-
నకిలీ ఫేస్బుక్ ఖాతాతో యువతికి వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేసి అసభ్యకర సందేశాలు పంపుతూ ఓ యువతిని వేధిస్తున్న ప్రైవేట్ ఉద్యోగిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధూలపల్లికి చెందిన మోహన్ కృష్ణ వర్మ ఫేస్బుక్ ఖాతా నుంచి మన్సూరాబాద్కు చెందిన ఓ యువతి ఫొటోలను డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం స్వాతిరెడ్డి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేసి బాధితురాలి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకొని బాధితురాలి ఫ్రెండ్స్కు రిక్వెస్ట్లు పంపాడు. ఆ తర్వాత అసభ్యకర సందేశాలు పంపిస్తూ బాధితురాలి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించాడు. తన స్నేహితురాలి ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోహన్ కృష్ణ వర్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
బీజేపీ నాయకురాలికి వేధింపులు
ముంబై: అసభ్య సందేశాలతో దుండగుడు ఒకరు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకురాలు, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ పోలీసులను ఆశ్రయించారు. వాట్సాప్, ఎసెమ్మెస్ ద్వారా తనకు అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై బీకేసీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆమె ఫిర్యాదు చేశారు. దుండగుడు గత డిసెంబర్ నుంచి తనకు అశ్లీల సందేశాలు పంపిస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. నిత్యం అభ్యంతకర మెసేజ్ లు వస్తుండడంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించినట్టు షైనా తెలిపారు. తనలా మరొకరు వేధింపులకు గురికాకుడదన్న ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దుండగుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని కోరారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బుల్లితెర నటికి అసభ్యకర మెసేజ్లు...
బంజారాహిల్స్: గుర్తు తెలియని వ్యక్తి తనకు అసభ్యకర సందేశాలు పంపి మానసికంగా వేధిస్తున్నాడని బుల్లితెర నటి ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకా రం... శ్రీనగర్కాలనీ గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే ఎస్.భారతి (40) టీవీ షోల్లో నటిస్తోంది. మూడు నెలలుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు అసభ్యకర మెసేజ్లు వస్తున్నాయి. దీంతో తాను తీవ్రమానసిక క్షోభకు గురవుతున్నానని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అసభ్యకర సందేశాలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ఓ మహిళ పట్ల అభ్యకరంగా వ్యవహరిస్తున్న యువకుడ్ని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్స్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న మహిళకు చింతల్బస్తీకి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు అసభ్యకరంగా సంక్షిప్త సందేశాలను పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
విద్యార్థినితో ‘సెల్’గాటం
* ఉపాధ్యాయుడిపై విద్యార్థిని బంధువుల దాడి * అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడని ఆరోపణ కాకినాడ క్రైం : అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని తల్లిదండ్రులు ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిపై దాడి చేసి గాయపరిచారు. ఇందుకు సంబంధించి విద్యార్థిని బంధువులు, పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ... కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం ఉషోదయ మెరిట్ స్కూల్లో ఓ విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో యు.కొత్తపల్లికి చెందిన మురళి మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. స్కూల్ రికార్డుల్లో ఆ విద్యార్థిని ఫోన్ నంబర్ చూసిన ఈ ఉపాధ్యాయుడు ఆ నంబర్కు మెసేజ్లు పంపుతూ... మిస్డ్ కాల్స్ ఇస్తున్నాడు. ఇది గమనించిన ఆ విద్యార్థిని తాత తిరిగి ఆ నంబర్కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆయన తన స్నేహితుల ద్వారా ఆ సెల్ నంబర్ చిరునామా తెలుసుకున్నాడు. ఆ ఫోన్ ఉషోదయ స్కూల్లోని తెలుగు ఉపాధ్యాయుడిదిగా గుర్తించాడు. దీంతో సోమవారం ఉదయం అతడితో మాట్లాడే పని ఉందని కొంత మంది స్కూల్ వద్దకు వెళ్లి ఆ ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. స్కూల్ ప్రతినిధులు ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఆకుల మురళీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మురళిని ఆస్పత్రికి తరలించారు. అతడిపై దాడికి పాల్పడిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. తెలుగు తమ్ముళ్ల జోక్యం ఉషోదయ స్కూల్లో ఉపాధ్యాయుడిపై విద్యార్థిని బంధువులు దాడికి పాల్పడిన సంగతి తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నాడు. ఇరు వర్గాలతో చర్చించి సమస్యను ‘సెటిల్’ చేసుకుందామంటూ పైరవీలకు దిగాడు. దీంతో అక్కడకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి గుణపాఠం చెప్పకుండా సెటిల్మెంట్ వ్యవహారానికి తెరలేపేందుకు ప్రయత్నాలు సాగించిన తెలుగు తమ్ముడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
Advertisement