-
తిరుమల: మహాసంప్రోక్షణ ప్రారంభం
సాక్షి, తిరుమల: శ్రీవరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. డిసెంబరు 10న మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 20 మంది ప్రముఖ రుత్వికులు 13హోమగుండాలలో విశేష హోమాలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకర్షణ : రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. డిసెంబరు 7, 8, 9వ తేదీల్లో : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరల రాత్రి 8 నుండి 10 గంటల వరకు విశేషహోమాలు, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబరు 10న: ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయబడిన రాగి రేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులకు వరాహస్వామి వారి మూల విరామూర్తి దర్శనం ఉండదు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగు వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. -
జగత్కల్యాణం.. శారదాదేవికి కుంభాభిషేకం!
నేత్ర పర్వం బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతీదేవి, శాపవశాన బ్రహ్మదేవుని అవతారమైన మండనమిశ్రుని భార్యగా భూలోకాన అవతరించింది. మండన మిశ్రులు, సురేశ్వరాచార్యులనే పేరుతో, శ్రీశంకర భగవత్పాదుల శిష్యులైన వెంటనే, శాపవిమోచనమై, బ్రహ్మలోకానికి వెళుతుండగా, శ్రీ శంకరులు, తమ యోగశక్తితో ఆమె నిజస్వరూపాన్ని దర్శించి, ‘‘అవ్యాజ దయామృతాలు కురిపించే చల్లని తల్లివి, జ్ఞానధనాన్నిచ్చే పరమనిధివి, ఋష్యశృంగాది క్షేత్రాలలో మేము నెలకొల్పుతున్న అద్వైత పీఠాలలో శ్రీ శారదదేవీ స్వరూపాన విలసిల్లి సకల జనుల పూజలు స్వీకరిస్తూ, సనాతన ధర్మాలను కాపాడుతూ ఉండు తల్లీ’’ అని ప్రార్థించారు. ఆ ప్రార్థనను అంగీకరించి, శ్రీ సర్వతీదేవి ఆనాటినుండి, శృంగగిరి క్షేత్రాన శ్రీ శారదాదేవిగా కొలువై భక్తుల పాలిట కల్పతరువుగా ఉంది. శ్రీ శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించిన చందన శారదావిగ్రహాన్ని జగద్గురు శ్రీ విద్యారణ్యులు సువర్ణవిగ్రహంగా మార్పు చేశారు. అనంతర కాలంలో చంద్రశేఖర భారతీ స్వామి ఆలయనిర్మాణం చేసి, 1916లో కుంభాభిషేకం కావించారు. 35 వ పీఠాధిపతి అభినవ విద్యాతీర్థులు 1963లో శ్రీశారదాదేవి ఆలయానికి కుంభాభిషేకం కావించి, శ్రీ శారదాదేవి అనుగ్రహాన్ని భక్తులకు అందించారు. తదుపరి, ఈనాటి జగద్గురువులు, 36వ పీఠాధిపులైన జగద్గురు భారతీతీర్థులు 1993లో ఆలయానికి కుంభాభిషేకం చేశారు. లోకక్షేమం కోసం మళ్లీ ఇప్పుడు భారతీతీర్థులు తమ శిష్యులైన విధుశేఖర భారతీ సన్నిధానం వారితో కలిసి దుర్ముఖినామ సంవత్సర మాఘశుక్ల పంచమి, సౌమ్యవాసరం, ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా ఫిబ్రవరి 1, బుధవారం నాడు శిలామయంగా ఉన్న శ్రీ శారదాదేవి ఆలయగోపురాన్ని స్వర్ణమయంచేసి, కుంభాభిషేకం జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. దుర్ముఖ వత్సర మాఘశుక్ల ద్వితీయనాడు గణపతికి లక్షమోదక హోమం, తృతీయనాడు శ్రీ సన్నిధానం వారిచే శ్రీ మలహానికరేశ్వర స్వామివారికి విశేష పూజ, ఆ పవిత్రదినం నుండి మాఘపూర్ణిమ వరకు అతిరుద్ర మహాయాగం ది.2.2.2017 నుంచి పదిరోజులు కోటికుంకుమార్చన జరిపి, మాఘకృష్ణ తృతీయ 13.2.2017న శ్రీ శారదాదేవి రథోత్సవం జరుపుతున్నారు. శారదే పాహిమాం, శంకర రక్షమాం – కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని శ్రీ వేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠం, తిరుమల
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement