-
ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జువ్వాదిమలైకొండ వద్ద అదుపుతప్పి ఓ వ్యాన్ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతులంతా పులియూర్ గ్రామస్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పాదచారులపైకి దూసుకెళ్లిన వ్యాను
బెర్లిన్: జర్మనీలోని మ్యూన్స్టర్ నగరంలో శనివారం ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఓ వ్యానుతో కీపెన్కెర్ల్ విగ్రహం సమీపంలో ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. పాదచారుల్ని వ్యానుతో గాయపర్చిన అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉగ్రదాడా? కాదా? అన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఉగ్రకోణాన్నీ కొట్టిపారేయలేమన్నారు. ప్రమాదస్థలికి రావద్దనీ, ఈ ఘటనపై ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని పోలీసులు ప్రజలకు ట్విటర్లో విజ్ఞప్తి చేశారు. 2016, డిసెంబర్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది అనీస్ బెర్లిన్లో ఓ ట్రక్కుతో పాదచారులపైకి దూసుకెళ్లడంతో 14 మంది దుర్మరణం చెందారు. -
రహదారులు రక్తసిక్తం
నార్పల/గుత్తి రూరల్, న్యూస్లైన్ : శనివారం సాయంత్రం జిల్లాలో రహదారులు రక్తమోడాయి. ఒకే రోజు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. నార్పల మండలంలోని ధర్మవరం- నార్పల ప్రధాన రహదారిపై పప్పూరు సమీపంలో ఆటో, వ్యాన్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందగా.. గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి వాటర్ ప్రాజెక్టు వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రాత్రి ఆటో, బైక్ను లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉన్నాడు. ఈ రెండు ప్రమాదాల్లో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం సాయంత్రం నార్పల నుంచి బత్తలపల్లికి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ధర్మవరం వైపు నుంచి వస్తున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ రహంతుల్లా (35), బత్తలపల్లికి చెందిన సిరింతాజ్(16), ధర్మవరానికి చెందిన జిలాన్ (50), మరో గుర్తు తెలియని మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిలో తాడిమర్రికి చెందిన ఆంజనేయులు, బండ్లపల్లికి చెందిన నబీసాబ్, బందలేడుకు చెందిన కుళ్లాయమ్మ, బత్తలపల్లికి చెందిన హమీదా, ధర్మవరం రూరల్ మండలం బడన్నపల్లికి చెందిన గంగిరెడ్డి ఉన్నారు. వీరు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుళ్లాయమ్మ, గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిరింతాజ్ సంఘటన స్థలంలోనే మరణించినప్పటికీ ఆ బాలిక స్వగ్రామం బత్తలపల్లి కావడంతో వెంటనే 108 అంబులెన్స్లో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. ఆటో డ్రైవర్ రహంతుల్లా బంధువుల రోదనలతో సంఘటన స్థలంలో విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని ఇటుకలపల్లి సీఐ మహబూబ్బాష, నార్పల ఎస్ఐ శేఖర్ ,తహశీల్దార్ రవీంద్ర, వీఆర్వోలు వెంకటేశ్వరరావు,పెద్దన్న పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆటో, బైక్ను ఢీకొన్న లారీ.. గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి వాటర్ ప్రాజెక్టు వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందడం, ఆరుగురు తీవ్రంగా గాయపడటానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. వాటర్ ప్రాజెక్టు వద్ద గుత్తి నుంచి పామిడి వైపు ప్రయాణికులతో వెళ్తున్న డీజిల్ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని, ఆ వెంటనే ఆటో వెనుక ఉన్న ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రామరాజుపల్లికి చెందిన భువనేశ్వర్రెడ్డి(27), పామిడి మండలం పి కొండాపురానికి చెందిన కుళ్లాయప్ప(40) , మరో గుర్తు తెలియని వ్యక్తి, గుత్తికోటకు చెందిన రామ్మూర్తి, రామరాజుపల్లికి చెందిన 11 ఏళ్ల బాలుడు గంగాధర్రెడ్డి, రామరాజుపల్లికి చెందిన రామిరెడ్డి, చిన్నరాయుడు, చింతలాంపల్లికి చెందిన వసంతకుమార్, పామిడికి చెందిన ఆటో డ్రైవరు మహబూబ్బాషా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎస్కేడీ కళాశాలలో బీటెక్ చదువుతున్న బొమ్మనహాళ్కు చెందిన అబ్దుల్జ్రాక్(20) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి గాయపడ్డ వారిని 108, ఇతర వాహనాల ద్వారా గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భువనేశ్వర్రెడ్డి, కుళ్లాయప్ప, మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో అబ్దుల్ రజాక్ మరణించాడు. ఆటోను లారీ వేగంగా ఢీకొనడంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా కంప చెట్లపై పడ్డారు. సంఘటన స్థలాన్ని గుత్తి ఇన్చార్జి సీఐ మహబూబ్ బాషా, ఎస్ఐలు గోపాలుడు, మహ్మద్ బాషాలు సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement