-
మోదీ హయాంలోనే పర్యాటక అభివృద్ధి
హైదరాబాద్(గోల్కొండ): ప్రధాని మోదీ హయాంలోనే పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింద ని ఆ శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవా రం గోల్కొండ కోటలో సరికొత్తగా ఏర్పాటు చేసిన లేజర్ బేస్డ్ లైట్ అండ్ సౌండ్ షోను సినీనటుడు చిరంజీవితో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ హయాంలోనే అన్ని రాష్ట్రాలలో టూరిజంకు ఆదరణ పెరిగిందని, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. గోల్కొండ కోటలో ప్రస్తుతమున్న లైట్ అండ్ సౌండ్ షోకు మరింత ఆధునిక సాంకేతికత జోడించి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తయారు చేశామన్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షో ప్రతి రోజూ మూడు భాషల్లో ఉంటుందని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ నగరానికి కూడా పర్యాటకులు ఎక్కువగా వచ్చేలా ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేస్తామన్నారు. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లను రూ.1300 కోట్లతో ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్షో వచ్చే నెలలో ప్రారంభమవుతుందని, దీనికి వాడుతున్న లేజర్ లైట్లు దేశంలోనే అత్యుత్తమమైనవని తెలిపారు. వరంగల్ కోటలో కూడా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తామని, వెయ్యి స్తంభాల గుడిని అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. గిరిజన పర్యాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ తాను కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోల్కొండ కోటలో 50 దేశాల ప్రతినిధులతో సమావేశమైన వారికి లైట్ అండ్ షో చూపించామన్నారు. మగధీరతో పాటు రామ్చరణ్తో కలిసి గోల్కొండ కోటలో తాను సినిమా షూటింగ్లో పాల్గొన్న రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ యూఎస్.రావత్ పాల్గొన్నారు. -
ఆశీర్వదించండి!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ నేడు నిరంతర విద్యుత్తు వెలుగులు, పంట కాల్వలు, పచ్చని చేలతో కళకళలాడుతోంది. మండే ఎండల్లో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతోంది. ఇరవైకి పైగా రిజర్వాయర్లతో తెలంగాణ పూర్ణకలశం వలె తొణికిసలాడుతోంది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోంది. తెలంగాణ అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఈ పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని అందించాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. నాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు! పదేళ్ల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవన చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ దుఖం తన్నుకొస్తుంది. ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరెంటు షాకుకో, పాము కాటుకో బలైపోయిన రైతన్నలు. అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు. ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు. యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు. ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు. ఇలాంటి అగమ్యగోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఒక దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని సూచికలుగా పరిగణిస్తారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1గా నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగంతో తొలి స్థానంలో ఉంది. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. తొమ్మిదిన్నరేళ్లలో రూ.37 వేల కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా స్థిరీకరించింది. కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ వక్ర భాష్యాలు చెబుతున్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలని వ్యాఖ్యానిస్తున్నారు. వీరికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నా. సాగునీరు, వైద్యారోగ్య రంగంలో ప్రగతి మిషన్ కాకతీయ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించినా కేసులు వీగిపోయాయి. పర్యావరణ అనుమతులు లభించాయి. స్వల్ప కాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించి రాష్ట్రం చరిత్ర సృష్టించింది. మరో 8 మెడికల్ కాలేజీలను త్వరలోనే ప్రారంభించి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, నిమ్స్ విస్తరణ శరవేగంగా జరుగుతున్నాయి. అనాథ పిల్లలను ‘స్టేట్ చి్రల్డన్’గా గుర్తిస్తూ వారికోసం ప్రత్యేక పాలసీని ప్రభుత్వం రూపొందించింది. విద్యారంగ వికాసం..ఐటీలో మేటి వెయ్యికి పైగా గురుకుల జూనియర్ కళాశాలలు ప్రారంభించాం. మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి పేరుతో రాష్ట్రంలోని 26 వేలకు పైగా పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నాం. రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందిస్తున్నాం. టీఎస్ ఐపాస్ చట్టం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజం వచ్చింది. రూ.2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రా్రష్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. 17.21 లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు పెరిగాయి. త్వరలో ‘తెలంగాణ చేనేత మగ్గం’ దళితబంధు కింద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం. ప్రభుత్వ లైసెన్సు వ్యాపారాల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు, బీసీల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీలకు రూ.లక్ష సాయం, ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంపు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు, మద్యం దుకాణాల్లో గౌడలకు 15శాతం రిజర్వేషన్లు, గీతన్న, నేతన్నలకు రూ.5 లక్షల బీమా, నేత కార్మికులకు నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఫ్రేమ్ మగ్గాల పంపిణీకి ‘తెలంగాణ చేనేత మగ్గం’అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నాం. ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,016కు, లబ్దిదారుల సంఖ్యను 29 లక్షల నుంచి 44 లక్షలకు పెంచాం. లబ్దిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించాం. దివ్యాంగుల పెన్షన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచాం. 33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం 33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోగా, ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందిన సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయి. వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలను పొందుతున్నారు. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతాం. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తాం. సింగరేణి కార్మికులకు వచ్చే దసరా, దీపావళి పండుగల బోనస్గా రూ.1,000 కోట్లు పంపిణీ చేయబోతున్నాం. వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులనూ క్రమబద్దీకరించాలని నిర్ణయించాం. హైదరాబాద్లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. వారికి రైతుబంధు సాయం సైతం అందించింది. పోడు కేసుల నుంచి విముక్తులను చేసింది. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాం. గత నెలలో భారీ వర్షాలు కురవడంతో తక్షణ సహాయంగా రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు మంగళవారం నుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నాం. నగరం నలువైపులకూ రూ.69 వేల కోట్లతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదరికం తగ్గుముఖం సంపద పెంచు – ప్రజలకు పంచు అనే సదాశయంతో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతోందని, తలసరి ఆదాయం పెరుగుతోందని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచి స్పష్టం చేసింది. జాతీయ స్థాయి సగటుతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైంది. 2015–16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019–21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైంది. లక్ష్యం చేరని స్వతంత్ర భారతం 75 ఏళ్ల స్వతంత్ర భారతం గణనీయ ప్రగతి సాధించినా, ఆశించిన లక్ష్యాలు, చేరవల్సిన గమ్యాలను ఇంకా చేరలేదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల్లో పేదరికం తొలగిపోలేదు. వనరుల సంపూర్ణ వినియోగంతో ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే స్వాతంత్య్రానికి సార్థకత. అమర వీరులకు నివాళి గోల్కొండ కోటలో జెండావిష్కరణకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమర జవానుల స్మృతి చిహ్నాన్ని సీఎం కేసీఆర్ సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఎయిర్ వైస్ మార్షల్ చంద్రశేఖర్, ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జీవోసీ మేజర్ జనరల్ రాకేష్ మనోచా ఇతర ఆర్మీ అధికారులు అమర సైనికులకు నివాళులర్పించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎంఓ కార్యాలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు : సీఎం కేసీఆర్
►సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణది 15 స్థానం ఉండగా.. ప్రస్తుతం వరి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానం కోసం పోటీ పడుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తూ.. రైతులు 3 గంటల కరెంట్ చాలన కొందరు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. ►ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి గృహలక్షి పథకం ►రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉచిత మంచినీరు అందిస్తున్నాం ►దళితబంధు దేశానికే దిక్సూచిగా నిలిచింది ►నేతన్నల కోసం తెలంగాణ మగ్గం పేరుతో కొత్త పథకం ►ఆసరా పెన్షన్లకు రూ.2016కు పెంచాం ►ఆర్టీసీ బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టాం ►ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం ►సింగరేణలో రూ.12వేల కోట్ల టర్నోవర్ను 30 వేల కోట్లకు పెంచాం ►సింగరేణిలో కార్మికులకు ఈ సారి దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు ► జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..హైదరాబాద్లో నేటి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రూ.37 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, పోడు సమస్యకు పరిష్కారం చూపించడంతో పాటు తెలంగాణలో తాగునీటి సమస్య లేకుండా చేశామని చెప్పారు. రాష్ట్రం ప్లోరోసిస్ రహితంగా మారిందని కేంద్రమే ప్రకటించిందన్నారు. ►సమైక్య పాలనతో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. ►రాష్ట్ర సాగునీటి రంగంలో స్వర్ణయుగం నడుస్తోందని అన్నారు. 44 లక్షల మందకి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ► స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్కగచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు చేరుకుంటారు. అనంతరం ఆ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. -
గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు!
సాక్షి, హైదరాబాద్/రసూల్పురా: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో జాతీయజెండాను ఎగురవేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం జెండా వందనం సందర్భంగా కేంద్ర బలగాల కవాతు కూడా నిర్వహించనున్నారు. సాయంత్రం గోల్కొండ కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో కిషన్రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్రెడ్డి లేదా సీనియర్ మంత్రి జాతీయజెండాను ఎగురవేసే అవకాశముంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీలకు ఆహ్వానాలు పంపనున్నట్లు సమాచారం. గత సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు బీజేపీ అగ్రనేత, కేంద్రహోం మంత్రి అమిత్షా ముఖ్యఅతిథిగా హాజరై సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ఇతర కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే తరహాలో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న మోదీ దేశంలో ఉగ్రవాద కదలికలను కట్టడి చేసి ప్రపంచ దేశాలకు భారత దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న నేత ప్రధాని మోదీ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పది లక్షల కుంభకోణం జరిగిందని కాగ్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మన్ కీ బాత్’థీమ్.. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఈ నెల 29న ‘మన్ కీ బాత్’థీమ్తో ప్రత్యేకమైన సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. మన్ కీ బాత్కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని థీమ్స్ను పురావస్తు శాఖ అధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 13 చారిత్రక కట్టడాల్లో సౌండ్ అండ్ లైట్ షో ద్వారా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట, గ్వాలియర్ కోట, సూర్య దేవాలయం, వెల్లూరు కోట, గేట్ వే ఆఫ్ ఇండియా, నవ్నతన్ ఘడ్ కోట, రాంనగర్ ప్యాలెస్, ది రెసిడెన్సీ భవనం, గుజరాత్లోని సూర్య దేవాలయం, రాంఘడ్ కోట, చిత్తోర్ఘడ్ కోట, ప్రధాని సంగ్రహాలయతో పాటు హైదరాబాద్లోని గోల్కొండ కోటలోనూ ‘మన్ కీ బాత్’కు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను చేపట్టనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గురువారం తెలిపారు. ‘మన్ కీ బాత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ మరోవైపు మన్ కీ బాత్ థీమ్ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఈ నెల 30 న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో నీటి పొదుపు, నారీశక్తి, కోవిడ్పై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్–ఖగోళ శాస్త్రం, క్రీడలు–ఫిట్నెస్, భారత్ ఎట్ 75 అమృత్ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్చిత్ర కథ కామిక్స్లో మొదటి కామిక్ను ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు గోవింద్ మోహన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సాగర తీరాన ధగధగల సౌధం -
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది
-
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన గోల్కొండ
-
గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుందని, దీనికి ముందు ముఖ్యమంత్రి పోలీస్ గౌరవవందనం స్వీకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా దాదాపు వెయ్యిమంది కళాకారులు స్వాగతం పలుకుతారన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
గోల్కొండ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం....(ఫొటోలు)
-
గురువారం నుంచే బోనాలు ప్రారంభం.. గోల్కోండ అమ్మవారికి నగర్ బోనం
లంగర్హౌస్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే ప్రధాన పండగల్లో ఒకటైన బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ నిర్వహించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. మొదటి పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. నేడు లంగర్హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, తొట్టెలను తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జులై 10న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు వాద్యాలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తులతో కలిసి అంగరంగ వైభవంగా అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్లి బోనంలా సమర్పించనున్నారు. వేడుకలకు లంగర్హౌస్, గోల్కొండ వేదిక కానున్నాయి. -
‘గోల్కొండ’ సందర్శనలో హైకోర్టు సీజే దంపతులు
గోల్కొండ (హైదరాబాద్): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ ఆదివారం తన సతీమణితో సహా గోల్కొండకోటను సందర్శించారు. ఆసిఫ్నగర్ డివిజన్ ఏసీపీ శివమారుతి, గోల్కొండ ఎస్సై చంద్రశేఖర్రెడ్డి సతీష్చంద్ర దంపతులకు కోట వద్ద స్వాగతం పలికారు. కోటలోని క్లాపింగ్ పోర్టికోతోపాటుగా, ఎగువభాగాన ఉన్న కుతుబ్షాహీ కాలం నాటి ఫిరంగి, చారిత్రక కట్టడాలను దంపతులిద్దరూ ఆసక్తిగా తిలకించారు. కోటలోని సీనియర్ గైడ్ వారికి చారిత్రక కట్టడాల విశేషాలను వివరించారు. అనంతరం పర్యాటకశాఖ నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షోను వీక్షించారు. -
గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకున్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి.. అటుపై సాయుధ దళాల నుంచి గౌరవ వందనం అందుకున్నారు ఆయన. అనంతరం కోటలోని రాణిమహల్ ప్రాంగణం నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ‘‘ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఏడేళ్లలో స్థిరమైన ఆర్ధిక అభివృద్దితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా చాటి చెప్పారు. దేశంలో కనీస అవసరాల కోసం ప్రజలు ఇంకా అల్లాడే పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశం సాధించిన అభివృద్దిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకొన్న రోజు నుండి అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఇప్పుడు లేవన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లో మిగులు సాధ్యమౌతోందన్నారు.రాష్ట్ర జీఎస్డీపీలో 20 శాతం వ్యవసాయరంగం నుండి వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దండగ అనుకొన్న వ్యవసాయం పండుగలా మారిందని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఆ సంస్కరణలతో తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా నిలిచిందని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రైతులకు రూ.50వేల లోపు రుణాల మాఫీ ఇవ్వడంతో పాటు ధరణి పోర్టల్ ద్వారా భూమి లెక్కలు తేల్చామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, వరంగల్లో అధునాతన ఆస్పత్రిని నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. -
హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోటలో ఆదివారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తమ్మీద 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నగర పోలీసులు వీటినీ బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (సీసీసీ) అనుసంధానించింది. స్థానిక పోలీసుస్టేషన్, కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పని తీరుపై సీసీసీ అధికారులు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతి ద్వారం దగ్గరా డోర్ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ► 15న ఉ. 7 నుంచి మ. 12 గంటల వరకు కో ట వైపునకు వాహనాలకు అనుమతి లేదు. ► రాందేవ్గూడ నుంచి కోటకు ఎ, బి, సి, పాస్ హోల్డర్స్ వాహనాలకే అనుమతి. ► కింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే పాస్ హోల్డర్లు రేతిబౌలి,నానల్నగర్ జంక్షన్ నుంచి లంగర్హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్గూడ జంక్షన్ మీదుగా రావాలి. ► మక్కై దర్వాజ వద్ద ఎ– కారు పాస్ హోల్డర్లు మెయిన్ రోడ్డు పక్కన, బి– పాస్ హోల్డర్లు గోల్కొండ కోట బస్టాప్ వద్ద, సి– కారు పాస్ హోల్డర్లు గోల్కొండ బాయ్స్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్లో పార్క్ చేయాలి. ► డి– పాస్ హోల్డర్లు ప్రియదర్శిని స్కూల్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి. ఇ– కారు పాస్ హోల్డర్లు సెవన్ టూంబ్స్ బంజారా దర్వాజ మీదుగా రేతిగల్లిలోని ఒౖవైసి గ్రౌండ్లో వాహనాలను పార్క్ చేయాలి. ► లంగర్హౌస్ మీదుగా వచ్చే ఇ– పాస్ హోల్డర్లు బడాబజార్, బల్దియా ఐలాండ్ మీదుగా ఒవైసి గ్రౌండ్కు వెళ్లాలి. ఎఫ్– కారు పార్క్ హోల్డర్లు లంగర్హౌస్ మీదుగా ఫతే దర్వాజ నుంచి హుడా పార్కు వద్ద వాహనాలను పార్క్ చేయాలి. ► షేక్పేట్, టోలిచౌకికి చెందిన వారు బంజారా దర్వాజ నుంచి ఆర్టీసి బస్సుల ద్వారా కోటకు చేరుకోవాలి. ► వేడుకలు పూర్తయిన తర్వాత ఏ,బీ,సీ– కారు పాస్ హోల్డర్లు మక్కై దర్వాజ, రాందేవ్గూడ, లంగర్హౌస్ నుంచి వెళ్లాలి. డి కారు పాస్ హోల్డర్లు బంజారదర్వాజ మీదుగా సెవన్ టూంబ్స్ వైపు వెళ్లాలి. ఇ– కారు పాస్ హోల్డరు బడాబజార్, ఫతే దర్వాజ గుండా వెళ్లాలి. ఎఫ్– కారు పాస్ హోల్డర్లు తమ తమ పార్కింగ్ ప్రదేశాల నుంచి వచ్చిన మార్గం గుండానే వెనక్కి వెళ్లిపోవాలి. అన్ని రకాల పాస్ హోల్డర్లు తమ పాస్ను తమ కారుపై డిస్ప్లే చేయాలి. -
యునెస్కోను మెప్పించాలి
27 చారిత్రక కట్టడాలనూ.. చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్షాహీ టూంబ్స్తోపాటు రాష్ట్రంలోని 27 పురాతన చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రణాళికలు 4 వారాల్లో రూపొందించాలని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై పలు సూచలను చేసిందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. సాక్షి, హైదరాబాద్: ‘చారిత్రక వారసత్వసంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ప్రపంచ పటంలో స్థానం లభించడం తెలంగాణకు గర్వకారణం. దీంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రక శిల్పకళా సంపద కల్గిన రామప్ప ఆలయాన్ని యునెస్కో తాత్కాలిక ప్రాతిపదికన హెరిటేజ్ కేంద్రంగా ఎంపిక చేసింది. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి యునెస్కో అధికారులను మెప్పించాలి. వారి అంచనాల మేరకు డిసెంబర్లోగా ఈ క్షేత్రం సంరక్షణకు చర్యలు చేపట్టి పూర్తిస్థాయి హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు సాధించాలి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రామప్ప ఆలయానికి యునెస్కో తాత్కాలిక గుర్తింపు లభించడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించి బుధవారం విచారించింది. ఆగస్టు 4న ఏఎస్ఐ, కలెక్టర్ సమావేశమవ్వాలి ‘ఇదొక అద్భుతమైన, బంగారం లాంటి అవకాశం. రామప్ప ఆలయ సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. దీనిని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దాలి. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉండేందుకు ఇక్కడ విడిది సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం, హెరిటేజ్ విభాగం, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలి. ఆగస్టు 4న ఈ నాలుగు విభాగాల అధికారులు సమావేశం కావాలి. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి రామప్ప ఆలయ అభివృద్ధికి బ్లూప్రింట్ రూపొందించాలి. వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి. పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించుకోవాలి. యునెస్కో అంచనాల మేరకు అధికారులు పనిచేయక, గుర్తింపు వెనక్కు పోయే పరిస్థితి వస్తే మాత్రం దేశమంతా నిందిస్తుంది. సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను మేమే పర్యవేక్షిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. -
ఈసారి కుతుబ్ షాహీ టూంబ్స్
సాక్షి, హైదరాబాద్: రామప్ప రుద్రేశ్వర దేవాలయానికి ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో, తదుపరి కుతుబ్ షాహీ టూంబ్స్ రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నగర నిర్మాతలైన కుతుబ్ షాహీ వంశస్తుల సమాధుల ప్రాంగణాన్ని గతంలోనే యునెస్కోకు ప్రతిపాదించినప్పటికీ తిరస్కరణకు గురైంది. వాస్తవానికి అప్పట్లో చార్మినార్, గోల్కొండలతో కలిపి దాన్ని ప్రతిపాదించారు. అద్భుత కట్టడాలే అయినప్పటికీ చార్మినార్, గోల్కొండల చుట్టూ పలు ఆక్రమణలు ఉండటంతో యునెస్కో ఆ ప్రతిపాదనను బుట్ట దాఖలు చేసింది. దీంతో సమాధుల ప్రాంగణం ఒక్కదాన్నే ప్రతిపాదించాలన్న ఆలోచన తాజాగా తెరపైకి వస్తోంది. కాగా తదుపరి దశలో పాండవుల గుట్ట, అలంపూర్ నవబ్రహ్మ దేవాలయ సమూహాలకు కూడా యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించే అర్హత ఉందని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్కు అవకాశం ఉంది రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావటంలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలక భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. యునెస్కోకు ప్రతిపాదన (డోజియర్) రూపొందించటం మొదలు, చివరకు ఫైనల్ ఓటింగ్ రోజున వర్చువల్ సమావేశంలో పాల్గొనటంతో పాటు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగంతో ఈ ట్రస్టు కలిసి పనిచేసింది. ఇప్పుడు తదుపరి ప్రతిపాదన విషయంలో కూడా ఇదే ట్రస్టు కీలకంగా వ్యవహరించనుంది. ఈసారి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణాన్ని ప్రతిపాదించాలనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ‘రామప్ప’లాంటి ప్రతిపాదన మరోసారి చేసేందుకు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్న ప్రాంతం కుతుబ్షాహీ టూంబ్స్ ప్రాంగణమే అని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు ‘సాక్షి’తో చెప్పారు. గతంలో అడ్డుగా నిలిచిన పరిస్థితులను చక్కదిద్దగలిగితే కుతుబ్ షాహీ టూంబ్స్కు కూడా ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజవంశీయుల సమాధులన్నీ ఒకేచోట.. ఓ రాజవంశానికి చెందిన వారి సమాధులన్నీ ఒకేచోట ఉండటం, వాటి నిర్మాణం ప్రత్యేకంగా రూపొందటం ప్రపంచంలో మరెక్కడా లేదు. కుతుబ్ షాహీ రాజులు, వారి భార్యలు, పిల్లలు, వారి ముఖ్య అనుచరుల సమాధులు .. వెరసి 30 సమాధులు ఒకేచోట ఉన్నాయి. గోల్కొండ కోటకు కేవలం కిలోమీటరు దూరంలో ఇబ్రహీంబాగ్గా పేర్కొనే చోట వీటిని నిర్మించారు. పర్షియన్–ఇండియన్ నిర్మాణ శైలితో అద్భుతంగా నిర్మించారు. ç1543–1672 మధ్య ఇవి రూపొందాయి. వారి పాలన అంతరించాక వాటి నిర్వహణ సరిగా లేక కొంత దెబ్బతిన్నా.. 19వ శతాబ్దంలో సాలార్జంగ్–3 వాటిని మళ్లీ మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ఢిల్లీలోని హుమయూన్ సమాధిని యునెస్కో గుర్తించిన నేపథ్యంలో.. కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణం మరింత సులభంగా యునెస్కో గుర్తింపును పొందుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యునెస్కో నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధిలో ఆక్రమణలు లేకుండా చూడాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరో ప్రపంచ వారసత్వ హోదా కోసం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. మరో నాలుగేళ్ల తర్వాతనే.. తాజా ప్రతిపాదనను యునెస్కో ముందుంచేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరైన పోటీ లేనిపక్షంలో మళ్లీ తెలంగాణకు అవకాశం రావచ్చునని అంటున్నారు. ఈలోపు నిర్ధారించుకున్న కట్టడ పరిసరాలను యునెస్కో నిబంధనల మేరకు తీర్చిదిద్దితే, కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా మరో గొప్ప అవకాశాన్ని ఒడిసిపట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరో గొప్ప నిర్మాణం అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాల సమూహం.. కర్ణాటకలోని పట్టడకల్ దేవాలయాలు యునెస్కో గుర్తింపు పొందాయి. వాటిని నిర్మించిన బాదామీ చాళుక్యులే అలంపూర్లో ఏడో శతాబ్దంలో బ్రహ్మేశ్వరాలయాల సమూహాన్ని అద్భుత శిల్ప, వాస్తు నైపుణ్యంతో నిర్మించారు. నవ బ్రహ్మలుగా తొమ్మిది శివరూపాలతో ఉన్న ఈ ఆలయాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తుంగభద్ర ఒడ్డున ఉన్న ఈ ఆలయాలను ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. వాటిల్లో 32 రకాల కిటికీలు, పైకప్పు శిల్పాలు రేఖా నాగర ప్రాసాదం శైలిలో నిర్మాణాలు జరిగాయి. దాదాపు 50 ఎకరాల వైశాల్యంలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణానికి కూడా వారసత్వ హోదా పొందే అర్హత ఉందని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ విశ్రాంత స్తపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. పాండవుల గుట్ట కూడా సిద్ధం.. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం మానవుడి చిత్రలేఖనం ఎలా ఉండేది..? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే పూర్వపు వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట గుహలను పరికిస్తే తెలుస్తుంది. దాదాపు వేయి చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని బింబేడ్కాలో దాదాపు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టల్లో వేల సంఖ్యలో ఇలాంటి చిత్రాలున్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఆదిమానవులు వేసిన అన్ని చిత్రాలు ఒకేచోట బయటపడ్డ దాఖలాలు లేవు. దీంతో దాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాతో సత్కరించింది. ఆ తర్వాత అన్ని చిత్రాలున్న ప్రాంతంగా ఇప్పటివరకు పాండవుల గుట్టనే రికార్డుల్లో ఉంది. ఇది కూడా యునెస్కో గుర్తింపును పొందగల అర్హతలున్న ప్రాంతమేనని పురావస్తు పరిశోధకులు రంగాచార్యులు, శ్రీరామోజు హరగోపాల్లు తెలిపారు. -
బురుజు కట్టే వారెవరు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టును కట్టేశాం.. సంప్రదాయ–ఆధునిక నమూనాల మేళవింపుతో కొత్త సచివాలయ నిర్మాణం సాగుతోంది.. భాగ్యనగరంలో ఎన్నో ఆకాశహర్మ్యాలూ సిద్ధమవుతున్నాయి.. ఇలాంటి భారీ కట్టడాలకు నిర్మాణ కంపెనీలు పోటీపడుతున్నాయి.. కానీ, ఓ కట్టడానికి మాత్రం ఇంజనీర్లు దొరకడం లేదు. అదే మజ్నూ బురుజు. గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న నయాఖిల్లాలో ఈ బురుజు ప్రస్తుతం శిథిలగుట్టగా ఉంది. దీన్ని పునర్నిర్మించేందుకు గతేడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణకు బురుజులు కొత్త కాదు. చాలా ఊళ్లలో అవి దర్శనమిస్తాయి. అప్పట్లో ఊరూవాడా వాటిని సులభంగా నిర్మించేశారు. ఇప్పుడు వాటిని కట్టేవా రి కోసం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) భూతద్దం పెట్టి గాలిస్తున్నా దొరకడం లేదు. ఇదీ సంగతి.. నయాఖిల్లాలో 500 ఏళ్ల క్రితం లైలా–మజ్నూల పేరుతో రెండు బురుజులు నిర్మించారు. ఇందులో మజ్నూ బురుజు కాస్త పెద్దది. గత అక్టోబర్లో కురిసిన అతి భారీ వర్షాలకు కుప్పకూలింది. అంతకు కొన్ని నెలల ముందే దానికి భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. గోల్ఫ్ కోర్టు అభివృద్ధి చేసే క్రమంలో దాని దిగువన జరిగిన మట్టిపనులతో సమతౌల్యం దెబ్బతిని పగుళ్లు ఏర్పడటానికి కారణమైందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆ పగుళ్లకు ఏఎస్ఐ సకాలంలో స్పందించలేదు. ఆలస్యంగా పనులు ప్రారంభించినా, శాస్త్రీయత లేకుండా లోపభూయిష్టంగా చేపట్టడంతో వాననీళ్లు సులభంగా లోనికి చొరబడి మట్టి జారి కట్టడం కూలిపోయింది. ఇది పూర్తిగా మట్టి కట్టడం. చుట్టూ భారీ బండరాళ్లను పద్ధతి ప్రకారం పేర్చి బురుజు రూపమిచ్చారు. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. మట్టి కట్టడం ఐదు శతాబ్దాల పాటు నిలబడి, మానవ తప్పిదంతో చివరకు కూలిపోయింది. చరిత్రలో ఆ కట్టడానికి స్థానం ఉండటం, చారిత్రక గోల్కొండ కోట అంతర్భాగం కావటంతో దాన్ని తిరిగి నిర్మించాలని ఏఎస్ఐ నిర్ణయించి గతేడాది చివరి నుంచి ప్రయత్నిస్తోంది. జాతీయ స్థాయిలో రెండు దఫాలు టెండరు నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని నిర్మించగలిగే సంస్థలు రాలేదు. నైపుణ్యం ఉన్న వారు కరువు... మట్టితో నిర్మించి, బాహ్య భాగాన్ని డంగు సున్నం పూతతో పెద్ద రాళ్లతో నిర్మించాలని ఈసారి నిర్ణయించారు. ఈ తరహా కట్టడాలను నిర్మించిన అనుభవం ఉన్న వారిని ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. బురుజుల పునర్నిర్మాణం, లేదా ఆ తరహా భారీ గోడలను నిర్మించిన వారు, ఆ పనుల్లో కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్నవారు కావాలని పేర్కొన్నారు. ఇలాంటి నైపుణ్యం ఉన్నవారికి కరవు వచ్చి పడింది. కొందరు వచ్చినా అనుభవం లేకపోవటంతో రద్దు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పనితీరు అనుభవం ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. కేవలం రూ.కోటి విలువైన ఈ పని పూర్తి చేయటం ఇప్పుడు ఏఎస్ఐకి కత్తిమీద సాములా మారింది. అది కూలిన సమయంలో పై భాగంలో గాలిలో వేళ్లాడుతూ ఉండిపోయిన 18 అడుగుల పొడవైన 150 టన్నుల బరువున్న భారీ తోపును కిందకు దింపేందుకు రెండు రోజులు పట్టింది. అందుకే ఇప్పుడు ఆ పనులు సవాల్ విసురుతున్నాయి. -
భూగర్భంలో గోల్కొండ షో!
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: మట్టి కోట మహా నగరమైంది. కాకతీయుల పరిపాలన వైభవానికి ప్రతీకగా వెలిసింది. అనతి కాలంలోనే కుతుబ్షాహీల రాజధానిగా అభివృద్ధి చెందింది. కుతుబ్షాహీల రాజ్యం నలుదిశలా విస్తరించింది. ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టిన అసఫ్జాహీలు ఆధునిక హైదరాబాద్కు శ్రీకారం చుట్టారు. అప్పటికే ఈ నగరం అంతర్జాతీయ ఖ్యాతికెక్కింది. వజ్ర వైఢూర్యాలను రాశులుగా పోసి విక్రయించిన మార్కెట్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. కుతుబ్షాహీల నుంచి అసఫ్జాహీల వరకు వైవిధ్యభరితమైన చారిత్రక కట్టడాలు నిర్మించారు. ఆనాటి నవాబుల ఆహార్యం నుంచి ఆహారం వరకు అన్నీ ఆకర్షిస్తాయి.(చదవండి: తెలంగాణ మొత్తానికి 50 వేల పరీక్షలేనా?) ఇప్పటికే సాలార్జంగ్ మ్యూజియం, నిజామ్స్ మ్యూజియాలలో అలాంటి అద్భుతమైన వస్తువులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. దాదాపు అలాంటి మరో స్మారక కేంద్రాన్ని కుతుబ్షాహీల సమాధుల చెంత నిర్మించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. గోల్కొండ సమాధుల పక్కనున్న దక్కన్ పార్కులో భూగర్భంలో ‘ఇంటర్ప్రిటేషన్ సెంటర్’ పేరుతో దీన్ని నిర్మించనున్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఆధునిక ప్రదర్శశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యాయి. ఒకప్పటి చారిత్రక కట్టడాలను తలపించేలా ఈ భూగర్భ ప్రదర్శనశాల సుమారు రూ.45 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనుంది. ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో చరిత్ర పుస్తకాలతో ఒక లైబ్రరీ, అప్పటి రాజుల జీవిత విశేషాలు, చిత్రపటాలతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ‘సెవన్ టూంబ్స్’గా పేరొందిన కుతుబ్ షాహీ సమాధుల చెంత ఇది మరో చారిత్రక కట్టడాన్ని తలపించనుంది. ఉద్యానవనంలోకి అడుగుపెట్టగానే.. ఏడెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్కన్ హెరిటేజ్ పార్కు వద్ద 6,500 చదరపు అడుగుల పరిధిలో ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు. పైన అందమైన ఉద్యానవనం ఉంటుంది.కింద భూగర్భలో ప్రదర్శనశాల,కెఫెటేరియా, లైబ్రరీ, తదితర సదుపాయాలు ఉంటాయి. గోల్కొండ కోట, కుతుబ్షాహీల చరిత్రకు సంబంధించిన సమస్త సమాచారం ఇక్కడ లభిస్తుంది. సుమారు 1,200 చదరపు అడుగుల్లో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓరియంటేషన్ కోర్టు, పిల్లల గ్యాలరీలు, స్క్రీనింగ్ సెంటర్లు, సావనీర్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. కొన్ని న్యాయపరమైన వివాదాల దృష్ట్యా పనులు నిలిచిపోయాయని, ఉన్నత న్యాయస్థానం నుంచి సానుకూలమైన తీర్పు వెలువడితే 2023 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నామని ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. -
డంగుతోనే హంగు!
సాక్షి, హైదరాబాద్: గట్టి ప్లాన్స్.. మట్టి వాల్స్.. రాతికీ రాతికీ మధ్య సున్నం మిశ్రమం కూడా లేదు.. రాతి మీద రాతిని పేర్చి పొందికగా కట్టిన నిర్మాణం.. అయినా వందల ఏళ్లపాటు పదిలం.. ఇది గోల్కొండ కోట ప్రత్యేకత. తాజాగా కూలిన నిర్మాణాలు పరిశీలిస్తే 80 శాతం మట్టితోనే కట్టినట్టు స్పష్టమవుతోంది. కాకతీయుల హయాంలో మట్టితో కోటగోడలు కట్టడం ప్రత్యేకత. గోల్కొండను కూడా వారు అలాగే నిర్మించారు. ఆ తర్వాత దాన్ని ఆక్రమించిన బహమనీల నుంచి స్వాధీ నం చేసుకున్న కుతుబ్షాహీలు దాన్ని కొంత పటిష్ట పరిచారు. ఇప్పుడు అది క్రమంగా కూలిపోవటం ప్రారంభమైంది. ఇటీవలి భారీవర్షాలకు నయాఖిల్లాలో కూలిన మజ్నూ బురుజు, కోట పైభాగంలో ఉన్న జగదాంబిక ఆలయం వైపు వెళ్లే క్రమంలో కూలిన మెట్ల వద్ద ప్రాకారం శిథిలాల్లో మట్టి తప్ప డంగు సున్నం మిశ్రమం లేదు. నిర్మాణం మొత్తం డంగు సున్నంపూత పూయకుంటే ప్రమాదమే.. ఇటీవలి వర్షాలకు మూడు ప్రాంతాల్లో గోడలు కూలిపోయిన నేపథ్యంలో భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్ఐ) విభాగం అధికారులు దాన్ని ఆసాంతం పరిశీలించారు. డంగు సున్నం పూత లేని ప్రాంతాల్లో, గోడల్లో మొక్కలు మొలిచి వాటి వేళ్లు పాకిపోవటంతో పగుళ్లు ఏర్పడి, కాలక్రమంలో అవి వెడల్పుగా మారినట్టు భావిస్తున్నారు. ఆ పగుళ్లకు సకాలంలో మరమ్మ తులు చేయకపోవటంతో వర్షం నీళ్లు లోపలికి చేరి మట్టి కరిగి గోడలు కూలిపోవటం ఆరంభించాయి. ఇప్పుడు ఉన్నఫళంగా కోట గోడలకు డంగు సున్నం పూతలు పూయనిపక్షంలో నిర్మాణాలు కూలిపోవటం ఖాయ మని నిపుణులు తేల్చారు. (చదవండి: గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?) ఏం చేయాలంటే.. 1 పెయింటింగ్ వర్క్: కోట ప్రధాన ప్రాకారం మొదలు, అంతర్గత గోడల వరకు అన్నీ మట్టితో నిర్మించి ఉన్నాయి. మట్టితో గోడలు నిర్మించి వాటికి వెలుపల, లోపలివైపు రాళ్లను పేర్చారు. రాళ్లు పడిపోగానే లోపల ఉన్న మట్టి జారిపోతోంది. ఇప్పుడు ఆ రాళ్లకు.. లోపల, బయటివైపు డంగు సున్నం మిశ్రమంతో సంప్రదాయపద్ధతిలో పూత పూయాల్సి ఉంది. 2 గ్రౌటింగ్: కొన్ని గోడలకు ఏర్పడ్డ పగుళ్లు బాగా వెడల్పుగా మారిపోయాయి. ఇటీవల జగదాంబిక దేవాలయం మార్గంలో కూలిన గోడకు కుడివైపు పైనుంచి కింది వరకు ఉన్న పగుళ్లు ఇలా వెడల్పుగా మారి భయపెడుతున్నాయి. ఇలాంటి పగుళ్లను వెంటనే మూసేయాల్సి ఉంది. ఏఎస్ఐ నిర్వహణ పద్ధతి ప్రకారం.. ఇటుక ముక్కలను లోనికి దూర్చి వాటికి డంగు సున్నం మిశ్రమంతో కోట్ వేస్తారు. ఆ తర్వాత పై భాగంలో అదే మిశ్రమంతో రాళ్ల మధ్య పూస్తారు. ఇప్పుడు అన్ని గోడలకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. 3 కోపింగ్: గోడల పైభాగం నుంచి వాన నీళ్లు లోనికి వెళ్లకుండా మందంగా డంగు సున్నం మిశ్రమాన్ని అద్దుతారు. వాన నీళ్లు పడగానే పక్కలకు జారి పోయేందుకు ఏటవాలు ఉండేలా దాన్ని పూస్తారు. ఆ పూత చాలా గోడలపై ఊడిపోయింది. అక్కడి నుంచి వాననీళ్లు లోనికి చేరుతున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ పైభాగంలో పూత వేయాల్సి ఉంది. మజ్నూ బురుజు మూడొంతులు మళ్లీ కట్టాల్సిందే.. నయాఖిల్లాలో కూలిపోయిన మజ్నూ బురుజు మరోవైపు పావు భాగం పదిలంగానే ఉందని గుర్తించారు. మూడొంతుల భాగాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ మట్టి నింపి కట్టాల్సి ఉంది. పునర్నిర్మాణంలో మాత్రం డంగు సున్నం మిశ్రమాన్ని వాడుతూ నిర్మించాలని నిర్ణయించారు. దాని పునాది భాగం వరకు పాత నిర్మాణాన్ని తొలగించి పునాదిని పటిష్టం చేసి కట్టనున్నారు. భారీ బడ్జెట్ అవసరం.. గోల్కొండ గోడల మరమ్మతులకు భారీగా వ్యయం అవుతుంది. దాన్ని తేల్చే డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపి నిధులు తెప్పించుకోవాల్సి ఉంది. ఈ పనులు పూర్తి కావటానికి కనీసం ఐదేళ్లు పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే వానాకాలంలోపు.. ప్రమాదకరంగా ఉన్న గోడలకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఎడబాసిన లైలా–మజ్నూలు.. నయాఖిల్లాల్లో ఒకదాని పక్కన ఒకటిగా రెండు బురుజులున్నాయి. అమరప్రేమికులుగా చరిత్రలో నిలిచిన లైలా–మజ్నూల పేర్లను వీటికి పెట్టారు. ఇప్పుడు ఇందులో మజ్నూ బురుజు కూలిపోవటంతో వాటి మధ్య ఎడబాటు వచ్చినట్టయింది. డంగు సున్నంమిశ్రమం ఇలా.. అలనాటి నిర్మాణాల్లో డంగుసున్నం మిశ్రమందే కీలకపాత్ర. అందులో డంగు సున్నం, రాతిపొడి, గుడ్డు సొన, కరక్కాయ, నల్లబెల్లం కలిపి చాలా మెత్తని మిశ్రమాన్ని రూపొందిస్తారు. ఆధునిక నిర్మాణాల్లో సిమెంట్ పాత్రను ఇది పోషిస్తుంది. మిశ్రమం తయారీకి ముందు 21 రోజుల పాటు కరక్కాయలను నానబెడతారు. ఇప్పుడు గోల్కొండలో కూలిన భాగాల పునర్నిర్మాణంలో దీన్నే వినియోగించనున్నారు. ముందు ఉన్న రూపును అచ్చంగా తిరిగి తీసుకొస్తారు. ఇంటర్లాకింగ్ నిర్మాణం.. అప్పట్లో నిర్మాణ ఇంజనీరింగ్లో ఇంటర్లాకింగ్ రాతి కట్టడాలు ప్రత్యేకంగా ఉంటాయి. రాతికి గ్రూవ్స్ తరహాలో సందులు చేసి, పైరాయి అందులో కూర్చునేలా రూపొందిస్తారు. గోల్కొండ కోటలో ప్రాకారాల్లో రాళ్లను ఇలాగే నిలిపారు. ఇక్కడ పూర్తిస్థాయి ఇంటర్ లాకింగ్ టెక్నిక్ కాకుండా రాళ్లు జారిపోకుండా కాస్త వాలు, కాస్త ఎత్తుగా ఉండేలా కోసి మరో రాయి అందులో పేర్చి నిర్మించారు. ఆ క్రమంలో రాళ్ల మధ్య చెట్ల గోందు(గమ్)లాంటిది పూసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు అలా పునర్నిర్మాణం సాధ్యం కానందున, రాళ్ల మధ్య బైండింగ్ కోసం డంగు సున్నం మిశ్రమాన్ని వాడబోతున్నారు. -
గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం తొలిరూపు గోల్కొండ.. భాగ్యనగరం అనగానే ముందుగా గుర్చొచ్చే చారిత్రక నిర్మాణం. కాకతీయులు పునాది వేయగా, కుతుబ్షాహీలు ఆక్రమించుకుని మరింత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత అసఫ్జాహీలు ఏలారు. ఇన్ని రాజవంశాల చేతులు మారినా.. పదిలంగా నిలిచిన ఆ మహా కోటకు ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. చాలా ఏళ్లు కావడంతో స్వతహాగా ఏర్పడుతున్న పగుళ్లు క్రమంగా పెరిగి మూలాలనే పెకిలిస్తున్నాయి. వాటికి వేగంగా మరమ్మతులు జరగక క్రమంగా కోటకు బీటలు వేస్తున్నాయి. ఇంతటి ప్రమాదపు అంచుల్లో ఉన్న కోటకు ఇటీవలి భారీ వర్షాలు పెద్ద కుదుపునే ఇచ్చాయి. రికార్డు స్థాయి వర్షంతో ఒక్కసారిగా గోడలన్నీ కదిలిపోయి నిట్టనిలువునా కూలిపోయేందుకు సిద్ధమయ్యాయి. ఆ వర్షాల సమయంలోనే ఓ బురుజు, మరో మహా కోట ప్రాకారం, నవాబులు జలకాలాడిన కటోరా హౌస్ ప్రహరీ నేలమట్టమైంది. మరికొన్ని గోడలు కూడా కూలే ప్రమాదం ఉంది. వాన కాదు కదా బలంగా గాలివీచినా రాళ్లు జారిపడేలా మారింది ఈ మహా కట్టడం. కేంద్రం వెంటనే స్పందించకుంటే కోటలోని చాలాప్రాంతాలు మట్టిదిబ్బగా మారటం ఖాయం. రూ.6 నుంచి రూ.8 కోట్లు కావాలి ఇటీవలి వర్షాలకు కూలిన ప్రాంతాలను పునరుద్ధరించాలంటే రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అవసరం అవుతాయని సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు అంచనాలు రూపొందించి మరమ్మతు కోసం అనుమతి కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. దానికి సమ్మతిస్తూ సరిపడా నిధులు కేటాయిస్తేనే వీలైనంత తొందరలో పునరుద్ధరణ పూర్తవుతుంది. వచ్చే వానాకాలం లోపు ప్రధాన పనులు చేపట్టడంతో పాటు, బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతు చేయకపోతే ఏడాదిలో మరిన్ని గోడలు కూలడం ఖాయం. నిధులేవి.. ఇంతపెద్ద గోల్కొండ నిర్వహణకు కేంద్ర పురాతత్వ సర్వేక్షణ విభాగం కేటాయిస్తున్న నిధులు సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే. శతాబ్దాల నాటి నిర్మాణం కావటంతో అడుగడుగునా మరమ్మతు చేస్తే తప్ప నిర్మాణం పదిలంగా ఉండని పరిస్థితిలో ఈ నిధులు ఏ మూలకూ చాలట్లేదు. మరోవైపు ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా ఢిల్లీకి అనుమతి కోసం పంపి, అక్కడి నుంచి అనుమతి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది. ఇక మరమ్మతు పనుల్లో నైపుణ్యం ఉన్న పనివారు దొరక్కపోవటం జాప్యానికి మరో కారణం. నిత్యం నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు మరమ్మతులు వేగంగా చేపడితేనే ఈ కట్టడం పదిలంగా ఉంటుంది. చారిత్రక కట్టడాలను దత్తత ఇచ్చేందుకు గతేడాది కేంద్రం శ్రీకారం చుట్టింది. గోల్కొండ బాధ్యత జీఎమ్మార్కు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎవరైనా దాతలు ముందుకొస్తే దత్తత ఇచ్చేందుకు ఏఎస్ఐ సిద్ధంగా ఉన్నా ఎవరూ స్పందిచట్లేదు. (చదవండి: టూరిస్టుల గోల్కొండ) జారిపోయిన బండరాళ్లు.. గోల్కొండ కోట పైభాగంలో జగదాంబ దేవాలయం వైపు వెళ్లే దారిలో 50 అడుగుల ఎత్తయిన కోట గోడ నిలువునా జారిపోయింది. గతంలో ఇక్కడ కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి మరమ్మతు చేయటంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత కూడా పైభాగంలోనే పనులు చేపట్టారు. బలహీనంగా ఉన్న కింది భాగానికి పూర్తిస్థాయి మరమ్మతు జరగలేదు. దీంతో భారీ వర్షాలకు కిందిభాగం మరింత బలహీనపడి కూలింది. దీంతో పైనుంచి రాళ్లు జారి పడిపోయాయి. ఫలితంగా గోడ వెనుక ఉండే మట్టి పూర్తిగా జారిపోయింది. మజ్నూ బురుజు.. దాదాపు కనుమరుగు మజ్నూ బురుజు. నయాఖిల్లాలో ఉంది. ప్రస్తుతం దీని చుట్టూ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి అయి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సరిగ్గా 20 రోజుల ముందు దీనికి పైభాగంలో భారీ పగులు ఏర్పడింది. బురుజు పైభాగంలో 18 అడుగుల పొడవైన ఫిరంగి ఉంది. ఇది ఔరంగజేబు సైన్యం ఏర్పాటు చేసింది. దాని వెనుకవైపు పిట్టగోడ తరహాలో ఓ గోడ అప్పట్లోనే కట్టారు. ఆ గోడ నుంచి పగులు మొదలైంది. భారీ వర్షాల సమయంలో ఆ పగులు నుంచి నీరు లోపలికి చేరటంతో మట్టి జారి పైనుంచి దిగువ వరకు సగం బురుజు కూలిపోయింది. సగం బురుజు కూలగా, మిగతా సగం కూడా బలహీనపడింది. దానిపై టన్నుల బరువుండే ఫిరంగి ఉంది. ప్రస్తుతం అది కొంత భాగం గాలిలో వేళ్లాడుతోంది. క్రేన్తో దాన్ని పదిలంగా తీసి పనులు చేపట్టాలి. (చదవండి: గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?) ఇలా అయితే కష్టమే.. జగదాంబ దేవాలయానికి మరోవైపు వెళ్లే మార్గం. ఆ పక్కన కూలిన గోడ లాగానే ఇక్కడ కూడా ప్రధాన కట్టడానికి పైనుంచి దిగువ వరకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దీనికి అత్యవసరంగా శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు అవసరం. లేకుంటే, సాధారణ వర్షాలకు కూడా అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన స్థాయి భారీ వర్షం భవిష్యత్తులో కురిస్తే ఈ గోడ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణంలో లోపం? కుతుబ్షాహీ నవాబుల కుటుంబం జలకాలాడేందుకు 460 ఏళ్ల కింద రూపుదిద్దుకున్న భారీ జలాశయాన్ని కటోరా హౌస్ అంటారు. దీన్ని ఆనుకునే రోడ్డు ఉంది. దానివైపు దాదాపు 5 అడుగుల ఎత్తుతో 60 మీటర్ల పొడవైన గోడ ఉంది. గతంలో రోడ్డు నిర్మించినప్పుడు, ఆ తర్వాత మరమ్మతులు చేసినప్పుడు వరద నీటి ప్రవాహ మార్గం చెదిరిపోయింది. వర్షాల వరద ప్రవాహం గతి తప్పి, గోడను ఆనుకుని ఉన్న మట్టి జారింది. ఇటీవలి వర్షాలకు ఆ గోడ దాదాపు 40 మీటర్ల మేర కటోరా హౌస్లోకి పడిపోయింది. ఇక్కడ నిర్వహణలో శాస్త్రీయత లోపించటం వల్లే ఈ గోడ కూలిందని స్పష్టమవుతోంది. -
గోల్కొండ కోట సందర్శనకు అనుమతి
-
పర్యాటకులు భౌతికదూరం పాటించేలా చర్యలు
-
గోల్కొండ కోట, చార్మినార్ సందర్శనకు అనుమతి
-
చార్మినార్, గోల్కొండ మూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే జూ పార్కులు, ప్రదర్శనశాలలు, ప్రధాన పార్కు లను రాష్ట్ర ప్రభుత్వం మూసేయగా, తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) ప్రధాన పర్యాటక కేంద్రాలను మూసేసింది. మంగళవారం నుంచి గోల్కొండ, చార్మినార్, వరంగల్ కోట తదితర ప్రాంతాలకు పర్యాటకులకు అనుమతి రద్దు చేసింది. ఇదే విభాగం అధీనంలో ఉన్న వేయిస్తంభాల దేవాలయం, రామప్ప గుడి, గద్వాల జోగుళాంబ దేవాలయాలకు మాత్రం స్వల్ప సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఇవి దేవాలయాలు కావడంతో వాటిని మూసే పరిస్థితి లేదు. అయితే ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా, క్యూలైన్లలో ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రామనవమి ఉత్సవాలపై నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాలయాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం శుభకార్యాలు ఎక్కువగా జరిగే రోజులు కావటంతో దేవాలయాలకు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీంతోపాటు ఆలయాల్లో పరిశుభ్రత చర్యలు ముమ్మరం చేశారు. కోవిడ్ వైరస్ వ్యాపించే విధానం, దాన్ని నియంత్రిం చేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా వచ్చే నెల 2న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారులు దృష్టి సారించారు. భద్రాచలంలో ప్రభుత్వ వేడుకగా జరిగే సీతారామ కల్యాణాన్ని పూర్తిగా ఆలయ కార్యక్రమంగా పరిమితం చేశారు. అర్చకులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే పాల్గొనేలా చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులు ఆలయానికి రాకుండా కట్టడి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆన్లైన్ టికెట్లను రద్దు చేశారు. ఇప్పటికే ఆ టికెట్లు కొన్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాల్లోనూ అర్చకులు దేవేరుల కల్యాణం నిర్వహించటానికే పరిమితం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు దేవాలయ నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. బలవంతంగా భక్తులు రాకుండా కట్టడి సాధ్యం కానందున, భక్తులే స్వచ్ఛందంగా ఆలయ సందర్శన విరమించుకుని ఇళ్లలో వేడుకలు చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఉగాది వేడుకలకూ దూరం! ఉగాది వేడుకలనూ ఆర్భాటాలకు దూరంగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ కార్యక్రమంగా ప్రగతిభవన్లో నిర్వహించే వేడుకలకు సాధారణ ప్రజలు రాకుండా నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. టీవీల్లో లైవ్ ద్వారా ప్రజలు చూడాలనే సూచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బోసిపోయిన భద్రాద్రి రామాలయం పరిసరాలు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement