-
ఏడాదిలోగా తొలి సెమీకాన్ ప్లాంటు
న్యూఢిల్లీ: దేశీయంగా ఎల్రక్టానిక్ చిప్ తయారీ తొలి ప్లాంటు ఏడాదిలోగా ఏర్పాటయ్యే వీలున్నట్లు కేంద్ర టెలికం, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటుసహా.. సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్(వ్యవస్థ)ను నెలకొల్పే బాటలో తొలిగా ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. అన్ని రకాల హైటెక్ ఎల్రక్టానిక్ ప్రొడక్టులలో వినియోగించే ఫిజికల్ చిప్స్ తయారీకి వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను తొలి దశ బ్లాకులుగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయిలో ఎదిగేందుకు కొన్ని ప్రత్యేక విభాగాలపై దృష్టి పెట్టినట్లు అశ్వినీ వెల్లడించారు. ప్రధానంగా సెమీకండక్టర్లకు టెలికం, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) అతిపెద్ద విభాగాలుగా ఆవిర్భవించినట్లు వివరించారు. వెరసి ఈ విభాగాలలో వినియోగించే చిప్స్ అభివృద్ధి, తయారీలపై దృష్టి పెట్టడం ద్వారా టెలికం, ఈవీలకు గ్లోబల్ లీడర్లుగా ఎదిగే వీలున్నట్లు తెలియజేశారు. ఈ రెండు విభాగాలపై ప్రత్యేక దృష్టితో పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రానున్న కొన్ని నెలల్లో చెప్పుకోదగ్గ విజయాలను అందుకోనున్నట్లు అంచనా వేశారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్, డిజైన్, తయారీ ద్వారా పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చిప్ తయారీ యూఎస్ దిగ్గజం మైక్రాన్ పెట్టుబడుల విజయంతో ప్రపంచమంతటా దేశీ సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మైక్రాన్ గత నెలలో గుజరాత్లోని సణంద్లో సెమీకండక్టర్ అసెంబ్లీ ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంటుతోపాటు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు జూన్లో మొత్తం 2.75 బిలియన్ డాలర్ల(రూ. 22,540 కోట్లు) పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. వీటిలో మైక్రాన్ 82.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన పెట్టుబడులను సమకూర్చనున్నాయి. -
నెస్లేకు 'కిట్ క్యాట్' బాధిత యువతి అల్టిమేటం
ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కిట్ క్యాట్ చాక్లెట్ లో ఒట్టి చాక్లెట్ తప్ప వేఫర్ లేకపోవడంతో కంగుతిన్న అమ్మాయి.. ఏకంగా తయారీదారులైన నెస్లే కంపెనీకి హెచ్చరికలు పంపింది. నష్టపరిహారంగా తనకు జీవితకాలం ఉచితంగా చాక్లెట్లు పంపాలని డిమాండ్ చేసింది. లండన్ కు చెందిన న్యాయవిద్యార్థిని సైమా అహ్మద్(20) గత వారం ఓ షాపులో కిట్ క్యాట్ చాక్లెట్లు కనుక్కుంది. ఇంటికెళ్లి చూస్తే.. వేఫర్ లేకుండా కిట్ క్యాట్ మొత్తానికిమొత్తం చాక్లెట్ మాదిరే కనిపించడంతో అవాక్కయింది. ఆ వెంటనే వినియోగదారుల పట్ల కంపెనీ తీరును నిరసిస్తూ నెస్లేకు లేఖ రాసింది. తాను కొన్న చాక్లెట్ శాంపిళ్లను కంపెనీకి పంపుతూ పరిహారంగా జీవితకాలం తనకు ఉచితంగా చాక్లెట్లు సరఫరా చేయాలని సైమా అహ్మద్ డిమాండ్ చేసింది. అలా కాని పక్షంలో విషయం కోర్టులో తేల్చుకుంటానని హెచ్చరించింది. ఇప్పటివరకైతే నెస్లే ఆమె డిమాండ్ కు స్పందించలేదు. మ్యాగీ నూడుల్స్ లో విషపదార్థాలు కలుస్తున్నాయనే ఆరోపణలతో ఇండియాలో పరువుపోగొట్టుకున్న నెస్లే.. కిట్ క్యాట్ రచ్చ ద్వారా ఇప్పుడు ఇంగ్లాండ్ లోనూ అదేపరిస్థితికి దిగజరినట్లయింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ కు కౌంట్ డౌన్
సునీల్ నరైన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
వాజ్పేయిని ఒప్పించి రోడ్లేశా!
నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
29వ సారి ఎవరెస్ట్ను అధిరోహించిన కమీ రీటా షెర్పా
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
ఓటేయండి.. రాయితీ పొందండి
వివాదాలు.. సంచలనాలు.. కేసులు
ప్రత్యామ్నాయంగా..
ఓటు ఎటో!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement