-
ఇన్చార్జీలతో ఇంకెంత కాలం?
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ కీలక పోస్టుల్లో పూర్తిస్థాయి అధికారుల్లేక పాలన కుంటుపడింది. ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారిసహా ఇతర ముఖ్య పోస్టుల్లోనూ ఒక్కరే ఇన్చార్జిగా ఉన్నారు. దీంతో వైద్య సేవల నిర్వహణపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడుతోంది. వైద్య, ఆరోగ్య పథకాలు, కార్యక్రమాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణను ప్రభుత్వం ఇటీవల భూపరిపాలన డైరెక్టర్గా బదిలీ చేసింది. దీంతో ఆ స్థానంలో పూర్తిస్థాయి అధికారిని ఇంకా నియమించలేదు. కరుణకే ఈ బాధ్యతను అదనంగా అప్పగించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వైద్యసేవలను పర్యవేక్షించే వైద్య విధాన పరిషత్కు కూడా పూర్తిస్థాయి అధికారి లేరు. ఇప్పటిదాకా కరుణ అదనంగా ఈ బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) తెలంగాణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్గా పూర్తిస్థాయి అధికారి లేరు. ఈ బాధ్యతలను కూడా కరుణ ఇప్పటి దాకా అదనంగా నిర్వర్తించారు. వైద్య, ఆరోగ్య శాఖలోని ఉద్యోగులకు, సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ప్రక్రియ నిర్వహించే భారత కుటుంబ సంక్షేమ శిక్షణ సంస్థ డైరెక్టర్గానూ కరుణ వ్యవహరించారు. ∙రాష్ట్రంలోని అన్ని వర్గాలకు వైద్య సేవలను అందించే కీలకమైన ఆరోగ్యశ్రీ వైద్య సహాయ ట్రస్టుకు పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేరు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డైరెక్టర్ కె.మనోహర్కు ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టును అదనంగా కేటాయించారు. ఈ రెండూ పెద్ద సంస్థలే కావడంతో పర్యవేక్షణ కొరవడి వాటిల్లో పరిపాలన గాడితప్పుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ∙వైద్య, ఆరోగ్య శాఖ విధాన నిర్ణయాల్లో కీలకమైన అదనపు కార్యదర్శి పోస్టులోనూ ఇన్చార్జే ఉన్నారు. తెలంగాణ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ సీఈవో సోనిబాలదేవికి అదనపు కార్యదర్శి బాధ్యతను అదనంగా కేటాయించారు. ∙యోగాధ్యయన పరిషత్ ఉన్నతాధికారి పోస్టు(కార్యదర్శి)లోనూ మరో విభాగం ఉన్నతాధికారి అదనంగా బాధ్యతలు చూస్తున్నారు. ఆయుర్వేద, యోగా, ప్రాకృతిక, యునానీ, హోమియోపతి(ఆయుష్) కమిషనర్ డాక్టర్ ఎ.రాజేందర్రెడ్డికి యోగాధ్యయన పరిషత్ కార్యదర్శి పోస్టును అదనంగా కేటాయించారు. -
వన జాతరకు వాకాటి
సాక్షి, వరంగల్ : మేడారం జాతర నిర్వహణకు ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను నియమించనున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క–సారలమ్మ జాతరపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జాతర తేదీలు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రత్యేక అధికారిగా నియమించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ విభాగాలతో గురువారం హైదరాబాద్లో ఆయన సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా జాతర ప్రత్యేకతలు, అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞురాలైన సీనియర్ ఐఏఎస్ కరుణను ప్రత్యేకాధికారిగా నియమిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు గురువారం వెలువడనున్నట్లు సమాచారం. నాలుగోసారి.. ప్రస్తుతం భూ పరిపాలన విభాగం డైరెక్టర్గా వాకాటి కరుణ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. గతంలో మూడు జాతరల నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించారు. తొలిసారి 2010లో వరంగల్ జేసీ హోదాలో .. ఆ తర్వాత 2012లో రెండో సారి జేసీ హోదాలో జాతర విధులు నిర్వర్తిస్తూ తనదైన ముద్ర వేశారు. అనంతరం 2016 జాతరలో వరంగల్ కలెక్టర్ హోదాలో కరుణ అన్ని తానై వ్యవహరించారు. జాతరకు సంబంధించి నిధుల కేటాయింపు నుంచి పనుల పర్యవేక్షణ వరకు అన్ని అంశాలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ సకాలంలో పనులయ్యేలా వ్యవహరించారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించే బంగారం (బెల్లం) వేలం పాటను మేడారం నుంచి మణుగూరుకు తరలించడంలో పట్టుదలగా వ్యవహరించారు. ముందే మేడారం చేరుకుని జాతర ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు అక్కడే ఉంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవహరించారు. బ్రాండ్ మేడారం.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించేలా చూడాలని, కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. మేడారం జాతరకు బ్రాండ్ ఇమే జ్ తెచ్చేందుకు అంతర్జాతీయ టీవీ చానల్, బ్లాగులు, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీ య, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపొందిం చా లన్నారు. విదేశీ యాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యే క నివాసాలను ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని చెప్పా రు. జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, గిరిజన పార్లమెంట్ సభ్యులను ప్ర త్యేకంగా ఆహ్వానించాలని ఆదేశించారు. జాతర కోసం వచ్చే ముఖ్య అతిథులను తగు ప్రొటోకాల్తో ఆహ్వానించాలని సూచించారు. మేడారంలో పారిశుద్ధ్య నిర్వహణకు మునిసిపల్ శాఖ ద్వారా తగు సిబ్బంది ని నియమించాలని, సరిపడా అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. సాంస్కృతిక, దేవాదాయశాఖ అధికారులు జాతర ఏర్పాట్లపై ప్రత్యేక బ్రోచర్ను విడుదల చేయాలని, జాతరకు వచ్చు భక్తులకు హెలికాప్టర్ సేవలందేలా చూడాలన్నారు.ఏ ఒక్క భక్తుడికీ ఎ టువంటి ఇబ్బంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ సూచించారు. -
ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ డైరెక్టర్గా కరుణ
హైదరాబాద్: భారతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) డైరెక్టర్గా తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆ పోస్టులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి టి.గోపాల్రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement