-
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? టికెట్లు తీశారా? లగేజ్ సర్దారా?
బస్సెక్కి వెళ్లాలా? కారెక్కి వెళ్లాలా? ఏ రోజు వెళ్లాలి.. ఎప్పుడు రావాలి... సెలవు అడగాలా వద్దా? డబ్బులు సమకూరాయా లేదా? సంక్రాంతి వచ్చేసింది. కొందరు మాత్రం చివరి వరకూ ఏ విషయం తేల్చకుండా హడావిడిగా ప్రయాణం పెట్టుకుని ట్రబుల్స్లో పడతారు. వద్దు. సంక్రాంతికి ఊరెళ్లేందుకు హాయిగాప్లాన్ చేసుకోండి. సంతోషంగా పండక్కు పదండి. పండగని తెలుసు. వెళ్లాలనీ తెలుసు. కాని ఏదీ తెమల్దు. నెలా రెండు నెలల ముందు భార్యాభర్తలు కూచుని మాట్లాడుకుని కచ్చితంగా ఫలానా డేట్కు బయలుదేరి వెళ్దాం అనుకుని ఉంటే ట్రైన్ టికెట్లు ఉంటాయి. తత్కాల్లో చూసుకోవచ్చులే అనుకుంటారు. బస్సులు దొరుకుతాయిలే అనుకుంటారు. అంతగాకుంటే కారుంది కదా పోదాం అనుకుంటారు. అనుకోవడం ఎందుకు? ఖరారు చేసుకోకపోవడం ఎందుకు? చివరి నిమిషంలో హైరానా పడటం ఎందుకు? ఎప్పుడు? ఎక్కడకు? సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండుగ. అయినవారితో కలిసి చేసుకుంటే సంతోషాన్ని పెంచే పండగ. అయితే ఈ అయిన వారు ఎవరు అనేది ఒక్కోసారి స్పష్టత రాదు. భార్యకు పుట్టింటికి వెళ్లాలని ఉండొచ్చు. భర్తకు తన సొంతూరికి వెళ్లాలని ఉండొచ్చు. ఈ పండక్కు ఈ ఊరు... మరో పండక్కి ఆ ఊరు అని టక్కున నిశ్చయించుకుంటే సగం చింత ఉండదు. కాని తేల్చరు. మరికొన్ని కారణాలు ఉంటాయి. భర్త గమనించాల్సినవి భార్య పుట్టింటికి వెళితే ఎవరికో ఏవో కానుకలు ఇచ్చుకోవాలనుకోవచ్చు. తల్లిదండ్రులకు బట్టలు తీసుకెళ్లాలనుకోవచ్చు. మేనకోడలికి పట్టీలు తీసుకెళ్లాలనుకోవచ్చు. వీటికి బడ్జెట్ కేటాయించబడిందా? అవి లేక ఆమె ఏ విషయం తేల్చకుండా ఉందా? భార్య అత్తింటికి వెళితే అక్కడ పనులన్నీ నెత్తిన పడే ప్రమాదం ఉందా? మరో కోడలి ఎదుట ఆర్థిక స్థితిగతుల విషయంలో ఏమైనా చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉందా? ఈ సంవత్సరం నేను ఈ నగ చేయించుకున్నాను అనంటే నేను ఏమీ చేయించుకోలేదు వంటి జవాబు చె΄్పాలనుకోవడం లేదా? అందుకే అత్తారింటికి వెళ్లడం గురించి ఆమె ఏ విషయం మాట్లాడటం లేదా? భార్య గమనించాల్సినవి పుట్టింటి నుంచి అల్లుడికి సరైన పిలుపు అందిందా? అక్కడకు వచ్చాక మంచి మర్యాదే దొరుకుతుందనే నమ్మకం ఉందా? తోడల్లుడు, బావమరిది... వీళ్లు ఆదరంగా చూసే వీలుందా? పండక్కు వస్తే భర్త ఏదైనా కానుక ఆశిస్తాడా? మంచి బట్టలైనా పెట్టాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటున్నట్టయితే ఆ కోరిక నెరవేర్చే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా? తీరా వచ్చాక అలకలు ఏర్పడతాయా? అందుకే అతను అత్తగారిల్లు అనే మాట ఎత్తడం లేదా? టికెట్లు.. పాట్లు ► తాత్కాల్ను ఇలాంటి టైమ్లో నమ్ముకోలేము. ►ఆర్టీసి బస్సులు ఎన్ని స్పెషల్స్ వేసినా సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ►ప్రయివేటు ట్రావెల్స్ డబుల్ రేట్ చెప్తాయి. ఇంకా ఎక్కువే చెప్పాచ్చు. ►సొంత కారు ఉన్నా పండగ ముందు రోజు బయలుదేరితే టోల్గేట్ల దగ్గరే సమయం సరిపోతుంది. ►ముందే టికెట్లు బుక్ చేసుకోకపోవడం వల్ల తత్కాల్ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు భరించలేక భార్యాభర్తలు టికెట్లు తీసుకుని పిల్లలకు తీసుకోకుండా ఫైన్లు కట్టి లేదా ఒళ్లు కూచోబెట్టుకుని ప్రయాణం చేస్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండటం అవసరమా? ►మరో విషయం ఎలాగోలా చేరుకుంటే ఎలాగోలా వెనక్కు రావచ్చు అనుకుంటారు. కాని తిరుగు ప్రయాణానికి అసలు టికెట్లు దొరకవు. దాంతో సెలవు పొడిగించుకుని, సద్ది బంధువుగా మారి ఇబ్బంది పడటం అవసరమా? ఇప్పుడైనాప్లాన్ చేయండి ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ. శనివారం ప్రయాణం అనుకోకండి. గురువారం ఉదయం నుంచి రైళ్లు, బస్సులు, కారు ప్రయాణంప్లాన్ చేసుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. పోనీ శుక్రవారం తెల్లవారు జాము నుంచి బయల్దేరండి. డబ్బు ఈ ఒక్కసారికే దుబారా అనుకుంటే కారు, ప్రయివేటు బస్సులో ప్రయాణం ఎంజాయ్ చేసేలా వెళ్లండి. పండగ మూడ్తో వెళ్లండి. వెళ్లే ముందు భార్య తరపు ఇంటికి వెళ్లినా, భర్త తరపు ఇంటికి వెళ్లినా మన ఆర్థిక స్థితి మనది... మన ఆనంద స్థితి మనది... వేరొకరితో పోటీ వద్దు... తల్లిదండ్రులను అత్తామామలను ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా గడిపి వద్దాం అనుకుని బయలుదేరండి. -
ఒమన్ లో మహిళ మృతి
తాడేపల్లిగూడెం : పొట్టచేత పట్టుకుని ఒమన్ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భారత దౌత్య కార్యాలయంలో సంప్రదింపులు జరిపి తాడేపల్లిగూడెంలోని కైండ్నెస్ సంస్థ ఆమె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన కోయ జ్యోతి (46) జీవనోపాధికోసం ఒమన్ దేశం వెళ్లారు. ఆమె ఇటీవల మరణించడంతో మృతదేహాన్ని జిల్లాకు రప్పించాల్సిందిగా ఆమె కుమార్తె వర్ధనపు ఈశ్వరి కైండ్నెస్ సంస్థ ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించింది. భారతరాయబార కార్యాలయంతో గట్టిం మాట్లాడి.. ఒమన్ నుంచి హైదరాబాద్కు జ్యోతి మృతదేహాన్ని రప్పించారు. అక్కడి నుంచి అంబులెన్సులో భౌతికకాయాన్ని ఆమె స్వగ్రామానికి ఉచితంగా చేర్చారు. శుక్రవారం మృతదేహం స్వగ్రామం చేరింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు మాణిక్యాలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని వినతులు : అలాగే జిల్లాలోని నర్సాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల ఏసురత్నం రెండేళ్ల క్రితం సౌదీఅరేబియా వెళ్లారు. గతనెల 24న గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయారు. ఆయన పార్దీవదేహాన్ని తీసుకురావాలని కోరుతూ శుక్రవారం ఆయన కుమారుడు రాజశేఖర్ మాణిక్యాలరావుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే మొగల్తూరు మండలం సిరిపాలెం గ్రామానికి చెందిన భూసి శిరోమణి మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. అనుకోని పరిస్థితులలో అక్కడ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని ఆమె బంధువులు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి సాయం చేస్తానని మాణిక్యాలరావు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement