-
రాజేశ్ ఎక్స్పోర్ట్స్ చేతికి వాల్కాంబీ
ఒప్పందం విలువ రూ. 2,600 కోట్లు.. - ప్రపంచంలోనే అతిపెద్ద - గోల్డ్ రిఫైనరీ సంస్థ వాల్కాంబీ ముంబై: జ్యుయలరీ సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ తాజాగా స్విట్జర్లాండ్కి చెందిన పసిడి రిఫైనరీ సంస్థ వాల్కాంబీని కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద ం విలువ సుమారు రూ. 2,560 కోట్లు. ఇది పూర్తిగా నగదు డీల్ అని సంస్థ ఎండీ ప్రశాంత్ మెహతా తెలిపారు. వచ్చే 2-3 ఏళ్లలో తాము బంగారం మైనింగ్లోకి కూడా ప్రవేశించాలని యోచిస్తున్నామని, వాల్కాంబీ కొనుగోలు అందుకు తోడ్పడగలదని చెప్పారాయన. రాబోయే రోజుల్లో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఆర్ఈఎల్) ఆదాయాలు పెరిగేందుకూ ఇది గణనీయంగా ఉపయోగపడగలదన్నారు. వాల్కాంబీ అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో ఉన్న తమ రిఫైనరీని విస్తరించనున్నట్లు మెహతా పేర్కొన్నారు. భారత్, చైనా, మధ్యప్రాచ్యం తదితర కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి ఆర్ఈఎల్తో భాగస్వామ్యం తోడ్పడగలదని వాల్కాంబీ సీఈవో మైఖేల్ మెసారిక్ చెప్పారు. డీల్కు సంబంధించి క్రెడిట్ సూసీ 30-35 శాతం మొత్తాన్ని దీర్ఘకాలిక రుణ ప్రాతిపదికన సమకూర్చిందని, మిగతా దానికి సంస్థ అంతర్గత నిధులను ఉపయోగించుకున్నట్లు మెహతా చెప్పారు. మొత్తం రుణాన్ని నాలుగేళ్లలో తీర్చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ సంస్థగా నిలుస్తున్న వాల్కాంబీ గడచిన మూడేళ్లలో ఏటా సుమారు 945 టన్నుల బంగారం, 325 టన్నుల వెండి శుద్ధి చేయడం, విక్రయించడం ద్వారా సగటున 38 బిలియన్ డాలర్ల మేర (రూ.2,36,500 కోట్లు) ఆదాయాలు నమోదు చేసిందని మెహతా వివరించారు. ఇక, 14 రాష్ట్రాలకు ముడి వస్తువులు సరఫరా చేస్తున్న తమకు మెజారిటీ మార్కెట్ వాటా (50%) ఉందన్నారు. ‘శుభ్’ బ్రాండ్ పేరిట ఉన్న తమ రిటైల్ స్టోర్స్ సంఖ్యను వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెంచుకోనున్నట్లు మెహతా తెలిపారు. ప్రస్తుతం 82 స్టోర్స్ ఉన్నాయని, 2018 నాటికి సొంత అవుట్లెట్స్, ఫ్రాంచైజీ విధానాల్లో 450కి ఈ సంఖ్యను పెంచుకోనున్నట్లు వివరించారు. -
అతి పెద్ద బంగారం కంపెనీ కొనుగోలు
ముంబై: ముంబైకి చెందిన రాజేష్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాల్కాంబీని (స్విస్) కొనుగోలు చేసింది. దాదాపు 2,540 కోట్ల రూపాయల విలువైన ఈ డీల్తో తమ కంపెనీ ప్రతిష్ఠ మరింత పెరగనుందని కంపెనీవర్గాలు సోమవారం ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం సరఫరా కంపెనీలను పరిశీలించిన మీదట న్యూ మాంట్ మైనింగ్ కార్పొరేషన్ కు చెందిన వాల్కాంబీ కంపెనీని ఎంచుకున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ కంపెనీ ముడి బంగారం, బంగారు నగల తయారీలో ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు. దీంతో తమ కంపెనీ లాభాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. కాగా ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం అతి పెద్దదిగా పేరు గాంచింది భారత్. ఏడాదికి సుమారు 900 టన్నుల బంగారం కొనుగోళ్లు జరుగుతున్నట్టు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement