-
అంకుల్.. స్కూల్లో వాష్రూమ్స్ లేవు
వేములవాడ రూరల్: ‘అంకుల్.. మాకు వాష్రూమ్స్, మూత్రశాలలు లేవు, ఇబ్బందులు పడుతున్నాం’అని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కు మొరపెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటాంపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన వికసిత్భారత్ సంకల్పయాత్రకు సంజయ్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో బాలరాజుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఎంపీకి ఏకరువు పెట్టారు. దీనికి ఆయన స్పందిస్తూ సౌకర్యాలకు ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు 24 గంటల్లో తెలపాలని అధికారులకు సూచించారు. -
టాయిలెట్ బిల్లుకు జీఎస్టీ ఘటన!! ఐఆర్సీటీసీ వివరణ
ఢిల్లీ: జీఎస్టీ.. దేశంలో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. నిత్యావసరాల మొదలు.. చాలావాటిపై కేంద్రం జీఎస్టీ వడ్డన చేయడంతో.. సోషల్మీడియాలోనూ విపరీతమైన విమర్శలు వినిపించాయి. తాజాగా టాయిలెట్కు వెళ్లినా ఫారినర్లకు భారీ బిల్లుతో పాటు అందులో జీఎస్టీ సైతం పడడంతో కంగుతిన్నారు. దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగింది. ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో వాష్ రూమ్ని వాడుకున్నందుకు ఇద్దరు విదేశీ పర్యాటకులు భారీ బిల్లు ఫ్లస్ జీఎస్టీ చెల్లించాల్సి వచ్చింది. అయితే వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్రిటిష్ ఎంబసీ నుంచి విదేశీయులిద్దరూ గతిమాన్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో దిగారు. వాళ్లను శ్రీవాస్తవ అనే గైడ్ రీసివ్ చేసుకున్నాడు. అయితే.. స్టేషన్లో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలనుకున్నారు. దీంతో స్టేషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి తీసుకెళ్లారు శ్రీవాస్తవ. కేవలం ఐదు నిమిషాల్లో వాళ్లు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ఐదు, పది రూపాయలు.. మహా అయితే రూ. 20 ఇవ్వాల్సి వస్తుందని శ్రీవాస్తవ భావించారు. కానీ, అక్కడి రిసెప్షనిస్ట్.. రూ. 224 బిల్లు చేతిలో పెట్టడంతో.. ఆయన షాక్ అయ్యారు. ఐదు నిమిషాల పాటు వాష్ రూం వాడుకున్నందుకు ఒక్కొక్కరి బిల్లు రూ. 100లు వేశారు. పైగా దానిపై జీఎస్టీ రూ. 12 జత చేశారు. అలా వారిద్దరికీ కలిపి రూ. 224 బిల్లు అయింది. అంత చెల్లించేందుకు మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, సిబ్బంది ఒత్తిడితో చివరికి చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఐఆర్సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి ప్రవేశానికి ప్రత్యేక చార్జ్ ఉందని, దానిపై జీఎస్టీ పడుతుందని చెప్పారు. అంతేకాదు లాంజ్లో ఉన్నంతసేపు టూరిస్టులు, ఫారినర్లు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చని, కాంప్లిమెంటరీగా కాఫీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ కోచ్లో ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తే టికెట్ రూ. 90 రూపాయలు మాత్రమేనని, కానీ స్టేషన్లో వాష్రూం వినియోగించుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథి దేవో భవ పిలుపును ఐఆర్సీటీసీ అవమానిస్తోందని, ఇలా చేయడం వల్ల విదేశీయులు ఇక్కడి వ్యవస్థలపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యవహారంపై టూరిజం శాఖలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఇదీ చదవండి: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం
సాక్షి, ఖమ్మం: కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల విషయం పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రతీ మీటర్పై వ్యాట్ రూపంలో చెల్లిస్తున్న రుసుంతో బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి చాలా మందికి తెలియదు. ఒకరిద్దరు నిబంధనల పేరుతో ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం తెలిసిందే. బంకుల వద్ద వినియోగదారులకు కొన్ని కచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలు ఏ పెట్రోల్ పంపులోనైనా అందించకపోతే మీరు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛమైన తాగునీరు.. బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందు కోసం బంకు డీలర్ ఆర్వో యంత్రం, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాల్సి ఉంది. ఏ బంకులో కూడ తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థ కు ఫిర్యాదు చేయవచ్చు. మూత్రశాలలు, మరుగుదొడ్లు.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలు చోట్ల వీటిని ఏర్పాటు చేసినా వినియోగించేందుకు నిర్వహకులు అనుమతులివ్వటం లేదు. మరికొన్ని చోట్ల అసలు కనిపించని పరిస్థితి నెలకొంది. బంకుల్లో ఇలాంటి సౌకర్యాలు లేనట్లయితే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చు. లీటర్ పెట్రోల్, లేదా డీజిల్ కొనుగోలు చేస్తే అందులో మనం బంకులకు 4 నుంచి 8 పైసల వరకు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణకు చెల్లిస్తున్నాం. ఆపదవేళ ఫోన్ సదుపాయం.. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ధ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పని లేదు. ఏదైనా పెట్రోల్ బంక్ ను సందర్శించటం ద్వారా మీరు ఏ నంబర్ కు అయినా కాల్ చేసుకోవచ్చు. ఉచితంగా గాలి నింపాల్సిందే.. టైర్లలో గాలి నింపటానికి గాలి శాతం తనీఖీ చేసుకోవటానికి అనువుగా బంకుల్లో కచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు కూడ ఓ వ్యక్తి ని అందుబాటులో ఉంచాలి. బంకులో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకున్నా, వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనీఖీ చేయాలి. ఇటీవల కాలంలో వాహనాల టైర్లకు ప్రత్యామ్నయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ట్యూబ్లెస్ టైర్లు వస్తున్నాయి. వాటిలో నైట్రోజన్ నింపాలి. ఫిర్యాదుల పెట్టె, ప్రథమ చికిత్స కిట్టు ఉండాలి.. ప్రతి బంకులో ఫిర్యాదు పెట్టే లేదా రిజిష్టర్ను అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారుడు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. ప్రథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతి బంకు వద్ధ ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ ప్రథమ చికిత్స పెట్టెలో ఆరోగ్యాన్ని రక్షించే మందులు ఉండాలి. దీంతో పాటు అన్ని మందులపై గడువు తేదీ కూడ రాసి ఉంచాలి. పాత మందులు ఉండకూడదు. నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చు.. పెట్రోల్, డీజీల్ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునేందుకు పరికరాలను సిద్ధంగా ఉంచాలి. వాటి ద్వారా నాణ్యత ను పరీక్షించేందుకు హక్కు మనకు ఉంటుంది. అదే విధంగా పెట్రోల్, డీజీల్ తక్కువగా వస్తుందనే అనుమానం వచ్చినా పరీక్షించుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ కరువు.. బంకుల వద్ద ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సిన హక్కులు ఉండి కూడ ఏ ఒక్కటి కూడ కల్పించటం లేదు. ముఖ్యంగా బంకులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వలన వారి ఇష్టారాజ్యంగా అవుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. - బచ్చలకూరి నాగరాజు, కోరట్లగూడెం అవగాహన కల్పించాలి బంకుల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అన్నింటికి కలిపి చమురుకు ధరలు చెల్లిస్తున్నారు. కానీ వాటిని మాత్రం వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. -మాదాసు శ్రీనివాసరావు, కొత్తకొత్తూరు ఫిర్యాదుల పెట్టెలు కనిపించవు బంకులపై ఫిర్యాదు చేసేందుకు కనీసం ఫిర్యాదుల పెట్టెలు కానీ, రిజిష్టర్లు కానీ బంకుల వద్ధ ఎవరికి కనిపించవు. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించరు. ప్రజల హక్కులను కూడ వినియోగించుకోలేకపోతున్నారు. బంకుల పై అధికార యంత్రాంగం ఉందా లేదా అనిపిస్తుంది. -రావెళ్ల కృష్ణారావు, మోటాపురం -
ఇక స్మార్ట్ వాష్ రూమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో జనాభా అవసరాలకు తగ్గట్టు సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ (అర్బన్) మార్గదర్శకాల మేరకు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లేదా ఇతర పద్ధతుల్లో టాయిలెట్లు, యూరినల్స్, హ్యాండ్వాష్ల సదుపాయంతో సమీకృత వాష్రూమ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. టాయిలెట్, యూరినల్స్, హ్యాండ్ వాష్లు ఒకే సముదాయంలో ఉండనున్నాయి. వీటికి అదనంగా ఏటీఎం, ఫొటో కాపీయింగ్ (జిరాక్స్), వైఫై, ఇంటర్నెట్, ప్రింటర్, మీ–సేవాలతో పాటు ఆహ్లాదకరమైన కేఫే సదుపాయాన్ని కల్పిస్తారు. స్మార్ట్ వాష్ రూమ్లో ఏర్పాటు చేసే ఇతర వాణిజ్య సముదాయాలతో పాటు ప్రకటనలతో ఆదాయం వచ్చే మార్గాలుంటే వాష్రూమ్ల వినియోగానికి చార్జీలు వసూలు చేయరు. హైదరాబాద్లో పలు చోట్ల వాష్రూమ్స్, ఏటీఎం, కేఫేలతో నిర్మించిన ‘లూ కేఫే’లను ఆదర్శంగా తీసుకుని వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. జనాభాకు తగ్గట్టు.. పురుషుల కోసం 100 నుంచి 400 మందికి టాయిలెట్ సీట్ ఏర్పాటు చేయాలని, జన సంచారం 400 మందికి మించి ఉంటే, ఆపై 250 మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి 50 మందికి ఒక యూరినల్ నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి ఒక్క టాయిలెట్, యూరినల్కు ఒక హ్యాండ్వాష్ను ఏర్పాటు చేయనుంది. మహిళల కోసం 100 నుంచి 200 మందికి రెండు టాయిలెట్ సీట్లు, 200 మందికి మించితే ప్రతి 100 మందికి అదనంగా మరో ఒక టాయిలెట్ సీట్ను నిర్మించనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా యూరినల్స్, హ్యాండ్ వాష్లు ఏర్పాటు చేయరు. సామూహిక మరుగుదొడ్ల విషయానికి వస్తే ప్రతి 35 మంది పురుషులకు ఒకటి, 25 మంది మహిళలకు ఒకటి చొప్పున టాయిలెట్లు నిర్మిస్తారు. వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి. పీపీపీ భాగస్వామ్యంతో.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో స్థానికంగా సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్, సామూహిక మరుగుదొడ్లకు ఉన్న అవసరాలను గుర్తించేందుకు అధ్యయనం చేసి అవసరమైన మేరకు టాయిలెట్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఆదేశించారు. పీపీపీ విధానం లేదా ప్రైవేటు వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో సుదీర్ఘ కాలం మన్నిక కలిగిన సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్లను కోరారు. పీపీపీ భాగస్వామ్యంతో డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీ ఎఫ్వోటీ) విధానంలో పురపాలికల్లోని వాణిజ్యపర ప్రాంతాల్లో స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్ కాంప్లెక్స్లను రిహాబిలేట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (ఆర్వోటీ) కింద స్మార్ట్ వాష్ రూమ్స్గా పునర్నిర్మించేందుకు ప్రైవేటు పార్టీలు ఆసక్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ వాష్ రూమ్స్ల ఏర్పాటుకు ఆసక్తి గల ప్రైవేటు సంస్థలు, సొసైటీలు, స్వయం సహాయక సంఘాలు తదితర వాటి నుంచి ఆసక్తి వ్యక్తీకరణను (ఈవోఐ) ఆహ్వానించాలని కమిషనర్లను ఆదేశించారు. స్వచ్ఛ బారత్ మార్గదర్శకాల ప్రకారం ఒక స్మార్ట్ వాష్ రూమ్లో ఒక టాయిలెట్ నిర్మాణానికి రూ.98 వేలు, యూరినల్ ఏర్పాటుకు రూ.32 వేల వరకు వ్యయాన్ని అనుమతించనున్నారు. మూడు పద్ధతుల్లో నిర్మాణం.. ప్రైవేటు సంస్థల డిజైన్లకు అనుగుణంగా స్మార్ట్ వాష్ రూమ్స్ల నిర్మాణాన్ని అనుమతించనున్నారు. అయితే, డిజైన్లను స్థానిక పురపాలిక/జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. పురపాలిక/జిల్లా కమిటీ రూపొందించిన డిజైన్ ప్రకారం స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయవచ్చు. అయితే, స్థానిక లేఅవుట్కు తగ్గట్టు డిజైన్కు చిన్నచిన్న మార్పులు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్ సముదాయాల స్థానంలో కొత్తగా స్మార్ట్ వాష్ రూమ్స్ను నిర్మిస్తారు. సమయ పాలన.. సామూహిక టాయిలెట్లు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు బాగా వినియోగంలో ఉంటాయి. రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు, విమానాశ్రాయాల వద్ద ఉండే స్మార్ట్ వాష్రూమ్స్ 24 గంటలు వినియోగంలో ఉంటాయి. ప్రధాన వ్యాపార కూడళ్లలో ఉండే వాటికి ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు డిమాండ్ ఉండనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ వాష్ రూమ్స్ నిర్వహించనున్నారు. -
ఢిల్లీ 6:మహిళల కోసం ఆరు ‘కట్టడాలు’
సౌకర్యం ఇది మామూలు విషయమే కానీ, ఎంతో మంచి విషయం! నార్త్ ఢిల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ వాళ్లు, ఢిల్లీ పౌరుల సహకారంతో మహిళల కోసం ఆరు ‘కట్టడాలను’ ఏర్పాటు చేయబోతున్నారు. వాటిల్లో ఒక కట్టడం ఇటీవలే కాశ్మీరీ గేట్ మార్కెట్ ప్రాంతంలో పూర్తయి, వారం క్రితమే మహిళలకు అందుబాటులోకి వచ్చింది కూడా. మహిళలకు కట్టడం అనగానే మనకు తాజ్మహల్ గుర్తుకు రావచ్చు. ఒక విధంగా ఈ ఆరు కట్టడాలూ మహిళల గౌరవార్థం, అంతకన్నా కూడా వారి అవసరార్థం నిర్మిస్తున్నవే. ఢిల్లీ ప్రభుత్వ ‘భాగీదారి’ (ప్రజల భాగస్వామ్య పథకం) కింద ‘మై ఢిల్లీ ఐ కేర్’ ప్రాజెక్టు పేరుతో ఫెడరేషన్ నిర్మిస్తున్న ఈ కట్టడాలు... వాష్ రూమ్లు! ఇటీవలి ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో ఓటు వేసేందుకు మహిళా ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇలాంటి సందర్భంలోనైనా, ఇలాంటి చోటనైనా మహిళలకు వాష్రూమ్లు ఏర్పాటు చేయలేకపోయారు అధికారులు. మహిళా సంక్షేమం కోసం పెద్దపెద్ద పథకాలు ప్రకటించే నాయకులు మహిళలకు అత్యవసరమైన పబ్లిక్ టాయ్లెట్ల నిర్మాణంలో, వాటి నిర్వహణల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారో... ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే! ‘‘ఇవి మాకెంతో ఉపయోగపడతాయి. మగవాళ్లలా మేము ఢిల్లీ వీధులను బహిరంగ మూత్రశాలలుగా మార్చకపోవచ్చు. అంతమాత్రాన మాకు వాష్రూమ్ల అవసరం లేదని కాదు కదా. ఇది ఎంతో చిన్న విషయంగా మీకు అనిపించవచ్చు. మహిళలకు మాత్రం అత్యవసరమైనది’’ అని కాశ్మీరీ గేట్ వాష్రూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా రాగిణి (22) అనే సేల్స్ ఉమన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నార్త్ ఢిల్లీ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని మరో ఐదు ప్రాంతాలలో మహిళల వాష్రూమ్లు ఏర్పాటు అయ్యాయి. హనుమాన్ మందిర్ రోడ్, కమలానగర్ మార్కెట్, రోషనార బాగ్ సింగ్ సభ గేట్, రోషనార బాగ్ క్లబ్ గేట్ 2, హిందూరావ్ ఆసుపత్రిలోని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మెడికల్ కాలేజీ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో నిర్మాణం పూర్తయిన దశలో ఉన్న ఈ ఐదు వాష్రూమ్లు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ఈ వాష్రూమ్లు మహిళలకు అందుబాటులో ఉంటాయి. భద్రతగా అక్కడ మహిళా సిబ్బంది ఒకరు ఉంటారు. ‘‘ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుకోడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. వాష్రూమ్ పరిశుభ్రతతో పాటు, భద్రతా సిబ్బంది ఏర్పాటుకు కాస్త పెద్ద మొత్తంలోనే డబ్బు అవసరమౌతుంది. అందుకే ఢిల్లీ పౌరుల చేయూతను మేము అర్థించాం. వారి నుంచి సానుకూల స్పందన రావడంతో ఇంతదూరం రాగలిగాం’’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్ భాసిన్ అన్నారు. ‘‘గత ఆరేళ్లుగా దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లు తమ బడ్జెట్లో ‘మహిళా టాయ్లెట్’ల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాయి. ఢిల్లీ అయితే అంతకు ముందు నుంచే ఈ ప్రాజెక్టు కోసం మల్లగుల్లాలు పడుతోంది. చివరికి ఎలాగైతేనే అందరి సహకారంతో ఆరు వాష్రూమ్లను నిర్మించగలిగాం’’ అని అశోక్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం ఢిల్లీలో మగవాళ్ల కోసం మొత్తం 3,712 పబ్లిక్ టాయ్లెట్లు ఉండగా, మహిళలకు ఉన్నవి కేవలం 269 మాత్రమే! ఎప్పుడూ రద్దీగా ఉండే చాందినీ చౌక్, కరోల్బాగ్ మార్కెట్ ప్రాంతాల్లో అయితే మహిళలకు వాష్రూమ్ల కొరత మరింత తీవ్రంగా ఉంది. ‘‘మాకిది ప్రధాన సమస్య. వాష్రూమ్లో అందుబాటులు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి శుభ్రంగా ఉండవు. పైగా వాటి దరిదాపుల్లో మాదకద్రవ్యాలకు బానిసలైనవారు తూలుతూ, వాగుతూ కనిపిస్తారు’’ అని చాందినీ చౌక్ దుకాణదారు అరుణిమా కపూర్ అనడంలో... ఇకనైనా మాకు ఈ ఇబ్బందులు తొలగితే మంచిదే కదా అనే ఆశాభావం కనిపిస్తుంది. నార్త్ ఢిల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్లా ప్రతి రాష్ర్టంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన ఇలాంటి సమస్యలపై దృష్టి సారిస్తే అరుణిమ లాంటి మహిళల అసౌకర్యాలు తొలగినట్లే!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement