-
ఉడ్ కార్వింగ్ కళాకారులపై సాక్షి స్పెషల్ రిపోర్ట్
-
కొయ్య బారుతున్న శిల్పం
తరతరాల వారసత్వం కళ సృజనకు.. సునిశిత దృష్టికి వారధి కళ సహనానికి.. దృఢ సంకల్పానికి సాక్ష్యం కళశిల్పం.. శిల్పుల పనితనానికి దర్పణం కొయ్య శిల్పం ఆధ్యాత్మిక తిమిరాల రాగం కురిచేడుకు చెందిన మాచరౌతు వంశీయులకు కళాత్మక దృష్టి ఉన్నా భవిష్యత్ తరాలకు ఈ విద్య అందించడం కష్టంగా మారుతోంది మారుతున్న కాలం చెక్క బొమ్మలను సుదూరంగా నెట్టేస్తోంది...! - కురిచేడు గుడిలో ఏ వేడుక జరిగినా.. ఆలయూలకు ఎలాంటి బొమ్మలు కావాలన్నా రాష్ర్టం నలుమూలల నుంచి స్థానికంగా నివాసం ఉండే మాచరౌతు శ్రీనివాసులు గడప తొక్కాల్సిందే. కొయ్యతో కావాల్సిన రూపాల్లో శిల్పాలను చెక్కడం ఈ వంశీయుల ప్రత్యేకత. ఉత్సవ విగ్రహాలు, స్వామివార్ల వాహనాలైన అశ్వం, పులి, సింహం, హంస, హనుమంత, గరుడ, గజ, బొల్లావుల వంటి వాటిని తయూరు చేస్తే ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే. వంశపారంపర్యంగా వస్తున్న ఈ కళను నేటికీ జాగ్రత్తగా పట్టుకొస్తున్నారు. మాచరౌతు సుబ్బరాయుడు తన తండ్రి, తాతల వద్ద నేర్చుకున్న విద్యను తన కుమారులు శ్రీనివాసులు, రాముడుకు నేర్పించారు. వీరు తయూరు చేసే కళారూపాలకు ఎంతో విశిష్టత ఉంది. చక్కనైన డిజైన్లు.. రంగులతో ముగ్ధమనోహరంగా రూపొందిస్తారు. ఇత్తడి రాకతో.. కాలంతో పాటు సంప్రదాయూల్లో కూడా కొన్ని మార్పులు వస్తున్నారుు. ప్రస్తుతం ఇత్తడి వాహనాలపై ప్రజలకు మోజు పెరగటంతో కొయ్యవాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ఎంతో ఉత్కృష్టమైన ఈ విద్య భావి తరాలకు ఎక్కడ అందకుండా పోతుందో అని కళాభిమానులు ఆవేదన చెందుతున్నారు. శ్రీనివాసులు కూడా తమ బిడ్డలు ఇదే పని చేయమని సూచించడంలేదు. జీవితంలో స్థిరపడే వృత్తిని కూడా ఎంచుకోవచ్చంటున్నారు. కాలం.. శ్రమ! ఒక్క వాహనాన్ని తయారు చేయటానికి సుమారు రెండు నెలలు పడుతుంది. దీనికి ఇద్దరు మనుషులు కావాలి. ‘ఏడాదిలో మూడు నెలలు మాత్రమే పండగల సీజన్ ఉంటుంది. విగ్రహాలను ద్రోణాచలం, తెనాలి, గుంటూరు, తదితర ప్రాంతాలనుంచి వచ్చినవారు కొంటారు. పూర్వకాలంలో ఈ బొమ్మలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోరుుంది. అందుకే వేరే పనులు కూడా చూసుకుంటున్నాం. మా తండ్రి నుంచి నేర్చుకున్న ఈ విద్యను నా సంతానానికి నేర్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అరుుతే ఈ కళనునేర్చుకునేందుకు ఎవరు ముందుకు వచ్చినా నేర్పిస్తా’ అని శ్రీనివాసులు తెలిపారు. -
చూస్తే చాలు ‘చెక్కే’స్తాడు
‘హోమ్వర్క్ చెయ్యని వాళ్లు చేతులెత్తండర్రా’... మాస్టారు గద్దించారు. క్లాసులో ఒకే ఒక్కడు చెయ్యెత్తాడు. శిక్షగా మోకాళ్ల కుర్చీ వేయించారు. మాస్టారు పాఠం ప్రారంభించారు. అంతా శ్రద్ధగా వింటున్నారు. ఆ కుర్రాడు మాత్రం గోడపై దేశ నాయకుల చిత్రపటాల్ని చూస్తూనే ఉన్నాడు. ఇంటికెళ్లాక పెన్సిల్తో బాపూజీ, నెహ్రూ చిత్రాలను అద్భుతంగా గీయడం మొదలెట్టాడు. చెక్కపై చెక్కితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా చెక్కడం మొదలెట్టాడు. చూడ‘చెక్క’ని కళాకారునిగా ఎదిగాడు. అపురూప చిత్రాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అతనే అనకాపల్లికి చెందిన వుడ్ కార్వింగ్ కళాకారుడు వల్లివిరెడ్డి శ్రీనివాసరావు. అనకాపల్లిలోని నెహ్రూచౌక్ కూడలిలో ఒక సెల్ఫోన్ సర్వీసింగ్ కేంద్రం ఉంది. అక్కడికెళ్తే మూగనోము పట్టిన సెల్ఫోన్లను మాట్లాడించడంలో నిమగ్నమైన శ్రీనివాసరావు కనిపిస్తాడు. కాసేపయ్యాక సర్జికల్ బ్లేడు అందుకుంటాడు. కలపను సజీవ స్వరూపాలుగా తీర్చిదిద్దుతాడు. ఫొటో ఇస్తే అచ్చు గుద్దినట్టు చెక్కపై చిత్రాన్ని చెక్కుతాడు. కలపతో 800 చిత్రాలు లక్ష్మణరావు, మునెమ్మ దంపతుల ఎనిమిదో సంతానం శ్రీనివాసరావు. తండ్రి సమరయోధుడు. టెన్త వరకూ చదువుకున్న శ్రీనివాసరావు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులపై దృష్టి సారించలేకపోయాడు. సెల్ మెకానిక్గా జీవనోపాధి పొందుతూ ఉడ్ కార్వింగ్లో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. దేవతామూర్తులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఆలయాల చిత్రాలను రూపొందించడంలో ప్రతిభావంతుడు. సూక్ష్మ కళాఖండాల సృష్టికర్త ఉడ్కార్వింగ్తో అద్భుతాలు సృష్టిస్తున్న శ్రీనివాసరావు పప్పులు, పంచదార పలుకులు, పసుపు కొమ్ముల్నీ వదలడు. అతని చేతుల్లో పంచదార పలుకు షిరిడి సాయిగా మారిపోతుంది. పసుపు కొమ్ము వినాయకుడిగా ఊపిరి పోసుకుంటుంది. గోధుమ గింజ శివలింగమై పూజలందుకుంటుంది. బియ్యం గింజ నందీశ్వరుడిగా రంకెలేస్తుంది. పసుపు కొమ్ములపై 108 రూపాల్లో వినాయకుడి రూపాన్ని చెక్కి ప్రశంసలు పొందాడు. మోదీని కలవాలని... ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన తన తల్లితో మాట్లాడుతున్నట్టుండే చిత్రాన్ని చెక్కాడు. దాన్ని స్వయంగా మోదీకి అందజేయాలన్నది శ్రీనివాసరావు అభీష్టం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అమెరికా మంత్రి పెన్నీ ప్రిజ్కర్కు బహూకరించిన మోదీ-ఒబామాల జ్ఞాపిక శ్రీనివాసరావు చెక్కినదే. వైఎస్, చంద్రబాబు, చిరంజీవి, కృష్ణ, మహేష్బాబు, అబ్దుల్కలాం తదితర ఎందరో ప్రముఖుల చిత్రాలు, బొమ్మలు, పక్షులు, జంతువుల రూపాలకు జీవం పోశాడు. ‘‘ఉడ్కార్వింగ్ చేసిన అల్లు రామలింగయ్య చిత్రాలను ఆయన కొడుకు అల్లు అరవింద్, సినీనటుడు చిరంజీవికి అందజేశాను. ఆ చిత్రాలను చూసి వారెంతో అభినందించారు’’ అని చెప్పాడు శ్రీనివాసరావు. ఒక్కసారి చూస్తే చాలు... ‘‘ఫొటోలు, పెయింటింగులు ఎంతో కాలం ఉండవు. చెక్కతో చేసినవి చిరకాలం మన్నుతాయి. చెక్కిన తర్వాత పెయింటింగ్, పాలిషింగ్, ఫ్రేమ్ వర్క్ సక్రమంగా చేసేవరకూ ఆ ప్రక్రియ యజ్ఞంలా సాగుతుంది. అప్పుడే ఆ చిత్రానికి నిండుదనం వస్తుంది’’ అన్నాడు శ్రీనివాసరావు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా బుక్ ఆఫ్ స్టేట్ రివార్డ్స్ వారు ‘సృజనపుత్ర’ అవార్డును అందజేశారు. హైదరాబాద్కు చెందిన సంఘమిత్ర సంస్థ ‘విజయపుత్ర’ అవార్డుతో సత్కరించింది. తాజాగా మార్వ్లెస్ గిన్నిస్, హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులను కూడా అందుకున్నాడు. గిన్నిస్ బుక్లో చేరడమే లక్ష్యం ఇప్పటి వరకూ కలపతో 800 చిత్రాలను చేశాను. వెయ్యి కళాఖండాలను రూపొందించి గిన్నిస్బుక్లో నమోదు కావాలన్నదే నా లక్ష్యం. చెక్కను చిత్రంగా మలచడానికి ఒక్కొక్కసారి నాలుగైదు రాత్రులపాటు నిద్ర ఉండదు. చిత్రం తయారయ్యాక అప్పటి వరకూ పడిన కష్టం మరచిపోతాను. - వల్లివిరెడ్డి శ్రీనివాసరావు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం
పాఠశాలలు తెరిచే నాటికి పనుల పూర్తి
అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
కేటీపీఎస్ గేమ్స్ సెక్రటరీగా టి.మహేశ్
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
మనమే అభివృద్ధి చేసుకుందాం..
సకుటుంబ సపరివార సమేతం
బీటీపీఎస్ కీర్తి ప్రతిష్టలు పెంచాలి
వంద కేజీల గంజాయి స్వాధీనం
పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీ
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement