-
వైఎస్సార్సీపీ నేతలతో కందుల సోదరుల చర్చలు
కడప కార్పొరేషన్, న్యూస్లైన్: కందుల సోదరులు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కె. సురేష్ బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, లోక్సభ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, కడప శాసన సభ అభ్యర్థి అంజద్ బాష తదితరులు కందుల శివానందరెడ్డి, కందుల రాజమోహన్ రెడ్డిలను శనివారం వారి నివాసంలో కలుసుకున్నారు. సుమారు రెండుగంటల పాటు జరిగిన చర్చల్లో వివిధ అంశాలు ప్రస్తావనకు వ చ్చినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో కందుల సోదరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. -
పార్లమెంట్కు రెండు, అసెంబ్లీలకు ఐదు..
కడప కలెక్టరేట్, న్యూస్లైన్ : కడప లోక్సభ స్థానానికి మంగళవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డి తరపున ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి శశిధర్కు అందజేశారు. పిరమిడ్ పార్టీ అభ్యర్థి గజ్జల రామసుబ్బారెడ్డి ఒక సెట్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వెంకల భాగ్యలక్ష్మి ఒక సెట్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థి జక్కం వెంకటరమణ నామినేషన్ దాఖలు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నగిరిపల్లె యానాదయ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి కొనుదుల నారాయణరెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా సి.సుజనాదేవి ఒక సెట్నామినేషన్ను సమర్పించారు. -
చకచకా ఏర్పాట్లు
పులివెందుల/వేంపల్లె, న్యూస్లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 2వ తేదీన ఇడుపులపాయలో నిర్వహించే రెండవ ప్లీనరీకి(ప్రజాప్రస్థానం) ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇడుపులపాయలో ఒకటవ తేదీన సీజీసీ సమావేశం, అధ్యక్ష పదవికి షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 2వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్ఆర్ సీపీ నాయకులు వైఎస్ భాస్కర్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. వీరితోపాటు చక్రాయపేట వైఎస్ఆర్ సీపీ మండల ఇన్ఛార్జి వైఎస్ కొండారెడ్డి, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే ఉన్న జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఏర్పాట్లపై ఆరా తీశారు. భోజన వసతి, పార్కింగ్, స్టేజీ నిర్మాణం తదితర వాటిపై సమగ్రంగా చర్చించారు. నేడు వైఎస్ జగన్ రాక : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఇడుపులపాయకు రానున్నారు. నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర ముగిసిన వెంటనే ప్రజాప్రస్థానం ప్లీనరీలో పాల్గొనడానికి వస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా శనివారం ఉదయాన్నే ఇడుపులపాయకు చేరుకోనున్నారు. నాయకులతో సమావేశం : పులివెందుల నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో పులివెందుల వైఎస్ఆర్ సీపీ నాయకులు వైఎస్ భాస్కర్రెడ్డి ప్లీనరీ కార్యక్రమంపై శుక్రవారం సమావేశమయ్యారు. పాసుల జారీ, భోజన వసతి, ఇక్కడికి వచ్చే నాయకుల సంఖ్య తదితర వాటిపై చర్చించారు. నేడు ఎమ్మెల్యే విజయమ్మ రాక వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శనివారం పులివెందులకు రానున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందులకు చేరుకుంటారు. శనివారం ఉదయం 11గంటల ప్రాంతంలో పులివెందులలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులకు సంబంధించిన భూ పట్టాలను పంపిణీ చేయనున్నారు.అనంతరం ఇడుపులపాయకు వెళతారు. ప్లీనరీని జయప్రదం చేయండి ఇడుపులపాయలో ఈనెల 2వ తేదీన నిర్వహించనున్న వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ ప్లీనరీని జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ కె.సురేష్బాబు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సమావేశాలకు పార్టీలో 27 రకాల హోదాలున్న వారిని ప్రతినిధులుగా ఆహ్వానించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9వేల మంది ప్లీనరీలో పాల్గొననున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన నాయకులంతా తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
మేమంటే.. మేమే..
Advertisement