-
సౌందర్యతో ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రిన్స్.. ఏ సినిమానో తెలుసా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో అలరించనుంది. అయితే రాజ కుమారుడు చిత్రంతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మహేశ్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. (ఇది చదవండి: హౌస్ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్లో సీమంతం వేడుకలు!) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగువారికి పరిచయం అక్తర్లేని పేరు. అప్పటి స్టార్ హీరోలందరితో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. అయితే సౌందర్యతో నటించే ఛాన్స్ మహేశ్ బాబు మిస్ అయినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన మూవీలో మరో హీరోయిన్ నటించింది. రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తర్వాత యువరాజు చిత్రంలో నటించారు. ఇందులో ప్రిన్స్ సరసన సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా కనిపించారు. అయితే ఈ చిత్రంలో ముందుగా సిమ్రాన్ స్థానంలో డైరెక్టర్ సౌందర్యనే ఎంపిక చేశారు. అయితే సౌందర్య- మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కావడంతో వీరిద్దరి కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాలేదట. ఎలా చూసిన మహేశ్కు అక్కలా కనిపిస్తున్నానని.. ఈ విషయాన్ని స్వయంగా సౌందర్యనే డైరెక్టర్ వైవీఎస్ చౌదరికి చెప్పిందట. (ఇది చదవండి: రూరల్ బ్యాక్డ్రాప్లో ‘ అశ్వధామ’.. ఫస్ట్ లుక్ రిలీజ్) ఈ పాత్రకు తనకంటే సిమ్రాన్ ఫర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సౌందర్య సూచించిదట. దీంతో డైరెక్టర్ సౌందర్యకు బదులుగా సిమ్రాన్ను ఎంపిక చేశారు. అలా సౌందర్య- మహేశ్ బాబు జోడిని వెండితెరపై చూసే ఛాన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ కోల్పోయారు. లేదంటే మహేష్ బాబు - సౌందర్య జోడీని తెలుగువారు చూసే అవకాశం దక్కేది. కాగా.. సౌందర్య 2004లో బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. యువరాజు సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ చిత్రంలోని గుంతలక్కడి గుమ్మ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. -
రేసు గుర్రం
రెక్కల గుర్రంపై యువరాజు.. ఒకప్పటి ఫిమేల్ ఫాంటసీ. యుద్ధాలలో గుర్రాలపై దూసుకొచ్చే వీరులు.. జానపద కథల్లో తరచూ తారసపడే పాత్రలు. కాలం మారడంతో గుర్రాల మీది యువరాజులు పోయి, జాకీలు వచ్చారు. గుర్రాలను రణరంగం బదులు రేసుకోర్సుల్లో పరుగులు తీయిస్తున్నారు. నవాబుల కాలం నాటి మలక్పేట మార్కెట్లో నుంచి తిన్నగా ఒకటిన్నర కిలోమీటరు దూరం వెళితే.. రాచరికపు ఆనవాళ్లు కనిపించడమే కాదు, గుర్రాల డెక్కల చప్పుడూ వినిపిస్తుంది. తేరిపార చూస్తే ‘హైదరాబాద్ రేస్కోర్స్’ అనే బోర్డుంటుంది. లోపలకు వెళ్లి చూస్తే.. పద్నాలుగు, పదిహేనేళ్ల కుర్రాళ్లు గుర్రాలకు సేవ చేస్తూ కనిపిస్తారు. బాలకార్మికులేమీ కాదు గానీ, వారే రేపటి జాకీలు. వారిని హార్స్ జాకీలుగా తీర్చిదిద్దే అప్రెంటిస్ జాకీ ట్రయినింగ్ స్కూల్ అది. హైదరాబాదీలదే హవా దేశంలో ప్రస్తుతం 250 మంది జాకీలు ఉన్నారు. వారిలో దాదాపు 50 మంది హైదరాబాదీలే. వారిలోనూ చాలామంది అప్రెంటిస్ జాకీ ట్రైనింగ్ స్కూల్ పూర్వవిద్యార్థులే. స్కూల్లో ఏం చేస్తారు..? ఉదయం 5.30 గంటల నుంచి శిక్షణ మొదలవుతుంది. గుర్రాలను శుభ్రం చేసి, దాణాపెట్టి.. దాని బాగోగులు చూసుకోవాలి. తర్వాత రేసింగ్ ప్రాక్టీస్, రేసింగ్ నిబంధనలపై తరగతులుంటాయి. తర్వాత మళ్లీ ప్రాక్టీస్. వారంలో ఆరురోజులు ఇదే షెడ్యూల్. వీటిపై రిటెన్, ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ప్రిన్సిపాల్ వీరేందర్ ఖాజా, వైస్ ప్రిన్సిపాల్ బజరంగ్ సింగ్లు స్కూలు వ్యవహారాలు చూసుకుంటారు. దేశంలో ఏకైక స్కూల్ హార్స్ జాకీల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన స్కూల్ మన దేశంలో ఇదొక్కటే. 1986లో ప్రారంభమైన ఈ స్కూల్ నుంచి వందలాది మంది జాకీలు తయారయ్యారు. విద్యార్థులకు భోజన, వసతులు ఉచితం. హైదరాబాద్ రేస్ క్లబ్ వాటన్నింటినీ చూసుకుంటుంది. ఈ స్కూల్లో మూడేళ్ల కోర్సుకు.. రాత, శరీర దారుఢ్య పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. మూడేళ్లకోసారి మాత్రమే ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇస్తారు. జాకీలే కీలకం పందెం రాయుళ్లే కాదు, ప్రేక్షకులు సైతం గుర్రాలపైనే దృష్టి పెడతారు. సంరక్షణ కోసం నెత్తిపై పెట్టుకున్న హెల్మెట్లో జాకీ ముఖం కవరైపోతుంది. గుర్రాన్ని నడిపించే జాకీని ఎవరూ గుర్తించరు. ఎంతో కష్టమైనా, అండర్రేటెడ్ జాబ్ హార్స్ జాకీలది. ఒకప్పుడు ఆదరణ తక్కువగా ఉన్నా, ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ యువతరం ముందుకొస్తుండటంతో హార్స్ జాకీయింగ్పై క్రేజ్ పెరుగుతోంది. రెండున్నర శతాబ్దాల చరిత్ర దేశంలో గుర్రపు పందాలకు రెండున్నర శతాబ్దాల చరిత్ర. ప్రస్తుతం భారత్లో అరడజను రేస్ టర్ఫ్లున్నాయి. ఏడాది పొడవునా ఏదో ఒక టర్ఫ్లో పందేలు జరుగుతూనే ఉంటాయి. జాకీకి గుర్రాన్ని ముందుకు ఉరికించడమే కాదు, దానిని అదుపుచేయడమూ తెలిసుండాలి. గుర్రం, జాకీల్లో ఏ ఒకరు తడబడినా పరిస్థితి తారుమారవుతుంది. ‘అశ్వహృదయం’ అర్థమైతే తప్ప జాకీలుగా రాణించలేరు. మనం పదేపదే మాట్లాడుతుంటే.. మన భాష, భావం గుర్రాలకు అర్థమవుతుందని చాలామంది జాకీలు నమ్ముతారు. రేసుల్లో కూడా వెయిట్ లిఫ్టింగ్ మాదిరిగానే జాకీల బరువునే కొలమానంగా పోటీలు నిర్వహిస్తారు. 40 నుంచి 70 కేజీల వరకు వివిధ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. జాకీలకు ప్రత్యేకంగా ఉద్యోగాలేవీ ఉండవు. పందేలలో గుర్రాలను పెట్టే యజమానులే జాకీలను హైర్ చేసుకుంటారు. గుర్రాన్ని బట్టి వారికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కాంట్రాక్టు ఉంటుంది. అంతేకాదు, గెలిచిన గుర్రానికి అందే ప్రైజ్ మనీలో ఏడున్నర శాతం జాకీకే చెందుతుంది. గెలిచిన రేసులను బట్టి జాకీలకు పాపులారిటీ పెరుగుతుంది. పీసీ చవాన్, శ్రీనాథ్, సూరజ్ నర్రెడులు మన దేశంలో ఫేమస్ జాకీలు. గుండెధైర్యం, ఏకాగ్రత, శారీరక దారుఢ్యం ఉంటే ఎవరైనా జాకీలుగా రాణించవచ్చు. గుర్రాల మధ్యే పెరిగా.. మాది బీహార్ అయినా, మా నాన్న ఇక్కడే పనిచేస్తారు. చిన్నప్పటి నుంచి గుర్రాల మధ్యే పెరగడంతో జాకీయింగ్పై ఆసక్తి పెరిగింది. పెద్ద జాకీగా ఎదిగి బాగా డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. -రోహిత్ కుమార్, బీహార్ పీసీ చవాన్ ఆదర్శం మాది ఊటీ. సమ్మర్ రేసులన్నీ ఊటీ రేస్ కోర్సులో జరుగుతాయి. రేసులు చూసి ఆసక్తి పెరిగింది. మొదట్లో ఎత్తయిన గుర్రాలను చూసి కాస్త భయమేసినా, తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటే చాలని అర్థమైంది. జాకీ పీసీ చవాన్ నాకు ఆదర్శం. ఎప్పటికైనా ఆయనలా టాప్ రేంజ్కి ఎదగాలన్నదే నా కోరిక. - రాహుల్ హుటి, ఊటీ టాప్ జాకీ కావడమే లక్ష్యం నాకు తల్లిదండ్రులు లేరు. మా అంకుల్ వద్ద పెరిగాను. ముంబై రేస్ కోర్స్ దగ్గర ఉండేవాళ్లం. రోజూ రేసులు చూసి చూసి ఆసక్తి పెరిగింది. హైదరాబాద్లో ఈ స్కూల్ ఉందని తెలిసి, ఇక్కడ చేరాను. దేశంలోనే టాప్ జాకీని కావడమే నా లక్ష్యం. - రఫీక్ షేక్, ముంబై - జాయ్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement