-
ప్రొద్దుటూరులో ఎన్నికల శంఖారావం పూరించిన వైఎస్ఆర్సీపీ
-
కార్మికుల గురించీ ఆలోచించండి
లోక్సభలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎన్ని కార్మిక చట్టాలున్నా.. వాటి అమలుపై పర్యవేక్షణ లేదు చట్టాల అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి సాక్షి, న్యూఢిల్లీ: కార్మికులు, ఉద్యోగులు చట్టబద్ధమై న కనీస హక్కులకు కూడా నోచుకోవడం లేదని, కేంద్ర కార్మిక సంక్షేమ చట్టాల అమలుపై దృష్టి పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వై.ఎస్.అవినాశ్రెడ్డి కేంద్రాన్ని డిమాం డ్ చేశారు. కార్మికులు నిర్దేశిత పని గం టలకు మించి పనిచేస్తున్నప్పటికీ తగిన వేతనం లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టం(రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై శుక్రవారం జరి గిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘‘యాజమాన్యాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు ఈ బిల్లు తెస్తున్నారు. గతంలో 19లోపు ఉద్యోగులు కలిగిన సంస్థలకే ఈ రిటర్నుల దాఖలు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయిం పులు వర్తించేవి. ఇప్పుడు ఆ సంఖ్యను 40గా మార్చారు. యాజమాన్యాల కోసం ఉద్యోగుల సంఖ్యలో మార్పులు చేసిన ఈ బిల్లు.. ఒకవేళ యాజమాన్యాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే ఆ మేరకు విధించాల్సిన జరిమానాలు మాత్రం పెంచలేదు. ఉద్యోగుల సంఖ్యను 19 నుంచి 40కి పెంచిన కేంద్రం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల చాలా మూల దనం, ఎక్కువ టర్నోవర్, ఎక్కువ లాభాలు ఉన్న సంస్థలు కూడా 20కి తక్కువగా ఉద్యోగులను నియమించుకుంటున్న దాఖలాలు ఉన్నాయి’’ అని అవినాశ్ గుర్తుచేశారు. ఈ బిల్లుపై స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవడం మంచిది’’ అని పేర్కొన్నారు. కేంద్రం కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు పూర్తి దృషి ్టపెట్టాలన్నారు. ఇప్పటివరకు కార్మికులకు మేలు కలిగించగలిగిన పాత చట్టాలను పలుచన చేయకుండా చూడాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement