-
సంపద నిర్వహణ సేవలకు డిమాండ్
సంపద వృద్ధికి మెరుగైన అవకాశాల కోసం చిన్న పట్టణాల్లోని వారు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వెల్త్ మేనేజ్మెంట్ సేవల్లోని కంపెనీలు టైర్–2, 3 పట్టణాల వైపు చూస్తున్నాయి. సాధారణంగా చిన్న పట్టణాల్లోని అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) సంప్రదాయ సాధనాలైన బంగారం, రియల్ ఎస్టేట్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పుడు బంగారం, రియల్టీ కాకుండా ఇతర సాధనాల్లోకి తమ పెట్టుబడులను విస్తరించుకోవాలని అనుకుంటున్నారు. ఈ ధోరణి వెల్త్ మేనేజ్మెంట్ సేవలకు డిమాండ్ను తెస్తోంది. ముఖ్యంగా కరోనా తర్వాత చిన్న పట్టణాల్లో కొన్ని వ్యాపారాలకు కొత్త జీవం రావడాన్ని వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంపద నిర్వహణ సేవలు అందించే సంస్థలు (వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు) ఆర్థిక ప్రణాళిక, పన్నుల కు సంబంధించిన సలహాలు, ఎస్టేట్ ప్లానింగ్ వంటి ఎన్నో సేవలు అందిస్తుంటాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సంస్థలతో పోలిస్తే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు విస్తృతమైన సేవలను ఆఫర్ చేస్తుంటాయి. అధిక శాతం మంది వెల్త్ మేనేజర్లు కనీసం రూ.కోటి నుంచి రూ.25 కోట్ల వరకు పెట్టుబడుల నిర్వహణ చూస్తుంటారు. కరోనా తర్వాతే.. కరోనా ముందు నాటికి మా మొత్తం క్లయింట్లలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని క్లయింట్లు 17 శాతంగా ఉంటే, ఇప్పుడు 22 శాతానికి పెరిగినట్టు ఆస్క్ ప్రైవేటు వెల్త్ వెల్లడించింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ఈ సంస్థ క్లయింట్ల ఆస్తులు 13 శాతం నుంచి 22 శాతానికి చేరాయి. నువమా వెల్త్ క్లయింట్లలోనూ కరోనా ముందు టైర్–2 నుంచి 15 శాతంగా ఉంటే, కరోనా తర్వాత 20 శాతానికి పెరిగారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ప్రైవేటు వెల్త్ మేనేజ్మెంట్ సేవలు విస్తరించడానికి ఎక్కువ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. మరిన్ని సంస్థలు రావడంతో అవి ఎక్కువ మంది ధనవంతులను చేరుకోగలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సేవల విస్తరణకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘కరోనా తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ గొప్ప పనితీరు చూపించింది. దీంతో ప్రమోటర్లకు, ఈ వ్యాపారాల్లో ఉన్న వారి సంపద పెరిగింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని వారికి ఖర్చు చేయగల ఆదాయం అసాధారణంగా పెరిగింది’’అని మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ డైరెక్టర్ జయేష్ ఫరీదా వివరించారు. అంతేకాదు చిన్న పట్టణాల్లో స్టార్టప్లు ఏర్పాటు అవుతుండడాన్ని వెల్త్ మేనేజర్లు గుర్తు చేస్తున్నారు. 50 శాతం స్టార్టప్లు టైర్–2, 3 పట్టణాల నుంచి ఉన్నాయని 2022 మార్చిలో కేంద్ర సర్కారు పార్లమెంటుకు తెలియజేయడం గమనార్హం. ‘‘టైర్–2, 3 పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడుతున్నాయి. దీంతో వ్యాపారాల నిర్వహణ సులభంగా మారుతోంది. పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ప్రభుత్వం నుంచి మద్దతు కూడా తోడయింది’’అని నువమా ప్రైవేట్ ప్రెసిడెంట్ అలోక్ సైగల్ పేర్కొన్నారు. మెరుగైన రాబడుల కోసం.. చిన్న పట్టణాల్లో హెచ్ఎన్ఐలు పెరగడం ఒక్కటే కాకుండా, కరోనా తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పులను వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంప్రదాయ సాధనాలైన బ్యాంక్ ఎఫ్డీలపై రాబడులు కనిష్ట స్థాయికి చేరడం ఇందులో ఒకటిగా ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను కనిష్ట స్థాయికి తగ్గించడం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు ఈ మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డల్గా మారింది. ఇది ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ తదితర సాధనాల వైపు చూసేలా చేసినట్టు చెబుతున్నారు. తమ కొత్త క్లయింట్లలో ఎక్కువ మంది ఇంత కాలం బంగారం, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్ మినహా మరో సాధనంలో పెట్టుబడులు పెట్టని వారేనని వెల్త్ మేనేజర్లు వెల్లడించారు. ఆనంద్రాఠి వెల్త్ మేనేజ్మెంట్ కరోనా ముందు టైర్–2 పట్టణాల క్లయింట్లకు సంబంధించి రూ.814 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, కరోనా అనంతరం రూ.3,500 కోట్లకు పెరిగిపోయాయి. జో«ద్పూర్,, నాగ్పూర్ తదితర పట్టణాల్లో వ్యాపారం రెట్టింపైది. దీంతో టికెట్ సైజు (పెట్టుబడి మొత్తం) తక్కువగా ఉన్నా, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలు చిన్న పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారించాయి. 2022లో వెల్త్ మేనేజ్మెంట్ సేవలు ప్రారంభించిన ఎప్సిలాన్ మనీ తన క్లయింట్లలో 70 శాతం టైర్ 2, 3 పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది. ‘‘చాలా మంది క్లయింట్లు సంప్రదాయ సాధనాలతోపాటు, వ్యాపారాలకే పెట్టుబడులు పరిమితం చేసుకుంటున్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, బంగారం, ఎఫ్డీలు కాకుండా ఇతర సాధనాల పట్ల వారిలో అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఉంది’’అని ఆస్క్ ప్రైవేటు వెల్త్ ఎండీ రాజేష్ సలూజా అభిప్రాయపడ్డారు. -
స్మాల్కేస్తో జిరోధా జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: కొత్తగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)ని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్న బ్రోకరేజీ సంస్థ జిరోధా తాజాగా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ స్మాల్కేస్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. దీనికోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ సాధనాలను రూపొందించడంలో స్మాల్కేస్కు 6 ఏళ్ల పైగా అనుభవం ఉందని, ఈ నేపథ్యంలోనే దానితో చేతులు కలిపామని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్లపై భారీ వ్యయాలు భారం లేకుండా మెరుగైన మ్యూచువల్ ఫండ్ పథకాలను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆశిస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఇన్వెస్టర్లకు ఫండ్స్ను పరిచయం చేయడానికి ఈ భాగస్వా మ్యం తోడ్పడగలదని స్మాల్కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. మ్యుచువల్ ఫండ్ కంపెనీని ప్రారంభించేందుకు జిరోధా 2020 ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకుంది. 2021 సెప్టెంబర్లో సెబీ సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తుది అనుమతుల కోసం జిరోధా ఎదురుచూస్తోంది. ప్రస్తు తం 42 మ్యుచువల్ ఫండ్ కంపెనీలు రూ. 40.5 లక్షల కోట్ల పైగా ఆస్తులను నిర్వహిస్తున్నాయి. -
వెల్త్ మేనేజ్మెంట్లోకి పేటీఎం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ– కామర్స్ సంస్థ పేటీఎం.. పెట్టుబడులు, ఆర్ధిక నిర్వహణ విభాగం(వెల్త్ మేనేజ్మెంట్)లోకి అడుగుపెట్టనుంది. అనుమతుల కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నామని.. ఈ ఏడాది తొలి త్రైమాసికం లోపు విపణిలోకి తొలి ఉత్పత్తులను ప్రవేశపెడతామని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ట్వీటర్లో తెలిపారు. ముందుగా మ్యుచువల్ ఫండ్స్ ఉత్పత్తులను విక్రయించనుంది. ఇప్పటికే పలు ప్రముఖ 10–12 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లతో చర్చిస్తున్నట్లు శేఖర్ తెలిపారు. పేటీఎం బ్రాండ్ను వన్97 కమ్యూనికేషన్స్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం దీనికి పేటీఎం వాలెట్, మాల్, పేమెంట్ బ్యాంక్ మూడు అనుబంధ సంస్థలున్నాయి. ఇప్పుడిది నాల్గోది. ఇప్పటివరకు పేటీఎంలో సాఫ్ట్బ్యాంక్ గ్రూప్, సైఫ్ పార్టనర్స్, అలీబాబా, ఏఎన్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడులు పెట్టాయి. రూ.63 కోట్ల పెట్టుబడులు.. పేటీఎం మనీలో రూ.63 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది. పేటీఎం మనీకి ప్రవీణ్ జాదవ్ సీనియర్ హెడ్గా వ్యవహరించనున్నారు. గతంలో ఆయన రెడిఫ్, ఎంటర్టైన్మెంట్ పోర్టల్స్లో పనిచేశారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ విష్బర్గ్ వ్యవస్థాపకులు ఈయనే. బెంగళూరు కేంద్రంగా పనిచేసే పేటీఎం మనీలో ఇప్పటివరకు 40 మంది ఉద్యోగులను నియమించుకున్నారు. మరో 6 నెలల్లో 200 మందిని నియమించుకోనున్నట్లు జాదవ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 40కి పైగా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలుండగా.. ఇవన్నీ అర్బన్ మార్కెట్లకే పరిమితమయ్యాయని.. పేటీఎం మనీ మాత్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై దృష్టిసారిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
వెయ్యికోట్లతో కంపెనీ చైర్మన్ పరారీ
ప్రముఖ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అధినేత ఏకంగా వెయ్యికోట్ల వరకు పెట్టుబడిదారుల సొమ్ము తీసుకుని ఉడాయించేశాడు. అతగాడి ఆచూకీ కోసం చైనా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చైనాలోని హంగ్జూ నగరంలో వాంగ్జూ గ్రూప్ ఛైర్మన్ యాంగ్ వైగూ గత గురువారం నుంచి ఎవరికీ కనపడకుండా పోయాడు. దాంతోపాటు అప్పటివరకు ఆసంస్థలో ప్రజలు పెట్టుబడిగా పెట్టిన దాదాపు రూ. వెయ్యి కోట్ల సొమ్మును కూడా అతడు తీసుకుపోయాడు. ఈ సంస్థలో నగదు నిల్వల విషయమై ఈనెల 18 నుంచే పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటన తర్వాత హంగ్జూ నగరంలోని తమ షాపింగ్ మాల్ను కూడా వాంగ్జూ గ్రూపు మూసేసింది. ఎలాగోలా పెట్టుబడిదారులకు వాళ్ల సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చేస్తామని కంపెనీ చెబుతోంది. వాంగ్జూ గ్రూపు వ్యాపారాలు విస్తృతంగా ఉన్నాయి. కామర్స్ , ఆటోమొబైల్స్, ఆస్పత్రులు, వెల్త్ మేనేజ్మెంట్.. ఇలా పలు కంపెనీలతో 70 నగరాల్లో 7వేల మంది ఉద్యోగులను ఆ కంపెనీ కలిగి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement