-
Welding Tanks: వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలిన ట్యాంకర్
సాక్షి, సూర్యాపేట: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ శబ్దంతో ట్యాంకర్ పేలడంతో స్థానికులు పరుగులు పెట్టారు. మృతులను అశోక్, అర్జున్గా పోలీసులు గుర్తించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదం సూర్యాపేట జిల్లాలోని ఉప్పలపహాడ్ వద్ద రోడ్డు డివైడర్ను మినీ డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. వాహనంలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉండగా అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. -
కొనసాగుతున్న ట్రాక్ మరమ్మతు
తక్కువ వేగంతో వెళ్తున్న రైళ్లు కేసముద్రం : స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని జమలాపురం వద్ద గురువారం రైలు పట్టాలపై ఆరు చోట్ల మెత్తబడి గుంతలుగా ఏర్పడిన విష యం తెలిసిందే. సాయంత్రం వరకు ఆ పట్టాలను కట్చేసి, మరోపట్టాను బిగించి రైళ్లను నె మ్మదిగా నడిపించారు. కాగా, బిగించిన పట్టాల మధ్య వెల్డింగ్ పనులను చేపట్టకపోవడంతో శుక్రవారం డౌన్లైన్లో వెళ్లే రైళ్ల వేగాన్ని తగ్గించి, 30 కిలోమీటర్ల స్పీడుతోనే పంపించారు. శని వారం నుంచి యథావిధిగా తగిన స్పీడుతో(100-120 కిలో మీటర్లు) నడిపించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఇలా పట్టాలు మెత్తబడి గుంతలుగా ఏర్పడటం, ఇదే తొలిసారని రైల్వే సిబ్బంది తెలిపారు. గూడ్సురైలు వెనక చక్రాలు బ్రేకులు పట్టేయడం, ముందు చక్రాలు తిరగడం మూ లంగా, అదే విధంగా ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే ఇలా పట్టాలు మెత్తబడి, గుంతలు పడినట్లుగా రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. -
ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం
కడప : కడప జిల్లాలోని విజయదుర్గా కాలనీలో సోమవారం ప్రమాదవశాత్తు బస్సు దగ్ధమైంది. నగరంలోని విజయదుర్గాకాలనీలో ఉన్న వెల్డింగ్ షాప్లో మైదకూరుకు చెందిన వీఆర్ కాలేజీ బస్సుకు వెల్డింగ్ చేస్తున్నారు. వెల్డింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో బస్సుకు నిప్పంటుకుని కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో వెల్డింగ్ చేస్తున్న మెకానిక్ మహబూబ్ బాషాకు స్పల్ప గాయాలయ్యాయి. మెకానిక్ షెడ్ పూర్తిగా కాలిపోయింది. కాగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
నీటితో మంట.. వెల్డింగ్!
మంటలు ఆర్పేందుకు ఏం కావాలి? నీళ్లుంటే సరిపోతుంది. మరి మంట పుట్టించాలంటే... వంటచెరకు మొదలుకొని అనేక పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. కానీ... యూరప్కు చెందిన ఓ పరిశోధక బృందం మాత్రం తాము నీళ్లతోనే మంటలు సృష్టిస్తామని, తద్వారా వేర్వేరు పరిశ్రమల్లో జరిగే వెల్డింగ్ పనులకయ్యే ఖర్చు తగ్గిస్తామని అంటోంది. అనడమే కాదు.. ఓ నమూనా యంత్రాన్ని తయారు చేసి వెల్డింగ్ పనులు చేసే వారికి పంపిణీ చేసి పరీక్షిస్తోంది కూడా. నీళ్లతో మంటలేమిటబ్బా అన్న సందేహం వద్దు. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్, ఆక్సిజన్లు కలిస్తేనే నీరవుతుందని మనకు తెలుసు. కాకపోతే నీటిలోని ఈ రెండు మూలకాలను వేరు చేసి వా డుకోవడంలోనే ఇబ్బందులున్నాయి. ఎలక్ట్రోలైజేషన్ అన్న ప్రక్రియ ప్లాటినమ్ వంటి ఖరీదైన పదార్థాలను వాడుతుంది. యూరోపియన్ పరిశోధక బృందం మాత్రం ఖరీదైన పదార్థాలకు ప్రత్యామ్నాయాలు గుర్తించింది. ఫలితంగా కరెంట్ సాయంతో నడిచే పోర్టబుల్ ఎలక్ట్రొలైజర్ పరికరం ‘సేఫ్ ఫ్లేమ్’ పుట్టింది. సంప్రదాయ వెల్డింగ్లో వాడే అసిటలీన్, ప్రొపేన్ వంటి వాటితో పోలిస్తే సేఫ్ఫ్లేమ్ దాదాపు 20 రెట్లు చౌక మాత్రమే కాకుండా చాలా సురక్షితమైందని పరిశోధకులు అంటున్నారు. హైడ్రోజన్, ఆక్సిజన్లు రెండూ ఎలక్ట్రోలైజర్ గొట్టం చిట్టచివరి భాగంలో మాత్రమే కలిసి మంట పుట్టిస్తాయి కాబట్టి... దీన్ని వాడటమూ సులువేనన్నది వీరి అంచనా.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement