-
టెన్త్ జవాబు పత్రాలు @ రూ.8,500
పట్నా: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను చెత్తతో కలిపి అమ్మేశారు కొందరు ఘనులు. బిహార్లోని గోపాల్గంజ్ లోని ఓ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్ట్రాంగ్ రూమ్లో భద్ర పరిచిన సుమారు 40 వేల జవాబు పత్రాలు కనిపించకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల నైట్వాచ్మన్ పూజన్ సింగ్, ప్యూన్ చిట్టు సింగ్లను అరెస్టు చేసి విచారించారు. విచారణలో అవి ఓ చెత్త కొనుగోలు డీలరు పప్పు కుమార్ గుప్తాకు రూ.8,500కు అమ్మేసినట్లు తేలింది. -
తెలుగుకు ‘చైతన్యం’
బోరివలి, న్యూస్లైన్: బోరివలి తూర్పు రాజేంద్రనగర్లో ‘బి.ఎల్. చాట్లాన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగు చైతన్య ఉన్నత పాఠశాల మంగళవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో 89 శాతం మార్కులు సాధించి, ముంబైలోని తెలుగు పాఠశాలలన్నింటి కన్నా ముందంజలో నిలిచింది. స్కూల్ టాపర్గా బాస శ్రీకాంత్ (89 శాతం), ఇసర్ల రవీంద్ర (77 శాతం) ద్వితీయ స్థానంలో, ఎజెల్లి సునీత (73 శాతం)తో తృతీయస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ చాట్లా గంగాధర్ మాట్లాడుతూ....ముంబైలో మొదటి తెలుగు ఉన్నత పాఠ శాల బోరివలిలోని బృహన్ ముంబై మహానగర పాలిక ఆధ్వర్యంలో ఒకటో తరగతి నుండి 7వ తరగతి వరకు మాత్రమే విద్యాబోధన జరుగుతుండేదన్నారు. ఆ పై చదువులు చదవాలంటే ఇంగ్లిష్ మీడియం చదవాల్సి వచ్చేది. లేదంటే విద్యార్థులు చదువు మానేసేవారు. అందుకే పేదవిద్యార్థులు పై చదువులు చదువుకునేలా తోడ్పడేందుకు 2004లో 8వ తరగతి ప్రారంభించామన్నారు. తర్వాత 9,10 క్లాసులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రభుత్వపరంగా గాని, ఇతర సంస్థల నుంచిగాని ఎటువంటి సాయం పొందకుండానే పదేళ్లుగా పాఠశాలను విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు. ప్రభుత్వం చొరవ చూపితే పేదవిద్యార్థులకు మెరుగైన విద్య లభించడంతోపాటు, సిబ్బందికి సైతం ఆర్థికవెసులుబాటు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి ఫలితాల సాధన కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను సైతం తీసుకుంటున్నామన్నారు. అలాగే ఆటస్థలం లేకపోవడం వల్ల పక్కనున్న మైదానానికి అద్దె చెల్లించి పిల్లలకు క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నామని గంగాధర్ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ జాగృతి మాట్లాడుతూ స్థానిక తెలుగు సంఘాల నాయకులు ఎవరైనా పాఠశాలలో చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజుల చెల్లించేందుకు ముందుకువస్తే, వారి భవిషత్తును తీర్చిదిద్దినవారవుతారని అభిప్రాయపడ్డారు. భివండీకే తలమానికం ‘వివేకానంద’.. భివండీ, న్యూస్లైన్: పదోతరగతి పరీక్షా ఫలితాల్లో పద్మనగర్ ప్రాంతానికి చెందిన వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ హ్యాట్రిక్ సాధించి సత్తాచాటింది. పట్టణవ్యాప్తంగా వందశాతం ఫలితాలు సాధించిన ఆరు పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో ఈ పాఠశాలను ప్రారంభించారు. స్కూల్ టాపర్గా గుంటుకుల ప్రియాంక (93.6 శాతం), ద్వితీయ స్థానంలో దూస శ్రీలత (84.6 శాతం), తృతీయ స్థానంలో మడుత సాగర్ (84.4 శాతం) నిలిచారు. ఈ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు గాజెంగి కృష్ణ మాట్లాడుతూ.. ఇక్కడ స్థిరపడిన మధ్య తరగతి తెలుగు ప్రజల కోసం ఈ సంస్థను ప్రారంభించామని అన్నాడు. మున్ముందు జూనియర్ కళాశాల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని సూచించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్యకై తమ వంతు సహకారాలు అందిస్తానని శిక్షణ్ మండలి సభాపతి రాజు గాజెంగి హామీ ఇచ్చారు. కార్యక్రమానికి సంస్థ ఉపాధ్యక్షుడు నోముల శేఖర్, కార్యదర్శి లత మంగళారపు, అవదూత బలరామ్, గాలిపెల్లి మారుతి, మంగళారపు భాస్కర్తో పాటు ప్రధానోపాధ్యాయులు గాజుల ఉమారాణి, అర్దాకర్ అశ్విని, పూజారి జయశ్రీ తదితరులు హాజరయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement