-
‘కంపెనీని టేకోవర్ చేసే ప్రతిపాదనైతే లేదు’
నగదు కొరతతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టంచేసింది. వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నకు బుధవారం లోక్సభలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ తమ శాఖ వద్ద అలాంటి ఏ ప్రతిపాదన లేదని తెలిపారు. అయితే కంపెనీని ఆర్థికంగా ఆదుకునేందుకు మాత్రమే ఆ వాటాను తీసుకున్నామనీ స్పష్టం చేశారు. మేజర్ వాటా కేంద్రానిదే.. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.1 శాతం వాటా ఉంది. ఆ కంపెనీ టెలికం శాఖకు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ షేర్లుగా మార్చుకుంది. దీంతో ప్రభుత్వానికి ఆ వాటా సమకూరింది. ఇప్పుడు కంపెనీలో అతిపెద్ద వాటాదారు కేంద్ర ప్రభుత్వమే. భాగస్వామ్య సంస్థ బ్రిటన్కు చెందిన వొడాఫోన్కు 32.3 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్నకు 18.1 శాతం..రెండింటికీ కలిపి 50.4 శాతం వాటా ఉన్నది. మిగిలిన వాటా రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. వొడాఫోన్ చెల్లించాల్సిన మరో రూ.40,000 కోట్లకు నాలుగేళ్లపాటు మారటోరియం ఉంది. అయితే ఈ మొత్తాన్ని 2026 నుంచి కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బకాయిల్ని ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకుని వాటాను 70 శాతానికి పెంచుకుంటుందన్న అంచనాలున్నాయి. ఇదీ చదవండి: భారత్ ప్రధాన సమస్య ఏమిటంటే..? ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎన్ఎన్ఎల్)పై అడిగిన ప్రశ్నకు చౌహాన్ స్పందిస్తూ.. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 4జీ సేవలను ప్రారంభించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన 1,00,000 సైట్ల కోసం కొనుగోలు ప్రణాళికలు చేసిందని తెలిపారు. -
పన్నులపై ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతం
వొడాఫోన్ కేసులో బాంబే హైకోర్టు ఉత్తర్వుపై అప్పీల్కు కేంద్రం నో... న్యూఢిల్లీ: దేశ పన్నుల వ్యవస్థలో సమస్యలకు సంబంధించి పెట్టుబడిదారుల భయాందోళనలు పోగొట్టడంసహా, ఫలవంతంకాని లిటిగేషన్లను సాగదీయడం జరగదని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. వొడాఫోన్ కేసులో బాంబే హైకోర్టు ఉత్తర్వుపై అప్పీల్కు వెళ్లరాదని బుధవారం నిర్ణయించింది. ఒక ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేసులో రూ.3,200 కోట్లు చెల్లించాలని గతంలో ఆదాయపు పన్ను శాఖ వొడాఫోన్కు డిమాండ్ నోటీసు జారీచేసింది. దీనిపై వొడాఫోన్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. కేసులో హైకోర్టు 2014 అక్టోబర్ 10వ తేదీన వొడాఫోన్కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లరాదని బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. ఈ తరహా మిగిలిన కేసులపైనా కేంద్ర క్యాబినెట్ నిర్ణయ ప్రభావం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆయా కేసులను అధ్యయనం చేసిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తదితరులతో ఆర్థికమంత్రి వొడాఫోన్ కేసు విషయాన్ని క్షుణ్ణంగా చర్చించారని, హెకోర్టు రూలింగ్ సమంజసంగానే ఉందని ఈ సందర్భంగా భావించడం జరిగిందని వెల్లడించారు. కేసు ఇదీ... ఇది 2010కి సంబంధించిన లావాదేవీ వ్యవహారం. బ్రిటన్లోని మాతృ కంపెనీ అయిన వొడాఫోన్కు- ఇక్కడి సబ్సిడరీ అయిన వొడాఫోన్ ఇండియా సర్వీసెస్ షేర్లను బదలాయిస్తున్నప్పుడు, వాటికి తగిన ధరను లెక్కించలేదని (అండర్ వ్యాల్యూ) ఐటీ శాఖ అప్పట్లో ఆరోపించింది. అందువల్ల అదనపు ఆదాయపు పన్ను చెల్లించాలని డిమాండ్ నోటీసు పంపింది. అయితే భారత చట్టాల ప్రకారం, విదేశాల్లోని మాతృసంస్థకు తన షేర్ల బదిలీ లావాదేవీ పన్ను చెల్లింపుల పరిధిలోకి రాదని వొడాఫోన్ వాదించింది. ఈ వాదనతో బాంబే హైకోర్టు ఏకీభవించింది. పరిశ్రమ హర్షం... ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. దీని వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు భారత్లో పన్నుల విధానాలపై సానుకూల అభిప్రాయం ఏర్పడగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సెక్రటరీ జనరల్ దీదార్ సింగ్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఇదొక శుభ పరిమాణమన్నారు. హెచ్డీఎఫ్సీ ప్రతిపాదనకు ఓకే కాగా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాలన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కార్యదర్శి (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
Advertisement