-
స్టార్ హీరో సినిమాలు మానేస్తున్నాడా..!
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్. ఆయన శనివారం నాడు బాంబు లాంటి వార్త పేల్చారు. ఇకనుంచి తాను ఎవరికోసమూ సినిమా చేయనని చెప్పారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2016లో పాల్గొన్న సంజయ్ ఇకపై సినిమాల విషయంలో ఎలా ఉండబోతున్నాడో వివరించాడు. తొలుత ఈ వార్త విన్న వారంతా సంజూ బాయ్ సినిమాలు తీయరేమోనని ఆశ్చర్యపోయారు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. తన పిల్లలు ఇఖ్రా, షాహ్రాన్ ల స్కూలు ఫంక్షన్లకు హాజరవుతున్నానని చెప్పాడు. తాను జైలుకు వెళ్లినప్పుడు వారికి కేవలం రెండేళ్లేనని, తాను ఎన్నో వేడుకలలో పాల్గొనలేకపోయానని ఈ సీనియర్ హీరో బాధపడ్డాడు. ఇప్పటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితేనే చేయాలని నిర్ణయించుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు సంజయ్. ప్రస్తుతం సిద్ధార్థ ఆనంద్, విధు వినోద్ చోప్రా, మున్నాబాయ్ 3 మూవీ ప్రాజెక్టుల కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే 'మున్నాబాయ్ 3' షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమం అవుతుందని చెప్పుకొచ్చాడు సంజయ్. -
మార్చి 7న మున్నాభాయ్కి విముక్తి
పుణె: మహారాష్ట్ర ఎరవాడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్కు త్వరలోనే విముక్తి లభించనుంది. వచ్చే ఏడాది మార్చి 7న ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. 42 నెలల శిక్షాకాలం పూర్తిచేసుకుని జైలు నుంచి విడుదల అవుతాడని తెలుస్తోంది.18 నెలలు అండర్ ట్రయల్ ఖైదీగానూ సంజయ్ ఉన్నాడు. 1993 ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని ఆరోపణలపై టాడా చట్టం కింద సంజయ్ దత్ కు జైలుశిక్ష పడిన విషయం అందరికీ విదితమే. శిక్షాకాలంలో తోటి ఖైదీలతో సత్ర్పవర్తనతో మెలిగిన సంజయ్ దత్ ఇప్పటికే పలుమార్లు పెరోల్ మీద బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపారు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక్కరైన సంజయ్దత్ 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగేరహో మున్నాభాయ్', 'ఖల్నాయక్' వంటి హిట్ సినిమాల్లో నటించారు. -
మున్నాభాయ్కి భారీ ఊరట!
ముంబై: ప్రస్తుతం ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఆయనను శిక్షాకాలం గడువు కన్నా దాదాపు ఆరు నెలలు ముందే విడుదలే చేసే అవకాశముందని ఓ మహారాష్ట్ర దినపత్రిక తెలిపింది. జైల్లో మున్నాభాయ్ సత్ప్రవర్తనే అందుకు కారణమట. జైలుశిక్షాకాలంలో ఖైదీ సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే అతనికి 114 రోజులపాటు శిక్షను తగ్గించే అవకాశముంది. ఈ మేరకు చట్టాల్లో ఉన్న ఓ క్లాజును ఎరవాడ జైలు అధికారులు పరిశీలిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. ఆ క్లాజు ఏం చెప్తోంది..! జైలు నిబంధనలకు సంబంధించిన ఓ క్లాజు ప్రకారం ఖైదీ ప్రవర్తన బాగుంటే అతనికి మూడు రోజులు సెలవు ఇస్తారు. అదేవిధంగా తాను ఎంచుకున్న వృత్తిలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే నాలుగు రోజుల వరకు సెలవు పొందే అవకాశముంది. ఈ లెక్కన ఓ నెలలో ఏడురోజుల వరకు సెలవు పొందవచ్చు. అంతేకాకుండా ఒక ఏడాదికాలంలో ఖైదీ ఆదర్శప్రాయమైన ప్రవర్తన కనబరిస్తే అతనికి 30రోజల వరకు సెలవు ఇవ్వవచ్చు. ఈ సెలవు 30 రోజులా లేక 60 రోజులా లేక 10 రోజులా అన్నది నిర్ణయించే అధికారం జైలు సబ్ సూపర్ వైజర్, చీఫ్ సూపర్ వైజర్, సీనియర్ పోలీసుల అధికారుల చేతిలో ఉంటుంది. మున్నాభాయ్ సత్ప్రవర్తన.. జైలులో అత్యంత బుద్ధిమంతుడిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న మున్నాభాయ్ కి నెలకు ఏడు రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున తన ఐదేళ్ల శిక్షాకాలంలో మొత్తం 114 రోజుల సెలవు దొరికే అవకాశముంది. దీంతో శిక్షాకాలం నిర్ణీత గడువు కన్నా దాదాపు ఆరు నెలలముందే సంజయ్ విడుదల కావొచ్చునని భావిస్తున్నట్టు ఆ దినపత్రిక తెలిపింది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడని ఆరోపణలతో సంజయ్ దత్ కు జైలుశిక్ష పడింది. ఇప్పటికే ఆయన పలుసార్లు పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబసభ్యులతో గడిపారు. -
జైలుకు తిరిగి వెళ్లిన మున్నాభాయ్
ముంబై: 1993నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో పెరోల్ గడువు ముగియడంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్దత్ పుణెలోని ఎరవాడ జైలుకు తిరిగి వెళ్లారు. భార్య మాన్యతాదత్కు చికిత్స చేయించాల్సి ఉండడంతో గతేడాది డిసెంబర్ 21న ఆయన పెరోల్పై జైలు నుంచి విడుదలయ్యారు. సంజయ్ శనివారం ముంబైలోని తన నివాసం నుంచి స్నేహితుడు బంటీ వాలియా వెంట రాగా పుణెకు వెళ్లారు. -
ఎర్రవాడ జైల్లో సంజయ్ దత్ కు మద్యం సరఫరా!
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ పై మహారాష్ట్ర కౌన్సిల్ లో బీజేపీ నేత వినోద్ తావ్ డే ఫిర్యాదు చేశారు. ఎర్రవాడ జైలులో సంజయ్ దత్ కు బీరు, రమ్ లాంటి మద్యపానీయాల్ని జైలు సిబ్బంది సరఫరా చేస్తున్నారని వినోద్ ఆరోపించారు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా సంజయ్ దత్ కు జైలు అధికారులు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాక మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన అన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోయాయని వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రత కల్పించడంపై హోమంత్రి ఆర్ ఆర్ పాటిల్, మంత్రులు సతేజ్ పాటిల్, వర్షా గైక్వాడ్ లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్క్షప్తి చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement