-
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు మలేషియాలో: మంచు విష్ణు
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకను మలేషియాలో ఘనంగా నిర్వహిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. సినీ పెద్దలతో చర్చించి త్వరలోనే వేడుకల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా ఉండటం చాలా గర్వంగా ఉంది.జులైలో మలేషియాలో తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తాం. తెలుగు సినీ పరిశ్రమ ఘన కీర్తిని తొడ కొట్టి చెప్పాలనే ఈ వేడుకలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ వేడుకల గురించి ఫిల్మ్ ఛాంబర్తో మాట్లాడాం. జులైలో తెలుగు పరిశ్రమకు రెండు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరాం.అందుకు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలో ఉన్న ఐదు అసోసియేషన్ లతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒప్పందం చేసుకున్నాం. భారతీయ సినిమాను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృషి చేస్తోంది’ అని అన్నారు. -
‘మా’తో బాలీవుడ్ ఒప్పందం
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), బాలీవుడ్ అసోసియేషన్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలు చేసే బాలీవుడ్ కళాకారులకు ‘మా’ సభ్యత్వం అందుతుంది. అలాగే బాలీవుడ్ చిత్రాల్లో నటించే తెలుగువాళ్లకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం ఉంటుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ని కలిసి, రెండు అసోసియేషన్లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతి΄ాదన ఉంచారు. అందుకు బాలీవుడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ‘మా’, సినేటా (హిందీ చలనచిత్రం మరియు టీవీ అసోసియేషన్) ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి. ‘‘త్వరలో వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలి’’ అన్నారు మంచు విష్ణు. -
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్బండ్పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్
సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయన పార్థివదేహం వద్ద నివాశులర్పించారు. శరత్ బాబు గొప్ప నటుడని విష్ణు కొనియాడారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి.. అందరూ గర్వించే విధంగా ఎదిగారని అన్నారు. ఈ సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచు విష్ణు మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అందరం అండగా ఉందాం.' అని అన్నారు. శరత్ బాబు పార్థివదేహానికి నటులు మురళీ మోహన్, శివాజీ రాజా, శివ బాలాజీ, ప్రసన్న కుమార్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్పై చేసిన కామెంట్స్పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు.. మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ నిర్వహించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మా ప్రిసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ.. కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మెన్ గురునాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, డాక్టర్ మేఘనాథ్ రెడ్డిలకి ధన్యవాదాలు తెలిపాడు. 'జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్ మాకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషం' అని విష్ణు పేర్కొన్నారు. మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తున్న మూడవ హెల్త్ చెకప్ ఇది. మా సభ్యులందరికి 3 లక్షల విలువ చేసే హెల్త్ భీమాని ఉచితంగా అందిస్తున్నాం" అని తెలిపారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
అలా చేస్తే వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తా: మంచు విష్ణు
సాక్షి, హైదరాబాద్: మా ఎన్నికల్లో తాను చేసిన వాగ్దానాలు 90 శాతం పూర్తయ్యాయన్నాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు. సంక్రాంతి తర్వాత మా కోసం యాప్ తీసుకొస్తామని, నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్లెట్ తయారుచేశామని చెప్పాడు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి మోహన్బాబు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. '2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్ 13న నేను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు సినీపరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది. నేను మా అసోసియేషన్కే కాదు ప్రేక్షకులకు కూడా జవాబుదారీనే! మా అసోసియేషన్లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్ సభ్యత్వం కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం. నటీనటులు కనీసం రెండు చిత్రాల్లో నటించి, అవి విడుదలైతేనే వారికి మాలో శాశ్వత సభ్యత్వం ఉంటుంది. కనీసం ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగ్ చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం కల్పిస్తాం. అసోసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. మా అసోసియేషన్కు వ్యతిరేకంగా ఎవరైనా నటీనటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అసోసియేషన్కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు పోటీకి అనర్హులవుతారు. మా అసోసియేషన్ భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించాను. ఫిల్మ్ నగర్కు అరగంట దూరంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తాను. చాలా మంది సభ్యులు రెండో అంశానికే మద్దతు పలికారు' అని చెప్పాడు. చదవండి: ఆరోహి పోయిందంటే ఇనయను తగులుకున్నాడు సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి.. : నటి -
తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు
కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్సీసీ–తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఇటీవల నాలుగు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్లు నిలిపివేసి, సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సెస్టెంబర్ 1 నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. షూటింగ్లు కూడా ఆరంభం అయ్యాయి. తాజాగా పారితోషికం, ఓటీటీ, థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్, ఫెడరేషన్కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ, టీఎఫ్సీసీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వస్తాయన్నట్లుగా టీఎఫ్సీపీ పేర్కొంది. కాగా ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపాకే ఈ కొత్త మార్గదర్శకాలను నిర్ణయించినట్లుగా టీఎఫ్సీసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా.... ప్రొడక్షన్కు సంబంధించిన గైడ్లైన్స్ ► నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు. ► నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బంది వేతనాలు చెల్లించుకోవాలి. అలాగే స్థానిక రవాణా, బస, స్పెషల్ ఫుడ్ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. ► సినిమా షూటింగ్ ప్రారంభించడా నికి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. ► కాల్షీట్స్ టైమింగ్, సెట్స్లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్ రిపోర్ట్ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఓటీటీ : ► ఓ సినిమా ఏ టీవీ చానెల్లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది? అనే అంశాలను టైటిల్స్లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్లో కానీ బహిర్గతం చేయకూడదు. ► థియేటర్స్లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్ ► వీపీఎఫ్ (వర్చ్యువల్ ప్రింట్ ఫీ)కి సంబంధించిన చార్జీల విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్తో నేడు జరగాల్సిన సమావేశం 6కి వాయిదా పడింది. ► తెలంగాణలో మల్టీప్లెక్స్లకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో ఇకపై ఆంధ్రప్రదేశ్లోనూ అంతే ఇస్తారు. సినీ కార్మికుల సంఘం: ► కార్మికులకు సంబంధించిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయి. రేట్ కార్డ్స్ ఫైనలైజ్ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని భోగట్టా. కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని సమాచారం. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది పారితోషికం, సొంత రవాణా ఖర్చులు వంటివాటిపై ‘మా’ సుముఖత వ్యక్తపరిచిందట. కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ త్వరలో అధికారికంగా పంపనుందని సమాచారం. ► కొత్త మార్గదర్శకాల్లో రోజువారీ వేతనాల గురించిన అంశం ఒకటి. మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పెద్ద రేంజ్ ఉన్నవారు రోజువారీ వేతనాలు తీసుకుంటారు. అయితే ఇకపై వారికి కూడా సినిమాకి ఇంత అని పారితోషికం నిర్ణయించాలనుకుంటున్నారు. మరి.. రోజువారీ వేతనాలు తీసుకునేది ఎవరూ అంటే.. అట్మాస్ఫియర్ కోసం సీన్లో నిలబడేవాళ్లు, అటూ ఇటూ కదులుతూ కనిపించేవాళ్లు, డైలాగ్స్ చెప్పే జూనియర్ ఆర్టిస్టులు .. ఇలా చిన్న స్థాయి కళాకారులు రోజువారీ వేతనాల కిందకు వస్తారు. -
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో దిల్ రాజు భేటీ
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుతో నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. గురువారం ఉదయం మా కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్స్ బంద్పై, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు ముచ్చటించారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరు ఆయన ట్వీట్ చేశారు. దిల్ రాజును కలిసిన సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, అలాగే కొత్తవారు ‘మా’ సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని దిల్ రాజును కోరినట్లు విష్ణు తెలిపారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటి వినతి పత్రాన్ని దిల్ రాజుకు అందించారు. కాగా ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించాలని కోరుతూ విష్ణు ఇకపై పలువురు టాలీవుడ్ నిర్మాతలను కలవనున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన దిల్ రాజుతో భేటి అయినట్లు సమాచారం. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు హఠాన్మరణం Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J — Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022 -
ప్రొడ్యూసర్స్ గిల్డ్తో ‘మా’ కీలక భేటీ.. ‘అవసరమైతే స్ట్రయిక్ తప్పదు’
‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం దిశగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) సమస్యల గురించి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్లతో చర్చలు జరిపారు. బుధవారం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సభ్యులు సమావేశమై పలు సమస్యల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘మా’ జనరల్ సెక్రటరీ రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ హాజరయ్యారు. ఇటు నిర్మాతలు ‘దిల్’ రాజు, మైత్రీ నవీన్, నాగవంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్, నటి-దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నటీనటుల పారితోషికాలు, ‘మా’ సభ్యత్వం వంటి అంశాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలిసింది. నూతన నటీనటులను సినిమాల్లోకి తీసుకోవాలంటే వాళ్లు కచ్చితంగా ‘మా’లో అసోసియేట్ లేదా లైఫ్ మెంబర్షిప్ అయినా ఉండాలని, వేరే భాషల నటులను ఇక్కడి సినిమాలకు తీసుకుంటే వాళ్లకు కూడా ‘మా’లో మెంబర్షిప్ ఉండాలనే నిర్ణయాలను ‘మా’ ప్రతిపాదించిందట. ఓటీటీల్లో నటించే ఆర్టిస్టులకూ ‘మా’లో సభ్యత్వం ఉండాలనే అంశాన్ని కూడా చర్చించారట. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు వందమంది సీనియర్ నటీనటుల పేర్లు సూచించి, వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలను ‘మా’ కోరినట్లు తెలిసింది. షూటింగ్ బంద్కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేలోపు ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులనే తీసుకోవాలన్నట్లుగా నిర్మాతలు నిర్ణయించుకోవాలని కూడా ‘మా’ కోరిందని భోగట్టా. అలా కాని పక్షంలో ‘మా’నే స్ట్రైక్కు పిలుపునివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. -
'మా'తో ముగిసిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సమావేశం ముగిసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో దిల్ రాజు, జీవిత రాజశేఖర్, రఘుబాబు, మంచు విష్ణు, తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగుల నిలుపుదల, ఆర్టిస్టుల పారితోషికం విషయాలపై చర్చించారు. కాగా పారితోషికం తగ్గింపు విషయంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇదివరకే ప్రత్యేక కమిటీని వేసింది. మరోవైపు ఇదే విషయంపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 33 మందితో ఓ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే! చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్కు మెరుగులు ఆ హీరోయిన్తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే.. -
యాక్సిడెంట్ అయి సింగపూర్కి వెళ్తే అలా అన్నారు: మంచు విష్ణు
'మా' అసోసియేషన్ సభ్యుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంచు విష్ణు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో 'మా' సభ్యుల కోసం ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించారు. దీని ప్రకారం మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్తో పాటు పది రకాల హెల్త్ చెకప్లు ఉచితంగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. 'మా సభ్యులకు ఏఐజీ వారు ఉచితంగా చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.గతంలో మలేసియాలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్టర్ చెకప్కి సింగపూర్కి వెళ్తే ఇండియాలో ఏఐజీ పెట్టుకొని ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు అని అడిగారు. అలాంటి హాస్పిటల్లో ఇకపై మా సభ్యలకు ఉచితంగా హెల్త్ చెకప్ అందిస్తుండం సంతోషం. ఈ క్యాంప్ వల్ల మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు' అని పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు అధ్యక్షుడు అయ్యాక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నటుడు నరేష్ అన్నారు. కరోనా సమయంలో ఆర్టిస్టులు కష్టాలు చూసి విష్ణు ఇప్పుడు మెడికల్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈరోజు జరిగిన క్యాంప్లో సుమారు 300కి పైగా మా సభ్యులు చెకప్లు చేసుకున్నారని తెలిపారు. ఏఐజీ ఇంటర్నేషనల్ లెవల్లో ఉందన్నారు. ఇక ఈ సందర్బంగా ఏఐజీ డైరక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్లు వేసుకొని షూటింగ్ చేయొచ్చా అని అడిగేవారు. వాళ్లు చాలా కష్టపడుతున్నారు. అయితే ఆర్టిస్టులలో లైఫ్స్టైల్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్ వ్యాధి, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అని పేర్కొన్నారు. -
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. ఫిల్మ్నగర్లోని మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) కార్యాలయంలో విలువైన సామాగ్రి కనిపించడం లేదని మంచు విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్పింగ్ సామాగ్రిని దుండగులు దొంగలించినట్లు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దొంగతనం జరిగినప్పటి నుంచి హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండోచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. మరి ఈ సంఘటనపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి. -
మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్.. 'ఆ జీవోపై చర్చ జరగాలి'
Manchu Vishnu Sensational Comments About Maa Association: హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మన్యం రాజు మూవీ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలోనే మా అసోసియేషన్ తరపున మా భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు. మోహన్బాబు నాయకత్వంలో తిరుపతిలో స్టూడియో ఏర్పాటు గురించి త్వరలోనే ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. 'నూతన నటీనటులు , సాంకేతిక సిబ్బందిని ప్రోత్సాహిస్తాం. సినిమా టికెట్స్ ధరలు విషయం లో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్పడం సరికాదు. లెజెండరీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్బాబు,నాగార్జున, వెంకటేష్ మాకు ఆదర్శం. దాసరి నారాయణరావు వై.ఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి సీఎంగా ఉన్నపుడు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి జీవో తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు నలుగురి కోసం ఆ జీవో మార్చారు. దీనిపై చర్చ జరగాలి' అని విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. -
‘మా ఏపీ’ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్’ (మా ఏపీ) ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ప్రస్తుత కార్యవర్గంలో ప్రెసిడెంట్గా నటి కవిత, ప్రధాన కార్యదర్శిగా నరసింహ రాజు, కార్యదర్శిగా అన్నపూర్ణల పదవీ కాలం ముగిసింది. కరోనా వల్ల ఎన్నికలను సకాలంలో నిర్వహించలేకపోయాం. 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు ‘మా ఏపీ’లో సభ్యులుగా ఉన్నారు. 24 విభాగాల్లోని ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తును ‘మా ఏపీ’ కార్యాలయానికి పంపవచ్చు. ఎన్నికల తేదీని మార్చి 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారు’’ అని దిలీప్ రాజా పేర్కొన్నారు. -
MAA: రాజీనామాలపై మంచు విష్ణు కీలక నిర్ణయం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ‘మా’ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలుపొందిన 11 మంది రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని మంచువిష్ణు క్లారిటీ ఇచ్చారు. అయితే ‘మా’సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించలేదని తెలిపారు. ‘మా’ బిల్డింగ్పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని మంచు విష్ణు అనఆనరు. కాగా, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు…ప్రకాశ్ రాజ్పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్లోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి గెలుపొంది, రాజీనామా చేసిన సభ్యులు వీరే జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్ వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్ ఈసీ మెంబర్స్ బ్రహ్మాజీ శివారెడ్డి సుడిగాలి సుధీర్ ప్రభాకర్ తనీష్ కౌశిక్ సురేశ్ కొండేటి సమీర్ -
‘మా’ సభ్యుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు
MAA Members to Receive Corporate Health Care: MAA President Manchu Vishnu: పోటా పోటీగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నటుడు మంచు విష్ణు విజయం సాధించి ‘మా’ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన ఆనందరం తొలి కర్తవ్యంగా ‘మా’లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించే దిశగా విష్ణు అడుగులు వేస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. చదవండి: షాకింగ్ లుక్లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? ఈ నేపథ్యంలో తమ ప్రధాన ఎజెండాల్లో ఒక్కటైన సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు విష్ణు పెర్కొన్నారు. మంగళవారం మీడియాతో ముచ్చటించిన విష్ణు సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందుకోసం మా సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నగరంలోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషనల్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. చదవండి: ప్రతీకార కథాంశంతో కొరటాల, ఎన్టీఆర్ చిత్రం అలాగే నిరంతరం సభ్యులు తమ ఆరోగ్యాన్ని ఈ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. అంతేకాకుండా వైద్యనిపుణులతో ముఖాముఖీ మాట్లాడటంతో పాటు వీడియో కన్సల్టెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించారు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్లో అపోలో, సెప్టెంబర్లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. అలాగే టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లోనూ మా సభ్యులకు రాయితీపై రోగ నిర్దారణ పరీక్షలు చేయించనున్నట్లు విష్ణు వెల్లడించారు. -
సినిమా ఇండస్ట్రీలో కులం లేదు..అలా చేయడం తప్పు : డైరెక్టర్
Director Samudra Contesting In Directors Association Elections: ‘‘డైరెక్టర్స్ అసోసియేషన్కు డిసిప్లిన్, డిగ్నిటీ, డీసెన్సీ ఉన్నాయి. ఎలక్షన్స్లో భాగంగా కొందరు కులప్రస్తావన తీసుకువస్తున్నారు. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో కులం లేదు. సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, హీరోలు, నిర్మాతలు.. అందరిదీ ఒకటే కులం’’ అన్నారు దర్శకుడు సముద్ర. ఈ నెల 14న (ఆదివారం) హైదరాబాద్లోని ఫిలింనగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో దర్శకుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి వి.సముద్ర పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన ప్యానల్ను గురించిన వివరాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సముద్ర మాట్లాడుతూ – ‘‘ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారి జయంతిని మే 3,4 తేదీల్లో ఓ పండగలా చేస్తాం. డైరెక్టర్స్ డే (ప్రముఖ దివంగత దర్శకులు దాసరినారాయణరావు జయంతిన దర్శకుల సంఘం అసోసియేషన్ బిల్డింగ్కు శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం. అన్నపూర్ణ క్యాంటీన్, ‘మా’ అసోసియేషన్లో కథల రిజిస్ట్రేషన్, లెజెండ్ సెంచరీ అవార్డ్స్లను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. హామీలను నేరవేర్చకపోతే మే 5న రాజీనామా చేస్తాను.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సముద్ర ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే..ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్న కారణంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని, ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న జర్నలిస్టు ప్రభు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ విషయమై ప్రభు హైకోర్టును ఆశ్రయించగా, ఆయన ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. కొందరు వ్యక్తులు చేస్తున్న అప్రజాస్వామిక వ్యవహారాలకు ఈ తీర్పు చెంపపెట్టు అని ప్రభు అన్నారు. -
యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తన తొలి నిర్ణయంగా ‘మా’ మహిళల భద్రతకు ముందడుగా వేశారు. వారి భద్రత కోసం ప్రత్యేకంగా విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్(WEGC)ను ఏర్పాటు చేస్తున్నామని, మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని విష్ణు తన ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: ట్విటర్లో మంచు మనోజ్, ఆర్జీవీల మధ్య ఆసక్తికర సంభాషణ ఇక ఈ విషయం సోషల్ మీడియాలో ప్రకటించిన అనంతరం మంచు విష్ణు పలు యూట్యూబ్ ఛానళ్లుపై మండిపడ్డారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నటీమణులు, హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపెక్షించేది లేదని హెచ్చిరించారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకర రీతిలో వారిపై రూమర్లు క్రియేట్ చేస్తు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. చదవండి: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం ఇక యూట్యూబ్ ఛానళ్లలో థంబ్నైల్స్ హద్దులు మీరుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీమణులు మన ఆడపడుచులని, వారిని గౌరవించాలని విష్ణు విజ్ఞప్తి చేశారు. అలాగే హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించబోమన్నారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు విష్ణు తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లని నియంత్రించడం తన ఎజెండాలో ఓ అంశమని ఆయన పేర్కొన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని మంచు విష్ణు పేర్కొన్నారు. #MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF — Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021 -
ట్విటర్లో మంచు మనోజ్, ఆర్జీవీల మధ్య ఆసక్తికర సంభాషణ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడిచింది. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్పై మంచు విష్ణు విజయం సాధించి ‘మా’ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వివాదాలు, విమర్శలు, ఆరోపణలతో ‘మా’ ఎన్నికలు వాడివేడిగా సాగాయి. ఇరూ ప్యానల్ల సభ్యులు ఒకరిపై ఒకరూ చేసుకున్న విమర్శ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చదవండి: ‘మా’పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్ ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తనదైన శైలిలో స్పందించారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు’ అంటూ వర్మ ట్వీట్ చేయగా.. దానికి మంచు మనోజ్.. ‘మా ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్’ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే ఇది జరిగిన పది రోజులకు తాజాగా వర్మ.. మనోజ్ కౌంటర్పై స్పందించారు. మనోజ్ కామెంట్కు రీట్వీట్ చేస్తూ.. ‘నేను రింగ్ మాస్టర్ కాదు. సర్కస్లో అందరికి వినోదం పంచే కోతిని మాత్రమే’ అని రిప్లై ఇచ్చాడు. చదవండి: పెళ్లిలో కలిసిన మెగా బ్రదర్స్.. నవ్వుతున్న ఫోటోలు వైరల్ దీనిపై మనోజ్ స్పందిస్తూ.. ‘మనం అందరం ఒకటే సర్, సేమ్ సర్కస్కు చెందిన వాళ్లమే’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి ఆర్జీవీ మరో ట్వీట్ చేస్తూ.. ‘హే మనోజ్ మీ డీపీ స్టేటస్ కంటే ‘మా’ ఇంక గొప్పదని అనుకుంటున్నాను’ అంటూ రిప్లై ఇవ్వగా దీనికి మనోజ్ రిప్లై ఇచ్చాడు. మీరు చెప్పంది కరెక్ట్ సర్’ అంటూ రీట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ ‘అవును’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇలా ట్విటర్ వేదికగా వర్మ, మనోజ్ల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వారి ట్వీట్స్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. Regardless we all belong to the same circus sir 🙌🏽🙏🏼🤗 https://t.co/78gwcHn1cp pic.twitter.com/HkBgBhwms0 — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 25, 2021 And @RGVzoomin sir replied me 🤗🤗🤗🤗 yes sir u right 😘❤️ https://t.co/Sa3GC5J74H pic.twitter.com/yLZJX9owNR — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 25, 2021 -
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం
Manchu Vishnu Announced Women Empowerment and Grievance Cell: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మాలో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్(WEGC)ను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని, మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని, త్వరలోనే కమిటీ మెంబర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. #MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF — Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021 -
రేపు గుడ్న్యూస్ చెబుతా : మంచు విష్ణు
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు కార్యచరణ మొదలు పెట్టారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ ఫైల్పై సైన్ చేసిన విష్ణు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే మాకు సొంత బిల్డింగ్ కట్టిస్తానని ప్రకటించిన మంచు విష్ణు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. చదవండి : ఘనంగా వైవా హర్ష వివాహం.. ఫోటోలు వైరల్ ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు,మూడు చోట్ల స్థలాలను కూడా చూసినట్లు పేర్కొన్నారు. తాజాగా 'మా'కు సంబంధించి రేపు గుడ్న్యూస్ చెబుతానంటూ హింట్ ఇచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. మరోవైపు ప్రకాశ్రాజ్ ప్యానల్ రాజీనామాలపై కూడా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న సస్పెన్స్ కూడా నెలకొంది. చదవండి : ఆరోజు జరిగింది ఇదే..వీడియో రిలీజ్ చేసిన మంచు విష్ణు సమంత డబ్బుల కోసం కేసులు వేయలేదు : లాయర్ Have a very good news to share on #MAA front. Will share it tomorrow 💪🏽 — Vishnu Manchu (@iVishnuManchu) October 21, 2021 -
నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao Comments On Mega Brother Nagababu: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య పలువురు నటీనటులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ యుట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్ అనసూయ డ్రెస్పింగ్పై కోట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతకుముందు ‘మా’ ఎన్నికల నేపథ్యంలో విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట అదే సమయంలో ప్రకాశ్ రాజ్పై చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబును ఆయన టార్గెట్ చేశారు. గతంలో తనపై చేసిన కామెంట్స్పై స్పందిస్తూ ఈ ఇంటర్య్వూలో మెగా బ్రదర్కు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ.. ‘చిరంజీవి ఒక పక్క, పవన్ కల్యాణ్ మరో పక్క వీరిద్దరు లేకపోతే ఈ నాగబాబు ఎవరు?. వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. ఆయనకేందుకు అసలు. గతంలో నాగబాబు ప్రకాశ్ రాజ్ను తిట్టారు. అది అందరికి తెలుసు. నేను ప్రకాశ్ రాజ్ను అన్నానని ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు. అపుడు ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన కామెంట్స్కు అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో డిబెట్లు అంటూ రచ్చ జరిగేది’ అంటూ కోట మండిపడ్డారు. అనంతరం ఇప్పటికి తాను అదే చెబుతానని, చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబుకు గుర్తింపు లేదన్నారు. ఒక్క మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్పా అంటూ కోట సంచలన కామెంట్స్ చేశారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! కాగా ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రకాశ్ రాజ్ కలిసి 15 సినిమాలకు పైగా నటించానని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్కు సమయానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ కోట సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోట వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబుశాడు కోట శ్రీనివాసరావు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు కూడా నాగబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రకాశ్రాజ్పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement