-
హత్యకు గురైన ఫ్యాషన్ డిజైనర్..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. సంపన్నులు నివసించే వసంత్ కుంజ్ ప్రాంతంలో ఫ్యాషన్ డిజైనర్ మలా లఖాని ఆమె ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. లఖాని, ఆమె సెక్యూరిటీ గార్డు బహుదూర్ సింగ్ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 53 సంవత్సరాల లఖానీ తమ ఇంటి సమీపంలోని గ్రీన్పార్క్ ప్రాంతంలో బొటిక్ నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరిద్దరిని పలుమార్లు కత్తితో పొడిచి చంపారని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబందించి స్ధానికులు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నామని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ దేవేందర్ ఆర్య చెప్పారు. కాగా, ముగ్గురు నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీస్ కమిషనర్ అజయ్ చౌదరి వెల్లడించారు. ఫ్యాషన్ డిజైనర్ వర్క్షాప్లో పనిచేసే రాహుల్ అన్వర్ అనే టైలర్ దోపిడీకి పాల్పడే ఉద్దేశంతోనే ఈ హత్యలకు పాల్పడ్డాడు. అన్వర్కు సహకరించిన ఇద్దరు బంధువులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
కామాంధుడి చేతిలో 6 గంటలు నరకం
సాక్షి, న్యూఢిల్లీ: పదుల సంఖ్యలో లైంగిక వేధింపుల కేసులు. జైలుకు వెళ్లటం.. బెయిల్పై రావటం... మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడటం ఆ కామాంధుడికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఓ యువతిపై ఆ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు గంటలపాటు మృగ చేష్టలతో ఆమెకు నరకాన్ని చూపించాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే... వసంత్ కుంజ్లోని రంగ్పూరి పహారిలో ఓ యువతి(27) ఒంటరిగా నివసిస్తోంది. మే 29వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. తాళం తీస్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చి ఓ వ్యక్తి అమాంతం ఆమెను ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. మంచానికి కట్టేసి ఆమెతో బలవంతగా మందు తాగించి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆరు గంటలపాటు అతని వికృత క్రీడలు కొనసాగాయి. చివరకు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. స్నేహితురాలి సాయంతో వసంత్ కుంజ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చెప్పిన ఆనవాళ్లతో పోలీసులు ఓ వ్యక్తి ఫోటోను చూపించారు. ఫోటోలో ఉన్నదే నిందితుడిగా ఆమె అతన్ని గుర్తించటంతో గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడైన సందీప్ చౌహాన్ను జూన్1న పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ నేర చరిత్ర... పశ్చిమ్ విహార్కు చెందిన 38 ఏళ్ల సందీప్ వివాహితుడు. ఓ పాప కూడా ఉంది. గతంలో తైక్వాండో ట్రైనర్గా పని చేసేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. దాంతో ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచి తప్పుడు మార్గంలోనే ప్రయాణిస్తూ వస్తున్నాడు. కంటికి కనిపించిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారి వెంటపడి వేధింపులకు గురిచేయటం, దాడి చేసి వాళ్ల దగ్గరి నుంచి గొలుసులు, ఫోన్లు దొంగతనం చేయటం... అలవర్చుకున్నాడు. ఈ క్రమంలో చాలాసార్లు జైలుకు వెళ్లి, బెయిల్పై బయటికొచ్చేవాడు. ఇప్పటిదాకా అతనిపై 30 కేసుల దాకా నమోదయినట్లు తెలుస్తోంది. ‘సందీప్ దాడి చేసిన మహిళలెవరూ అతనికి తెలీదు. అప్పటికప్పుడే వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై దాడికి పాల్పడుతుంటాడు. కానీ, అత్యాచారం కేసులో అరెస్ట్ కావటం మాత్రం ఇదే తొలిసారి’ అని వసంత్ కుంజ్ ఎస్సై చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం తాను ఉండే ప్రాంతంలోనే ఓ మహిళ ఇంటి ముందు సందీప్ వికృత చేష్టలకు పాల్పడిన నేరంలో జైలుపాలయ్యాడు. బెయిల్పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఇలా అత్యాచారం కేసులో ఇప్పుడు మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. పోలీసులేం చేస్తున్నారు?.. కాగా, ఈ ఘటనపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని కఠినంగా శిక్షించకపోవటం, సమాజంలో తిరుగుతున్న అతనిపై నిఘా వేయకపోవటం ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. శనివారం ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, సందీప్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీలో చర్చిపై దుండగుల దాడి
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ చర్చిని ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చర్చిలో ఉన్న ప్రార్థనకు సంబంధించిన వస్తువులను అటూ ఇటూ విసిరేశారు. కొన్ని వస్తువులు పగిలిపోయినట్లు ఎఫ్ఐఆర్ దాఖలైంది. సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, దాని ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. గత సంవత్సరం నవంబర్ నుంచి చర్చిలపై దాడులు జరగడం ఇది ఐదో సారి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement