-
విద్యార్థుల సమైక్య స్ఫూర్తికి తలొగ్గిన సర్కారు
⇒ యువభేరి సదస్సులో ప్రసంగించిన విద్యార్థిపై తొలుత వేధింపులు.. టీసీ ఇస్తామని బెదిరింపు ⇒ నిరసనగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి విద్యార్థుల హెచ్చరిక.. వైఎస్సార్సీపీ మద్దతు ⇒ దిగి వచ్చిన ప్రభుత్వం.. కళాశాలకు రావాలని విద్యార్థికి యాజమాన్యం పిలుపు సాక్షి, అమరావతి బ్యూరో : రాష్త్రానికి ప్రత్యేక హోదా కోరుతూ యువభేరి సదస్సులో పాల్గొన్న విద్యార్థిని ఇంటికి పంపేయాలన్న సర్కారు కుతంత్రాన్ని విద్యార్థి లోకం అడ్డుకుంది. ప్రత్యేక హోదా కోసం నినదించిన విద్యార్థులకు అండగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. విద్యార్థుల సమైక్య స్ఫూర్తికి సర్కారు దిగొచ్చింది. సదస్సులో పాల్గొన్న విద్యార్థికి టీసీ ఇచ్చి పంపేయాలన్న ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మొన్న విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో యువభేరి సదస్సుల్లో పాల్గొన్న విద్యార్థులను సస్పెండ్ చేయాలని చూసిన సర్కారు.., విద్యార్థులు కన్నెర్ర చేయడంతో వెనక్కి తగ్గింది. తాజాగా ఈ నెల 16వ తేదీన గుంటూరులో జరిగిన యువభేరి సదస్సుకు కూడా విద్యార్థులు హాజరవకుండా ఇదే విధమైన ప్రయత్నాలు చేసింది. నల్లపాడులో జరిగిన ఈ సదస్సుకు వచ్చినవారిలో చిలకలూరిపేటలోని మోడ్రన్ కళాశాల విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న తాటిపర్తి సాయి కృష్ణారెడ్డి నేరుగా జగన్తో మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి తాము ఆందోళన చేస్తుంటే పీడీ యాక్టు కింద కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు చెప్పారు. తమ ఊరికే చెందిన ప్రత్తిపాటి పుల్లారావు అరాచకాలను జగన్ దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వం సాయి కృష్ణారెడ్డిపై వేధింపులకు దిగింది. అతనికి టీసీ ఇచ్చి పంపేయాలని యాజమాన్యంపై ఉన్నత స్థాయిలో ఒత్తిడి వచ్చింది. దీంతో కళాశాల యాజమాన్యం సాయిరెడ్డిని పిలిచి బెదిరించింది. వద్దని చెప్పినా సదస్సుకు ఎందుకు వెళ్లావని కళాశాల డైరెక్టర్ మహేష్ ప్రశ్నించారు. టీసీ ఇచ్చి పంపుతామని హెచ్చరించారు.ఈ విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయింది.తోటి విద్యార్థులు ఆందోళనకు సిద్ధమయ్యారు. సాయి కృష్ణారెడ్డి కూడా విద్యార్థి సంఘాలతో కలసి న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. సాయి కృష్ణారెడ్డికి కళాశాల డైరెక్టర్ మహేష్ ఫోన్ చేసి, టీసీ ఇచ్చే ఉద్దేశం తమకు లేదని, కళాశాలకు రావాలని కోరారు. -
‘యువభేరి’ ప్రొఫెసర్లపై కక్ష సాధింపు
- నేడు ఆంధ్రా వర్సిటీ బంద్కు పిలుపు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నినదించిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పతుండడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో ‘యువభేరి’ సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదాను డిమాండ్ చేసిన ప్రసాదరెడ్డి, అబ్బులులకు ఏయూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా బుధవారం ఏయూ బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement