-
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
ప్రముఖ బిలినీయర్ 'గౌతమ్ సింఘానియా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల కూడా ఈయన మరో కారును కొనుగోలు చేశారు.గౌతమ్ సింఘానియా కొనుగోలు చేసిన కారు మెక్లారెన్ కంపెనీకి చెందిన 750ఎస్. దీని ధర మార్కెట్లో రూ.5.91 కోట్లు వరకు ఉంటుంది. అయితే సింఘానియా గ్యారేజిలో ఇప్పటికే రెండు మెక్లారెన్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. తాజాగా కొనుగోలు చేసిన మెక్లారెన్ 750ఎస్ కారు ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యుయల్-టోన్ షేడ్లో ఉండటం చూడవచ్చు.మెక్లారెన్ 750ఎస్ అనేది 720ఎస్ కంటే ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ కలిగి.. 750 పీఎస్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. -
భారత్లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్పై గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్, ఫ్రంట్ బంపర్పై ఎయిర్ ఇన్టేక్ సరౌండ్లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్బాక్స్తో లభిస్తాయి.Make a bold statement with the Audi Q3 and Audi Q3 Sportback Bold Edition that come with the black styling package plus.*Terms and conditions apply.#AudiIndia #AudiQ3models #AudiBoldEdition pic.twitter.com/t6Yeq5CKT0— Audi India (@AudiIN) May 10, 2024 -
బీజింగ్ మోటార్ షోలో అడుగుపెట్టిన ఫోక్స్వ్యాగన్ కారు ఇదే..
బీజింగ్ మోటార్ షో 2024లో సరికొత్త 'ఫోక్స్వ్యాగన్ టైరాన్' అధికారికంగా వెల్లడైంది. చైనా మార్కెట్లో విక్రయానికి రానున్న ఈ కొత్త కారు 5 సీటర్ టైగన్ ఎల్ ప్రో పేరుతో విక్రయానికి రానుంది. ఇది 2025 నాటికి దేశీయ మార్కెట్లో 7 సీటర్ రూపంలో అడుగుపెట్టనుంది.ఫోక్స్వ్యాగన్ టైరాన్ చూడటానికి చాలా వరకు టైగన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు, పెద్ద గ్లాస్హౌస్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్, రెండు కప్హోల్డర్లతో మంచి లేఅవుట్ను పొందుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఫోక్స్వ్యాగన్ టైరాన్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. బేస్ మోడల్ 184 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ వేరియంట్ 217 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ గేర్బాక్స్తో లభిస్తుంది.ఫోక్స్వ్యాగన్ టైరాన్ గ్లోబల్ మోడల్ అని సీఈఓ థామస్ షాఫర్ వెల్లడించారు. చైనా తరువాత జపాన్, ఆ తరువాత మెక్సికోలో తయారవుతుంది. 2025లో భారతీయ తీరాలను చేరే అవకాశం ఉందని సమాచారం. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ప్రపంచంలో వేగవంతమైన కారు ఇదే!.. లాంచ్ ఎప్పుడంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. టెస్లా రోడ్స్టర్ (Tesla Roadster) పేరుతో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకుంటుందని సమాచారం.ఈ కారు గురించి టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) కొన్ని వివరాలను వెల్లడిస్తూ.. ఇది 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కారుని టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.Tonight, we radically increased the design goals for the new Tesla Roadster.There will never be another car like this, if you could even call it a car.— Elon Musk (@elonmusk) February 28, 2024టెస్లా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు అత్యంత ఆకర్షణీయమైన కారుగా పేర్కొన్నారు. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది 4 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. దీని గురించి మస్క్ 2017లోనే వెల్లడించారు.కంపెనీ టెస్లా రోడ్స్టర్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారును బుక్ చేసుకోవాలనుంటే 50000 డాలర్ల టోకెన్ మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నిజానికి 2021లో లాంచ్ కావలసిన ఈ కారు 2024 చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారత యాప్స్పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్లో అవి మాయం!0-60mph < 1 secAnd that is the least interesting part— Elon Musk (@elonmusk) February 28, 2024 -
'ఫెరారీ పురోసాంగ్యూ' కొన్న బిజినెస్ మ్యాన్ - ధర ఎంతో తెలుసా?
బెంగళూరులో ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకరైన 'బ్రెన్ కార్పొరేషన్' ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'బూపేష్ రెడ్డి' ఇటీవల ఓ ఖరీదైన ఇటాలియన్ సూపర్ కారును కొనుగోలు చేశారు. భారతదేశంలో ఈ కారును కొన్న మొదటి వ్యక్తిగా బూపేష్ రెడ్డిగా నిలిచారు. బూపేష్ రెడ్డి కొనుగోలు చేసిన కారు ఫెరారీ కంపెనీకి చెందిన 'పురోసాంగ్యూ' (Purosangue). దీని ధర రూ.6.5 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫెరారీ పురోసాంగ్యూ మంచి డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బ్లాక్ కలర్ పొందిన ఈ కారు రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ కలిగి ఉండటం గమనించవచ్చు. ఇంటీరియర్ గోధుమ రంగులో ఉంది. లోపలి భాగంలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడవచ్చు. ఫెరారీ పురోసాంగ్యూ SUV 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 725 పీఎస్ పవర్, 716 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, 10.6 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 310 కిమీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా.. బూపేష్ రెడ్డి గ్యారేజిలో కేవలం ఫెరారీ పురోసాంగ్యూ కారు మాత్రమే కాకుండా లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ, లంబోర్ఘిని ఉరస్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్వీజే, లంబోర్ఘిని ముర్సిలాగో, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, ఫెరారీ 458స్పెషలే, ఫెరారీ 296 జీటీబీ, ఫెరారీ 812 సూపర్ఫాస్ట్, టెక్ఆర్ట్ పోర్స్చే జీటీ స్ట్రీట్ ఆర్, పోర్స్చే 911 ఆర్, పోర్స్చే 911 జీతీ2 ఆర్ఎస్, పోర్స్చే కేమాన్ జీటీ4, పోర్స్చే 911 కారెరా ఎస్, పోర్స్చే 39, పోర్స్చే 911 డీబీఎస్ కార్బన్ బ్లాక్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Boopesh Reddy (@bren_garage) -
భారత్లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే..
గత కొన్ని రోజులుగా కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో బైకులు, కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఈ మధ్య కాలంలో భారతీయ విఫణిలో లాంచ్ అయిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.కవాసకి జెడ్650ఆర్ఎస్జపాన్ బైక్ తయారీ సంస్థ కవాసకి దేశీయ మార్కెట్లో జెడ్650ఆర్ఎస్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర మునుపటి మోడల్ కంటే కూడా రూ. 7000 ఎక్కువ కావడం గమనార్హం. ఇది 649 సీసీ ఇంజిన్ కలిగి, 68 హార్స్ పవర్, 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హీరో మావ్రిక్ 440హీరో మోటోకార్ప్ కూడా ఇటీవల మార్కెట్లో మావ్రిక్ 440 అనే కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 27 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ను పొందుతుంది.కవాసకి జెడ్900కవాసకి లాంచ్ చేసిన మరో బైక్ జెడ్900. దీని ధర రూ. 9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధర మాత్రం దాని కంటే రూ. 9000 ఎక్కువ. ఈ బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి, 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.కవాసకి నింజా 500మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్ కవాసకి నింజా 500. దీని ధర రూ. 5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). 451 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది భారతదేశానికి కంప్లైట్ బిల్డ్ (CBU) ద్వారా దిగుమతి అవుతుంది. -
మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
కవాసకి కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 9000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడింది. డిజైన్ పరంగా చూడటానికి 2023 మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ బైకులో USD ఫోర్క్, మోనోషాక్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 250 మిమీ డిస్క్ ఉంటుంది. జెడ్900 బైక్ రెండు పవర్ మోడ్లు, మూడు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు నాన్ స్విచ్బుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఈ బైక్ కేవలం 350 మందికి మాత్రమే.. ధర ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో కేవలం సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. లగ్జరీ బైకులకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్సైకిల్' త్వరలోనే '2024 రోడ్మాస్టర్ ఎలైట్' లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇండియన్ మోటార్సైకిల్ లాంచ్ చేయనున్న కొత్త 2024 రోడ్మాస్టర్ ఎలైట్ కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ కలిగిం ఈ బైక్ గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్-అవుట్ విండ్స్క్రీన్, హ్యాండ్-పెయింటెడ్ గోల్డెన్ పిన్స్ట్రైప్స్, కలర్ మ్యాచింగ్ సీట్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆపిల్ కార్ప్లేతో కూడిన ఈ బైక్ 7 ఇంచెస్ TFT కలిగి టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12 స్పీకర్ ఆడియో-సిస్టమ్ సెటప్, 136 లీటర్లు స్టోరేజ్ స్పేస్ వంటివి లభిస్తాయి. కొత్త 2024 రోడ్మాస్టర్ ఎలైట్ బైక్ 1890 సీసీ వీ ట్విన్ ఇంజిన్ కలిగి 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుమారు 412 కేజీల బరువు కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ బైక్ ధర 41999 డాలర్ల వరకు ఉండవచ్చని సమాచారం. (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34.85 లక్షలు). అయితే ఈ బైక్ భారతదేశంలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి - ఎవరీ హువాంగ్! -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కారు ఇదే - టెస్లాకు గట్టి పోటీ!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ తయారీదారు బీవైడీ ఆటో భారతీయ మార్కెట్లో తన సీల్ మిడ్-సైజ్ సెడాన్ను మార్చి 5న లాంచ్ చేయనుంది. దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఈ కొత్త చైనా మోడల్ బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు ఇప్పటికే తెలిసిపోయాయి. బీవైడీ కంపెనీ లాంచ్ చేయనున్న సీల్ ఈవీ 61.4 కిలోవాట్, 82.5 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. ఈ రెండు బ్యాటరీలు ఒక సింగిల్ చార్జితో 550 కిమీ, 700 కిమీ రేంజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కోసం 150 kW ఛార్జర్, చిన్న బ్యాటరీ కోసం 110 kW ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బీవైడీ సీల్ ఈవీ 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే, రెండు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. స్వెప్ట్బ్యాక్ హెడ్ల్యాంప్లు, ర్యాప్రౌండ్ ఎల్ఈడీ టైల్లైట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్రూఫ్, 360 డిగ్రీ కెమెరా, సేఫ్టీ కోసం ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ బీవైడీ సీల్ ఈవీ కోడం త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించనుంది. దీని ధర రూ. 65 లక్షల నుంచి రూ. 70 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. -
మార్కెట్లో లాంచ్ అయిన 'మార్విక్ 440' బైక్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 'మార్విక్ 440' బైక్ లాంచ్ చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఈ బైక్ ధరలు రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ బైక్ కోసం రూ. 5000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 15లోపల బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ. 10000 విలువైన యాక్ససరీస్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడటానికి హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మాదిరిగా ఉండే హీరో మార్విక్ 440 బైక్ 440 సీసీ ఇంజిన్ కలిగిన ఈ హీరో మావ్రిక్ 26 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందించనుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హోండా సిబి350, జావా 350 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది, కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్లో యూజర్ చాట్ వైరల్ -
పర్యావరణ హితం ప్రధానం! నాలుగేళ్లలో సగానికిపైగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారత్లో జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 46 శాతం వృద్ధితో 48,714 యూనిట్లు రోడ్డెక్కాయి. 2023 జనవరిలో ఈ సంఖ్య 33,334 యూనిట్లు నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య దేశవ్యాప్తంగా రిటైల్లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు 3,64,528 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 4,75,000 యూని ట్లు దాటవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. 2022– 23లో 39 శాతం వృద్ధితో 3,27,820 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. తొలి స్థానంలో మారుతి.. దేశంలో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకి 69 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ ఏకంగా 13 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,51,620 యూనిట్లను విక్రయించింది. 14 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్కు నాలుగు సీఎన్జీ మోడళ్లు ఉన్నాయి. 2023–24 ఏప్రిల్–జనవరిలో 64,972 యూనిట్లు కస్టమర్లకు చేరాయి. మూడు సీఎన్జీ మోడళ్లతో హ్యుండై మోటార్ ఇండియా 41,806 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రస్తుతం మూడు మోడళ్లలో సీఎన్జీని ఆఫర్ చేస్తోంది. జనవరితో ముగిసిన 10 నెలల కాలంలో ఈ కంపెనీ 6,064 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నాలుగేళ్లలో సగానికిపైగా.. 2014–15లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు దేశవ్యాప్తంగా 1,48,683 యూనిట్లు పరుగుతీశాయి. 2019– 20లో కరోనా కారణంగా పరిశ్రమ 7 శాతం క్షీణించింది. 2021–22 నుంచి వీటి అమ్మకాల్లో 30 శాతంపైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. ఇప్పటి వరకు 21,16,629 యూనిట్ల సీఎన్జీ ఆధారిత కార్లు, ఎస్యూవీలు కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. ఇందులో గడిచిన నాలుగేళ్లలో 52 శాతం యూనిట్లు రోడ్డెక్కాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే సీఎన్జీ వాహనాలతో ఖర్చు తక్కువ కాబట్టే వినియోగదార్లు వీటికి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లలో సీఎన్జీ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 4,500 నుంచి 8,000 కేంద్రాలకు చేర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. టాటా నుంచి పోటీ.. సీఎన్జీకి ఊతమిచ్చేలా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో టియాగో హ్యాచ్బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్ సీఎన్ జీ వేరియంట్లను టాటా మోటార్స్ జనవరి 24న పరిచయం చేసింది. ఫ్యాక్టరీలో ఫిట్ అయిన కిట్తో సీఎన్ జీ వాహనాలు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో రావడం దేశంలో ఇదే తొలిసారి. సంస్థ మొత్తం అమ్మకాల్లో సీఎన్జీ వాటా 2026 నాటికి 25 శాతానికి చేర్చాలని టాటా లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా నెక్సన్ సీఎన్జీ వేరియంట్ తీసుకొస్తోంది. 2022–23 ఏప్రిల్–జనవరిలో టాటా మోటార్స్ 36,963 యూని ట్ల అమ్మకాలను సాధించి మూడవ స్థానంలో ఉంది. 2024 జనవరితో ముగిసిన 10 నెలల్లో 64,972 యూనిట్లతో రెండవ స్థానానికి దూసుకు వచ్చింది. పర్యావరణహిత వాహనాలపై కంపెనీల దృష్టి భారత్ మొబిలిటీ ఎక్స్పోలో వెల్లడి దేశీయంగా ఆటోమొబైల్ దిగ్గజాలు పర్యావరణహిత వాహనాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఎగ్జిబిషన్లో పలు వాహనాలను ప్రదర్శించాయి. వీటిలో సీఎన్జీ, హైబ్రిడ్స్ మొదలుకుని ఎలక్ట్రిక్ వరకు వివిధ రకాల వాహనా లు ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోట ర్ ఇండియా, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, బీఎండబ్ల్యూ మొదలైన దిగ్గజాలు వీటిని ప్రదర్శించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీఎక్స్, ఫ్లెక్స్–ఫ్యూయల్ వ్యాగన్ఆర్, హైబ్రీడ్ గ్రాండ్ విటారా.. జిమ్నీ, స్కైడ్రైవ్ ఈ–ఫ్లయింగ్ కారు మొదలైనవి ప్రదర్శించింది. ఈ ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్ ఈవీఎక్స్ ఎస్యూవీని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ రాహుల్ భారతి తెలిపారు. భారతీయ మొబిలిటీ రంగ ప్రాధాన్యాన్ని మొబిలిటీ ఎక్స్పో తెలియజేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఎక్స్పో విశేషాలు.. మెర్సిడెస్ బెంజ్ తమ ఆఫ్ రోడ్ జీ వాగన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ’కాన్సెప్ట్ ఈక్యూజీ’, జీఎల్ఏ, ఏఎంజీ జీఎల్ఈ 53 కూపే వాహనాలను ప్రదర్శించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ర్యాల్–ఈ, ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 400, ఎలక్ట్రిక్ 3 వీలర్ ట్రియో మొదలైనవి ప్రదర్శనకు ఉంచింది. ఫోర్స్ మోటర్స్ .. ట్రావెలర్ ఎలక్ట్రిక్, అర్బానియా డీజిల్, ట్రావెలర్ సీఎన్జీల వాహనాలను ప్రదర్శించింది. ప్రదర్శనలో టాటా మోటార్స్ 18 ‘ఫ్యూచర్ రెడీ‘ కమర్షియల్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. బీఎండబ్ల్యూ తమ ఈవీలు, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ4, మినీ 3–డోర్ కూపర్ ఎస్ఈలను ప్రదర్శనకు ఉంచింది. -
సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు
న్యూఢిల్లీ: బ్రిటన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏ) కింద ఆటోమొబైల్స్పై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీ పరిశ్రమకు ప్రతికూలం అవుతుందని ఆర్థికవేత్తల సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలు, జపాన్, కొరియాలతో ఉన్న ఎఫ్టీఏల్లో కూడా కార్లపై సుంకాలను భారత్ తగ్గించలేదని పేర్కొంది. ‘ఎఫ్టీఏల కింద ఎలక్ట్రిక్ వాహనాలు సహా ఆటోమొబైల్స్పై కస్టమ్స్ సుంకాలను భారత్ తగ్గించరాదు. అలా చేస్తే భారత్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆటో దిగ్గజాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవి సంస్థలను మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది‘ అని జీటీఆర్ఐ తెలిపింది. బ్రిటన్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో కార్లను అసెంబుల్ మాత్రమే చేస్తుంది కాబట్టి ఆ దేశానికి సుంకాలపరమైన మినహాయింపుని ఇచ్చేందుకు సరైన కారణమేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బ్రిటన్కి గానీ మినహాయింపులు ఇస్తే జపాన్, కొరియా వంటి ఇతరత్రా ఎఫ్టీఏ భాగస్వాములు తమకు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టారిఫ్ విధానాన్ని కొనసాగిస్తూ, అదనంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపరమైన మద్దతును పరిశ్రమకు అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని జీటీఆర్ఐ సూచించింది. పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయాలి.. 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు నుంచే ఉంటున్నందున ఎలక్ట్రిక్ వాహనాలనేవి భారత్లో అంతగా పర్యావరణ అనుకూలమైనవేమీ కాదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చే బదులు కొత్త తరం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశోధన కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని జీటీఆర్ఐ పేర్కొంది. దిగుమతి సుంకాలను క్రమంగా 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేయడంతో ఆ్రస్టేలియాలో చాలా మటుకు స్థానిక కార్ల కంపెనీలు మూతబడ్డాయని తెలిపింది. దానికి విరుద్ధంగా భారత్ అధిక సుంకాలను కొనసాగించడం వల్ల కార్ల పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. దీనివల్ల దేశీయంగా కార్లు, ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందగలదని పేర్కొంది. -
రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు?
ఒక సాధారణ సైకిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 20,000 రూపాయలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కనిపించే సైకిల్ ధర మాత్రం ఏకంగా రూ. 32 లక్షలు. సైకిల్ ఏంటి? రూ. 32 లక్షలు ఏంటి? అని చాలామంది ఒక్కసారిగా షాకవొచ్చు! అయితే మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూసెయ్యండి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'బుగాటీ' (Bugatti) కంపెనీ 'పీజీ ఎక్స్' తయారు చేసింది. ఇది చూడటానికి సాధారణ సైకిల్ మాదిరిగా అనిపించినప్పటికీ ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది బుగాటీ చిరోన్ కారు నుంచి ప్రేరణ పొంది ఖరీదైన మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్లను ఉపయోగించి తయారైంది. 2017 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో కనిపించిన ఈ పీజీ ఎక్స్ బుగాటీ కేవలం 667 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీని ధర రూ. 39000 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 32 లక్షల కంటే ఎక్కువ). ఈ సైకిల్ తయారీలో అగ్రశ్రేణి స్పోర్ట్స్ ఆటోమొబైల్స్, నాసా, ఏరోనాటిక్ దిగ్గజాలలో ఉపయోగించే హై-ఎండ్ మెటీరియల్స్ ఉపయోగించారు. ఈ సైకిల్ను 95 శాతం అధిక శక్తి కలిగిన కార్బన్ ఫైబర్తో తయారు చేశారు, కాబట్టి ఇది ఐదు కిలోల కంటే తక్కువ బరువును కలిగి ఉంది. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో ప్రపంచంలో అత్యంత ఖరీదైన, తక్కువ బరువున్న సైకిల్ బహుశా ఇదే అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఒక సీటు కలిగిన ఈ సైకిల్ సింగిల్ వీల్ బ్రేక్ మాత్రమే కలిగి ఉంటుంది. పీజీ బుగాటీ సైకిల్ కార్బన్ ఫ్రేమ్ను ఫార్ములా వన్ కార్లను తయారు చేసే అదే కార్మికులు తయారు చేశారు. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువ. -
Budget 2024: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా..
ఫేమ్ II సబ్సిడీ పథకం ముగియడంతో, ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు మార్చి 2024 తర్వాత కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ఫేమ్ II స్కీమ్ కింద రూ. 10,000 కోట్ల బడ్జెట్తో వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో జోడించడానికి ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫేమ్ II గడువు ముగిసిన తర్వాత అమలు చేయడానికి సిద్దమవుతున్న ఫేమ్ III అంత విస్తృతంగా ఉండకపోవచ్చని, రానున్న బడ్జెట్లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం పరిశ్రమలకు సహాయం చేయాలి. అప్పుడే ఆశించిన రీతిలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఫేమ్ III ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలుస్తుంది. FAME IIIని రాబోయే కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి సీతారామన్ నిస్సందేహంగా ప్రవేశపెడతారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఫేమ్ III కూడా ఫేమ్ II మార్గదర్శకాలనే కొనసాగించే అవకాశం ఉంది. 2021 సెప్టెంబర్ 15న PLI-ఆటో స్కీమ్కు కేంద్ర మంత్రివర్గం ఐదేళ్లకు రూ. 25,938 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఈ పథకం 2027-28 ముగిసే వసరకు పొడిగించారు. అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (AAT) ఉత్పత్తి తయారీని పెంచడం, దాని కోసం లోతైన స్థానికీకరణను ప్రోత్సహించడం, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-అమర్చిన వాహనాల వంటి జీరో ఎమిషన్ వెహికల్స్ (ZEVలు) కోసం ప్రపంచ సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ పధకం ముఖ్య లక్ష్యం. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2024 మీద ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రం ఈ ఆశలను నిజం చేస్తుందా? లేక షాకిస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రోత్సాహాలు అవసరం, కాబట్టి రానున్న బడ్జెట్ సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. 2024-25 బడ్జెట్ కథనాల కోసం క్లిక్ చేయండి. -
మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంటల్లో కాలుతున్న కారు వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగినట్లు సమాచారం. రాయ్పూర్కు చెందిన కారు ఓనర్ సౌరభ్ రాథోడ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్హెచ్ 53 హైవేలో ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. ఆ తరువాత కొంత సేపటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలు టెస్లా క్లబ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై వోల్వో సంస్థ అధికారులు ఇంకా స్పందించలేదు. కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడానికి గల కారణాలు ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటిసారి. కాలిపోవడానికి గల కారణాలకు కంపెనీ తప్పకుండా వెల్లడించగలదని ఆశిస్తున్నాము. గతంలో మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో దేశీయ దిగ్గజం టాటా మోటార్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీలో కూడా మంటలు చెలరేగి కాలిపోయింది. ఇదీ చదవండి: అమెరికన్ యూనివర్సిటీ అద్భుత సృష్టి - ఐదు నిమిషాల్లో చార్జ్ అయ్యే బ్యాటరీ! ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే.. మంటలకు ఆహుతైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కోకోల్లలుగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో జరిగిన షార్ట్ సర్క్యూట్లు, అధిక ఛార్జింగ్ వంటి సమస్యల కారణంగా మంటలు చెలరేగిన సందర్భాలు ఎక్కువ. ఈ ప్రమాదాలు 2022లో చాలా వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత కొంత తక్కు ముఖం పట్టినప్పటికీ.. అక్కడక్కడా ఒక్కో సంఘటన అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంది. LG Pouch NMC cells strike again? Sadly a case of Volvo C40 Recharge getting caught on fire on NH53 has come up. From video fire is starting from the bottom. Volvo sells 78kWh pack in India which uses LG Pouch NMC cells. Hope @volvocarsin @volvocars investigates this soon. pic.twitter.com/FRnL60Cdnw — Tesla Club India® (@TeslaClubIN) January 28, 2024 -
అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ
భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి కుబేరులు ఎప్పటికప్పుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల ఓ ఖరీదైన కారుని వారికంటే ముందే, హైదరాబాద్ మహిళ కొనుగోలు చేసింది. హైదరాబాద్ వాసి 'హర్షిక రావు' ఇటీవలే రూ. 2.55 కోట్ల లోటస్ ఎలెట్రే ఎలక్రిక్ కారును కొనుగోలు చేసి, ఈ కారు కొన్న మొట్ట మొదటి భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: నీతా అంబానీ వాడే ఫోన్ ధర రూ.400 కోట్లా? అసలు నిజమేంటంటే? పవర్ట్రెయిన్ విషయానికి వస్తే.. Eletre అండ్ Eletre S మోడల్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్-మోటార్ సిస్టమ్ను కలిగి 600 కిమీ రేంజ్ అందిస్తాయి. Eletre R మోడల్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ 22 kWh AC ఛార్జర్ కూడా పొందుతుంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు!
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల హీరో మోటోకార్ప్ మొదటిసారి ఓ వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన వాహనాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఈ కొత్త వెహికల్ 'సర్జ్ ఎస్32' కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ చూడటానికి ఆటో రిక్షా మాదిరిగా ఉంటుంది. కానీ ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి జత చేసి ఉండటం చూడవచ్చు. కాబట్టి ఈ వెహికల్ అటు స్కూటర్గా, ఆటో రిక్షాగా కూడా పనిచేస్తుంది. కంపెనీ ప్రత్యేకంగా దీనిని స్వయం ఉపాధి పొందే వారికోసం రూపొందించినట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన ‘హీరో వరల్డ్’ ఈవెంట్లో కంపెనీ దీన్ని ప్రదర్శించింది. ఈ వాహనానికి విండ్ స్క్రీన్, హెడ్ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి, డోర్స్ మాత్రం లేదు. కానీ జిప్తో కూడిన సాఫ్ట్డోర్లు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి.. కొత్త సర్జ్ ఎస్32 త్రీవీలర్లో 10 kW ఇంజిన్, 11 kWh బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో రోజు వారీ వినియోగనైకి అనుకూలంగా ఉండటానికి స్కూటర్లో 3kw ఇంజిన్, 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. త్రీవీలర్ 50 కిమీ/గం వేగంతో 500 కిమీ బరువుని మోయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. స్కూటర్ మాత్రం 60 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. -
అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా USAలో దాదాపు 2,00,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయకపోవచ్చనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. టెస్లా రీకాల్ అనేది 2023 మోడల్ ఎస్, ఎక్స్, వై వాహనాలకు వర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ 4.0ని కలిగి ఉన్నాయి. ఇది 2023.44.30 సాఫ్ట్వేర్ వెర్షన్పై పనిచేస్తుంది. ప్రస్తుతానికి టెస్లా కార్లలో ఈ లోపాలకు సంబంధించిన ఎలాంటి ప్రమాదం జరగలేదని టెస్లా యూఎస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్కు తెలిపింది. భవిష్యత్తులో కూడా టెస్లా కార్లలో ఎలాంటి సమస్య తలెత్తకూడదనే భావనతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కంపెనీ జనవరి 12 నుంచి రీకాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నష్టాల్లో టెస్లా.. ఇదిలా ఉండగా టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలిసింది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది. -
చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. బైకులు, కార్లలో మాదిరిగా కాకుండా.. సైకిల్స్లో చిన్న బ్యాటరీ లేదా ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు ఉంటాయి. బ్యాటరీల గురించి విన్న చాలామందికి కన్వర్షన్ కిట్ల గురించి తెలియకపోవచ్చు. ఈ కథనంలో మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు సాధారణ సైకిల్కు అదనంగా యాడ్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఇది మౌంట్ చేసుకున్న తరువాత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఫోటోలలో గమనించినట్లయితే డిస్క్ బ్రేక్కు అమర్చిన కన్వర్షన్ కిట్ చూడవచ్చు. (Image credit: Skarper / Red Bull) ఇక్కడ కనిపించే కన్వర్షన్ కిట్ను స్కార్పర్ అనే స్టార్టప్ ఈ ఏడాది పరిచయం చేసింది. ఇది ఒక అధునాతన టూ-మోడ్ ఎలక్ట్రిక్ బైక్ మోటారు. కస్టమ్ డిజైన్ చేసిన డిస్క్ బ్రేక్కు క్లిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తి గేర్బాక్స్గా పనిచేస్తుంది. బైక్పై కస్టమ్ డిస్క్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, మోటారును ఆన్ లేదా ఆఫ్ చేయడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. పవర్ అనేది వెంటనే మారుతుంది. కన్వర్షన్ కిట్ తయారీకి సంస్థకు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇది సైకిల్లో డిస్క్ బ్రేక్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఈ కిట్ను మౌంట్ చేయడం లేదా రిమూవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి వినియోగదారుని అవసరమైనప్పుడు మౌంట్ చేసుకోవచ్చు, మిగిలిన సమయంలో తీసి ఇంట్లో జాగ్రత చేసుకోవచ్చు. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేతిలో పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే కన్వర్షన్ కిట్ ధర 1295 యూకే పౌండ్స్ (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.30 లక్షలకంటే ఎక్కువ) అని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఈ కిట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గొప్ప ఆదరణ పొందుతుందని తయారీదారులు భావిస్తున్నారు. -
చైనా కంపెనీ ముక్కు పిండి వసూలు చేశాడు
గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని కంపెనీలు కస్టమర్లకు జరిగిన నష్టాన్ని రీప్లేస్ చేయగా.. మరో కొన్ని కంపెనీలు ఊరుకున్నాయి. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి కోర్టుకెళ్లి నష్ట పరిహారంగా రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ను 2021 ఏప్రిల్ 7న సంస్థకు చెందిన డీలర్ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుండేవాడు. అతడు రోజూ మాదిరిగానే 2023 ఫిబ్రవరి 26న కూడా ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ స్కూటర్ పేలిపోయి మొత్తం కాలిపోయింది. మంటల వల్ల పొగలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడంతో వినియోగదారుడు మాత్రమే కాకుండా.. అతని కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురైందని తెలిపాడు. జరిగిన నష్టం గురించి సంబంధిత డీలర్కు వెల్లడించారు. దీంతో కంపెనీ ప్రతినిధి కస్టమర్ను సంప్రదించి, కాలిన స్కూటర్ ఫోటోలను సేకరించుకున్నారు. ఇదీ చదవండి: ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే? ఎన్ని రోజులకూ కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో విసుగు చెందిన కస్టమర్ తమ లాయర్ ద్వారా తయారీదారు, డీలర్తో సహా ఇరువర్గాలకు నోటీసులు అందజేసింది. అయితే వీరిద్దరూ కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో కోర్టు డీలర్ నిర్లక్ష్యానికి, వెహికల్ తయారీలో నాసిరకమైన పరికరాలను ఉపయోగించిన కారణంగా కంపెనీకి.. రూ.10 లక్షల జరిమానా, ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా స్కూటర్ ధరను కస్టమర్కు చెల్లించాలని లేదా స్కూటర్ను భర్తీ చేయాలని కూడా ఆదేశించింది. -
గుజరాత్ సమ్మిట్లో కనిపించని 'ఇలాన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి?
భారతదేశంలో టెస్లా అరంగేట్రం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ప్రయత్నాలన్నీ సఫలీకృతమై గుజరాత్ రాష్ట్రంలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమైనట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ప్రారంభమైన 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024' (2024 Vibrant Gujarat Global Summit)కు మాత్రం 'మస్క్' హాజరు కాలేదు. నిజానికి వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024 వేదికగా టెస్లా చర్చలు జరగనున్నట్లు జరుగుతాయని చాలామంది భావించారు, కానీ టెస్లా అధినేత ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై స్పందించిన గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ 'రాహుల్ గుప్తా' మస్క్ ఈ సమ్మిట్కు హాజరు కానప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం రాష్ట్రం పలుకుతోందని స్పష్టం చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అమెరికన్ కంపెనీ కూడా ఇండియాలో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం కంపెనీ గుజరాత్ను మొదటి ఎంపిక చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుజరాత్ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇదీ చదవండి: వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఎలోన్ మస్క్ 2024లో భారతదేశంలో టెస్లా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలో గుజరాత్లో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు టెస్లా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని. 2023లోనే యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మస్క్ సమావేశమై టెస్లా ఫ్యాక్టరీ గురించి చర్చలు జరిపారు. మొత్తం మీద మస్క్ టెస్లా ఫ్యాక్టరీని ఈ ఏడాది భారత్కు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
రూ.20000 తగ్గింపుతో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' 2024 ప్రారంభంలోనే తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద కంపెనీ ఇప్పుడు రూ. 20000 తగ్గింపును ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ స్కూటర్ బెంగళూరులో రూ.1.09 (ఎక్స్-షోరూమ్) లక్షలకు, ఢిల్లీలో రూ.97,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలు లభిస్తోంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ ఏథర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా! ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. సంక్రాంతి పండుగలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు రూ. 20000 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ నెలలో మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు.. ఇవే!
2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్లిఫ్ట్ 2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఫేస్లిఫ్ట్ భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఎక్స్యువీ300 ఫేస్లిఫ్ట్ మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్యువీ300 కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్లిఫ్ట్ జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement