-
రేడియో ‘చిన్నమ్మ’ ఇక లేరు
సాక్షి, అమరావతి: ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతిరోజూ ప్రసారమయ్యే ‘పాడి–పంట’ కార్యక్రమంలో ‘చిన్నమ్మ’గా ఆబాలగోపాలాన్ని అలరించిన నిర్మలా వసంత్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం హైదరాబాద్లో మరణించారు. ఈ నెల 8న కూడా ఆమె ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవసాయ కార్యక్రమమే అయినా అన్ని వర్గాల శ్రోతలను ఆమె ఆకట్టుకునేవారు. ఆకాశవాణి కేంద్రం ద్వారా వ్యవసాయదారులకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుని రేడియో సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. నిర్మలా వసంత్ పల్లెటూరి యాసతో పాడిపంటకు జీవం పోశారని ప్రోగ్రాం స్టాఫ్ అసోసియేషన్ జాతీయ నాయకుడు వలేటి గోపీచంద్ కొనియాడారు. -
పంటచేలతో మాట్లాడిన శాస్త్రవేత్త
వ్యవసాయ శాస్త్రవేత్తంటే నిత్యం పొలాల్లో ఉండాలి. అప్పుడే మొక్కలతో మాట్లాడటం అలవడుతుంది. అవి తమ సమస్యలను మనకు చెప్పుకోగలుగుతాయి. వాటిని పరిష్కరించే అవకాశం మనకు లభిస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన నిజమైన రైతు శాస్త్రవేత్త ఎమ్వీ రెడ్డి సాంబ మసూరి (బీపీటీ 5204) వరి వంగడం గురించి వినని వారు ఉండొచ్చు. కానీ కర్నూలు సన్న బియ్యం అన్నం రుచి ఎరుగని వారుండరు. దేశవ్యాప్తంగా సన్న బియ్యం రకాలు ఎన్నున్నా... కర్నూలు సన్న బియ్యానికి మరేవీ సాటి రావని అనని వారూ ఉండరు. సాంబ మసూరి లేదా బీపీటీ 5204 వరి వంగడం సృష్టి కర్త ప్రొఫెసర్ మమోలవల్లి వెంకట రమణారెడ్డి (85)ఈ నెల 23న బెంగళూరులో కన్ను మూశారు. రైతు లోకానికి ఆయన మరణ వార్త అశనిపాతమనే చెప్పాలి. రెండున్నర దశా బ్దాల క్రితం, 1986లో ఎమ్వీ రెడ్డి రైతు లోకానికి అందించిన సాంబ మసూరి తర్వాత ఎన్ని వందల కొత్త రకాలు వచ్చి నా అవేవీ బీపీటీ 5204కు సాటి రావు. ఉడికిన తర్వాత అన్నం చిట్లకుండా, మెతుకులు పూలలా జాలు వారే సాంబ మసూరి దేశవ్యాప్తంగా వినియోగదారు లకు ప్రీతికరమైనది. రైతుకు అధిక దిగుబడినిచ్చేది. సగటు న ఎకరాకు 40 బస్తాల దిగుబడికి రైతుకు హామీనిచ్చే అది కర్నూలులో పుట్టి, బీపీటీ 5204గా దేశవ్యాప్తంగా విస్తరిం చింది. దేశంలో సాగు చేస్తున్న వరిలో మూడింట ఒక వంతు మన రాష్ట్రంలో రూపొందిన రకాలే. బీపీటీ 5204 వాటిలో ఒకటి. అధిక దిగుబడి, మంచి నాణ్యతలకు పేరు మోసిన సాంబ మసూరి రైతుకు భరోసానిచ్చింది. అంతేకాదు పల్లెల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల గౌరవాన్ని నిలిపింది. కరువు సీమలోని అనంతపూర్ జిల్లా కదిరి దగ్గరి చీకటి వారి పల్లెలో 1929లో ప్రొఫెసర్ రెడ్డి పుట్టారు. 1989లో తిరుపతి ‘ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం’ అసోసియేట్ డెరైక్టర్ ఆఫ్ రిసెర్చ్గా పదవీ విరమణ చేశారు. అంతవరకు ఆయన ఎక్కడున్నా కరువు సీమ నేపథ్యాన్ని మరువలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, వంగడాల రూపక ర్తగా ఎమ్వీ రెడ్డి పేరు బీపీటీ 5204 తోనే వినిపిస్తుంది. కానీ నూనె గింజల రకాలపైనే ఆయన ఎక్కువగా కృషి చేశారు. ప్రొద్దు తిరుగుడు, వేరుశనగ అధిక దిగుబడి వంగడాల ఆవి ష్కరణలో ఆయన కృషి ఉంది. ఆయన సృష్టించిన విత్తనా లతో కంపెనీలు, మిల్లర్లు, వ్యాపారవేత్తలు కోట్లకు పడగలె త్తారు. కానీ ఆయనకు గుర్తింపు లభించలేదు. 1980-83 మధ్య ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేశారు. ఆ సమయంలో నేను అక్కడ విద్యార్థిగా ఉన్నాను. రెడ్డి కొంచెం స్థూలకాయులు. అయినా చక చకా నడుస్తూ, పరిసరాలను నిశితంగా గమనించేవారు. తరగతి గదుల్లో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య సంభాషణలను, సమన్వయాన్ని ఆరాతీస్తూ కళాశాలను సజీవంగా నడిపిన అసమాన పరిపాలనా దక్షుడు. మొదటి సంవత్సరం విద్యా ర్థులకు, వారి తల్లిదండ్రులకు వ్యసాయంలోని సాధక బాధ కాలను క్లుప్తంగా ఆయన వివరించే తీరు ఆకట్టుకునేది. చివ రి ఏడాది మొదటి ఆరు నెలలు గ్రామాల్లో ఉండాలి. ఆ సంద ర్భంగా ఆయన ఇచ్చే మార్గదర్శకత్వం ఆలోచింపజేసేదిగా ఉండేది. విద్యార్థులు పెడదోవ పట్టకుండా నైతిక వర్తన, నియమనిబంధనలను గురించి పదే పదే హెచ్చరించేవారు. వ్యవసాయ శాస్త్రవేత్తంటే నిత్యం పొలాల్లో ఉండాలి. అ ప్పుడే మొక్కలతో మాట్లాడటం అలవడుతుంది. అవి తమ సమస్యలను మనకు చెప్పుకోగలుగుతాయి. వాటిని పరిష్క రించే అవకాశం మనకు లభిస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సారు ఎమ్వీ రెడ్డి. మొక్కలతో ఎంత ఎక్కువగా మమేకం కాగలిగితే అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుం దని నిత్యం తన సహచరులకు, శిష్యులకు బోధించేవారు. తానే ఒక ఉదాహరణగా నిలిచేవారు. నాడు వ్యవసాయ పరిశోధనలు పొలంలో సాగాయి. నేడవి గట్టెక్కి, ‘కట్ అండ్ పేస్ట్’ పద్ధతిలో కంప్యూటర్, ఇంటర్నెట్ సాంకేతికతపైనే ఆధారపడి సాగుతున్నాయని విమర్శలు వినవస్తున్నాయి. అందుకేనేమో రెండున్నర దశాబ్దాల క్రితం నాటి బీపీటీ 5204 ఇంకా రాజ్యమేలుతోంది. తెలుగు నేలపై వరి సాగు సాగినంత కాలం బీపీటీ 5204 ఉంటుంది. బీపీటీ వరి కంకి కంకిలో, గింజ గింజలో ఎమ్వీ రెడ్డి సజీవంగా ఉంటారు. మనం తినే ప్రతి అన్నం ముద్ద ఆయన జీవన సాఫల్యతకు సాక్ష్యమై నిలుస్తుంది. మరో నాలుగు బీపీటీ 5204లనైనా ఆవిష్కరించడమే ఆ రైతు శాస్త్రవేత్తకు నిజమైన నివాళి. వలేటి గోపీచంద్ (వ్యాసకర్త ‘ఆకాశవాణి’ హైదరాబాద్ కేంద్రం, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement