-
హెచ్ఎండీఏ డైరెక్టర్లే లక్ష్యంగా.. విజిలెన్స్ సోదాలు!
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ కార్యాలయంలో ఆ విభాగం డైరెక్టర్లే లక్ష్యంగా విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నాం దాదాపు 50 మంది స్పెషల్ టీమ్తో అమీర్పేట్ మైత్రీవనం నాలుగో అంతస్తులో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో.. తొమ్మిదేళ్లపాటు అనుమతులు జారీ చేసిన ఫైల్స్పై విజిలెన్స్ ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో వాటిని సీజ్ సైతం చేసినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్ గతంలో అనుమతించిన ఫైల్స్పై విజిలెన్స్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అరెస్ట్ వారెంట్తో అధికారులు అక్కడికి వెళ్లడంతో.. ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఆన్లైన్ డేటా నుంచి చెరువులు మాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. నాలుగు రోజుల క్రితమే దాడులు జరుగుతాయని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డాటా ఆన్లైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హెచ్ఎండీఏలో కొన్ని రోజుల క్రితం ఏసీబీ కూడా దాడులు నిర్వహించింది. అమీర్పేట్లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్లో ఉన్న హెచ్ఎండీఏ కార్యాలయంలో వివిధ జోన్లకు చెందిన ఫైళ్లను తెప్పించుకొని తనిఖీ చేశారు. ఫైళ్లను పరిశీలించే క్రమంలో హెచ్ఎండీఏలోని ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి జోన్లకు చెందిన ప్లానింగ్ అధికారులు, ఏపీఓలను తమ వద్దకు రప్పించుకొని పలు అనుమతులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు పని చేసిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ హయాంలో ఇచ్చిన హైరైజ్ భవనాల అనుమతులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. సీఎం రేవంత్ సమీక్షపై ఉత్కంఠ ఒకవైపు విజిలెన్స్ సోదాలు కొనసాగుతుండగానే.. మరోవైపు సచివాలయంలో హెచ్ఎండీఏపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. నాలుగు రోజుల క్రితమే హెచ్ఎండీఏ పై దాడులు జరుగుతాయని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైనా కీలక నిర్ణయం ప్రభుత్వం వెల్లడించనుందా? అనే ఉత్కంఠ రేకెత్తుతోంది. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
జిల్లాలోని దాచేపల్లిలో రెండు లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పిడుగురాళ్లకు చెందిన షేక్ సుభానీ, బండ్ల బిక్షమయ్య, షేక్ సదీప్ అనే వ్యక్తులు రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ సిబ్బంది ఆదివారం మాటువేసి దాడి చేశారు. దాచేపల్లి మండల కేంద్రంలో బియ్యం లోడ్తో వెళుతున్న ఓ లారీని పట్టుకుని సీజ్ చేశారు. మండలంలోని పొందుగుల వద్ద మరో లారీని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా బుమ్రా
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
- కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
Advertisement