-
అనంత విజ్ఞానరాశులు వేదాలు
మహా మహోపాధ్యాయ విశ్వనాథ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘వేదాలు అనంతవిజ్ఞాన రాశులు. వాటికి మించి న విజ్ఞాన సంపద లే’దని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ పేర్కొన్నారు. దానవాయిపేటలోని వా డ్రేవువారి భవనంలో గురువారం జరి గిన వేదశాస్త్రపరిషత్ సర్వజనమహాసభలో ఆయన అధ్యక్షునిగా ప్రసంగించారు. భారతీయ సంప్రదాయంలో వేదాలకు మించిన విజ్ఞానం మరొకటి లేదని, మానవుల కర్తవ్యనిర్వహణకు మార్గదర్శకాలు వేదాలని అన్నారు. కర్మకాండ అంతా వేదరూపంలోనే లభిస్తోందని తెలిపారు. వేదం అపౌరుషేయమని, భగవంతుని నిశ్వాçÜరూపంగా వెలువడిందని పేర్కొన్నారు. ఉదయం వేదపరిషత్తు విద్యార్థులు, వేదపండితులు వేదస్వస్తితో పరిషత్ కార్యాలయంనుంచి విశ్వేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వేదస్వస్తి ముగిశాక మార్కండేయేశ్వరాలయంలో వేదపారాయణ నిర్వహించారు. సుమారు 170 మంది విద్యార్థులు వివి ధ∙విభాగాల్లో పరీక్షల్లో పాల్గొనగా 49 మంది కొన్నివిభాగాల్లో ఉత్తీర్ణులయ్యారు. 23 మంది పట్టాలు తీసుకున్నారు. పరి షత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి, సహాయకార్యద ర్శి పీసపాటి వెంకటసత్యనారాయణశాస్త్రి పాల్గొన్నారు. -
రాష్ట్రపతి పురస్కారానికి విశ్వనాథ గోపాలకృష్ణ ఎంపిక
రాజమహేంద్రవరం కల్చరల్ : సంస్కృత భాష వికాసానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికయ్యారు. విశాఖపట్నంలో ఉన్న ఆయన ఈ సందర్భంగా సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్ర : మీ తండ్రి విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దశాబ్దాల తరువాత మీరు కూడా రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. దీనిపై మీ స్పందన ఏమిటి? విశ్వనాథ : ఈ సత్కారాన్ని మా తండ్రి ఆశీస్సులు, గురుదేవుల దీవెనలుగా భావిస్తున్నాను. ప్ర : యువత చూపు పూర్తిగా సాంకేతిక విద్యపై ఉన్న ప్రస్తుత తరుణంలో సంస్కృత భాషపై ఆసక్తి కలిగించడానికి ప్రభుత్వపరంగా చేపట్టవలసిన చర్యలు వివరిస్తారా? విశ్వనాథ : పదో తరగతి వరకూ సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలి. ఆర్షధర్మం, సనాతన సంప్రదాయాలు తెలియాలంటే సంస్కృత భాషా పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉండి తీరాలి. సంస్కృతం నేర్వకుండా నైతిక విలువల పునరుద్ధరణ జరిగే పని కాదు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు మూలబిందువు సంస్కృత భాషే. దీనిని పిన్నలు నేర్చుకునేలా పెద్దలు కూడా ప్రోత్సహించాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement