-
మళ్లీ సారు రారు.. కారు రాదు
సాక్షి, హైదరాబాద్: సారు(కేసీఆర్).. కారు(బీఆర్ఎస్).. మళ్లీ రారు.. రావని ఏఐసీసీ పరిశీలకుడు అజయ్కుమార్ వ్యాఖ్యానించారు. కారును పోలీ సోళ్లు కూడా ఉండనివ్వడం లేదని, కాంగ్రెస్ ప్రచా రం కోసం గాం«దీభవన్లో అద్దె కార్లు తెచ్చి పెట్టుకుంటే పోలీసులు తీసుకెళ్లిపోయారని ఆయన ఎద్దే వా చేశారు. ఆదివారం గాందీభవన్లో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఏఐసీసీ పరిశీలకుడు అంశు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కౌశిక్ చరణ్యాదవ్తో కలిసి అజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైద్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీ లకు అవసరమైన రక్తం కూడా దొరకడం లేదని, మెజార్టీ ప్రజలకు పౌష్టికాహారం దూరమైందని, 70 శాతం మంది పిల్లలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేదని చెప్పారు. కేసీఆర్ పాలనపై విసిగిపోయిన ప్రజలు ఈసారి బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందాలని నిర్ణయించారనీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ గత తొమ్మిదిన్నరేళ్లుగా వైద్య, ఆరోగ్య రంగాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మీడియా సమావేశంలో భాగంగా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై వీడియోను కాంగ్రెస్ నేతలు ప్రదర్శించారు. -
రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నేరం బయట పడటం వల్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇందుకు సంబంధించి గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిలు వివరాలు వెల్లడించారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై 21 నిమిషాల నిడివిగల వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి. భూ దందాలో మరో కోణం క్విడ్ ప్రో కో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్ అకడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి గానీ రాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్హౌస్ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసైన్డ్ భూముల వ్యవహారం.. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు. అధికార పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ప్లాట్లు రావని ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీ చేశారు. ఇలా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన వారిలో దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. అసైన్డ్ భూములను తక్కువకు కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్కు మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను చేజిక్కించుకున్నారు. ఇంకో సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరా తక్కువ ధరకు లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. జోన్ల అలైన్మెంట్ల కుంభకోణం.. రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూము లేవీ ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి సరిహద్దులను మార్చారు. 2015 జూన్లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్కు చెందిన సుర్బానాజురాంగ్కు డ్రాఫ్ట్ ప్లాన్ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టింది. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది. ► మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్ను సీఆర్డీయే జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. ► చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్కు చందర్లపాడులో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు. ► రాజధాని చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలోనూ అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్ రింగ్రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ► చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీ మోహన్ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగు రోడ్డు వచ్చేలా చేశారు. పక్కా ప్లాన్తో భూ దందా 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు అంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాజధాని ఎక్కడ రాబోతున్నదనే ముందస్తు సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చందర్లపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై 2014 ఆగస్టు 27న శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను పూర్తిగా పక్కన పడేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ 2014 డిసెంబర్ 30న ఏపీ సీఆర్డీయే చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన 2014 సెప్టెంబర్ 4లోపు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో తమ బంధువులు, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారు. లంకా దినకర్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), కంభంపాటి రామ్మోహన్రావు కుమార్తె కంభంపాటి స్వాతి , పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష.. వారు నడుపుతున్న ఆర్.ఆర్.ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్.. కూడా భారీగా భూములు కొనుగోలు చేశారు. (పైన పేర్కొన్న వాటికి అసైన్డ్ భూములు అదనం) రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్లరేషన్ కార్డు దారులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్లరేషన్ కార్డు దారులు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. చదవండి: ‘వారి బినామీలే భూములు కొనుగోలు చేశారు’ ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే రాజధాని దందా నిగ్గు తేలుస్తాం బట్టబయలైన అమరావతి కుంభకోణం ‘మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి..’ రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్సైడర్’ బాగోతాలు రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగే -
20న బీసీసీఐ ముందు డీఆర్ఎస్ ప్రజెంటేషన్
ధర్మశాల: అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన వీడియో ప్రజెంటేషన్ను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కు చూపించేం దుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. ఈ నెల 20న న్యూఢిల్లీలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముందు ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్ ఈ ప్రజెంటేషన్ను చూపించనున్నారు. అక్కడ వన్డే ఆడేందుకు వెళ్లే భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఈ ప్రజెంటేషన్ను తిలకించే అవకాశముంది. కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొననున్నాడు. భారత్ ఎప్పుడు డీఆర్ఎస్ను వద్దనలేదని దాని పనితీరుపైనే అనుమానాలు వ్యక్తం చేసిందని ఠాకూర్ పేర్కొన్నారు. -
రైల్ రన్
-
‘రోడ్ సేఫ్టీ క్లబ్’
దేశంలో సంభవించే మరణాల్లో అధిక శాతం రోడ్డు ప్రమాదాలే. వాహనదారులే కాదు... రోడ్డు మీద నడిచే వాళ్ల తప్పుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిపై రకరకాల గీతలుంటాయి. సిగ్నల్స్ కనిపిస్తాయి. కానీ... వాటి గురించిన క్షుణ్ణంగా ఎంత మందికి తెలుసు! చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. వీటిని నివారించాలంటే నిబంధనలపై అవగాహన ఉండాలి. వాటిని కచ్చితంగా పాటించాలి. అదే పని చేస్తోంది నగరంలోని ‘రోడ్ సేఫ్టీ క్లబ్’. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి అవేర్నెస్సే సరైన మార్గమంటున్న ఈ క్లబ్ విశేషాలు... -ఓ మధు ఫుట్పాత్ ఉంటే ఓకే... లేనప్పుడు ఎక్కడ నడవాలి? చాలా మందికి ఈ విషయం తెలియదు. అలాగే వివిధ సూచీలు కనిపిస్తాయి. వాటిపై ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. ఇది చిన్న విషయమే అనుకోవడం వల్లే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేలా చేయడం రోడ్ సేఫ్టీలో భాగమే. అదే ఈ క్లబ్ లక్ష్యం. ఎక్కువగా దీనిపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు క్లబ్ మెంబర్స్. ఈ కార్యక్రమాలన్నింటినీ స్కూళ్లు, కాలేజీలకు చేరువ చేయడానికి ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్... క్లబ్కు సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు అరవైకి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీరితో పాటు ఆటో, ట్యాక్సీ, బస్, లారీ డ్రైవర్లకూ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ‘రోడ్డు ఎవరి ప్రాపర్టీ కాదు. అందరిదీ. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు వాడతారు. నిబంధనల ఉల్లంఘనకూ పాల్పడతారు. అలా కాకుండా సూచించిన సిస్టమ్లో వెళితే చాలా ప్రమాదాలు నివారించవచ్చు. ఈ దిశలోనే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం’ అంటారు రోడ్ సేఫ్టీ క్లబ్ ఫౌండర్, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. మార్పు సాధ్యమేనా! ‘1983లో 40 లక్షల మంది లెప్రసీ రోగులుండేవారు. ఆ వ్యాధిని అదుపు చెయ్యటం అప్పుడు కష్టం. కానీ... భారత్ను ఇప్పుడు పోలియో రహిత దేశంగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఈ మార్పు కేవలం అవగాహనతో వచ్చిందే. తమ తప్పు లేకుండా ప్రమాదానికి గురైనవారు లెక్కకు మించే ఉన్నారు. రోడ్డుపై కాలు పెట్టిన మరుక్షణం నుంచి అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండక తప్పదు. రోడ్డు ప్రమాదాలు ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశమంతటా ఇదే పరిస్థితి. విషయం ఇంత తీవ్రమైనదైనప్పుడు దాని గురించి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడం అత్యంత ముఖ్యమైనదని భావించాం’ అన్నారు క్లబ్ ఆర్గనైజర్, ఐడీఎఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంజయ్రామ్. వాకథాన్... రోడ్డు ప్రమాదం జరిగిన చాలా సేపటికి గానీ బాధితులు ఆసుపత్రికి చేరడం లేదు. సరైన సమయానికి తేగలిగితే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. డాక్టర్గా ఇలాంటి సంఘటనలు చాలా చూశాను. ఈ దిశగా కూడా అవేర్నెస్ తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని స్థాయిల్లో రోడ్డు నిబంధనలు పకడ్బందీగా పాటించేలా చేయగలిగితే ఎన్నో ప్రమాదాలు అరికట్టవచ్చు. ఈ నెల 11న నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద రహదారి భద్రతా వారోత్సవంలో భాగంగా వాకథాన్ నిర్వహిస్తున్నాం. గతేడాది జరిగిన వాకథాన్కు ఖర్చు మేమే భరించాం. ఈ ప్రజోపయోగ కార్యక్రమానికి కార్పొరేట్ సంస్థలు కూడా సహకరిస్తే సేవలు మరింత విస్తరిస్తాం’ అని క్లబ్ కోఆర్గనైజర్, పిడియాట్రిస్ట్ డాక్టర్ గీతాంజలి చెబుతున్నారు. అందరికీ అవగాహన... చిన్నప్పటి నుంచే రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్నది క్లబ్ ఉద్దేశం. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి పిల్లలకు క్లబ్ సభ్యులు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో స్కూల్లో కొంత మంది పిల్లలను ఎంపిక చేసి వారి ద్వారా అక్కడ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసేలా చూస్తున్నారు. పోస్టర్లు, స్లోగన్స్, ఎస్సే రైటింగ్ వంటివి పెడుతున్నారు.అలాగే కార్పొరేట్ సంస్థలకు కూడా కార్యక్రమాలు విస్తరించారు. వారి కోసం వీడియో ప్రజంటేషన్, ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. చదువుకోని హెవీ వెహికిల్ డ్రైవర్లకు వారానికి రెండుసార్లు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏడాదికోసారి సేఫ్టీ వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్కూల్ బస్ డ్రైవర్లకూ అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని పాఠశాలల నుంచి చాలా మంది పిల్లలు ఆసక్తిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు క్లబ్ సభ్యులు చెబుతున్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్స్ పాటించడం, రోడ్ క్రాసింగ్, ఓవర్లోడ్ వంటివి ప్లకార్డులతో ప్రచారం చేస్తున్నారు. మెదక్ ఘటన సమయంలో... ‘మెదక్లో స్కూల్ బస్ ప్రమాదం వార్త తెలియగానే సంఘటనా స్థలికి చేరుకున్నాం. ఆ ప్రాంతంలో స్కూల్ బస్ డ్రైవర్స్ కోసం రోడ్ సేఫ్టీ గురించి నాలుగు సెషన్స్ నిర్వహించాం. ఆ తర్వాత ఆ జిల్లాలోని అన్ని స్కూల్స్లోనూ అవగాహన కల్పించాం. కార్యక్రమాలను మరింత విస్తరించడానికి కొందరికి శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాం’ అంటారు శ్రీనివాస్. క్లబ్ వివరాలకు http://www.meetup.com/ROADSAFETYCLUB/లింక్ క్లిక్ చేయవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement