-
ప్రపంచ యూత్ ఆర్చరీ నుంచి తప్పుకున్న భారత్
ఆటగాళ్లకు వీసా నిరాకరించిన అమెరికా న్యూఢిల్లీ : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్స్ నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇందులో పాల్గొనాల్సిన 31 మంది ఆర్చర్ల బృందంలో 20 మందికి యూఎస్ ఎంబసీ వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు దక్షిణ డకోటాలోని యాంక్టాన్లో ఈ టోర్నీ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నేడు (శనివారం) జట్టు అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఏడుగురు ఆర్చర్లు, ఇద్దరు కోచ్లు, ఒక సాయ్ అధికారికి మాత్రమే వీసా మంజూరయ్యింది. ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసిన వీసా అధికారి అంతగా సంతృప్తి పడలేదని, వీరంతా అక్కడికి వెళ్లి తిరిగి రారేమోనని రిజెక్ట్ చేసినట్టు భారత ఆర్చరీ సంఘం కోశాధికారి వీరేందర్ సచ్దేవ తెలిపారు. ‘వీసా నిరాకరణకు నిరసనగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నాం. మరోసారి వీసా కోసం అప్లై చేసుకున్నప్పటికీ ఏఏఐ అధ్యక్షుడు వీకే మల్హోత్రా సూచన మేరకు వైదొలిగేందుకు నిర్ణయం తీసుకున్నాం’ అని సచ్దేవ పేర్కొన్నారు. -
యూఎస్ వీసా నిరాకరణ..భారత ఆటగాళ్లకు షాక్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఈవెంట్లో పాల్గొననున్న భారత ఆటగాళ్లకు ఇక్కడి అమెరికా ఎంబసీ వీసా నిరాకరించింది. మొత్తం 30 మంది ఆటగాళ్లకుగాను 10 మందికి వీసా ఇచ్చింది. ఇందుకు నిరసనగా భారత్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని భారత్ ఆర్చర్ల సమాఖ్యకు చెందిన ఓ అధికారి వీరెందర్ సచ్దేవా వెల్లడించాడు. దక్షిణకొరియా కోచ్ చే వోమ్ లిమ్ కూడా బాధితులలో ఒకరు. అండర్-20 విభాగంలో బాలికలు, బాలురు దక్షిణ దకోటాలోని యాంక్టన్ లో జరగనున్న పోటీలలో పాల్గొనాల్సి ఉండగా, ఈ విషయం వారికి షాకిచ్చింది. జూన్ 8 నుంచి 14 వరకు జరిగే ఈ ఈవెంట్కి భారత ఆర్చర్లు శనివారం అమెరికా బయలుదేరాల్సి ఉండగా ఎంబసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఏడు మంది ఆర్చర్లకు, ఇద్దరు కోచ్లకు, మరోక సభ్యునికి వీసా సదుపాయాన్ని కల్పించింది. ముగ్గురు భారత్ కోచ్లు మిమ్ బహదుర్ గురుంగ్, చంద్రశేఖర లాగురీ, అవదేశ్లకు వీసా రాలేదు. ఇంటర్వ్యూలో ఆటగాళ్ల సమాధానాలు సంతృప్తికరంగా లేనందున ఎంబసీ అధికారి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని భారత ఆర్చరీ సమాఖ్యకు చెందిన ఓ అధికారి వీరెందర్ సచ్డేవా తెలిపారు. ఆ ఆటగాళ్లు ఇండియాకి తిరిగి వస్తారో లేదోనని సందేహించాడని కూడా ఆయన చెప్పారు. కానీ చాలా మంది ఆర్చర్లు అస్సాం, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలవారే కావడం గమనార్హం. వారికి భావవ్యక్తీకరణ నైపుణ్యంతో పాటు, ఇంగ్లీష్ అంతగా రాదని వీరెందర్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో పర్యటించిన కోచ్ లిమ్ నిరాకరణకు గురవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వీరేందర్ అన్నాడు. అమెరికా ఆర్చరీ సమాఖ్య ఆహ్వానం మేరకు, భారత ఆర్చరీ సంఘం ఎంపిక చేసిన ఆటగాళ్లను పంపినా ఇలా జరగడం బాధాకరమన్నాడు. యూఎస్ ఆర్చరీ సమాఖ్య సలహా మేరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని వీరెందర్ సచ్దేవా తెలిపాడు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
ఓటమి భయం.. ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి
అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి
అనుకున్నట్లే అయింది.. ఏపీలో కూటమిని ముంచేసిన..
లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
రష్మిక వీడియో వైరల్.. ఏకంగా ప్రధాని స్పందించేలా చేసింది!
రైజింగ్ స్టార్: 16 ఏళ్లకే రూ.100 కోట్ల ఏఐ స్టార్టప్
స్థల వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్
తప్పక చదవండి
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్పోర్టుకు..
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
- కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement