-
కాదన్నందుకు కడతేర్చాడు..
నిజామాబాద్, వర్ని(బాన్సువాడ): వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. కోరిక తీర్చలేదనే కోపంతో గొడ్డలితో హతమార్చాడు. అడ్డువచ్చిన భర్తపైనా దాడి చేసి పారిపోయాడు.. కలకలం రేపిన ఈ ఘటన వర్ని మండలం జాకోరాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జాకోరా గ్రామానికి చెందిన కుంచెపు సాయవ్వ(40) భర్త నాగయ్య జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మాగని చిన్నసాయిలుతో సాయవ్వకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరునెలల క్రితం నాగయ్య దుబాయ్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. నెలరోజుల క్రితం పెద్ద కుమారుడు సురేశ్ వివాహం చేశారు. ఈ నేపథ్యంలో సాయవ్వ సాయిలుతో దూరంగా ఉంటూ వచ్చింది. శుక్రవారం రాత్రి సాయిలు మద్యం సేవించి సాయవ్వ ఇంటికి వచ్చి తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. ఆమె నిరాకరించడంతో వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో ఆరు బయట భర్త నాగయ్యతో పాటు నిద్రిస్తున్న సాయవ్వ వద్దకు వచ్చి గొడ్డలితో మెడపై, చాతిపై కొట్టి దారుణంగా హతమార్చాడు. అడ్డువచ్చిన సాయవ్వ భర్తపై గొడ్డలితో దాడి చేశాడు. అలికిడికి చుట్టుపక్కల వారు నిద్రలేవడంతో పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ అంజయ్య ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రుడిని నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. శనివారం ఉదయం బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చుట్టు పక్కల వారిని ప్రశ్నించి హత్య వివరాలు తెలుకున్నారు. హంతకుడు సాయిలు గతం నుంచే నేర ప్రవత్తి కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సొంత భార్యతో తరుచూ గొడవపడే వాడని స్థానికులు పేర్కొన్నారు. దీంతో పదేళ్ల క్రితం ఆమె పుట్టిళ్లు మొగిలిపేట వెళ్లగా, అక్కడికి వెళ్లి భార్య గొంతు కోసి హత్యాయత్నం చేసినట్టు తెలిపారు. అనంతరం సాయవ్వతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఆమె వద్ద డబ్బులు డిమాండ్ చేసే వాడని తెలుస్తోంది. సాయవ్వ కుమారుడి పెళ్లి చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి రెండు రోజుల క్రితం పైపులు విక్రయించి వివాహం సమయంలో చేసిన ఉద్దెర బాకీలను తీర్చింది. ఈ డబ్బులు సైతం ఇవ్వాలని సాయిలు ఆమెను డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై కూడా కక్ష కట్టిన సాయిలు హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
నిజామాబాద్: వ్యవసాయం పై మక్కువతో తనకున్న ఐదు ఎకరాల్లో సేద్యం చేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పొలంలో విద్యుత్ షాక్తో ప్రాణాలొదిలాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని శంకోరా గ్రామానికి చెందిన పిరోజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అలాగే తనకున్న ఐదు ఎకరాల్లో సేద్యం చేస్తున్నాడు. శనివారం తెల్లవారు జామున వరి నారుమడిని తడిపేందుకు పొలం వెళ్లాడు. అయితే మోటారుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ను సరిచేస్తుండగా షాక్కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
IPL 2024: ఫైనల్ చేరడమే మిగిలింది: కమిన్స్ పోస్ట్ వైరల్
అలసిన దేహానికో'టీ'..! భారత్లో మొదటిసారిగా..
రైతులూ ఆందోళనొద్దు.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలెర్ట్
అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
శ్రీలంకలో స్టార్లింక్ సేవలకై చర్చ
బెంగళూరు రేవ్ పార్టీ: ఆ ఇద్దరు నటులు ఎవరు?
ఒడిషాలోని బీచ్ల గురించి తెలిస్తే.. ఇపుడే ‘ఛలో’ అంటారు
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement