-
మస్తుగా ఇసుక!
సాక్షి ప్రతినిధి విజయనగరం: వర్షాలు విస్తారంగా కురవడంతో వచ్చిన వరదల కారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలకు అంతరాయం కలిగింది. అంతేగాకుండా సరఫరాలో పారదర్శకత ఉండాలనీ... ఎలాంటి అక్రమాలకు తావుండకూడదనీ కొత్తగా ఇసుక పాలసీ తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సరఫరాలో కాస్తంత అతరాయం జరిగింది. దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని విపక్షం చూసింది. ఇదేదో ఘోర వైఫల్యం అన్నట్టు ఆందోళనలకు... విమర్శలకు తెరతీసింది. కానీ అనూహ్యంగా వారి కుట్రలను భగ్నం చేస్తూ విరివిగా రీచ్లు ప్రారంభించి... అవకాశం ఉన్న చోట స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి కావలసినంత ఇసుక అందుబాటు ధరకు సరఫరా చేయడంతో వారి గొంతులో ఇప్పుడు పచ్చివెలక్కాయ పడినట్టయింది. గత నెల 15న ఇసుక వారోత్సవాల పేరుతో జిల్లాలో ఇసుక సరఫరా మొదలుపెట్టారు. ప్రారంభంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇసుక అందించేవారు. ఇప్పుడిక ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇసుక అందుబాటులోకి రావడంతో ఆఫ్లైన్లోనే అందిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలకు నగదు చెల్లించి ఇసుక తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించారు. ట్రాక్టర్ ఇసుక ఇసుక రేటు, లేబర్ చార్జీలతో కలుపుకుని దాదాపు రూ.1600 వరకూ ఉంది. వాహనాన్ని వినియోగదారుడే తీసుకువెళితే ఈ రేటు. లేదంటే వాహనం అద్దెను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రీచ్లలో తవ్వకాల జోరు.. జిల్లాలో మొత్తం 76 ఇసుక రీచ్లుండగా వీటిలో 60 రీచ్లను తెరిచారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 1,34,577.25 టన్నుల ఇసుక సరఫరా చేశారు. డెంకాడ స్టాక్యార్డ్ నుంచి ఇప్పటి వరకూ 3156.5 టన్నులు, బొబ్బిలి స్టాక్యార్డ్ నుంచి 400 టన్నులు డెంకాడ పట్టాభూమి నుంచి 9014 టన్నులు ఇసుక విక్రయించారు. ఆదివారం ఒక్కరోజే 974 టన్నుల ఇసుకను వినియోగదారులకు అందించారు. డెంకాడ పట్టాభూముల్లో ఇసుక విక్రయాలు ఆదివారంతో ముగిశాయి. అక్కడే మరో 20వేల టన్నుల ఇసుక త్వరలోనే అందుబాటులోకి రానుంది. అధికారులు ఇప్పటికే భూమిని పరిశీలించి ప్రభుత్వ అనుమతికోసం నివేదిక పంపించారు. నిర్మాణానికి ఇక కొరత ఉండదు నిర్మాణ పనులకు ఇసుక కొత లేకుండా అవసరమైన మేరకు లభ్యతను బట్టి వినియోగదారులకు అందిస్తున్నాం. ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. రేవులకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్లు కూడా లేవు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నిటినీ అదిగమించాం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీస్, రెవిన్యూ, గనుల శాఖలతో మూడు చెక్పోస్టులు కూడా నడుపుతున్నాం. ఇకపై ఇసుకకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా -
పీవోఎస్ మెషీన్ల దిగుమతికి నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే దిశగా వ్యాపార సంస్థలు మరిన్ని పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను సమకూర్చునేందుకు ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దిగుమతి చేసుకునే పీవోఎస్ మెషీన్లకు మార్చి 31 దాకా భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) లేబులింగ్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆమోదముద్ర వేసింది. నిర్దిష్ట మోడల్ పీవోఎస్ దిగుమతికి సంబంధించి బీఐఎస్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ నంబరును ఎక్సైజ్, కస్టమ్స్ విభాగానికి సదరు వర్తకులు చూపించిన పక్షంలో క్లియరెన్స్ లభిస్తుంది. దేశీయంగా నగదు రహిత, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పీవోఎస్ మెషీన్లను దిగుమతి చేసుకుంటున్నందున ప్రత్యేక మినహాయింపు కల్పించాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను కేంద్ర ఆర్థిక శాఖ కోరిన నేపథ్యంలో తాజా సడలింపు ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా దిగుమతి చేసుకున్న పీవోఎస్ మెషీన్లకు బీఐఎస్ సర్టిఫికేషన్, లోగో తప్పనిసరి. ఇవి ఉంటేనే దేశీయంగా వాటి విక్రయాలకు కస్టమ్స్ విభాగం అనుమతినిస్తుంది. ఎస్బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో 15.1 లక్షల పీవోఎస్ మెషీన్లు ఉన్నాయి. అయితే, డిజిటైజేషన్ పెరిగే పక్షంలో అదనంగా 20 లక్షల పైచిలుకు అవసరం కావొచ్చని అంచనా.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement