-
ప్రాణాలు తీసిన ఓవర్టేక్
కణేకల్లు : ఓవర్ టేక్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వేగంగా బైక్ నడుపుతూ ముందు వెళుతున్న ఆటోను ఓవర్టేక్ చేసి కిందపడిన వారిపై ట్రాక్టర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఎస్ఐ యువరాజు కథనం మేరకు.... కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన కుమ్మరి సంజీవప్ప (34) నిరుపేద రైతు. రెండేళ్ల క్రితం ఇతను డి.హిరేహళ్ మండలం గొడిశెలపల్లికి కుటుంబాన్ని మార్చాడు. తహసీల్దార్ కార్యాలయంలో పని నిమిత్తం ఉదయం కణేకల్లుకు వచ్చాడు. సాయంకాలం 6గంటల సమయంలో పని పూర్తి కావడంతో స్వగ్రామానికి బయలుదేరాడు. తనకు బాగా తెల్సిన గోపులాపురానికి చెందిన సన్నకారు రైతులు యల్లప్ప (32), హనుమంతరాయుడు (38)లు కూడా తహసీల్దార్ కార్యాలయానికొచ్చారు. కణేకల్లుక్రాస్ వరకు ద్విచక్ర వాహనంలో వస్తానని చెప్పడంతో సంజీవప్ప తన ఎక్స్ఎల్ సూపర్ బైక్లో యల్లప్ప, హనుమంతరాయుడులను ఎక్కించుకొని తహసీల్దార్ కార్యాలయం నుంంచి బయలు దేరాడు. ఆలూరు గ్రామం దాటాక చిన్న ఆటోను ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఆటో వెనుకభాగంలో ద్విచక్ర వాహనం తగిలి కింద పడ్డారు. అదే సమయంలో కణేకల్లుక్రాస్ నుంచి ఆలూరుకు వస్తున్న ట్రాక్టర్ వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో సంజీవప్ప, యల్లప్పత లలు పగిలి అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన హనుమంతరాయుడును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ యువరాజు, తహసీల్దార్ ఆర్.వెంకటశేషు ఘటన స్థలాన్ని పరిశీలించారు. యల్లప్పకు భార్య సుశీలమ్మతోపాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. సంజీవప్పకు భార్య ప్రమీలమ్మ ఇద్దరు కొడుకులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరు పీయూసీ విద్యార్థుల దుర్మరణం
ప్రాణాలు తీసిన వేగం బైక్పై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ప్రమాదం శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాన్వి, న్యూస్లైన్ : ద్వితీయ పీయూసీ పరీక్ష రాసేందుకు మాన్వికి వెళుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులను తాలూకాలోని హిరేకొట్నేకల్కు చెందిన అజీం(18), యాపలపర్వికి చెందిన యల్లప్ప(18)గా గుర్తించారు. వీరు ఇక్కడకు సమీపంలోని నసలాపుర క్రాస్ వద్ద రాష్ట్ర రహదారిలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతుండగా, మలుపులో వంతెన వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. పోత్నాళలోని మహర్షి వాల్మీకి పీయూ కాలేజీలో చదువుతున్న వీరికి మాన్విలోని బాలికల ప్రభుత్వ పీయూ కాలేజీని పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష ప్రారంభమయ్యేలోపు కేంద్రానికి చేరుకోవాలనే ఆత్రుతలో వేగంగా బైక్పై వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సీఐ హరీష్, ఎస్ఐ దీపక్ బూసరెడ్డి తమ సిబ్బంది తో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మహర్షి కాలేజీ పాలక మండలి, విద్యార్థుల స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement