-
15 రోజుల్లో 1,648 వాహనాలు సీజ్
సాక్షి, అమరావతి: స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ) దాడుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాలు భారీగా పట్టుబడుతున్నాయి. రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గత 15 రోజుల క్రితం ఎస్ఈబీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ 15 రోజుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న 1,648 వాహనాలను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేశారు. వీటిలో అధికంగా ఖరీదైన హై ఎండ్ మోడల్ కార్లు ఉండటం గమనార్హం. ప్రధానంగా ఖరీదైన కార్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం పట్టుబడుతోంది. పెద్ద ఎత్తున వాహనాలు పట్టుబడటంతో వీటిని ఉంచేందుకు ఎక్సైజ్ స్టేషన్లు సరిపోవడం లేదు. దీంతో ఎక్సైజ్ స్టేషన్లలో ఉన్న అంతకుముందు పట్టుబడిన పాత వాహనాలకు వేలం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ► నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) ఒక్క బాటిల్ ఉన్నా వాహనాన్ని సీజ్ చేస్తారు. అదే డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు మూడుకు మించి ఉంటే కేసులు నమోదు చేస్తారు. ► సరిహద్దు చెక్పోస్టుల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ పార్టీలను రంగంలోకి దించి మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నారు. ► పదే పదే పట్టుబడుతున్న వారిపై పీడీ కేసులు నమోదు చేయనున్నారు. -
కర్నూలులో ‘ఎర్ర’ డంప్ స్వాధీనం
జిల్లా వ్యాప్తంగా 19 మంది స్మగ్లర్ల అరెస్టు రూ.కోటి విలువైన దుంగలు, వాహనాలు సీజ్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ శ్రీనివాస్ చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా పోలీసులు జరిపిన దాడుల్లో 19 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి, రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగల్ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 179 ఎర్రచందనం దుంగల్ని సైతం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు. కర్నూలులో భారీ డంప్.. చిత్తూరు పశ్చిమ విభాగం సీఐ ఆదిరానాయణ తన ఎస్ఐలు, సిబ్బందితో కలిసి మూడు రోజుల క్రితం కాణిపాకం వద్ద ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతను చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీకి చెందిన షామీర్బాషా (25)గా గుర్తించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె మండలం గోకవరం గ్రామంలో వెంకటేశ్వర్లుకు చెందిన పొలంలో 179 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. షామీర్బాషాను ఇప్పటికే అరెస్టు చేసి, రిమాండు పంపగా కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లును బుధవారం అరెస్టు చేసి, దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. పీలేరు పరిధిలో.. పీలేరు సీఐ నరసింహులు మంగళవారం పీలేరు శివారు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో పీలేరుకు చెందిన నాగేంద్రనాయక్ (27) మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ఉన్నాడు. ఇటుకల వ్యాపారం నుంచి ఎర్రచందనం డాన్గా ఎదిగాడు. నాగేంద్రనాయక్తో పాటు పీలేరు పరిసర ప్రాంతాలకు చెందిన చెంగల్రెడ్డి, వెంకటముని, తేజ, శంకర్, చెంగల్రాయుడు, రమణనాయక్, సురేంద్ర, రాజన్న, గోపినాయన్, సురేష్ను అరెస్టు చేశారు. వాయల్పాడు పరిధిలో.. వాయల్పాడు సీఐ శ్రీధర్ తన సిబ్బందితో మంగళవారం మండలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో వైఎస్సార్ జిల్లా పొద్దుటూరుకు చెందిన డీ.బాలచంద్ర (27), ఎం.అరుణ్కుమార్ (24), ఎం.నరేంద్రకుమార్ (25), బీ.ఆదినారాయణ (22), ఎం.సురేష్రెడ్డి (32), వేంపల్లెకు చెందిన రవికుమార్ (35)లను అరెస్టు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితుల నుంచి 217 ఎర్రచందనం దుంగలు, ఓ సుమో, మారుతి-800, ఐదు మోటారు సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన ఓఎస్డీ రత్న, డీఎస్పీలు గిరిధర్, దేవదాసు, సీఐలు, ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు షాదిక్ అలీ, మహేశ్వర్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement