస్తరించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 165 ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యాన్ని అందుకునే సౌలభ్యాన్ని బీపీఎల్ కార్డుదారులకు ఈ పథకం ద్వారా అందజేశామని చెప్పారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని ఏపీఎల్ కార్డుదారులకు సైతం చేరువ చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. డిసెంబర్ రెండవ వారంలో ఏపీఎల్ కార్డుదారులకూ ఈ పథకాన్ని విస్తరించేందుకు మంత్రి మండలి ఇప్పటికే తన అంగీకారాన్ని తెలిపిందని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా ఏపీఎల్ కార్డుదారులు జనరల్ వార్డుల్లో చికిత్స తీసుకుంటే చికిత్సకు అయ్యే ఖర్చులో 70 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 30 శాతం రోగులు భరించాల్సి ఉంటుందని అన్నారు. అదే స్పెషల్ వార్డుల్లో చికిత్స తీసుకుంటే మాత్రం 50 శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మరో 50 శాతం రోగి భరించాల్సి ఉంటుందని అన్నారు. అదే సూపర్ స్పెషాలిటీ వార్డ్లో చికిత్స తీసుకుంటే మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఖర్చును భరించబోదని వెల్లడించారు. కాగా, గత ఏడాది కేన్సర్, గుండె సంబంధ తదితర 469 వ్యాధులకు సంబంధించి 35 వేల మందికి శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. ఇందు కోసం రూ.176 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. కాగా, ఈఏడాది వాజ్పేయి ఆరోగ్యశ్రీ కోసం రూ.210 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, వాజ్పేయి ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ప్రపంచ బ్యాంక్ రాష్ట్రంలోని 572 గ్రామాల్లో 31,476 కుటుంబాలపై అధ్యయనాన్ని సాగించి ప్రశంసలు కురిపించడమే కాకుండా అంతర్జాతీయ జర్నల్స్లో కూడా ఈ విషయాన్ని ప్రకటించిందని యూటీ ఖాదర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement