-
రుచి మరిగిన పులిలా కమిషన్లకు కక్కుర్తి పడి..
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వంలో రుచి మరిగిన పులిలా కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులు చేపట్టారని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పారదర్శకత లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్పై జరుగుతున్న అన్ని పనులు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విచారణ కోసం కమిటీ నియమించిన ఎన్జీటీ, నెల రోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. 2015లో పట్టిసీమ, చింతలపాడుతోపాటు అక్రమ ప్రాజెక్టులపై హై కోర్టును ఆశ్రయించినా, చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ వేయలేదు కదా హియరింగ్కు కూడా రాలేదని మండిపడ్డారు. గత్యంతరం లేక ఏన్జీటీని ఆశ్రయించానన్నారు. నదుల అనుసంధానం విషయంలో అంతర్ రాష్ట్రాల నుంచి అనుమతులు, పరిరక్షణ చర్యలు తీసుకోలేదన్నారు. 2018లో పెన్నా-గోదావరి అనుసంధానం విషయంలో పోలవరం, గోదావరి ప్రాజెక్ట్ అథారిటీల అనుమతులు పొందలేదని తెలిపారు. డెల్టా ప్రాంత రైతుగా కోర్టును ఆశ్రయించానని, చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టులు బచావత్ ట్రిబ్యునల్ నిర్ధేశానికి పూర్తి విరుద్ధమన్నారు. టీడీపీ ప్రభుత్వం డెల్టా రైతుల జీవితాలతో ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలు పాటించాలని కోరారు. -
11 తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా: మాజీ మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి : నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసిస్తున్న టీడీపీతో పొత్తుపెట్టుకోవడం సహించలేకనే పార్టీకి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. ఈనెల 11 తర్వాత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఆయన భీమడోలు మండలం పూళ్లలో సోమవారం అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వసంతకుమార్ మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్ల కాలంలో జరిగిన పరిణామాలు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను తెలపడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశానని తెలిపారు. గత మార్చిలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లీనరీలో టీడీపీతో పొత్తుపెట్టుకుంటేనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీ కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు తన అనుచరులను ఐటీ దాడులు నుంచి కాపాడుకునేందుకే బీజేపీపై పోరాటం చేస్తున్నాడని, ఐదుకోట్ల ఆంధ్రుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 11 తరువాత దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్తో ఉండేది లేదని, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన బీజేపీతో వెళ్ళేది లేదని ఆయన తేల్చిచెప్పారు. -
‘అధిష్టానానికి చంద్రబాబుతో జాగ్రత్త అని చెప్పాం’
సాక్షి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాదని, జాగ్రతగా ఉండాలని అధిష్టానాన్ని హెచ్చరించామని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో జతకట్టే ప్రసక్తే లేదని వట్టి వసంతకుమార్ స్పష్టం చేశారు. పోలవరం, పట్టిసీమతో పాటు ఇతర పథకాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. యూపీఏ అధికారంలోకి వస్తే ఏపీలో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్లీనరీలోనే తొలిసారిగా తీర్మానించామని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి రెండేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమడోలు: ప్రభుత్వ అధికారులపై దాడులకు, వివాదాలకు మారుపేరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కోర్టు బుధవారం రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె.దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500లు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్కు బెయిల్ మంజూరు చేశారు. -
ఎమ్మెల్యే చింతమనేనికి మూడేళ్ల జైలుశిక్ష
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement