-
‘ఉపాధి’కి లింక్
ఎండనకా, వాననకా ఉపాధి పనులు చేసిన కూలీలు సకాలంలో నగదు అందక అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. గతంలో పే స్లిప్లు ఇచ్చి పోస్టాఫీస్లో నగదు తీసుకునే సమయంలో బాగుండేదని, ఇప్పుడు బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ పెట్టడంతో ఎక్కడ చెల్లింపులు చేస్తున్నారో తెలియడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు రూ.2 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. చిల్లకూరు(నెల్లూరు): జిల్లాలోని 46 మండలాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. 2016 నుంచి 2018వ సంవత్సరం వరకు జరిగిన పనుల్లో కూలికి వెళ్లిన వారిలో సుమారు 19,440 మంది ఖాతాలు సస్పెన్షన్లో ఉండడంతో నగదు చెల్లింపులు జరగలేదు. దీనికి కారణం ఖాతాలకు ఆధార్, జాబ్కార్డులు లింక్ చేయకపోవడమే. కొందరికీ అసలు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో రూ.2.03 కోట్లకు పైగా నగదు ఎక్కడ ఉందనే విషయం తెలియడం లేదు. అలాగే తిరస్కరణ పేరుతో రెండు సంవత్సరాలుగా 22,842 మంది కూలీల నగదు కూడా రూ.35 లక్షలు పైగా ఉంది. 21,173 మంది కూలీలకు సంబంధించి రూ.1.92 కోట్లకు పైగా పెండింగ్లో ఉంది. ఈ మొత్తం కూలీలకు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు మాత్రం ఈ పని క్షేత్ర స్థాయిలోనే జరగాలని చెబుతున్నారు. అక్కడి అధికారులు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తప్పించుకుంటున్నారు. అధికారుల తీరే కారణం అధికారులు తీసుకునే నిర్ణయాలు కూలీల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. జాబ్కార్డులో కుటుంబంలోని వారిలో ఎవరో ఒకరు పనికి వెళతుంటారు. ఒకరికి ఖాతా ఉంటే వారి ఖాతాలో నగదు చెల్లింపులు చేయవచ్చు. అయితే ప్రతిఒక్కరికీ బ్యాంక్ ఖాతా అవసరమని చెప్పడంతో కొందరికి వేలిముద్రలు సక్రమంగా లేకపోవడంతో ఆధార్ లింక్ కావడం లేదు. దీంతో వారు ఖాతా ప్రారంభంచలేకపోతున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్, జాబ్కార్డులు అనుసంధానం చేయించాల్సిన బాధ్యత అధికారులదే అయినా పట్టించుకోవడం లేదు. ఖాతాలను ఆఖరుగా భారత జాతీయ చెల్లింపుల సంస్థకు అనుసంధానం చేస్తేనే కూలీలకు నగదు చెల్లింపులు జమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇందుకు బ్యాంకు అధికారులతో ఉపాధి హామీ అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించి కూలీలకు నగదు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆధార్ లేక ఖాతా తెరవలేదు ఏడాదిగా ఉపాధి పనికి వెళుతున్నా. అయితే ఒక్క రూపాయి కూడా చేతికందలేదు. ఆధార్ తీయించుకునేందుకు వెళితే వేలిముద్రలు పడలేదని చెబుతున్నారు. దీంతో బ్యాంకు ఖాతా చేయించుకోలేకపోయా. పనికి వెళుతున్నా డబ్బు అందడం లేదు. – గడ్డం మణెయ్య, కలవకొండ ప్రతిరోజూ సమీక్ష చేస్తున్నాం జిల్లాలోని ప్రతి ఏపీఓతో సస్పెన్షన్ ఖాతాల విషయంపై రివ్యూ చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అన్ని ఖాతాలకు సంబంధించిన నగదు చెల్లింపులను 15 రోజుల్లో చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో కంప్యూటర్ ఆపరేటర్లు ఆధార్, జాబ్ కార్డు లింక్ చేయాలని ఆదేశించాం. – బాపిరెడ్డి, పీడీ, డ్వామా -
కష్టఫలమేది?
పిట్లం, న్యూస్లైన్: ‘‘ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పనిలేని పేదలకు పనులు కల్పిస్తున్నాం.. ఇందుకు సంబంధిం చిన కూలి డబ్బులు వారంలోగా చెల్లిస్తున్నాం’’ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో దానిని అమలు చేయడంలో విఫలమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణం. ఫలితంగా ఉపాధి పనులు జరిగి నెలలు గడుస్తున్నా కూలీలకు డ బ్బులు అందడం లేదు. వారు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి, తిరిగి వేసారిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పిట్లం మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి పనులు జరిగాయి. చాలా గ్రామాలలో కూలీల కు డబ్బులు చెల్లించారు. గోద్మేగాం, రాంపూర్ కలాన్, చిన్నకొడప్గల్, కారేగాం, మార్దండ గ్రామాల కూలీల కు మాత్రం ఇప్పటికీ కూలి డబ్బులు అందలేదు . అప్ప టి టెక్నికల్ అసిస్టెంట్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్య ఏర్పడింది. ఈ ఐదు గ్రామాలలో సుమారు రెండు నుంచి మూడు వారాలపాటు పనులు జరిగాయి. కూలీలకు దాదాపు 70 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అప్పుడు టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేసిన జ్ఞానేశ్వర్ పనికి సంబంధించిన మస్టర్లు సక్రమంగా నమోదు చేయలేదు. దీంతో చెల్లింపులు నిలిచిపోయాయి. చెమటోడ్చి కష్టపడి పనిచేసిన కూలీలు మాత్రం లబోదిబోమంటున్నారు. అధికారులకు ఈ విషయం గురించి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 220 బృందాలలో ఒక్కొక్కరికీ రూ. 1600 నుంచి రూ. 2వేల వరకు రావాల్సి ఉంది. ఒక్కో బృందంలో పది నుంచి ఇరవై మంది వరకు కూలీలు ఉన్నారు. ‘ఉపాధి’ చట్టం ఏం చెబుతోంది ఉపాధి హామీ పథకం చట్టం పకడ్బందీగానే ఉంది. ఉపాధి పనులు చేసిన కూలీలకు 15 రోజులలో కూలీ చెల్లించాలనే నిబంధనలున్నాయి. అధికారులు వీటిని తుంగలో తొక్కారు. కూలీల ఆశలపై నీళ్లు చల్లారు. దరఖాస్తు చేసుకున్నవారికి పని కల్పించడంలో విఫలమైతే 25 శాతం కూలీ చెల్లిస్తామన్న అధికారులు, ఈ విషయంలో ఎందుకు బిల్లులు చేయడం లేదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెండింగ్లో ఉంటే ఎలా జీవించాలని ఆవేదన చెందుతున్నారు. బాధ్యులపై చర్యలేవీ? అపుడు ఈ పనులను సంబంధించి మస్టర్లు తయారు చేసిన టెక్నికల్ అసిస్టెంట్ జ్ఞానేశ్వర్ ఆ తర్వాత ఉద్యోగం మానేశారు. ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులూ పట్టించుకోలేదు. బాధ్యులపై ఎలాంటి చర్యలూ లేవు. ఇపుడూ, అపుడూ అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే, సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం ఎవ్వరూ చొరవ చూపడం లేదు. డబ్బులు చెల్లిస్తం -అప్రీం, ఈజీఎస్ ఏపీఎం గతంలో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్ పొరపాటుతో ఇలా జరిగింది. ఈ విషయాన్ని డ్వామా పీడీ, జిల్లా కలెక్టర్తోపాటు, ఈజీఎస్ రాష్ట్ర డెరైక్టర్ దృష్టికీ తీసుకెళ్లాం. త్వరలోనే కూలీలకు డబ్బులు చెల్లిస్తాం. వాళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తాం. బైట పనులు చేసినా పైసలొచ్చేవి ‘ఉపాధి’ కూలి పైసలు తొందరగా వస్తాయనుకున్నం. పనులు జరిగి నెలలు కావస్తున్నా రావడం లేదు. దీని కంటే బయట పని చేసినా పైసలు వచ్చేవి. ఒక్క టెక్నికల్ అధికారి పొరపాటుకు మేం ఎన్ని రోజులు బాధలు భరించాలి. అధికారులు దృష్టి సారించాలి. - శ్రీరాముల రాములు, గౌరారం ఎప్పుడూ ఇట్ల జరగలేదు రాంపూర్ గ్రామ సర్పంచ్గా పని చేసిన నేను ఉపాధి కోసం పనులకు వెళ్లాను. గతంలో ఎన్నో పనులను చేయించినా ఇలా జరగలేదు. లేకనే కూలికి వెళ్తున్నాం. సమ యానికి డబ్బులు రాకపోతే, ఎంతమంచి పథకం ఉన్న ఏం ప్రయోజనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలీల డబ్బులు చెల్లించాలి. -సార నారాయణ, గౌరారం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement