-
పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు
సాక్షి, అమరావతి : ప్రజల్లో ఆదరణ కోల్పోయినా, పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల్లా మారాయి. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలా మంది సీనియర్ల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి ఆరు ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ, జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అయినా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర కకావికలం ఈ పొత్తులు ఖరారైతే ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జి, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు తదితర నేతల పేర్లు గల్లంతవనున్నాయి. ఎచ్చెర్లపై ఎన్నో అశలు పెట్టుకున్న కళా వెంకట్రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు ఎగిరిపోనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అశోక్గజపతిరాజు వంటి సీనియర్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకోలేక సతమతమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు తప్పని పొత్తు పోట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కీలకమైన సీనియర్లకు పొత్తు పోట్లు తప్పేలా లేవు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్ఖాన్, బొండా ఉమామహేశ్వరరావులను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడనుంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, నక్కా ఆనంద్బాబు వంటి నేతలకు షాక్ తగలనుంది. ఆలపాటి రాజా ఇప్పటికే తన సీటు పోతే ఒప్పుకునేది లేదని అనుచరులను ముందుపెట్టి హడావుడి చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియకు టాటా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పలువురు కీలక నాయకులు పొత్తుతో రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, నగరిలో గాలి భానుప్రకాష్, తిరుపతిలో సుగుణమ్మ, శ్రీకాళహస్తిలో బొజ్జల సుదీర్రెడ్డి, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, జమ్మలమడుగులో భూపే‹Ùరెడ్డి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోక తప్పదంటున్నారు. పొత్తులో బీజేపీ విశాఖ, విజయవాడ, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి గత ఎన్నికల్లో లోకేశ్ తోడల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆ సీటు బీజేపీకి పోతే ఆయన భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. విజయవాడ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో కేశినేని చిన్నికి సీటు పోయినట్లేనని భావిస్తున్నారు. జనసేన కోరుతున్న నియోజకవర్గాలు ♦ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ♦ ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ♦ ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట. ♦ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు. ♦ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు : దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం. గోదావరి జిల్లాల్లో సీనియర్ల సీట్లు గల్లంతే గోదావరి జిల్లాల్లోనూ చాలా మంది ముఖ్య నాయకుల మెడపై కత్తి వేలాడుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట సీతారామలక్ష్మి, కేఎస్ జవహర్, ఎస్వీఎస్ వర్మ వంటి వారు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తన సీటు ఉంటుందని చెప్పుకుంటున్నా దానికి గ్యారంటీ లేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీటు ఇప్పటికే ఎగిరి పోయింది. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం సీటును నిరాకరిస్తుండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం సీటు జనసేనకు పోతుండడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఇప్పటికే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వీరు కాకుండా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతక్ష్మి, ఐతాబత్తుల ఆనందరావు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు వంటి నేతలకు టికెట్లు గల్లంతవనున్నాయి. -
చంద్రబాబు కుట్రలు ఫలించవు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుందన్నారు సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం జగన్కి రెండు కళ్లు లాంటివి. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే’’ అంటూ వైవీ దుయ్యబట్టారు. ‘‘అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. కచ్చితంగా మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటాం. చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు. మా ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారు’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్ -
చంద్రబాబు చెప్తేనే పవన్కు సీటు: అడపా శేషు
తాడేపల్లి: పవన్ను నమ్మిన వారికి గతంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక్క సీటు కూడా జనసేన తీసుకోలేదని చెప్పారు. కాపులను పవన్ మోసం చేస్తున్నాడని తెలిపారు. ఒక పార్టీకి అధినేత ఎలా ఉండాలో జగన్ ను చూసి పవన్ నేర్చుకోవాలని అడపా శేషు అన్నారు. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. 'పవన్ పనైపోయింది. కాపు సోదరులారా మేల్కొనండి. లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్ ఉండదు. కాపులారా పవన్ ను చూసి మోసపోకండి. చంద్రబాబు,పవన్ మాటలు నమ్మకండి. తమ నాన్నే సీఎం అన్న లోకేష్ మాటలు పవన్ కు ఈ రోజు గుర్తొచ్చాయి. చంద్రబాబు ప్రొడ్యూసర్ ఐతే...ఆ సినిమాకు పవన్ ప్యాకేజ్ స్టార్. పవన్ కు తోడుగా ఇప్పుడు కొత్త ప్యాకేజ్ స్టార్ షర్మిలమ్మ వచ్చింది. కొత్త ప్యాకేజ్ స్టార్ వచ్చింది.. కాబట్టే పవన్ మాట్లాడటం లేదు. పవన్ ను చంద్రబాబు పక్కన పెట్టేశాడు. కాబట్టే టీడీపీ సీట్లు ప్రకటించుకుంటున్నాడు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ మీకు ఒక్క సీటు కూడా ఇప్పించలేడు.' అని అడపా శేషు అన్నారు. జనసేనలోకి ఎవరొచ్చినా పవన్ ప్రేమగా చూసుకుంటానంటున్నాడు కానీ.. సీట్లిస్తానని చెప్పడం లేదని అడపా శేషు తెలిపారు. చంద్రబాబు పాదాల దగ్గర కాపులను పవన్ తాకట్టు పెడుతున్నాడని దుయ్యబట్టారు. పవన్ కు సీటు ఎక్కడో ఈరోజుకీ చంద్రబాబు చెప్పలేదని విమర్శించారు. చంద్రబాబు వదిలేసినా.. పవన్ వదిలిపెట్టేలా లేడని వ్యంగ్యస్త్రాలు సందించారు. చంద్రబాబు చెప్తేనే పవన్ కు సీటు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దోచుకోవడానికి అవకాశం లేదు.. కాబట్టే చంద్రబాబు, పవన్కు జగన్ మోహన్ రెడ్డి శత్రువులా కనిపిస్తున్నారని విమర్శించారు. ఇదీ చదవండి: తమ్ముడు పవన్ ఇది తెలుసుకో..: మంత్రి అంబటి -
గిరిజన ద్రోహి చంద్రబాబు: ఎమ్మెల్సీ రవిబాబు ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజన ద్రోహి అని అన్నారు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు. గిరిజనుల పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, కుంభా రవిబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నాడు. గిరిజన ఎమ్మెల్యేపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు గిరిజన ద్రోహి. 14 ఏళ్లు సీఎంగా బాబు గిరిజనుల కోసం ఏం చేశాడు?. గిరిజన కార్పొరేషన్ వేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. చంద్రబాబు.. గిరిజన శాఖకు మంత్రిని ఎందుకు పెట్టలేకపోయావ్?. గిరిజనులకు బుద్ధి లేదంటావా. గిరిజనుల పేరెత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. గిరిజనులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే గిరిజనులకు మేలు చేశారు. దేశంలో ఎవరూ చేయలేనంత సంక్షేమం గిరిజనులకు సీఎం జగన్ వల్లే అందింది. మూడు లక్షల 26 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చారు. చంద్రబాబు ఒక్క ఎకరమైనా పోడు భూమి పట్టా ఇవ్వగలిగారా ?. అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేశారు. ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు ఎవరికీ రాని ఆలోచన. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్. పాడేరులో మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దే. చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారు. ఈరోజు సీఎం జగన్ చొరవతో అరకు కాఫీకి మరింత ఖ్యాతి దక్కింది. చంద్రబాబు చేతకాని తనాన్ని ప్రజలు తెలుసుకున్నారు. పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీలో గిరిజనులకు అన్యాయం చేసింది చంద్రబాబే. తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చంద్రబాబు మేలు చేశాడు. జీవో నంబర్-97ను తెచ్చింది చంద్రబాబే. గిరిజన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లు, కమ్యూనికేషన్ అభివృద్ధి చెందుతోంది. రాబోయే ఎన్నికల్లో మేమంతా ముఖ్యమంత్రి జగన్కు అండగా ఉంటాం. ఏడు అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాన్ని గెలిచి సీఎం జగన్కు కానుకగా ఇస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంపదనంతా హైదరాబాద్లో పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృత్తం కాకూడదు. పరిపాలనా వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని కామెంట్స్ చేశారు. -
పెద్దారెడ్డి టాక్స్: ‘తగ్గడంలో ఉంది మజా..!’
అదేందబ్బయ్యా అదీ.. అత్తను పుట్టింటికి తోడుకోని పోడానికొచ్చి, డైవరు యేసం గట్టి ఒక సినిమా జేసినావే.. ఆ సిన్మాలో నువ్వేదో అత్త ఎదురుగా మోకాళ్ల మీద కూలబడంగానే.. నీ తెలివితేటల గురించి ఆ ఎమ్మెస్సు ఏదో అంటాడే ఏందబ్బయ్యా అది?. ‘ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు’ అనే గదా..! అవునబ్బయ్యా.. సరైన మాటే అన్నాడు. ఆడు సినిమాలో జెప్పిన డైలాగుదేముండాది గానీ.. నువు నిజంగానే శానా శానా గొప్పోడివబ్బయ్యా.. ‘తగ్గడం’లో మజా తెలిసిన నీబోటి పొలిటీషియన్ ఇయ్యాల రేపట్లో బూపెపంచికంలోనే లేడంటే లేడు గదా!.. నిరుడు ఎలచ్చన్లు జరిగే యేళకి ఎన్ని మాటలు జెప్పినావబ్బయ్యా! ఎగిరెగిరి మాట్లాడినావు గదా.. జుట్టు ఎగదోసుకుంటా సెంద్రబాబుని తూర్పారబట్టినావు గదా! ఈ స్టేటుని నాశినం బట్టించినాడని మెడ రుద్దుకుంటా డైలాగులేసినావు గదా..! మరేటయ్యిందీ.. ఈసారి ఎలచ్చనొచ్చేపాటికి ఆయనేమో నీకు ఉన్నపళంగా దేవుడైపొయినాడా? ఆయన పల్లకీ మొయ్యాల్సిందే అని కుశాలపడతన్నావు గదా! యింతకంటె తగ్గడంలోని మజా యింకోటి యేముండబోతాది అబ్బయ్యా! పాపం.. కాపు కులపోళ్లంతా నిన్ను నమ్ముకోని రాజకీయంగా తమ కులానికేదో వైబోగం పట్టబోతాదని యిన్నాళ్లుగా కళ్లలో వత్తులేసుకోని యెదురుజూస్తాంటే.. వోళ్లందరికీ షాకు మీద షాకిచ్చినావు గదా! యే వూరికైనా పో.. నిన్ను నమ్ముకున్న కులం మనుషుల్లో ఎవురినైనా పలకరించు.. గుండెలమీద సెయ్యేసుకోని నికార్సుగా నిజం జెప్పమని అడుగు! గుండె నిబ్బరం జేసుకోని యిను. అప్పుడు జెప్తారబ్బయ్యా.. కులాన్నంతా కట్టగట్టుకోని తీసకపొయ్యి సెంద్రబాబు కాళ్లకాడ పడేస్తాండావని. ఒక్కొక్కడూ యెంతెంత కుమిలిపోతా వుండారో..? ‘సెంద్రబాబు గోరి ఎక్స్పీరియెన్సు ఈ స్టేటుకి శానా శానా గావాల.. కాబట్టి మన పార్టీ వోళ్లందరూ.. పచ్చజెండాలు ఎత్తాల.. పంచెలెగ్గట్టుకోని ఆయన పల్లకీ మొయ్యాల.. అని నంగి మాటలు జెప్పబోక! యీసారి ఎలచ్చన్లలో ఒక్క సీటైనా గెలస్తామో లేదో అనే నీ బయ్యంలో పార్టీని మటుకే కాదు అబ్బయ్యో.. కులానికి మొత్తం కడుపుమంట బెడితివే. తగ్గడం అంటే అదేననుకోవాలా యెట్టా? ఇప్పుడు లేటెస్టుగా నువ్వు తగ్గిన తమాసా వుండాదే.. అది యింకా యిచిత్రం! మొన్న మొన్నటిదాకా ఆ ముద్రగడ పెద్దాయిన నీ పరువు తీసినాడు! ‘వురేయ్ నాయినా.. ఆ సెంద్రబాబు మన కాపుల్ని బీసీ కులాల్లో పెట్టిస్తానన్జెప్పి నట్టేట ముంచినాడురా! ఆయన పంచన జేరి, ఆయన మోచేతి నీళ్లు తాగతా బతకతాండావేందిరా..’ అనేసి నిన్ను నానా మాటలూ అనేసినాడు. ఆ మాటకొస్తే సెంద్రబాబు నాయుడు ఎంత మోసకారి మడిసో, నువ్వెంత సేతగాని నాయకుడివో ఆయనంత బాగా యిడమరిసి సెప్పిన పెద్దమడిసి యింకోడు లేడంటే నమ్ము. నీ బాగోతాన్ని పేజీలు పేజీలుగా లెటర్లురాసి నడిబజార్లో బండారం బయటపెట్టేసినాడు గదా. తగుదునమ్మా అంటా యిప్పుడు బొయ్యి.. అదే పెద్ద మడిసిని వాటేసుకోబోతండావా అబ్బయ్యా! ఆ సినిమా డైలాగులో మాదిరిగా.. ‘తగ్గడం’ అంటే యేంటో, యెక్కడెక్కడ తగ్గాల్నో నిన్ను జూసే యీ పెపంచికం మొత్తం నేర్చుకోవాల గాబోలు. అదేదో సినిమాలో మన నెల్లూరు రవణా రెడ్డి పాడింది నీకు గెమనముండాదా అబ్బయ్యా..? ‘జుట్టు పట్టుకుని బయటకీడ్సినా.. సూరు పట్టుకుని యేళ్లాడీ.. దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవోడికి బలే చాన్సులే..’ అంటా రాగాలుదీసి మరీ పాడినాడు గదా! అప్పుడెప్పుడో నేను సిన్నప్పుడు సినిమానే గానీ.. అచ్చంగా యిప్పుడు నువ్వుండే సీనుకు తగ్గట్టుగానే పాడినట్టు అనిపిస్తా వుండాదబ్బయ్యా..!. అంతగా నీ సేతగానితనాన్ని అగ్నానాన్ని తిట్టిపోస్తే.. అయ్యన్నీ ఆశీస్సులే అని మురిసిపోతున్నట్టుగా.. రేపోమాపో ఆ ముద్రగడ పెద్దాయన యింటికి బొయ్యి వాటేసుకోబోతండావే.. నా పార్టీలోకి రమ్మని ఎర్రతివాచీ పరచబోతావుండావే.. తగ్గడంలో మజా తెలిసిన మగానుబావుడివి అబ్బయ్యా! స్టేజీ ఎక్కినావంటే సాలు.. సేతికి మైకు దొరికిందంటే సాలు.. దాన్సిగదరగా.. స్టేట్లో వుండే కులాల పేర్లన్నీ యేకరవు పెట్టేస్తావు. ఆల్లందరికీ రాజ్జాధికారం దక్కడం లేదంటా పెద్దపెద్ద డైలాగులు యేసేస్తావు. ఆల్లందరికీ అధికారం యిచ్చేస్తా.. అనేసి డైలాగులు కొడతావు. అక్కడికేదో సీఎం సీటు పప్పులు బెల్లాలు పంచినట్టుగా అన్ని కులాలోల్లకి పంచేస్తా అన్నట్టుగా వుంటాది నీ తమాసా! అయినా అబ్బయ్యా.. నువ్వు మోసే పల్లకీ మీద ఆ కులాల వోళ్లంతా యెక్కబోతండారా? యేందీ? సెంద్రబాబు వొక్కడే గదా? ఆ మాత్రం యింగితం నీకు లేకపోతే యెట్టా? మైకు దొరికితే వంద కులాల పేర్లు సదవతావు గానీ.. పార్టీ కాడికి, ఎలచ్చను కాడికి వొచ్చేసరికి నీకులమొక్కటే నీకు కావాల. నీ కులం ఓటు రవ్వంత కూడా సీలి పక్కకిపోకూడదనే యావ! నీ కులం ఓటు సీలిందా.. నీ రాజకీయ బతుకు సీటీ సిరిగినట్టే అని నీకు బయ్యం! అందుకే గదా.. నిన్నటిదాకా తిట్టిపోసిన పెద్దాయనకి యేం బిస్కెటు యేసినావో యేమో.. యియ్యాల పొయ్యి వాటేసుకోబోతండావు! అబ్బయ్యా.. నువ్వో సంగతి గేపకం పెట్టుకోవాల. జనం నీ మాటలు యిని యిజిళ్లు గొడతావుండారని మురిసిపోతండావో యేందో..? లోపల్లోపల కులం కార్డు యేస్తే జనం డంగైపోతారని ఆశపడతండావో యేందో? ఆ పప్పులేం వుడికేది లే! జనం యిదివరకటిలాగా యెర్రిబాగులోళ్లు కారు అబ్బయ్యా..! శానా తెలివి మీరిపోయుండారు? కులాన్ని బట్టి గాదు.. మంచి జేసే మడిసిని బట్టి ఓట్లేస్తారు! నీకేం దిగులక్కర్లేదులే అబ్బయ్యా.. ఎలచ్చను తర్వాత గ్యాప్ లు లేకుండా షూటింగులకు కాల్షీట్లు యిచ్చేసుకో.. అప్పుటికి పూర్తిగా కాళీ అయిపోతావు గదా! -నెల్లూరు పెద్దారెడ్డి.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement