-
ప్రపంచ తెలుగుసాహిత్య సదస్సుకు నన్నయ వీసీ
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : సింగపూర్లో జరిగే ఐదవ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సులో పాల్గొనేందుకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పయనమయ్యారు. వంగూరి ఫౌండేషన్, సింగపూర్ తెలుగు సమితి, లోక్నాయక్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగే సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మంది వరకు తెలుగు సాహిత్య ప్రముఖులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ‘తెలుగు భాష మాధుర్యం – ఆవశ్యకత’ అనే అంశంపై తాను ఉపన్యసిస్తానన్నారు. -
మానవ వనరుల సక్రమ వినియోగం అవసరం
తాడేపల్లిగూడెం: మానవ వనరులను సక్రమంగా ఉపయోగించాల్సిన అవసరం దేశానికి ఎంతో ఉందని ఆదికవి నన్నయ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ముత్యాలునాయుడు అన్నారు. వికాస్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వాసవీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మానవవనరుల అభివద్ధి కేంద్రాన్ని (హెచ్ఆర్డీ సెంటర్) బుధవారం ఆయన ప్రారంభించారు. యువత సత్తా ప్రపంచానికి తెలియాలంటే మానవ వనరులను పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. యువతలో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు నన్నయ వర్సిటీ ద్వారా వికాస్ సంస్థ సహకారంతో హెచ్ఆర్డీ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. గోదావరి జిల్లాలో 16 కేంద్రాలు.. ఉభయగోదావరి జిల్లాల్లో 16 హెచ్ఆర్డీ కేంద్రాలు ఎంపిక చేయాలనేది లక్ష్యం కాగా, 11వ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటుచేశామని వీసీ అన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 250 కళాశాలలు, లక్ష మందికి పైగా విద్యార్థులున్న ఏకైక యూనివర్సిటీగా నన్నయ వర్సిటీ నిలిచిందని చెప్పారు. వర్సిటీలో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టడంతో పాటు డిమాండ్ ఉన్న కోర్సులను ఏర్పాటుచేయడం, పరిస్థితులకు అనుగుణంగా కోర్సులను మార్పులు చేయడం వంటివి చేస్తున్నామని చెప్పారు. 45 రోజులపాటు శిక్షణ .. కాకినాడలోని వికాస్ కేంద్రంతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుందని వీసీ చెప్పారు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు హెచ్ఆర్డీ కేంద్రం ద్వారా 45 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా నైపుణ్యాలు పెంచడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కషిచేస్తున్నామన్నారు. కళాశాలకు రహదారి సౌకర్యం ఏర్పాటుచేయడానికి సహకారం అందిస్తామని మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement