-
నలుగురు ధనికుల కోసం దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదు: సీఎం జగన్
-
నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ కులమతాలు, లంచాలు, వివక్షకు తావు లేకుండా మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కరోనా సమయంలోనూ వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని అందించామని గుర్తు చేశారు. చదవండి: గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్కు చేరిన బరి‘తెగింపు’ ‘‘పాదయాత్ర సమయంలో డ్రైవర్ సోదరులు 2018 మే 14న ఏలూరులో నన్ను కలిసి వారి కష్టాలను చెప్పారు. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించాం‘’ అని సీఎం జగన్ చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని శుక్రవారం ఉదయం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రారంభించి మాట్లాడారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 వేల చొప్పున 2,61,516 మంది ఖాతాల్లో రూ.261.51 కోట్లను బటన్న్నొక్కి జమ చేశారు. దేశంలో ఎక్కడా లేదు... వాహన మిత్ర లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని సీఎం జగన్ చెప్పారు. ‘‘సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. డ్రైవర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.40 వేలు ఖాతాల్లో జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇదే. ఈ ఏడాదితో కలిపి మొత్తం రూ.1,026 కోట్లు వారికి అందచేశాం. వారంతా స్వయం ఉపాధి కల్పించుకుంటూ రోజూ లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా కుటుంబాలను నెట్టుకొస్తున్న వాహనదారులకు అండగా నిలిచేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చాం. నాడు.. రూ.40 కోట్లకుపైగా ఫైన్ల బాదుడు టీడీపీ హయాంలో ఆటోడ్రైవర్లపై కాంపౌండింగ్ ఫీజు విధించి విపరీతంగా దోచుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ‘‘2014–2015లో రూ.6 కోట్లు, 2015–16లో రూ.7.39 కోట్లు, 2016–17లో రూ.9.68 కోట్లు, 2017–18లో రూ.10.19 కోట్లు, 2018–19లో రూ.7 కోట్లు చొప్పున ఐదేళ్లలో ఫైన్ల రూపంలో ఆటో డ్రైవర్ల నుంచి దాదాపు రూ.40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు గుంజుకున్నారు. మీ జగన్ అన్న.. తమ్ముడి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో ఆటో డ్రైవర్ల నుంచి అపరాధ రుసుము రూపంలో వసూలు చేసింది కేవలం రూ.68 లక్షలు. ఇక 2020–21లో విధించింది రూ.35 లక్షలు మాత్రమే’’ అని తెలిపారు. ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది.. అర్హత కలిగిన వారు ఏ కారణంతోనైనా దరఖాస్తు చేసుకోలేకపోతే తిరిగి డిసెంబర్లో మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. పేదలకు ఎంత వీలైతే అంత మేర మేలు చేసే ప్రభుత్వం తమదన్నారు. ‘అర్హత ఉన్న వారికి ఏ విధంగా ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది... అర్హులందరికీ కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందించే ప్రభుత్వం మనది’ అని సీఎం జగన్ తెలిపారు. అప్పులు చేసీ ఆదుకోలేదు.. టీడీపీ హయాంలో చేసిన అప్పుల కంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. అప్పులు చేసి కూడా టీడీపీ సర్కారు ప్రజలకు మంచి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 దుష్టచతుష్టయంలా తయారై అసత్యాలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, సత్యవతి, కలెక్టర్ మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. చదవండి: పాత ఫొటోలతో విష ప్రచారం.. చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనారోగ్యంతో ఉంటే ఇట్టే పట్టేస్తుంది..
సికింద్రాబాద్: వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు ఉన్నఫలంగా అనారోగ్యం బారిన పడితే.. ఏం కాదులే అనుకుని డ్రైవర్ వాహనాన్ని నడుపుతూ వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు లేకపోలేదు. ఇటువంటి సమయాల్లో సదరు డ్రైవరుకు బీపీ పెరిగినా.. గుండె కొట్టుకునే పద్ధతుల్లో మార్పులు చోటుచేసుకున్నా సదరు ప్రమాదకర పరిస్థితులు కనిపెట్టేందుకు స్మార్ట్ గ్లౌజ్ను సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని రూపొందించింది. ఈ “స్మార్ట్ గౌజ్’ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి అవార్డును గెల్చుకుంది. అదే సమయంలో ఇదే ప్రాజెక్టు జాతీయ ఇన్స్పైర్ మేళా ప్రదర్శనకు ఎంపికైంది. గత విద్యాసంవత్సరం (2020–21)లో కరోనా లాక్డౌన్ పరిస్థితుల కారణంగా విద్యార్థుల ఇన్స్పైర్ మేళాను కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థల అధికారులు ఆన్లైన్లో నిర్వహించారు. సీతాఫల్మండికి చెందిన 8వ తరగతి విద్యార్థిని సఫియాబేగం అనే బాలిక రూపొందిన స్మార్ట్గ్లజ్ ప్రదర్శనను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గతనెలలో ఆన్లైన్ ప్రదర్శన జరిగినప్పటికీ..సదరు ప్రదర్శనలకు అవార్డులను శుక్రవారం ప్రకటించారు. సఫియాబేగం స్మార్ట్ గ్లజ్ ప్రదర్శనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేశారు. హైదరాబాద్ జిల్లా నుంచి పోటీ పడిన 12 ప్రదర్శనల్లో స్మార్ట్గ్లౌజ్ ప్రదర్శనను ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేయడంతోపాటు జాతీయ ఇన్స్పైర్ మేళాలో ప్రదర్శించేదుకు ఎంపిక చేశారు. కాగా, స్మార్ట్గ్లౌజ్ ప్రదర్శనకు అవార్డు రావడం, జాతీయ ప్రదర్శనకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తితోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి ప్రదర్శనకు స్మార్ట్గ్లౌజ్ ప్రదర్శనలో మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేవిధంగా రూపొందించనున్నట్టు హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. ప్రస్తుతం రూపొందించి స్మార్ట్గ్లౌజ్ అనారోగ్యకర పరిస్థితులను మాత్రమే లైట్లు వెలుగడం ద్వారా డ్రైవరుకు మాత్రమే తెలియజేస్తుందని చెప్పారు. ఇక ముందు ఇదే గ్లౌజ్ డ్రైవరు అనారోగ్యకర పరిస్థితులు వాహనం నడిపిస్తున్న డ్రైవరుకు తెలియజెప్పడంతోపాటు కుటుంబసభ్యుల సెల్ఫోన్కు మెస్సేజ్ అందించే విధంగా రూపొందిస్తున్నామని చెప్పారు. సుదూర ప్రాంతాలకు లారీలు, ట్రక్కులు ఇతర భారీ వాహనాలు రోజుల తరబడి నడిపించే డ్రైవర్లుకు స్మార్ట్గ్లౌజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త !
అనంతపురం టవర్క్లాక్: వేసవిలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. గత వారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ వివరాలు, సిబ్బంది పనితీరును సమీక్షించి ఆ గణాంకాలను ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల వాహనాల టైర్లు పగిలి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. బయలుదేరే ముందు వాహనాల చక్రాలను, ఇంజన్ కండీషన్లు పరిశీలించుకోవాలని సూచించారు. సుదూర ప్రయాణం చేసేవారు నిరంతరం వాహనాలు నడపకుండా అక్కడక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లాలన్నారు. పిల్లలు, వృద్ధులు ప్రయాణంలో ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 102 నమోదుకాగా రూ.1.41లక్షలు జరిమానాలు విధించామన్నారు. ఇందులో నాలుగు కేసులలో రెండు రోజులు, మరో నాలుగు కేసులలో ఒక రోజు ప్రకారం జైలు శిక్ష విధించినట్లు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 7,746 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. అలాగే ధర్మవరం సబ్డివిజన్ పరిధిలో 890, తాడిపత్రి 2170, పెనుకొండ 1901, కళ్యాణదుర్గం 928, పుట్టపర్తి 178, కదిరి 239, అనంతపురం ట్రాఫిక్ 663 మంది నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. వారం రోజుల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపి వారిపై మొత్తం 8,030 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రధానంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 4013 కేసులు, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన 49 మంది, వాహనం నడిపేటప్పుడు ఎల్ఎల్ఆర్ కూడా లేని 339 కేసులు, త్రిబుల్ రైడింగ్వెళ్లే 347 మందిపై, ఓవర్లోడ్తో వెళ్లే ఆటోలపై మోటరు వాహనాల చట్టం కింద 791 కేసులు నమోదు చేశామన్నారు. సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు, జీపులు తదితర వాహన చోదకులు 864 కేసులు, రాంగ్ రూట్లో వెళ్లిన వాహన చోదకులు 38 మందిపై, అతి వేగంతో వెళ్లిన 194 వాహనాలపై, ట్రాక్టర్ డ్రైవర్లు 6, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 374 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారని, 53 మంది గాయపడ్డారన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగిన రహదారులపై అడ్డంగా వాహనాలు నిలిపిన ఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు, జిల్లా వాట్సాప్ నెంబర్ 9989819191కు సమాచారం చేరవేయాలన్నారు. -
ఆధార్ చూపాలని చట్టంలో ఎక్కడుంది: హైకోర్టు
హైదరాబాద్ : వాహనాల తనిఖీ సమయంలో ఆధార్ కార్డు చూపాలని జారీ చేసిన సర్క్యులర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆధార్ కార్డు చూపాలని చట్టంలో ఎక్కడుందని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది. కాగా సైబరాబాద్ జంట కమిషనరేట్ పరిధిలో వాహనదారులకు ఆధార్ను లింక్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాల (డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్)తో పాటు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ పెట్టుకోకుండా కేవలం వాహనంతోనే వచ్చే వాహనదారుడి మీద తప్పనిసరిగా మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరికలు చేశారు. దీంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement