-
మెకార్తీయిజం–ఎల్లో జర్నలిజం
హిట్లర్ ప్రభుత్వంలో ప్రసార మంత్రిత్వశాఖను నిర్వహించిన ‘జోసెఫ్ గోబెల్స్’ పేరు అబద్ధపు ప్రచారాలకు పర్యాయ పదమై నిలిచింది. జనంలో ప్రచార మాధ్యమం ఎంత బలమైనదో అర్థం చేసు కున్నాడు జోసెఫ్ గోబెల్స్. వ్యక్తి (హిట్లర్) ఆరాధన పెంపొందించడానికీ, ప్రజా భిప్రాయాన్ని తారుమారు చేయడానికీ, తప్పుడు వార్తలను నిజాలుగా నమ్మించడానికీ ప్రచార, ప్రసార మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించాడు గోబెల్స్. తదనంతర కాలంలో దారుణంగా అపఖ్యాతి పాలయ్యాడు. అప్పటినుంచి ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే దానిని ‘గోబెల్స్’ ప్రచారంగా అభివర్ణించడం పరిపాటి అయింది. తెలుగు నాట గోబెల్స్ వారసులు బయల్దేరి అచ్చం గోబెల్స్ వలె చంద్రబాబు, లోకేష్ బాబుల ఇమేజ్ పెంచడానికి, జగన్ మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ దిగజారుడు జర్నలిజంలో గోబెల్స్ను మించి, కొత్త అంకానికి తెరతీశారు. అదే ‘మెకార్తీయిజం’. అర్థంలేని భయాలను సృష్టించి జనాల్ని కలవరపాటుకు గురి చేయడం, తమ ప్రత్యర్థులను జనాలకు భూతద్దంలో చూపి భయ పెట్టడం, తాము నమ్ముకున్న వాళ్లను రక్షకులుగా చూపించడం మెకార్తీ జర్నలిజం. అసలేమిటీ ‘మెకార్తీ జర్నలిజం’ అని రేఖా మాత్రంగా పరిశీలిస్తే చంద్రబాబు అను‘కుల’ మీడియా ప్రచారాల తంతు అర్థం అవుతుంది. 1950వ దశకంలో అమెరికా సెనేటర్ జోసెఫ్ మెకార్తి కమ్యూనిజాన్ని బూచిగా చూపిస్తూ, కమ్యూని స్టులపై పోరాడే అలుపెరుగని వీరుడిగా ఆదిలో పేరుగాంచాడు. అయితే ఆ తర్వాత జనం చీత్కారాలకు గురై రాజకీయాల నుంచి బహిష్కృతుడయ్యాడు. అమెరికా–రష్యాల మధ్య ఆధిపత్య పోరు నడి చిన రోజులవి. ఆ సమయంలో మెకార్తి మీడియాలో కమ్యూనిస్టులు దేశంలోకి చొరబడ్డారని భయపెట్టి వార్తలు విస్తృతంగా ప్రచారం చేసేవాడు. తనకు గిట్టని వాళ్లను ‘అన్ అమెరికన్’ అని ముద్ర వేశాడు. అతడి శాడిజానికి నిజాయితీగా పనిచేసే జర్నలి స్టులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అతడు పని చేసిన కాలాన్ని ‘రెడ్ స్కేర్’ అని పిలిచేవారు. లేని దాన్ని ఉన్నట్టు బీభత్సంగా ప్రచారం చేసే జర్నలిజం ‘మెకార్తీ యిజం’గా పేరుపడింది. ఇప్పుడు మన తెలుగు నాట చంద్రబాబునాయుడి మీడియా బృందం చేస్తున్నది అదే! ‘కామెంట్ ఈజ్ ఫ్రీ’ బట్ ట్రూత్ షుడ్ బీ శాక్రెడ్’ అంటాడు సంపాదకీయాలకు ఓంప్రథమంగా శ్రీకారం చుట్టిన ప్రఖ్యాత సంపాదకుడు థామస్ బార్జ్. కానీ ఈ సూత్రానికి తెలుగునాట ఒక వర్గం మీడియా ఎప్పుడో తిలో దకాలు ఇచ్చింది. వ్యాఖ్య ఏదైనా చేయవచ్చు. అందులో సత్యం ముత్యం అంత స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి అని బార్జ్ చెప్తే, ‘వ్యాఖ్య ఏదైనా చేసెయ్! అందులో వాస్తవాలతో పని లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం ఉండాలి. మాంచి మసాలా దట్టించిన గుత్తి వంకాయ కూరలాగా, ఇంకా ఘాటుగా ఉండాలంటే చికెన్ 65 లాగా స్టోరీ వండాలి. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ శెహ బాష్! అనే విధంగా ఉండాలి. వార్త వేరు వ్యాఖ్య వేరు అనుకోవద్దు. ఇప్పుడు మన పాలసీలో వ్యాఖ్యే వార్త’ అనే ఆదేశాలు ఇచ్చే స్థితికి దిగజారాయి బాబు భజన బృందాలు. వేయవల సిన వార్తలు ఉంటే లోపలి పేజీలో సింగిల్ కాలమో, డబుల్ కాలమో వేయాలి. ‘కిక్ ఇచ్చే వంటకాలే బ్యానర్ స్టోరీలు’... ఇదే నయా జర్నలిజం. అయితే ప్రజలకు ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఎప్పుడో అర్థమై పోయింది. అందుకే చంద్ర బాబు నాయుడుని 23 సీట్లకు పరిమితం చేశారు. అర్థం కానిదల్లా చంద్రబాబు నాయుడికీ, ఆయన తనయుడు లోకేష్కే! అసత్య ప్రచారాలకు మోసపోయే అపరిణత మనస్కులు కారు మన ఆంధ్రులు అని మరొకసారి చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. అందుచేత నయా గోబెల్స్లను, మెకార్తీలను తరిమికొట్టడానికి ‘సిద్ధం’ కండి! టీడీపీ దోపిడీకి శాశ్వతంగా వీడ్కోలు పలకండి. పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
నేను చెప్పనివి మీరు చెప్పకండి
‘‘ఆర్టిస్ట్ల గురించి ఏదైనా రాసేముందు ఒకటికి రెండుసార్లు ఎందుకు సరి చూసుకోరు?’’ అని మండిపడ్డారు తమన్నా. సెన్సేషన్ కోసం ఏది పడితే అది రాసే ఆర్టికల్స్ను చూసి ఆమె ఈ విధంగా స్పందించారు. ‘‘అజ్ఞానమే మహానందం అంటుంటారు. కానీ వీళ్ల (ఎల్లో జర్నలిజమ్) విషయంలో చాలా డిస్ట్రబింగ్గా ఉంది. నాకో సందేహం కలుగుతుంటుంది. రాసింది పబ్లిష్ చేసే ముందు వాళ్లు హోమ్వర్క్ చేయకుండా ఎలా ఉంటారా? అని. ఆ సమాచారం సరైనదా? కాదా? అని ఆలోచించకుండా ప్రచురించడం సరికాదు. పబ్లిష్ చేసేముందు సంబంధిత వ్యక్తులను ఒక మాట అడిగితే ఏం పోతుంది? కల్పిత వార్తలు రాసి, సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకోవడం సబబు కాదు. ఈసారి నా గురించి ఏదైనా రాసేముందు కొంచెం రెస్పాన్సిబుల్గా నన్ను సంప్రదించి, నా అభిప్రాయం ఏంటో కనుక్కోండి. నేను ఇవ్వని ఇంటర్వ్యూల్ని, అలాగే పాత ఇంటర్వ్యూలోని సమాచారాన్ని సంబంధం లేని చోట వాడకండి. దయచేసి నేను చెప్పని విషయాలను మీరు చెప్పకండి’’ అని ఘాటుగా పేర్కొన్నారు తమన్నా. ఇంతకీ తమన్నా గురించి రాసింది ఎవరు? ఏం రాశారు? అనే ప్రశ్నలకు సమాధానం ఎదురు చూడొద్దు. ఎందుకంటే తమన్నా ఆ విషయాలేవీ ప్రస్తావించలేదు. -
మీరు నన్ను హత్య చేయాలనుకుంటున్నారా?:నితీశ్
న్యూఢిల్లీ: ఎప్పుడూ శాంతంగా, చిరునవ్వుతో ఓపిగ్గా విడమర్చి సమాధానాలు చెప్పే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం అగ్గిమీద గుగ్గిలమయ్యారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలే అందుకు కారణమైంది. అసలు ఇలా ఎలా అడుగుతారని, తనను రాజకీయంగా హతమార్చే కుట్రం చేస్తున్నారా..? ఇది ముమ్మాటికి ఎల్లో జర్నలిజమే అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం చాలా గొప్పదని మంచి ఫలితాలు వస్తాయని ఆయన బహిరంగంగా చెప్పారు. అదే సమయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యమైన లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించారు. మరోపక్క, అటు బిజేపీ నేతలు నితీశ్ ను ఈమధ్య పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ రెండుమూడుసార్లు ట్వీట్లు చేయడంతోపాటు కొన్ని సభల్లో కూడా నితీశ్కు మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలోనే బిహార్లోని విధానసభ చాంబర్ లో ఓ ఐదుగురు జర్నలిస్టులు కూర్చుని ‘ఈ మధ్య మోదీకి బాగా దగ్గరవుతున్నారు. ఎన్డీయేకు మీరు బాహాటంగానే మద్దతిస్తున్నట్లున్నారు. పైగా బీజేపీ నేతలు కూడా మిమ్మల్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా నితీశ్ మండిపడ్డారు. ‘ ఇది నన్ను పనిగట్టుకొని రాజకీయంగా హత్య చేసే కుట్ర. దీంతో మీకు ఏమొస్తుంది. ఇది జర్నలిజం కాదు.. ఇది ఎల్లో జర్నలిజం. అదే బిహార్ కాకుండా మరో రాష్ట్రంలో అయితే అలాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టి జైలుకు పంపేవాడిని. కానీ, ప్రజాస్వామ్యవాదిని. అలాంటి పనులు నేను చేయను’ అని నితీశ్ చెప్పారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
మేమంటే.. మేమే..
Advertisement