-
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. -
వరుసగా నాలుగో టీ20లో టీమిండియా జయకేతనం
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్లో జయకేతనం ఎగురవేసింది. నిన్న (మే 6) జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 56 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ (39), స్మృతి మంధన (22), హేమలత (22), రిచా ఘోష్ (24) రాణించడంతో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 125 పరుగులుగా నిర్దారించారు. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వరుసగా నాలుగో మ్యాచ్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లు దీప్తి శర్మ (3-0-13-2), ఆశా శోభన (3-0-18-2), రాధా యాదవ్ (3-1-12-1), పూజా వస్త్రాకర్ (3-0-15-1) బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఆ జట్టు ఇన్నింగ్స్లో దిలారా అక్తెర్ (21) టాప్ స్కోరర్గా నిలిచింది.నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ మే 9న జరుగనుంది. ఈ మ్యాచ్లో కూడా భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. టీ20 ప్రపంచకప్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈ సిరీస్ విజయం మాంచి బూస్టప్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. -
ప్రపంచకప్కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
స్కాట్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించింది. నిన్న (మే 5) జరిగిన క్వాలిఫయర్ సెమీస్లో స్కాట్లాండ్ ఐర్లాండ్ను ఓడించి ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకుంది. 2015 నుంచి వరల్డ్కప్ బెర్త్ కోసం తపిస్తున్న స్కాట్లాండ్ ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) అనుకున్నది సాధించింది. మరో సెమీస్లో యూఏఈని ఓడించిన శ్రీలంక కూడా స్కాట్లాండ్తో పాటు వరల్డ్కప్ బెర్త్ను దక్కించుకుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్ పోటీల నుంచి ప్రపంచకప్కు అర్హత సాధించాయి. A special, special group 💜 pic.twitter.com/8BfoqsptAV— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.Flower of Scotland: World Cup Qualification Edition 🤩🏴 pic.twitter.com/zt8Gsm7gr2— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది.స్కాట్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ (తొలి సెమీస్) విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. స్కాట్లండ్ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేథరీన్ బ్రైస్ ఆల్రౌండ్ షోతో (4-0-8-4, 35 నాటౌట్) ఇరగదీసి స్కాట్లాండ్ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది.రెండో సెమీస్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన యూఏఈ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. మే 7న జరిగే వరల్డ్కప్ క్వాలిఫయర్లో స్కాట్లండ్, శ్రీలంక అమీతుమీ తేల్చుకుంటాయి. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్లో ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.పురుషుల క్రికెట్లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్లో రెండో టీ20 మ్యాచ్లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్ 4 వికెట్లు పడగొట్టింది. View this post on Instagram A post shared by Persatuan Cricket Indonesia (@cricket_ina) 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. -
బంగ్లాదేశ్ పర్యటనకు భారత టీ20 జట్టు ప్రకటన
ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (ఏప్రిల్ 15) ప్రకటించారు. ఈ పర్యటనలో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును భారత సెలెక్టర్లు నిన్న వెల్లడించారు. ఈ జట్టుకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధన వ్యవహరించనున్నారు. ఈ సిరీస్కు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ దూరంగా ఉండనుండగా.. కేరళ అమ్మాయిలు ఆశా శోభన, సజనా సజీవన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. శోభన 2024 డబ్ల్యూపీఎల్లో ఛాంపియన్ ఆర్సీబీ తరఫున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలువగా.. సజనా గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటింది. బంగ్లా సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మిన్ను మణి, మన్నత్ కశ్యప్కు చోటు దక్కకపోగా.. డి హేమలత, రాధా యాదవ్ చాలాకాలం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే టీ20 వరల్డ్కప్కు ముందు టీమిండియా ఆడబోయే అతి పెద్ద టీ20 సిరీస్ ఇదే కావడంతో ఈ సిరీస్కు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దయాళన్ హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్ (వికెట్కీపర్), యాస్తికా భాటియా (వికెట్కీపర్), రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ , ఆశా శోభనా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ వివరాలు.. ఏప్రిల్ 28- తొలి టీ20 (సిల్హెట్) ఏప్రిల్ 30- రెండో టీ20 (సిల్హెట్) మే 2- మూడో టీ20 (సిల్హెట్) మే 6- నాలుగో టీ20 (సిల్హెట్) మే 9- ఐదో టీ20 (సిల్హెట్) -
టీ20 సిరీస్ కూడా ఆస్ట్రేలియాదే.. మరో క్లీన్ స్వీప్
మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆసీస్ మహిళా టీమ్ ఇంటాబయటా అన్న తేడా లేకుండా, ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా ఆసీస్ ఖాతాలో మరో రెండు సిరీస్లు చేరాయి. ఆసీస్.. బంగ్లాదేశ్ను వారి సొంత దేశంలో మట్టికరిపించి వన్డే, టీ20 సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది. 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటించిన ఆస్ట్రేలియా.. తొలుత వన్డే సిరీస్ను, తాజాగా టీ20 సిరీస్ను 3-0 తేడాతో ఊడ్చేసింది. టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) జరిగిన మూడో మ్యాచ్లో ఆసీస్ 77 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇదివరకే సిరీస్ కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ ఆల్రౌండ్ షో చేసి గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హీలీ (45), మెక్గ్రాత్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో నహీద అక్తర్ 3 వికెట్లతో సత్తా చాటింది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తైలా వ్లేమ్నిక్ (3/12), జార్జియా వేర్హమ్ (2/1), సోఫీ మోలినెక్స్ (1/15) ధాటికి 18.1 ఓవర్లలో78 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో నిగార్ సుల్తాన్ (32) టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఆసీస్ భారీ విజయాలు సాధించింది. దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్ను సైతం ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. -
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్ ఆల్రౌండర్ మృతి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్ ఆల్రౌండర్గా ఎదిగింది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అరువా.. పపువా న్యూ గినియా తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది. Sad news out of Papua New Guinea following the passing of women's international all-rounder Kaia Arua.https://t.co/xOCFTLzIHV — ICC (@ICC) April 4, 2024 ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్ మహిళల క్రికెట్లో అరువాకు తిరుగులేని ఆల్రౌండర్గా పేరుంది. -
హ్యాట్రిక్తో చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్.. కెరీర్లో రెండోది
మహిళల క్రికెట్లో ఇవాళ (ఏప్రిల్ 2) బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్ ఆడుతున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్ ఫరిహా త్రిస్న హ్యాట్రిక్తో చెలరేగింది. త్రిస్నకు టీ20ల్లో ఇది రెండో హ్యాట్రిక్. 2022లో త్రిస్న తన టీ20లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టింది. త్రిస్న దెబ్బకు నేటి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులకు త్రిస్న.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్, బెత్ మూనీలను ఔట్ చేసింది. తన కోటా నాలుగు ఓవర్లు వేసిన త్రిస్న.. 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. HAT-TRICK for Fariha Trisna in T20i against Australia women#BCB #Cricket #BANWvAUSW #LiveCrcket #HomeSeries #T20Iseries #womenscricket pic.twitter.com/I00NUVXNg3 — Bangladesh Cricket (@BCBtigers) April 2, 2024 బంగ్లా బౌలర్లలో త్రిస్నతో పాటు నహీద అక్తర్ (4-0-21-2), ఫహీమా ఖాతూన్ (4-0-34-2) కూడా వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వేర్హమ్ (57), గ్రేస్ హ్యరీస్ (47) మాత్రమే రాణించారు. ఆఖర్లో పెర్రీ (29) వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. తహిల మెక్గ్రాత్ (19) రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా ప్లేయర్స్ అంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమతమయ్యారు. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 9.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్, మోలినెక్స్ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ను కష్టాల్లోకి నెట్టారు. ముర్షిదా ఖాతూన్ (8), శోభన మోస్తరీ (5), నిగార్ సుల్తాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. దిలారా అక్తర్ (27), ఫహీమా ఖాతూన్ (3) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే 65 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఈ సిరీస్లో ఆసీస్ తొలి మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతుంది. -
బంగ్లాదేశ్ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఖాతాలో మరో సిరీస్ చేరింది. ఇటీవలే న్యూజిలాండ్ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన ఆసీస్.. తాజాగా బంగ్లాదేశ్ను సైతం వారి స్వదేశంలో మట్టికరిపించింది. ఐసీసీ వన్డే ఛాంపియన్షిప్లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించింది. తొలి వన్డేలో 118 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. A historic victory for Australian women, they secured a 3-0 win over Bangladesh in their inaugural ODI bilateral series. pic.twitter.com/hvsjzemRWf — CricTracker (@Cricketracker) March 27, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఢాకాలో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 26.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. కిమ్ గార్త్, ఆష్లే గార్డ్నర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్లో నిగర్ సుల్తానా (16), షోర్ణా అక్తర్ (10), సుల్తానా ఖాతూన్ (10), మరుఫా అక్తర్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 33, లఫోబ్ లిచఫీల్డ్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. ఎల్లిస్ పెర్రీ 27, బెత్ మూనీ 21 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్ను గెలిపించారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, రబెయా ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
118 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళల టీమ్ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అలానా కింగ్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి ఆసీస్ గెలుపులో ప్రధానపాత్ర పోషించింది. రాణించిన సదర్ల్యాండ్.. విరుచుకుపడిన అలానా 146 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల మార్కును కూడా దాటలేదనుకున్న ఆస్ట్రేలియాను సదర్ల్యాండ్ (76 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు), అలానా కింగ్ (31 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకున్నారు. ఆఖర్లో అలానా కింగ్ బంగ్లా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఫలితంగా ఆసీస్ 200 పరుగుల మార్కును దాటింది. సదర్ల్యాండ్, అలానాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్లో హీలీ (24), మూనీ (25), గార్డ్నర్ (32), వేర్హమ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, నహిద అక్తెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తెర్, ఫహీమా ఖాతూన్, షోర్ణా అక్తెర్ తలో వికెట్ పడగొట్టారు. గార్డ్నర్, కింగ్ మాయాజాలం.. కుప్పకూలిన బంగ్లాదేశ్ 214 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. గార్డ్నర్ (5-1-22-3), కిమ్ గార్త్ (7-1-26-2), అలానా కింగ్ (10-3-12-1), మెగాన్ షట్ (6-1-5-1) ధాటికి 95 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో సోభన (17), ముర్షిదా ఖాతూన్ (10), నిగర్ సుల్తాన్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 24న జరుగనుంది. -
16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జవేరియా ఖాన్ 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల జవేరియా ఖాన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇవాళ (మార్చి 21) ప్రకటించింది. జవేరియా 2008-2023 మధ్యలో 116 వన్డేలు, 112 టీ20లు ఆడింది. ఈమె వన్డేల్లో 2 శతకాలు, 15 అర్దశతకాల సాయంతో 2885 పరుగులు.. టీ20ల్లో 10 అర్దశతకాల సాయంతో 2018 పరుగులు చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన జవేరియా.. వన్డేల్లో 17, టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టింది. తన కెరీర్లో ఫీల్డర్గానూ చురుకైన పాత్ర పోషించిన జవేరియా వన్డేల్లో 34 క్యాచ్లు, 13 రనౌట్లు.. టీ20ల్లో 16 క్యాచ్లు, 10 రనౌట్లు చేసింది. 17 వన్డేలు, 16 టీ20ల్లో పాక్ జాతీయ జట్టుకు సారధ్యం వహించిన జవేరియా .. ప్రస్తుత పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్కు డిప్యూటీగానూ (వైస్ కెప్టెన్) వ్యవహరించింది. -
సత్తా చాటిన హీథర్ నైట్.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్లో భాగంగా ఇవాళ (మార్చి 19) జరిగిన తొలి మ్యాచ్లో స్థానిక మహిళా టీమ్ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సత్తా చాటిన హీథర్ నైట్.. హీథర్ నైట్ మెరుపు అర్దశతకంతో (39 బంతుల్లో 63; 8 ఫోర్లు,సిక్స్) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. నైట్కు జతగా మైయా బౌచియర్ (43 నాటౌట్), డంక్లీ (32) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్, ఫ్రాన్ జోనాస్, లియా తుహుహు తలో వికెట్ పడగొట్టారు. తడబడిన న్యూజిలాండ్.. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వేగంగా పరుగులు సాధించలేక లక్ష్యానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుజీ బేట్స్ (65) అర్దశతకంతో రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన వారు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. బ్రూక్ హల్లీడే 27 నాటౌట్, జార్జియా ప్లిమ్మర్ 21 పరుగులు చేయగా.. మ్యాడీ గ్రీన్ 8, జెస్ కెర్ 8 నాటౌట్, ఇసబెల్లా గేజ్, మికేలా గ్రేగ్ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు పడగొట్టగా.. సారా గ్లెన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 మార్చి 22న జరుగనుంది. -
గుజరాత్ జెయింట్స్కు ఎదురుదెబ్బ
మహిళల ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఆ జట్టు బ్యాటర్ హర్లీన్ డియోల్ మిగితా డబ్యూపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైంది. హర్లీన్ స్థానాన్ని మరో టీమిండియా బ్యాటర్ భారతి ఫుల్మలితో భర్తీ చేస్తున్నట్లు గుజరాత్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయంతో బాధపడుతూనే ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్లు ఆడిన హర్లీన్.. వరుసగా 8, 22, 18 స్కోర్లు చేసింది. టీమిండియా తరఫున 10 వన్డేలు, 24 టీ20లు ఆడిన ఈ చంఢీఘడ్ అమ్మాయి.. రెండు ఫార్మాట్లలో కలిపి 3 అర్దసెంచరీల సాయంతో 458 పరుగులు చేసింది. హర్లీన్ స్థానంలో ఎంపికైన భారతి టీమిండియా తరఫున 2 టీ20లు ఆడి 23 పరుగులు చేసింది. దేశవాలీ టోర్నీల్లో విదర్భకు ఆడే భారతి.. మహిళల టీ20 లీగ్లో ట్రైల్బ్లేజర్స్కు ప్రాతినిథ్యం వహించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత డబ్యూపీఎల్ సీజన్లో గుజరాత్ జెయింట్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది. ముంబై, ఆర్సీబీ, యూపీ, ఢిల్లీ జట్ల చేతిలో ఓడిన ఈ జట్టు మార్చి 6న మరోసారి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. గుజరాత్ రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. -
క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా) సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ మూడో ఓవర్లో షబ్నిమ్ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించింది. ఈ ఓవర్ రెండో బంతిని షబ్నిమ్ 132.1 కిమీ వేగంతో సంధించింది. మహిళల క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లోనైనా ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. షబ్నిమ్ రికార్డును ఆమెనే బ్రేక్ చేసుకుంది. Mumbai Indians fast bowler Shabnim Ismail bowled the Fastest Delivery by a Women's Cricket - 132.1 KMPH 👏 #MIvDC #WPL2024 #DCvMI pic.twitter.com/srOZimZ0HQ — Richard Kettleborough (@RichKettle07) March 5, 2024 2016లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో షబ్నిమ్ 128 కిమీ వేగంతో బంతిని సంధించింది. ఈ మ్యాచ్కు ముందు వరకు మహిళల క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీగా ఉండింది. 2022 వన్డే వరల్డ్కప్లో షబ్నిమ్ రెండు సార్లు 127 కిమీ వేగంతో బంతులను సంధించింది. తాజాగా తన పేరిట ఉండిన రికార్డును షబ్నిమ్ తనే బ్రేక్ చేసుకుంది. మహిళల క్రికెట్లో 130 కిమీలకు పైగా వేగంతో నమోదైన బంతి ఇదే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, షబ్నిమ్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై 168 పరుగులకే పరిమితమై 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో షబ్నిమ్ 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టింది. -
రెచ్చిపోయిన రోడ్రిగెజ్.. విరుచుకుపడిన లాన్నింగ్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లు షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు షాట్లతో విరుచుకుపడగా.. ఆతర్వాత బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగెజ్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ ఆవలికి తరలించింది. ఢిల్లీ ఇన్నింగ్స్లో అలైస్ క్యాప్సీ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), మారిజన్ కప్ (12 బంతుల్లో 11; ఫోర్) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. జెస్ జొనాస్సెన్ 5 బంతుల్లో 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, పూజా వస్త్రాకర్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. -
అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ అందుకున్న ఆర్సీబీ ప్లేయర్
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 27) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ ప్లేయర్, టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్కు స్టాండ్స్లో ఉన్న ఓ అభిమాని నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్లో ఉన్న ఓ వ్యక్తి "Will You Marry Me Shreyanka" (నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయాంక) అని రాసి ఉన్న ప్లకార్డ్ను ప్రదర్శించాడు. ఆ ప్లకార్డ్పై హార్ట్ సింబల్తో పాటు అతని పేరు కన్నడలో రాసి ఉంది. ఈ సీన్ లైవ్లోకి రాగానే డగౌట్లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు నవ్వుకున్నారు. క్రీడా ప్రాంగణాల్లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో క్రీడాకారులు ఇలాంటి ప్రపోజల్స్ అందుకున్నారు. గతంలో మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ అందుకున్న పెళ్లి ప్రపోజల్ బాగా హైలైట్ అయ్యింది. Marriage proposal for Shreyanka Patil and RCB’s players laughing in the dressing room. pic.twitter.com/yoY4e5zfxK — CricketMAN2 (@ImTanujSingh) February 27, 2024 బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల శ్రేయాంక (రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్) ఆర్సీబీతో పాటు కర్ణాటక, టీమిండియా, గయానా అమెజాన్ వారియర్స్కు (కరీబియన్ ప్రీమియర్ లీగ్) ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ అమ్మాయి టీమిండియా తరఫున 2 వన్డేలు (4 వికెట్లు), 6 టీ20లు (8 వికెట్లు) ఆడింది. కాగా, గుజరాత్తో జరిగిన నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, లీగ్లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగా.. ఆర్సీబీ కేవలం 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రేణుకా సింగ్ (4-0-14-2), మోలినెక్స్ (4-0-25-3), స్మృతి మంధన (43), సబ్బినేని మేఘన (36 నాటౌట్), ఎల్లిస్ పెర్రీ (23 నాటౌట్) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. -
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. తేలిపోయిన గుజరాత్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేసింది. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ (4-0-14-2), సోఫీ మోలినెక్స్ (4-0-25-3), జార్జియా వేర్హమ్ (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. వికెట్లు తీయలేకపోయినా సోఫీ డివైన్ (4-0-12-0), ఆశా శోభన (3-0-13-0) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్లో దయాలన్ హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్గా నిలువగా.. హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బెత్ మూనీ (8), లిచ్ఫీల్డ్ (5), వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7), కేథరీన్ బ్రైస్ (3) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత ఎడిషన్లో ఇరు జట్లుకు ఇది రెండో మ్యాచ్. తమ తొలి మ్యాచ్లో ఆర్సీబీ.. యూపీ వారియర్జ్ను ఓడించి బోణీ కొట్టగా.. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన గుజరాత్ బోణీ విజయం కోసం ఎదురు చూస్తుంది. ఈ లీగ్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ, ఆర్సీబీ, గుజరాత్, యూపీ వరస స్థానాల్లో ఉన్నాయి. -
అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహిళల ఐపీఎల్.. సందడి చేసిన షారుక్ ఖాన్
మహిళల ఐపీఎల్ (WPL) 2024 సీజన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 23) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్కు ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుక్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్ర, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్ సందడి చేశారు. SOUND ON 😍 𝙎𝙝𝙖𝙝 𝙍𝙪𝙠𝙝 𝙆𝙝𝙖𝙣 👑 showcases his aura at the #TATAWPL Opening Ceremony 🤩🤩@iamsrk pic.twitter.com/WLjSmCxVXL — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 వీరిలో షారుక్ ఖాన్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. షారుక్ ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లతో కలియదిరుగుతూ వారితో స్పెప్పులు వేయించి ఫోటోలకు పోజులిచ్చాడు. Bengaluru erupts with joy to welcome Shahid Kapoor to the #TATAWPL Opening Ceremony 😃🙌@shahidkapoor pic.twitter.com/C2LckHvV2D — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 మిగతా హీరోలు ఒక్కో ఫ్రాంచైజీ తరఫున ఆడి, పాడారు. కార్తీక్ ఆర్యన్ గుజరాత్ జెయింట్స్ను, సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీ క్యాపిటల్స్ను, టైగర్ ష్రాఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును, వరుణ్ ధావన్ యూపీ వారియర్స్ను, షాహిద్ కపూర్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను రిప్రజెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సీ (ఇంగ్లండ్) 75 పరుగులు చేసి క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 31, షఫాలీ వర్మ 1, జెమీమా రోడ్రిగెజ్ 42, మారిజన్ కప్ 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ర్, నాట్ సీవర్ బ్రంట్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్ ఇస్మాయిల్ ఓ వికెట్ దక్కించుకుంది. -
ఆసీస్ క్రికెటర్ అద్భుత ప్రదర్శన.. బంతితో రాణించి, బ్యాట్తో డబుల్ సెంచరీ
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్ల్యాండ్ అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తొలుత బంతితో రాణించిన (3/19) అన్నాబెల్.. ఆతర్వాత బ్యాట్తో విశ్వరూపం ప్రదర్శించింది. ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కేవలం 248 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్లో మొత్తం 256 బంతులు ఎదుర్కొన్న అన్నాబెల్ 210 పరుగులు చేసి ఔటైంది. ఆన్నాబెల్.. టెయిలెండర్లు ఆష్లే గార్డ్నర్ (65), కిమ్ గార్త్ (49 నాటౌట్), సోఫీ మోలినెక్స్ (33) సహకారంతో డబుల్ సెంచరీ పూర్తి చేసింది. అంతకుముందు కెప్టెన్ అలైసా హీలీ (99), బెత్ మూనీ (78) కూడా రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 575 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లాస్, టైరాన్ తలో 3 వికెట్లు, డి క్లెర్క్ 2, టక్కర్ ఓ వికెట్ పడగొట్టారు. దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 76 పరుగులకే ఆలౌటైంది. డార్సీ బ్రౌన్ (5/25), అన్నాబెల్ (3/19), తహిళ మెక్గ్రాత్ (2/4) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో సూన్ లస్ (26), పదో నంబర్ ప్లేయర్ క్లాస్ ఝ(10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇది రెండో రోజు మాత్రమే. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం ఆసీస్ 499 పరుగుల ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా మహిళా జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. -
ఎట్టకేలకు గెలిచిన సౌతాఫ్రికా.. 17వ ప్రయత్నంలో విజయం
మహిళల క్రికెట్లో తమపై ఆస్ట్రేలియా ఆథిపత్యానికి సౌతాఫ్రికా చెక్ పెట్టింది. వన్డేల్లో వరుసగా 16 మ్యాచ్ల్లో విజయం ఎరుగని ప్రొటీస్ జట్టు.. ఎట్టకేలకు 17వ ప్రయత్నంలో (ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 16 వన్డేల్లో ఓ మ్యాచ్ టై కాగా మిగతా మ్యాచ్లన్నీ ఆస్ట్రేలియానే గెలిచింది) విజయం సాధించగలిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 80 పరుగుల తేడాతో గెలుపొందింది. 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మారిజెన్ కప్ (75) అర్ధసెంచరీతో రాణించగా.. అన్నెక్ బోష్ (44), క్లో టైరాన్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో రెండు వికెట్లు సాధించగా.. సదర్ల్యాండ్, కిమ్ గార్త్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 29.3 ఓవరల్లో 149 పరుగులకే చాపచుట్టేసింది. మారిజెన్ కెప్ 3, అయాండా హ్లుబీ, ఎలిజ్ మారి మార్క్స్, డి క్లెర్క్ తలో 2 వికెట్లు, క్లో టైరాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో పదో నంబర్ ప్లేయర్ కిమ్ గార్త్ (42 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచింది. గార్త్.. గార్డ్నర్ (35) సాయంతో ఈ ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఆసీస్ మరింత దారుణంగా ఓడేది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ ఆసీస్ గెలువగా.. రెండో దాంట్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 10న సిడ్నీలోనే జరుగనుంది. -
గుజరాత్ జెయింట్స్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్కు (రెండవది) ముందు గుజరాత్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్ను నియమించుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ క్లింగర్ గుజరాత్ హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్ స్థానాన్ని క్లింగర్ భర్తీ చేస్తాడు. క్లింగర్ ఎంపిక విషయాన్ని గుజరాత్ జెయింట్స్ మేనేజ్మెంట్ ఇవాళ (ఫిబ్రవరి 6) అధికారికంగా ప్రకటించింది. తొలి సీజన్ నుంచి జెయింట్స్ బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న క్లింగర్ .. మెంటార్ మిథాలీ రాజ్, బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్తో ఇదివరకే జాయిన్ అయినట్లు జెయింట్స్ మేనేజ్మెంట్ తెలిపింది. క్లింగర్.. మహిళల బిగ్బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్ అసిస్టెంట్ కోచ్గా, అదే సిడ్నీ థండర్స్ రిక్రూటర్గా, 2019-2021 వరకు మెల్బోర్న్ రెనెగేడ్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్గా పని చేశాడు. 43 ఏళ్ల క్లింగర్ 2019లో బిగ్బాష్ లీగ్కు రిటైర్మెంట్ (ఆటగాడిగా) పలికాడు. నాటికి క్లింగర్ బీబీఎల్లో లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. Coach saheb padharya! 🤩 We are delighted to welcome former Australian cricketer @maxyklinger as our head coach for the upcoming WPL season. 🙌🧡#BringItOn #GujaratGiants #Adani pic.twitter.com/iJjqnSUo9K — Gujarat Giants (@Giant_Cricket) February 6, 2024 ఇదిలా ఉంటే, మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్లో (2023) గుజరాత్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో ఈ జట్టు ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి లీగ్ నుంచి నిష్క్రమించింది. గత సీజన్ పేలవ ప్రదర్శన కారణంగా మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్పై వేటు పడింది. గతేడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ముంబై టీమ్.. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించి, తొలి WPL టైటిల్ను ఎగరేసుకుపోయింది. 2024 సీజన్ విషయానికొస్తే.. ఈ సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో మ్యాచ్లన్నీ బెంగళూరు, న్యూఢిల్లీ వేదికలుగా జరుగనున్నాయి. తొలి మ్యాచ్ గతేడాది ఫైనలిస్ట్ల మధ్య బెంగళూరులో జరుగనుంది. గుజారత్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 25న ముంబై ఇండియన్స్తో ఆడుతుంది. జెయింట్స్లో త్రిష పూజిత, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, మేఘన సింగ్, మన్నత్ కశ్యప్, స్నేహ్ రాణా లాంటి భారతీయ స్టార్లు ఉన్నారు. -
వెస్టిండీస్కు భారీ షాక్.. ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు క్రికెటర్లు
వెస్టిండీస్ క్రికెట్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆఫ్ స్పిన్నర్ అనిసా మొహమ్మద్, మీడియం పేసర్ షకీరా సెల్మన్, కవలలైన వికెట్కీపర్ కమ్ బ్యాటర్ కైసియ నైట్, మిడిలార్డర్ బ్యాటర్ కైషోనా నైట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు విండీస్ టీ20 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్లోని (2016) సభ్యులు. అనుభవజ్ఞులైన ఈ నలుగురు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో విండీస్ మహిళల క్రికెట్ జట్టు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ నలుగురు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. WI Women's cricketers Anisa Mohammed, Shakera Selman, Kycia Knight and Kyshona Knight have confirmed their retirement from International cricket. Read More⬇️ https://t.co/bV88ZNxITw — Windies Cricket (@windiescricket) January 18, 2024 35 ఏళ్ల అనిసా మొహమ్మద్ (ఆఫ్ స్పిన్నర్) 2003-22 మధ్యలో విండీస్ తరఫున 141 వన్డేలు, 117 టీ20లు ఆడి 305 వికెట్లు పడగొట్టింది. ఇందులో తొమ్మిది ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. 34 ఏళ్ల షకీరా సెల్మన్ (మీడియం పేసర్) 2008-22 మధ్యలో విండీస్ తరఫున 100 వన్డేలు, 96 టీ20లు ఆడి 133 వికెట్లు తీసి,310 పరుగులు చేసింది. షకీరా వన్డేల్లో ఓసారి ఐదు వికెట్ల ఘనత నమోదు చేసింది. 31 ఏళ్ల కైషోనా నైట్ (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) 2013-22 మధ్యలో విండీస్ తరఫున 51 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓ హాఫ్ సెంచరీ సాయంతో 1397 పరుగులు చేసి, ఓ వికెట్ తీసింది. 31 ఏళ్ల కైసియ నైట్ (వికెట్కీపర్ బ్యాటర్) 2011-22 మధ్యలో 87 వన్డేలు, 70 టీ20లు ఆడి నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 2128 పరుగులు చేసి 78 మందిని ఔట్ చేయడంలో భాగమైంది. -
IND W vs AUS W 3rd T20: సిరీస్ ఎవరిదో?
నవీ ముంబై: మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భారత్, ఆ్రస్టేలియా మహిళా జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్ను గెలుచుకునేందుకు ఫైనల్ లాంటి పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్లో క్లీన్స్వీప్ అయిన భారత అమ్మాయిలు ఇప్పుడు టి20 సిరీస్ను కోల్పోడానికి సిద్ధంగా లేరు. ఆఖరి పోరులో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో హర్మన్ప్రీత్ కౌర్ బృందం బరిలోకి దిగుతోంది. తద్వారా కొత్త ఏడాదిలో క్లీన్స్వీప్ పరాభవాన్ని మరిచేలా ఈ టి20 సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో నెగ్గినట్లే ఈ ఆఖరి పోరులోనూ దాన్ని పునరావృతం చేస్తే సిరీస్ కష్టం కానేకాదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమాలు రాణిస్తే తొలి మ్యాచ్ను గెలుచుకున్నంత సులభంగా సిరీస్నూ గెలుచుకోవచ్చు. గత మ్యాచ్లో వీరి వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. దీంతో పాటు కెపె్టన్ హర్మన్ప్రీత్ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఈ నలుగురు కీలకమైన చివరి మ్యాచ్లో రాణిస్తే మాత్రం మన మహిళా జట్టుకు తిరుగుండదు. బౌలింగ్లో రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్తో పోల్చుకుంటే భారత ఫీల్డింగ్ సాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్కు ఫీల్డింగ్పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్ ఓడాక అలీసా హీలీ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. తాజా టి20 సిరీస్లోనూ తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడినా... రెండో మ్యాచ్లో బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్ విజయంపై కన్నేసింది. -
ఆసీస్తో రెండో టీ20.. టీమిండియా ఆల్రౌండర్ అరుదైన రికార్డు
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్గా దీప్తికి ముందు ఈ ఘనతను మరో ముగ్గురు మహిళా క్రికెటర్లు సాధించారు. పాకిస్తాన్కు చెందిన నిదా దార్ (1839 పరుగులు, 130 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ (1750 పరుగులు, 123 వికెట్లు), న్యూజిలాండ్కు చెందిన సోఫీ డివైన్ (3107 పరుగులు, 113 వికెట్లు) టీ20ల్లో అరుదైన డబుల్ను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (30) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో దీప్తితో పాటు రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 26, బెత్ మూనీ 20, తహిల మెక్గ్రాత్ 19, ఎల్లిస్ పెర్రీ 34 నాటౌట్, ఆష్లే గార్డ్నర్ 7, లిచ్ఫీల్డ్ 18 నాటౌట్ తలో చేయి వేసి ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. బ్యాట్తో రాణించిన దీప్తి బంతితోనూ సత్తా చాటింది. 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ నెగ్గగా.. ఆసీస్ రెండో టీ20 గెలిచింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జనవరి 9న జరుగనుంది. -
ఆసీస్తో రెండో టీ20.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియా
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా నామామత్రపు స్కోర్కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. భారత ఇన్నింగ్స్లో దీప్తి శర్మ (30) టాప్ స్కోరర్గా నిలువగా.. రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. షెఫాలీ వర్మ (1), హార్మన్ప్రీత్ కౌర్ (6), పూజా వస్త్రాకర్ (9), అమన్జోత్ కౌర్ (4) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ దక్కించుకుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో విజయం సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయగా.. ఏకైక టెస్ట్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీకి ఈ మ్యాచ్ 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement