-
అసలైన 'టెస్టు'
యువ క్రికెటర్లతో కూడిన భారత జట్టు 22 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై సిరీస్ గెలిచి సంచలనం సృష్టించింది. దిగ్గజాలెందరికో సాధ్యం కాని ఘనతను ఈ యువ జట్టు అందుకుంది. అయితే ఆ విజయం కేవలం ‘వాపు’మాత్రమే. ఎందుకంటే ఆ సిరీస్లో ఆడిన శ్రీలంక జట్టు గత రెండు దశాబ్దాల్లోనే అత్యంత బలహీనంగా ఉన్న జట్టు. దక్షిణాఫ్రికాతో సిరీస్ శ్రీలంక తరహాలో సులభం కాదు. ఆడేది సొంతగడ్డ మీదే అయినా పటిష్టమైన జట్టుతో భారత్కు టెస్టు సిరీస్ అసలైన పరీక్ష. * కోహ్లి సేన ముందు కఠిన పరీక్ష * విదేశాల్లో నిలకడగా ఆడే దక్షిణాఫ్రికా * ఈసారి కూడా బలంగానే ప్రత్యర్థి సాక్షి క్రీడావిభాగం: సొంతగడ్డపై భారత్ ఎప్పుడూ బలమైన జట్టే. ప్రత్యర్థి ఎవరైనా... జట్టులో ఎవరున్నా... తరాలు మారినా... స్వదేశంలో భారత్ను ఓడించాలంటే ప్రత్యర్థులెవరికైనా కష్టమే. అయితే దక్షిణాఫ్రికా జట్టు మాత్రం 2000లోనే భారత్పై రెండు టెస్టుల సిరీస్ను 2-0తో స్వీప్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటికి ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసి ఎనిమిదేళ్లే అయింది. అయినా స్పిన్నర్లకు సహకరించే పిచ్లపై కూడా గెలవగలిగింది. సంప్రదాయబద్ధంగా భారత క్రికెటర్లు స్పిన్ బాగా ఆడతారు. సాధారణంగా ఇక్కడి పిచ్లు నెమ్మదిగా ఉంటాయి కాబట్టి... ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి ప్రత్యర్థిని కట్టడి చేయాలనే వ్యూహంతోనే ప్రతిసారీ బరిలోకి దిగుతారు. గతంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఒక బలహీనత ఉండేది. ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లలోకి స్పిన్ ఆడటంలో బాగా బలహీనం సఫారీలే. అందుకే ఆ జట్టు కోసం ప్రతిసారీ స్పిన్ పిచ్లు తయారు చేసేవారు. ఈసారి కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉండొచ్చు. పేస్, బౌన్స్తో కళకళలాడే మొహాలీ పిచ్ కూడా ఇప్పుడు స్పిన్నర్లకు అనుకూలించేలా ఉందనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈసారి కూడా భారత్ ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఇప్పుడు మెరుగు కేవలం స్పిన్ అస్త్రంతో దక్షిణాఫ్రికాను భారత్ నియంత్రించగలదా అనేది కూడా సందేహమే. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్పిన్ ఆడటంలో బాగా మెరుగుపడ్డారు. కెప్టెన్ ఆమ్లాతో పాటు డు ప్లెసిస్, డికాక్, డుమిని స్పిన్ బౌలింగ్ను చీల్చిచెండాడగల సమర్థులు. వీరిని నియంత్రించాలంటే అత్యంత భయంకరమైన స్పిన్ ట్రాక్ వేయాలి. అయితే ఇలా చేసినా ప్రమాదం పొంచి ఉంది. ఒక గొప్ప స్పిన్నింగ్ ట్రాక్ ఎదురైతే... దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ను ఎదుర్కోగల సత్తా భారత యువ క్రికెటర్లలో ఉందా అనేది అనుమానమే. ఇటీవల శ్రీలంకలోని గాలెలో జరిగిన టెస్టులో భారత్ 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 112 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. రంగన హెరాత్ బంతులకు భారత బ్యాట్స్మెన్ దగ్గర సమాధానం లేకపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైతే కష్టం. కాబట్టి భారత్ ఈ సిరీస్కు బాగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. మరోవైపు తుది జట్టులో స్పిన్నర్లు ఎవరనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్కు అత్యుత్తమ స్పిన్నర్ అశ్విన్. కానీ అతను గాయంతో ఉన్నాడు. తొలి టెస్టు సమయానికి కోలుకుంటే ఫర్వాలేదు. లేకపోతే అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా మిగిలిన ఇద్దరు స్పిన్నర్లు. ఈసారి జట్టు ఎంపిక సమయంలో కేవలం ముగ్గురు స్పిన్నర్లనే తీసుకున్నారు. అశ్విన్కు గాయం ఉందని తెలిసినా ఇలాగే ఎంపిక చేశారు. ఒకవేళ అశ్విన్కు గాయం తగ్గకపోతే ముగ్గురు స్పిన్నర్లతో ఆడాల్సిన పరిస్థితిలో ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రశ్నకు సమాధానం లేదు. నిలకడే ఆయుధం దక్షిణాఫ్రికా జట్టులో ప్రస్తుతం ఉన్న క్రికెటర్లంతా నిలకడకు మారు పేరు. ఆమ్లా, డు ప్లెసిస్, డివిలియర్స్లతో పాటు బావుమా కూడా స్పిన్ బాగా ఆడతాడు. ఫ్లాట్ వికెట్ ఎదురైతే వీళ్లని ఆపడం మరింత కష్టం. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన రెండు రోజుల మ్యాచ్లో సెంచరీతో డివిలియర్స్ ఫామ్ను కోల్పోలేదని అర్థమైంది. అయితే ఈ ఇన్నింగ్స్లో అతను ఆడిన స్వీప్లు, రివర్స్ స్వీప్లు చూస్తే భారత స్పిన్నర్లకు రాబోయే నెల రోజులు కష్టకాలంలాగే కనిపిస్తోంది. ఇక బౌలింగ్లో కూడా పేస్నే నమ్ముకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టెయిన్ టెస్టుల్లో మరింత ప్రమాదకారి. భారత పిచ్లపై రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. పేసర్లు స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్లతో పాటు తాహిర్ తుది జట్టులో ఉంటాడు. ఈసారి పర్యటనకు సఫారీలు కూడా భారీగానే స్పిన్నర్లను తీసుకొచ్చారు. డుమిని గాయం నుంచి కోలుకుంటే వారికి మంచి స్పిన్ ప్రత్యామ్నాయం ఉన్నట్లే. ఒకవేళ డుమిని కోలుకోకపోతే లెఫ్టార్మ్ స్పిన్ వేయగల ఆల్రౌండర్ ఎల్గర్ ఉన్నాడు. హార్మెర్, పిడెట్ల రూపంలో ఇద్దరు ఆఫ్స్పిన్నర్లు కూడా జట్టుతో పాటు ఉన్నారు. కాబట్టి దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లోనూ పటిష్టంగానే కనిపిస్తోంది. ఈ జట్టుపై గెలవాలంటే కోహ్లి సేన అసాధారణంగా ఆడాలి. మన పరిస్థితి ఏమిటి? టెస్టు కెప్టెన్ కోహ్లి, డెరైక్టర్ రవిశాస్త్రి ఐదుగురు బౌలర్ల మంత్రాన్ని పఠిస్తున్నారు. ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో ఉంటే ఇద్దరు పేసర్లు ఆడాలి. ఇషాంత్పై ఒక టెస్టు నిషేధం కారణంగా తొలి మ్యాచ్కు అందుబాటులో లేడు. ఉమేశ్, ఆరోన్ ఇద్దరినీ తీసుకుంటారా? లేక ఆల్రౌండర్ అనే కారణం వల్ల స్టువర్ట్ బిన్నీని తెస్తారో చూడాలి. జడేజా తుది జట్టులో ఉండే అవకాశం ఉన్నందున... బిన్నీని ఆపి, ఇద్దరు సిసలైన పేసర్లను తీసుకునే అవకాశమే ఉంది. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ లైనప్ను భారత బ్యాట్స్మెన్ ఏ మేరకు ఒత్తిడిలో నెట్టగలరనేది కూడా ప్రశ్నార్థకమే. విజయ్, ధావన్ ఫిట్నెస్తోనే ఉన్నందున లోకేశ్ రాహుల్కు అవకాశం రాకపోవచ్చు. కోహ్లి, రహానే, రోహిత్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తుది జట్టులో ఉండటం ఖాయం. ఈ లెక్క ప్రకారం పుజారా మరోసారి బెంచ్కు పరిమితం కావాలి. ఇలా జట్టు కూర్పుపై స్పష్టత లేకపోవడం భారత్కు ప్రధాన సమస్య. ఏమైనా కచ్చితమైన ప్రణాళిక, సన్నద్ధత లేకపోతే మరోసారి దక్షిణాఫ్రికా చేతిలో పరాభవం తప్పదు. 11 ఇప్పటివరకూ భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 11 టెస్టు సిరీస్లు జరిగాయి. ఇందులో ఆరు దక్షిణాఫ్రికా గెలిస్తే... భారత్ రెండు మాత్రమే నెగ్గింది. మిగిలిన మూడు సిరీస్లు ‘డ్రా’గా ముగిశాయి. 5 ఈ రెండు దేశాల మధ్య భారత్లో ఐదు సిరీస్లు జరిగితే రెండింట భారత్, ఒక సిరీస్లో దక్షిణాఫ్రికా నెగ్గాయి. రెండు సిరీస్లు ‘డ్రా’గా ముగిశాయి. -
గూగుల్ను ఆకట్టుకొన్న యంగ్ టీమ్!
భారత్ నుంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చే యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది... భవిష్యత్తులో వాళ్లంతా స్వదేశంలోనే సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెడతారు... అని అంటాడు రాహుల్ జైన్. ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ ద్వారా గూగుల్ ఐఎన్సీ నుంచి పెట్టుబడులను ఆకర్షించిన యువభారతీయ బృందంలో ఒకరు రాహుల్జైన్(27). జై శ్రీనివాసన్, మనీశ్లతో కలసి రాహుల్జైన్ అప్యూరిఫై అప్లికేషన్ను రూపొందించాడు. ఇప్పుడు ఈ బృందం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్లో చదువు పూర్తి కాగానే రాహుల్ జైన్ జింగా అనే గేమింగ్ డెవలప్మెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించాడు. చదివిన చదువు, చేస్తున్న పని అతడిలోని సృజనాత్మకతను మేల్కొల్పాయి. ఉద్యోగాన్ని వదిలి సొంతంగా కొత్త అప్లికేషన్ను రూపొందించాలనే ఆలోచనను కలిగించాయి. ఇలాంటి మేధోమథనం నుంచే ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ పుట్టింది. తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఆ అప్లికేషన్కు ప్రాణం పోసే పనిలో పడ్డాడు రాహుల్. ఇతడి అప్లికేషన్ గురించి సమాచారమందుకొన్న గూగుల్ పెట్టుబడి దారుగా రంగంలోకి దిగింది. ఆ అప్లికేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్న గూగుల్ దాన్ని టేకోవర్ కూడా చేసింది. గూగుల్ మానసపుత్రిక అయిన ఆండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్లో ఆ అప్లికేషన్ను అందుబాటులో ఉంచడానికి ఒకింత భారీ మెత్తాన్ని చెల్లించి జైన్తో ఒప్పందం చే సుకొంది. దీంతో ఈ యువకుడి దశ తిరిగింది. పేరు మార్మోగింది. తన అప్లికేషన్ను గూగుల్కు అమ్మడం ద్వారావచ్చిన డబ్బును మరిన్ని స్టార్టప్ల మీద పెట్టుబడిగా పెడుతున్నాడు రాహుల్ జైన్. వివిధ అవసరాల కోసం మనిషికి సదుపాయంగా ఉండే అప్లికేషన్ను అభివృద్ధి పరచడానికి సరికొత్త అప్లికేషన్ల రూపకల్పనకు పూనుకొన్నాడు. ప్రముఖ వ్యవస్థాపకుడిగా మారాడు. ‘భారత్లో వ్యాపారవేత్తల్లోఎక్కువమంది ఇన్నిరోజులూ సేవారంగానికి సంబంధించిన విభాగాలపైనే దృష్టిపెట్టారు. ఔట్సోర్సింగ్ రూపంలో కార్మికవృత్తికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయంలో మార్పు వస్తోంది. భారతీయులు తమ తెలివితేటలను విభిన్న రంగాల్లో వ్యాపారాభివృద్ధిని సాధించడానికి పెట్టుబడిగా పెడుతున్నారు...’ అనేది జైన్ విశ్లేషణ. ఈ విశ్లేషణ ఇతరుల విషయంలో ఏమో కానీ... జైన్ విషయంలో అయితే మాత్రం వంద శాతం నిజమనిపిస్తుంది. జైన్ కంఫర్ట్జోన్ నుంచి బయటకు వచ్చి జై శ్రీనివాసన్, మనీశ్లను కలుపుకొని అప్లికేషన్ రూపకల్పన ఆలోచన చేశాడు. ఆ సాహసమే విజయానికి దారి చూపింది. అప్లికేషన్ ఐడియా గురించి చెప్పగా గూగుల్ వెంచర్స్ వాళ్లు 1.75 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టడానికి ముందుకొచ్చారు. అనంతరం మరో 4.5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించి ఆ అప్లికేషన్ను పూర్తిగా కొనేశారు. దీంతో జైన్ బృందం దశ తిరిగింది. రాజీ పడిపోయి ఉద్యోగాలు చేసుకొంటూ, కంఫర్ట్ జోన్లో ఉన్నామని ఆనందిస్తూనే, మరోవైపుగా ఆందోళన పడటం కంటే... ఆత్మవిశ్వాసం ఉంటే సాహసం చేయడమే మంచిదనేది జైన్ సిద్ధాంతం. తను ఇప్పుడు అనుసరించిన ఈ బాటనే రానున్న రోజుల్లో మరింతమంది భారతీయ యువతీ యువకులు అనురిస్తారని జైన్ భావిస్తున్నాడు. ఈ మాటల ద్వారా అనేక మందిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. రాహుల్జైన్ కాన్పూర్కు చెందిన యువకుడు. తండ్రి ప్రభుత్వ పనులను చేసిపెట్టే కాంట్రాక్టర్. ఉద్యోగాన్ని వదిలి ఈ విధంగా అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి మొదట ఇంట్లో మద్దతు లభించలేదని... అయినప్పటికీ తను రిస్క్ చేశానని జైన్ చెబుతాడు. మరి ఇప్పుడు ఆ రిస్క్కు తగినట్టుగా విజయాన్ని సాధించడం ఎంతో ఆనందాన్నిస్తుందని అంటాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement