-
యాగం.. వైభోగం!
సాక్షి, జగదేవ్పూర్ (గజ్వేల్): రాష్ట్రం సుభిక్షంగా ఉం డాలని కాంక్షిస్తూ.. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న మహా రుద్ర సహిత సహస్రచండీ మహాయాగం నాలుగో రోజు విజయవంతంగా పూర్తయింది. గురువారం ఉదయం యాగశాలకు సతీసమేతంగా వచ్చిన సీఎం కేసీఆర్.. మొదట రాజశ్యామల మాత మంటపంలో పూజలు నిర్వహించారు. శ్రీమహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతీ, స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవికి పుష్పాంజలి ఘటించారు. సర్వమంగళ మాంగల్యే.. శ్రీ రాజశ్యామలా దైవేయ నమస్తే.. అంటూ రుత్వికులు వేదోక్తంగా ప్రార్థనలు చేశారు. రాజశ్యామల మంటపంలో సీఎం దంపతులకు వేద పండితు లు ఆశీర్వచనం చేశారు. శుక్రవారం పూర్ణాహుతితో ఈ యాగం పరిసమాప్తం కానుంది. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు విశాఖ శారదా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శుక్రవారం ఉదయం ఎర్రవల్లికి చేరుకోనున్నారు. మహారుద్ర మంటపంలో పూజలు గురువారం నాడు మహారుద్ర మంటపంలో జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుత్వికులు మహారుద్ర సహిత ఏకాదశ రుద్ర పఠనం, నమకం, చమకం పఠించారు. పంచాక్షరి జపంలో భాగంగా శివశివ శంకర భూత పతే, శంకర శివ, శంభో మహాదేవ, హరహర మహాదేవ మంత్రాలతో యాగశాలలు మార్మోగాయి. బ్రహ్మ స్వరూపిణి బగళాముఖి మంటపంలో సీఎం కేసీఆర్ దంపతుల సమక్షంలో వేద పండితులు, రుత్వికులు పూజలు చేశారు. శతమానం భవతే అంటూ పండితులు సీఎం దంపతులను ఆశీర్వదించారు. నవగ్రహ మంటపంలో ఆదిత్య హృదయంతోపాటు సూర్యాది నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీమాత ప్రధాన యాగశాలలో రాజరాజేశ్వరీదేవి ప్రార్థన చేశారు. గురువారం రుత్వికులు 400 సార్లు చండీ సప్తశతి పారాయణ చేశారు. వేద పండితులు యాగం వీక్షించడానికి వచ్చిన భక్తులకు సుభాషితాలు వినిపించారు. యాగ విశిష్టతను వివరించారు. మహాహారతితో గురువారం నాటి పూజా కార్యక్రమాలు ముగిసాయి. నాలుగో రోజు యాగంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో పాల్గొని చండీమాత అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్రంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు అందరితోపాటు పలువులు ప్రముఖులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం పూజాకార్యక్రమాలతో యాగం ముగియనుంది. -
సీఎం కేసీఆర్ కు అస్వస్థత.. కార్యక్రమాలు రద్దు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనను వైద్యులు పరీక్షించి విశ్రాంతి అవసరమని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి మూడు రోజులపాటు తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకోవాల్సి వచ్చింది. ఈ మూడు రోజులూ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement